-
దళితులపై అక్రమ కేసులు అమానుషం
పోలీసు స్టేష¯ŒS వద్ద ఎమ్మెల్సీ బోస్ ధర్నా ద్రాక్షారామ(రామచంద్రపురం రూరల్) : అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న అధికారులు, పోలీసులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్చంద్ర బోస్ ధ్వజమెత్తారు. పోలీసులు అధికార పార్టీ నేతల సూచనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తు శనివారం రాత్రి ధర్నాకు దిగారు. మండలంలోని వెంకటాయపాలెం చిన్నంపేటలో జనవాసాల మధ్య విద్యుత్ సబ్ స్టేష¯ŒS నిర్మాణాన్ని స్థానికులు వ్యతిరేకిస్తూ గత 72 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో కొన్ని రోజులు క్రితం స్థానిక ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు విద్యుత్ సబ్ స్టేష¯ŒS నిర్మించే ఆడిటోరియం వద్దకు రావటంతో స్థానికులు అడ్డుకున్నారు. దీంతో కక్ష సాధింపునకు దిగిన ఎమ్మెల్యే తనను ఎదిరించిన మందపల్లి మోషే అనే దళితునిపై కార్యదర్శిని విధులకు ఆటంకం కలించాడని ఆక్రమగా కేసును బనాయించారు. పోలీసులు మోషే సోదరుడు నాగేశ్వరరావును విచారణ నిమిత్తం స్టేష¯ŒSకు శనివారం తీసుకు వెళ్లారు. దీనిపై ఎమ్మెల్సీ బోస్, ఇతర వైసీపీ నేతలతో స్టేష¯ŒSకు వెళ్లి అక్రమ అరెస్టులు అపాలని కోరారు. ఈ మేరకు ఎమ్మెల్సీ బోస్ ఆధ్వర్యంలో అక్రమ అరెస్టులు ఆపాలని నినాదాలు చేశారు. ద్రాక్షారామ పోలీసు స్టేష¯ŒS వద్ద వైసీపీ నేతలతో కలిసి ధర్నాకు దిగారు. సీఐ కె. శ్రీధర్ కుమార్ ద్రాక్షారామకు చేరుకుని ఎమ్మెల్సీ బోస్తో చర్చించారు. సీఐ మాట్లాడుతూ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పటంతో వైసీపీ నేతలు ఆందోళనను విరమించారు. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ కార్యవర్గ సభ్యుడు వాసంశెట్టి శ్యామ్, రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ మాగాపు అమ్మిరాజు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెట్టా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి టేకుమూడి సత్యనారాయణ, తదితర పార్టీ నాయకులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. -
వైభవంగా కార్తిక దీపారాధన మహోత్సవం
ద్రాక్షారామ(రామచంద్రపురం రూరల్) : ఆధ్యాత్మిక క్షేత్రం ద్రాక్షారామలో శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయం వద్ద ప్రసన్నాంజనేయ బాల భక్త సమాజం ఆధ్వర్యంలో 53వ కార్తీక దీపారాధన మహోత్సవం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖామంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ప్రసన్నాంజేయ బాలభక్త సమాజం అధ్యక్షుడు నున్న రామచంద్రరావులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం సప్తగోదావరిలో స్వామివారి తెప్పోత్సవం కన్నుల పండుగా సాగింది. విజయవాడకు చెందిన శుభమ్ ఈవెంట్స్ సౌండ్స్ ఆధ్వర్యంలో రోష¯ŒSలాల్ ఆర్కెస్ట్రా, సినీ సింగర్ మనో (నాగూర్బాబు) నేతృత్వంలో సినీ సింగర్స్ సింహ, దీపు, దామినిలచే సినీ సంగీత విభావరి, టీవీ యాంకర్ మృదుల యాంకరింగ్ ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ద్రాక్షారామకు చెందిన శ్రీ ఆంజనేయ ఫైర్ వర్క్స్ అధినేత పెద్దిరెడ్డి సూరిబాబు బాణాసంచా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. శ్రీ రామాంజనేయ యు ద్దం వార్ సీను, చింతామణి నాటకాలు ప్రేక్షకులను అలరించాయి. -
ద్రాక్షారామలో ఉద్రిక్తత
ప్రజా, దళిత సంఘాల బహిరంగ సభను భగ్నం చేసిన పోలీసులు అడుగడుగునా మోహరింపు 60 మందికి పైగా అరెస్టు రామచంద్రపురం / రామచంద్రపురం రూరల్ : పోలీసు జీపుల సైరన్లు, పికెట్లు, మోహరింపులతో రామచంద్రపురం మండలం ద్రాక్షారామలో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 20 ఏళ్ల కిత్రం వెంకటాయపాలెంలో జరిగిన శిరోముండనం కేసులో పీపీగా ఉన్న జవహర్ ఆలీని తొలగిస్తూ గత నెల 23న ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును నీరు గార్చేందుకే ప్రభుత్వం స్థానిక టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుకు అనుకూలంగా ఈ జీవో ఇచ్చిందని, దీనిని వెంటనే నిలుపు చేయాలని, బాధితుల తరఫున వెంటనే పీపీని నియమించాలని డిమాండ్ చేస్తూ ద్రాక్షారామ అంబేడ్కర్ విగ్రహం వద్ద బహిరంగ సభ నిర్వహించేందుకు వివిధ ప్రజా, దళిత సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఈ సభను జయప్రదం చేయాలని కోరుతూ నియోజకవర్గంలోని గ్రామాల ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా, గత నెల 26న రామచంద్రపురంలో అంబేడ్కర్ విగ్రహం కళ్లకు గంతలు కట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అనుకూల వర్గం ఇదే రోజున ధర్నాకు పిలుపునిచ్చింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో డీఎస్పీ ఎన్బీఎం మురళీకృష్ణ నియోజకవర్గంలో సెక్షన్ 30 విధించారు. బహిరంగ సభలు, ధర్నాలు నిర్వహించరాదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ద్రాక్షారామలో ప్రజా, దళిత సంఘాలు నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభను పోలీసులు అడ్డుకున్నారు. పట్టణానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మందపల్లి చిట్టిబాబు, దొమ్మలపాటి శ్యాంసుదర్, జిల్లా కార్యదర్శి బొమ్ము మోహనరావు, జైభీమ్ దళిత సంఘాల నేతలు సీహెచ్ కర్ణ, గుబ్బల శ్రీనివాస్, అంబటి తుకారం, రైతుకూలీ సంఘం నేతలు గుత్తుల వెంకట రమణలను ఉదయమే అదుపులోకి తీసుకుని, రాయవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. ద్రాక్షారామ నలువైపులా ఉదయం నుంచీ పికెట్లు ఏర్పాటు చేశారు. సుమారు 60 మందికి పైబడి వ్యక్తులను అరెస్టు చేశారు. తెల్లవారుజామున ప్రారంభమైన అరెస్టులు సాయంత్రం వరకూ కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ద్రాక్షారామలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా అడుగడుగునా పోలీసులు మోహరించినా సీపీఐ ఎంఎల్, రైతుకూలీ సంఘం, పీడీఎస్యూ, ఇతర దళిత సంఘాల ఆధ్వర్యాన ద్రాక్షారామ అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. పీపీని తొలగిస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేయాలని, శిరోముండనం కేసును వెంటనే విచారణకు తీసుకురావాలని, బాధితులకు న్యాయం చేయాలని నినదించారు. వారిపై పోలీసులు ఒక్కసారిగా వారిపై విరుచుకుపడ్డారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్నవారిని లాక్కొంటూ వెళ్లి వ్యాన్లోకి బలవంతంగా ఎక్కించారు. శిరోముండనం కేసులో ప్రధాన బాధితుడు కోటి చినరాజు, సీపీఐ ఎంఎల్ జిల్లా నాయకుడు చీకట్ల వెంకటేశ్వరరావు, పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి ఉండ్రు గనిరాజు, పీవైఎల్ నాయకుడు వెంటపల్లి భీమశంకరం, రైతుకూలీ సంఘాల నాయకులను అరెస్టు చేసి, వ్యాన్లో తరలించారు. ధర్నాలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెట్టా శ్రీనివాసరావును కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్బంగా కొద్దిసేపు తొక్కిసలాట జరిగింది. రైతుకూలీ సంఘం నాయకుడు కింద పడిపోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పక్షపాతం ఇరువర్గాలవారూ ధర్నాకు, బహిరంగ సభకు పిలుపునిచ్చానా ఒకవర్గం వారినే పోలీసులు అరెస్టు చేసి అధికార పార్టీ నేతలకు కొమ్ము కాశారనే విమర్శలు తలెత్తాయి. టీడీపీకి చెందిన, ధర్నాకు పిలుపునిచ్చినవారినెవ్వరినీ అదుపులోకి తీసుకోకుండా.. జీవోను వ్యతికేరించిన వారిని మాత్రమే అరెస్టు చేయడం దారుణమని ప్రజా, దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించడం ద్వారా ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, టీడీపీ నేతలకు కొమ్ముకాసి, దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వ తీరు ఉందని దుయ్యబట్టారు.
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
విష్ణుప్రియ మాస్ డ్యాన్స్.. చాన్నాళ్ల తర్వాత అలా కనిపించిన పూనమ్!
'నోకియా 3210 4జీ' వచ్చేసింది.. రేటెంతో తెలుసా?
వారణాసిలో ప్రియాంక పోటీ చేసి ఉంటే.. రాహుల్ సంచలన కామెంట్స్
Priya Anand: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ ప్రియా ఆనంద్ (ఫొటోలు)
T20 World Cup 2024: బ్యాట్ను రెండుగా చీల్చేసిన బంగ్లాదేశ్ బ్యాటర్
వంద కోట్ల స్కాం బయటపెట్టిన అధికారిని పిచ్చోడని వేటు వేశారు..కట్ చేస్తే 15 ఏళ్ల తర్వాత
అలాంటి వ్యక్తిని కనుగొనడం చాలా అరుదు: సమంత పోస్ట్ వైరల్!
నటి సురేఖావాణితో వైరల్ స్టార్.. ఇతడెవరో గుర్తుపట్టారా?
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (11-06-2024)
ఒడిశా కొత్త సీఎంగా గిరిజన నేత మోహన్ మాఝీ
Advertisement