breaking news
Dongaata
-
ఆదిలాబాద్: బ్యాంకు సిబ్బందికి షాకిచ్చిన దొంగ
నెన్నెల: ఓ ఆగంతకుడు ఆశగా అర్ధరాత్రి బ్యాంకులో చొరబడ్డాడు. ఆబగా నగదు కోసం వెతికాడు. క్యాష్కౌంటరేమో ఖాళీగా కనిపించింది. స్ట్రాంగ్రూం తాళం యమా స్ట్రాంగ్గా ఉండటంతో తెరుచుకోలేదు. ఎక్కడ వెతికినా ఏమీ దొరకలేదు. ఆనక చేసేదేమీలేక ‘గుడ్ బ్యాంక్.. ఒక్క రూపాయి కూడా దొరకలేదు’అని కితాబు ఇస్తూ ఓ పేపర్పై రాసి వెళ్లిపోయాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో చోటు చేసుకుంది. ముసుగు వేసుకుని గురువారం అర్ధరాత్రి దొంగతనానికి వచ్చిన ఓ దుండగుడు బ్యాంకు తలుపు తాళం పగలగొట్టి లోనికి ప్రవేశించాడు. క్యాష్ కౌంటర్లో చిల్లిగవ్వ కూడా లభించలేదు. ఎంత ప్రయత్నించినా స్ట్రాంగ్రూమ్ తాళం తెరుచుకోలేదు. ఇలా 15 నిమిషాలు బ్యాంకులో ఉండి చోరీకి యత్నించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. పోతుపోతూ టేబుల్పై ఉన్న ఓ పేపర్ మీద ‘గుడ్ బ్యాంకు, రూపాయి కూడా దొరకలేదు. నన్ను పట్టుకోవద్దు. నా ఫింగర్ప్రింట్ కూడా దొరకదు’అని మార్కర్తో రాశాడు. శుక్రవారం ఉదయం బ్యాంకు ఆవరణలో ఊడ్చేందుకు వచ్చిన స్వీపర్ రాములు బ్యాంక్ తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి మేనేజర్ వెంకటేశ్వర్రెడ్డికి సమాచారం ఇచ్చాడు. మేనేజర్ వెంటనే బ్యాంకుకు చేరుకుని పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాంకు నగదు చోరీ కాకపోవడంతో సిబ్బంది, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బెల్లంపల్లి ఏసీపీ సదయ్య బ్యాంక్ను సందర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. -
కితకితలు పెట్టే పాత్ర నాది! - అడివి శేష్
కర్మ’తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు అడివి శేష్. ‘పంజా’ చిత్రంలో విలన్గా నటించి మెప్పించారు. ఆ తర్వాత చాలా ‘బలుపు, రన్ రాజా రన్, లేడీస్ అండ్ జెంటిల్మన్’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. లక్ష్మీ మంచు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘దొంగాట’. ఈ సినిమాలో ఆయన కీలక పాత్ర పోషించారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో ముచ్చటించారు. ‘‘ నేను చేసిన వెంకట్ పాత్రలో చాలా ట్విస్ట్లు ఉంటాయి . చాలా కొత్తగా అనిపించింది. వెంటనే ఈ ఆఫర్కు ఒప్పుకున్నా. మొదట ఈ పాత్ర వేరే వాళ్ల కోసం అనుకున్నారు. కానీ ఫైనల్గా నాకే దక్కింది. కన్ఫ్యూజన్ లోంచి పుట్టే కామెడీ ప్రేక్షకులకు కితకితలు పెడుతుంది. మొదటి సినిమా అయినా వంశీ చాలా బాగా తీశారు. లక్ష్మీ మంచు నాకు మంచి స్నేహితురాలు. షూటింగ్ కూడా చాలా సరదా సరదాగా గడిచిపోయింది. ‘బాహుబలి’ సినిమా మొదటి భాగంలో కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంటాను కానీ నా కెరీర్లో మైలురాయిలా నిలిచిపోతుందీ సినిమా. ప్రస్తుతం పీవీపీ బ్యానర్లో ‘క్షణం’ అనే సినిమాలో ముఖ్య పాత్ర చేస్తున్నా’’ అని చెప్పారు.