-
నా జీవితంలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా: స్టార్ డైరెక్టర్ కూతురు
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో టాప్ దర్శకులలో తనకుంటూ ఫేమ్తో పాటు నేమ్ని సంపాదించుకున్న డైరెక్టర్ శంకర్. ఇండియన్ 2 సినిమా ప్రారంభించినప్పటి నుంచి ఏదో ఒకలా ఈ దర్శకుడు ప్రొఫెషనల్ పరంగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా శంకర్ పర్సనల్ లైఫ్కి సంబంధించి సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్గా నిలిచారు. ఎలా అంటారా..? శంకర్కి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మొదటి కూతురు ఐశ్వర్య.. ఇటీవల ఓ క్రికెటర్ను పెళ్లాడిన విషయం తెలిసిందే. ఇక రెండో కూతురు అదితి శంకర్ సినిమాల్లోకి అడుగుపెట్టింది. అయితే అదితి మాత్రం తన కెరీర్ని సిని రంగానికే పరిమితం కాకుండా మరోపక్క చదువును కొనసాగించింది. శ్రీ రామచంద్ర ఇన్స్టిట్యూట్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న అదితి డాక్టర్ డిగ్రీని పొందిన తరువాత భావోద్వేగానికి గురైంది. ఈ సందర్భంగా ఈ రోజు కోసం నా జీవితంలో ఎన్నో కాపీ కప్పులు, నిద్ర లేని రాత్రులు గడిపానంటూ ట్వీట్ చేసింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు చదువు కొనసాగించడంతో అదితిని మల్టీ టాలెంటెడ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అదితి శంకర్ సినిమాల విషయాలకొస్తే.. త్వరలోనే హీరోయిన్గా వెండితెరపై ప్రేక్షకులకు పరిచయం కానుంది. ముత్తయ్య దర్శకత్వంలో 'వీరుమన్' అనే చిత్రంతో కోలీవుడ్లో తమిళ తంబీలను పలకరించనుంది. ఇందులో కార్తీ హీరోగా నటిస్తున్నాడు. Here’s to all the fun memories, late nights and mugs of coffee that got me here ✨ Officially Dr.Aditi Shankar #graduationday #endsandbeginnings pic.twitter.com/bws6Wlcy1O— Aditi Shankar (@AditiShankarofl) December 11, 2021 -
ఎంబీబీఎస్ సీట్లు అమ్మబడును!
15 శాతం ప్రభుత్వ సీట్లు ఎన్ఆర్ఐ కోటాలో విక్రయం వచ్చే ఏడాది నుంచి అమలుకు బాబు సర్కారు యోచన 15% ఎంబీబీఎస్ సీట్లు ఎన్ఆర్ఐ కోటాలో విక్రయం వచ్చే ఏడాది నుంచి అమలుకు బాబు సర్కారు యోచన ఈ ఏడాది పద్మావతి మహిళా కళాశాలలో, వచ్చే ఏడాది అన్ని ప్రభుత్వ కాలేజీల్లోనూ అమలు నివేదిక తయారీకి వైద్య ఆరోగ్యశాఖకు ఆదేశాలు సర్కారీ కళాశాలల్లో ఎన్ఐఆర్ఐ కోటా అమలైతే 225 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోనున్న ప్రతిభావంతులు ఏటా రూ. 27 కోట్ల ఆదాయాన్ని లెక్కేస్తున్న సర్కారు ఎన్ఆర్ఐ కోటా కుదరకపోతే రూ. 60 వేలు ఫీజు వసూలు ఆలోచన 2000-2003 లోనే ప్రభుత్వాస్పత్రుల్లో యూజర్ చార్జీలు, మెడిసిన్ సీట్లలో 5% ఎన్ఆర్ఐ కోటా ప్రవేశపెట్టిన చంద్రబాబు 2004లో వైఎస్ అధికారంలోకి వచ్చాక అవన్నీ రద్దుచేసిన వైనం డాక్టర్ కావాలనేది.. వైద్య వృత్తి చేపట్టాలనేది.. చాలా మంది యువత కల. రాష్ట్రంలో ఏటా లక్ష మంది విద్యార్థులు ఎంబీబీఎస్ కోర్సులో చేరేందుకు ప్రవేశ పరీక్ష రాస్తుంటారు. కానీ.. ఉన్న సీట్లేమో నాలుగైదు వేలే! అందులోనూ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉన్న సీట్లు మరీ స్వల్పం!! ప్రతిభావంతులైన పేద విద్యార్థుల్లో అతి కొద్దిమందైనా తమ డాక్టర్ కలను సాకారం చేసుకునేందుకు ఈ ప్రభుత్వ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లే ఆధారం. కానీ.. చంద్రబాబు సర్కారు ఆ కలకు గండి కొట్టే చర్యలు ప్రారంభించింది. సరిగ్గా పదకొండేళ్ల కిందట చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తలపెట్టిన ‘ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎన్ఆర్ఐ కోటా’ను మళ్లీ ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. నాడు 5 శాతం సీట్లను ఎన్ఆర్ఐ కోటాలో అమ్మకానికి పెట్టగా.. ఇప్పుడు ఏకంగా 15 శాతం సీట్లను ఈ పేరుతో అమ్మకానికి పెడుతున్నారు. అంటే ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు చెందాల్సిన ఆ 15 శాతం సీట్లు.. దాదాపు 225 సీట్లను.. వారికి చెందకుండా చేసి.. ఎన్ఆర్ఐ కోటా పేరుతో ప్రతిభతో నిమిత్తం లేకుండా ధనవంతులకు కట్టబెట్టబోతున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. గతంలో చంద్రబాబు ప్రవేశపెట్టిన 5 శాతం ఎన్ఆర్ఐ కోటాను ఆ మరుసటి ఏడాది వై.ఎస్.రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక రద్దు చేశారు. ఇప్పుడు బాబు సర్కారు అధికారంలోకి వచ్చి మూడు నెలలైనా కాకముందే సర్కారీ వైద్య కళాశాలల్లో 15 శాతం సీట్లను ఆదాయం కోసం అమ్ముకోజూస్తుండటం విద్యార్థులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పాత ఆలోచనలకు మళ్లీ పదునుపెట్టారు. 2000-2003 సంవత్సరాల మధ్య ప్రభుత్వ ఆస్పత్రుల్లో యూజర్ చార్జీలు వసూలు చేయించారు. అంతేకాదు ప్రతి ప్రభుత్వ వైద్య కళాశాలలో 5 శాతం సీట్లు ప్రవాస భారతీయులకు విక్రయించేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఆ లెక్కను మరింత పెంచి అమలులోకి తేనున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15 శాతం ఎంబీబీఎస్ సీట్లను విక్రయించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే స్విమ్స్ పరిధిలో నడిచే పద్మావతీ ప్రభుత్వ మహిళా వైద్య కళాశాలలో 15 శాతం సీట్లు ప్రవాస భారతీయులకు విక్రయించేందుకు జీవో జారీ చేశారు కూడా. ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలల్లో 85 శాతం స్థానిక కోటా కింద, 15 శాతం అన్రిజర్వ్డ్ నాన్ లోకల్ కోటా కింద భర్తీ చేస్తున్నారు. అయితే ఈ స్థానిక కోటా 85 శాతం సీట్లలో 15 శాతం సీట్లు ఎన్ఆర్ఐ కోటాలో విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది పద్మావతి మహిళా కళాశాలలో అమలు చేసి వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15 శాతం సీట్లను ఎన్ఆర్ఐ కోటా కింద అమ్మేందుకు నివేదిక సిద్ధం చేయాలని ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశాలొచ్చినట్టు ఆ శాఖకు చెందిన ఒక అధికారి చెప్పారు. సర్కారు కళాశాలల్లో ఎన్ఆర్ఐ కోటా అంటూ సీట్లను విక్రయిస్తే.. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోనున్నారు. మౌలిక వసతుల పేరుతో దగా... ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన, రోగులకు మెరుగైన వైద్యసేవలు అనే రెండు కారణాలను బూచిగా చూపి ప్రభుత్వ కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లను విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఒక్కో ఎన్ఆర్ఐ సీటును రూ. 60 లక్షలకు విక్రయించాలని యోచిస్తున్నారు. అంటే ఈ సొమ్మును ఐదేళ్లలో ఏటా రూ. 12 లక్షల చొప్పున (20 వేల డాలర్ల్లు) సీటు పొందిన వ్యక్తి చెల్లించాలి. ఇలా ప్రతి కళాశాలకూ ఏటా కనీసం రూ. 2.5 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకూ వస్తుందని.. ఈ నిధులతో మౌలిక వసతులు కల్పించవచ్చని సర్కారు వాదనను ముందుకు తెస్తోంది. మొత్తం కళాశాలలు, సీట్ల సంఖ్య, ఎన్ఆర్ఐ కోటా విక్రయంలోకి ఎన్ని సీట్లు వస్తాయి తదితర వివరాలతో నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలందాయి. విక్రయానికి 225 ఎంబీబీఎస్ సీట్లు? ప్రస్తుత ప్రభుత్వ ఆలోచన ప్రకారం సర్కారీ వైద్య కళాశాలల్లో 15 శాతం సీట్లు ఎన్ఆర్ఐ కోటాకింద విక్రయిస్తే కనీసం 225 సీట్లు ప్రతిభ కలిగిన విద్యార్థులకు దక్కకుండా పోతాయి. రాష్ట్రంలో మొత్తం 12 ప్రభుత్వ వైద్య కళాశాలలున్నాయి. ఇందులో విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాల రెండు రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఈ కళాశాలలో ఉన్న 150 సీట్ల విక్రయం కుదరదు. మిగతా 11 కళాశాలల్లో 1,750 సీట్లు ఉన్నాయి. ఇందులో 15 % అన్రిజర్వ్డ్ మినహాయిస్తే 1,498 సీట్లుం టాయి. ఈ సీట్లలో 15 శాతం అంటే 225 సీట్లు విక్రయిస్తారు. ఈ సీట్ల విక్రయం ద్వారా ఏటా రూ. 27 కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నారు. ‘ఎన్ఆర్ఐ’ లేదంటే.. రూ. 60 వేలు ఫీజు! ఒకవేళ ఎన్ఆర్ఐ కోటా సీట్లను విక్రయించలేని పక్షంలో ప్రస్తుతం కన్వీనర్ కోటా సీట్లకు రూ. 60,000 వసూలు చేస్తున్నట్టు ప్రభుత్వ సీట్లకూ అంతే స్థాయిలో తీసుకోవాలనే ఆలోచన కూడా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. మొత్తం సీట్లలో 50 శాతం సీట్లు రిజర్వేషన్ కేటగిరీ ఉంటుంది. వీటికి కేంద్ర ప్రభుత్వమే స్కాలర్షిప్ల కింద చెల్లిస్తుంది. మిగతా 50 శాతం సీట్లకు అంటే సుమారు 900 సీట్లకు ఏటా రూ. 60,000 లెక్కన వసూలు చేస్తారు. దీనివల్ల ఏటా రూ. 5.40 కోట్లు వస్తుంది. నాడు 5% ఎన్ఆర్ఐ కోటాపై తీవ్ర వ్యతిరేకత 2000-2003 సంవత్సరాల మధ్య అప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల నుంచి యూజర్ చార్జీలు వసూలు చేశారు. అంతేకాదు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 5 శాతం సీట్లను ఎన్ఆర్ఐ కోటాకింద ఇచ్చేయాలని తీర్మానించారు. దీంతో జూనియర్ డాక్టర్లు, సైన్స్ విద్యార్థులతో పాటు వివిధ ప్రజాసంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. జూడాల ఆధ్వర్యంలో ఆస్పత్రుల్లో సమ్మెలు జరిగాయి. ధర్నాలు జరిగాయి. ఆ తర్వాత 2004లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యూజర్ చార్జీలు, 5 శాతం ఎన్ఆర్ఐ కోటాను రద్దు చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: ఇద్దరు లాలు ప్రసాద్లు... అయితే ఏంటి?
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
రైతు రుణమాఫీ ఊసేది..?
ఈవీఎంల రెండో విడత ర్యాండమైజేషన్
ప్రారంభమైన హోం ఓటింగ్
No Headline
No Headline
కూలీల కనీస వేతనం పెంచాలి
నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు భేష్
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement