-
JP Morgan: మోదీ పనితీరు అద్భుతం
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ అద్భుతమైన పనితీరు ప్రదర్శిస్తున్నారంటూ జేపీ మోర్గాన్ సీఈవో జేమీ డిమోన్ ప్రశంసించారు. ఎకనామిక్ క్లబ్ ఆఫ్ న్యూయార్స్ సంస్థ మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మోదీ సంస్కరణలను డిమోన్ కొనియాడారు.‘‘సమ్మిళిత ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి భారత్లో ప్రధాని మోదీ 40 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశారు. అక్కడ పలు రాష్ట్రాల్లోని పన్ను వ్యవస్థల సంక్లిష్టతలను ఛేదించి సంస్కరించారు. సానుకూల మార్పు దిశగా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు’’ అంటూ మోదీని పొగిడారు. -
ఐసిస్ కొత్త లీడరే అమెరికా టార్గెట్: ట్రంప్
వాషింగ్టన్: ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్ కొత్త లీడర్పైనే అమెరికా దృష్టి సారించిందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఎకనామిక్ క్లబ్ ఆఫ్ న్యూయార్క్లో మంగళవారం ఆయన మాట్లాడారు. ‘అందరికీ తెలుసు అతను ఎక్కడున్నాడో..’అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కొత్త టార్గెట్ పేరుని మాత్రం ట్రంప్ వెల్లడించలేదు. ఉగ్రసంస్థ చీఫ్ అబూ బాకర్ అల్ బాగ్దాదీని గత నెలలో అమెరికా కమాండోలు చుట్టుముట్టిన నేపథ్యంలో ఆత్మాహుతి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అతని స్థానంలోకి వచ్చిన అబూ ఇబ్రహీం అల్ హష్మీ అల్ ఖురేషీనే అమెరికా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘అమెరికా అల్ బాగ్దాదీని అంతం చేసింది. అతని తర్వాతి వ్యక్తి (నంబర్–2)ని కూడా మట్టుబెట్టింది. ఇప్పుడు మిగిలిన నంబర్–3పైనే మా దృష్టంతా.. అతనికి చాలా సమస్యలున్నాయి. ఎందుకంటే అతను ఎక్కడున్నాడో మాకు తెలుసు కాబట్టి..’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
మోదీ సర్కార్పై అతి అంచనాలు
అయినా మెరుగ్గానే కొత్త ప్రభుత్వం పనితీరు ⇒ పెట్టుబడులకు అనువైన పరిస్థితుల కల్పన ⇒ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ న్యూయార్క్: ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో గతేడాది ఏర్పడిన కొత్త ప్రభుత్వంపై వాస్తవ పరిస్థితులను మించి అంచనాలు నెలకొన్నాయని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. అయితే, ఇన్వెస్టర్ల సమస్యలను పరిగణనలోకి తీసుకుంటూ ప్రభుత్వం.. పెట్టుబడులకు అనుకూల పరిస్థితులను కల్పించేందుకు చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు. ఎకనామిక్ క్లబ్ ఆఫ్ న్యూయార్క్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రాజన్ ఈ విషయాలు చెప్పారు. ‘ఈ ప్రభుత్వం భారీ అంచనాలతో అధికారంలోకి వచ్చింది. ఏ కొత్త ప్రభుత్వంపైనైనా ఇంత భారీగా ఆశలు ఉండటం సరికాకపోవచ్చు. అప్పట్లో రోనాల్డ్ రీగన్ (అమెరికా మాజీ అధ్యక్షుడు) మార్కెట్ వ్యతిరేక శక్తులను సంహరించేందుకు శ్వేతాశ్వంపై వచ్చిన తరహా ఇమేజ్తో ప్రస్తుతం మోదీని ఊహించుకున్నారు. ఈ రెండింటికీ పొంతన లేదు’ అని ఆయన పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల ఆందోళనలను అర్థం చేసుకున్న కొత్త ప్రభుత్వం.. ఆర్థికపరమైన సమస్యల పరిష్కారంపై దృష్టి పెడుతోందని రాజన్ పేర్కొన్నారు. వివాదాస్పదమైన రెట్రాస్పెక్టివ్ ట్యాక్సేషన్ (గతకాలపు లావాదేవీలపై పన్నులు)ను మళ్లీ ప్రవేశపెట్టబోమని స్పష్టం చేసిందని చెప్పారు. అలాగే కార్పొరేట్ ట్యాక్స్ కూడా ఏటా ఒక్క శాతం చొప్పున తగ్గనుందన్నారు. ఇక, ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని చూరగొనేలా, వృద్ధికి దోహదపడేలా చర్యలు తీసుకోవడంలో మోదీ సర్కార్ గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. పెట్రోల్, డీజిల్ సబ్సిడీలను ఎత్తివేయడంతో పాటు వంట గ్యాస్ సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు రాజన్ చెప్పారు. వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానం వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నాటికల్లా అమల్లోకి రాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. భారీ పెట్టుబడి ప్రణాళికలు.. రవాణా కారిడార్లు, పారిశ్రామిక కారిడార్లు మొదలైన వాటిపై కొత్త ప్రభుత్వం భారీ పెట్టుబడి ప్రణాళికలు సిద్ధం చేసిందని రాజన్ చెప్పారు. ఇతర కరెన్సీలతో పోలిస్తే రూపాయి మారకం విలువలో భారీ మార్పులు తగ్గాయని, డాలర్తో పోలిస్తే అత్యంత స్థిరంగా ఉన్న కరెన్సీల్లో రూపాయి కూడా ఒకటిగా ఉంటోందని రాజన్ చెప్పారు. అలాగే ద్రవ్యోల్బణమూ దిగి వస్తోందన్నారు. పెట్టుబడులు మరింత వేగం పుంజుకోవాల్సి ఉందని రాజన్ చెప్పారు. అటు బ్యాంకింగ్ వ్యవస్థను కూడా ప్రక్షాళన చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. సెంట్రల్ బ్యాంకులు బాధ్యతల నుంచి తప్పుకోలేవు దేశీయంగా తీసుకోవాల్సిన చర్యలు ఎలా ఉన్నప్పటికీ వివిధ దేశాలకు చెందిన సెంట్రల్ బ్యాంకులు అంతర్జాతీయంగా తమ బాధ్యతల నుంచి తప్పుకోజాలవని రాజన్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వంటి సంస్థలు, అసాధారణమైన ద్రవ్య విధానాలన్నింటినీ విశ్లేషించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. దాదాపు ప్రతి పారిశ్రామిక దేశంలోనూ ప్రజాకర్షక విధానాలపైనే దృష్టి ఉంటోందని, దీనివల్ల వాణిజ్య, ఆర్థికాంశాల విషయంలో ప్రతికూల విధానాలు ఉంటున్నాయని రాజన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ ద్రవ్య విధానంలో ఒక పద్ధతంటూ లేకపోవడం వల్ల ఇటు వృద్ధికి అటు ఆర్థిక రంగానికి గణనీయమైన రిస్కులు పొంచి ఉన్నాయన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement