breaking news
dis satisfaction
-
మీరిక వెళ్లొచ్చు
కోల్కతా: రోజంతా హైడ్రామా తర్వాత బెంగాల్ ప్రభుత్వం, జూనియర్ డాక్టర్లకు మధ్య శనివారం చర్చలు అసలు ప్రారంభమే కాలేదు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యర్థన మేరకు ‘ప్రత్యక్ష ప్రసారం’ డిమాండ్ను పక్కనబెట్టి చర్చలకు సిద్ధపడ్డ జూనియర్ డాక్టర్లను ఆకస్మాత్తుగా సీఎం నివాసం దగ్గర నుంచి పంపేశారు. చాలా మొరటుగా మీరికి వెళ్లిపోవచ్చని చెప్పారని జూడాలు ఆరోపించారు. ‘చర్చలకు ఆహ్వానించడంతో సీఎం నివాసానికి వచ్చాం. ప్రత్యక్షప్రసారం లేదా వీడియో రికార్డింగు ఉండాలని డిమాండ్ చేశాం. సీఎం మమతా బెనర్జీ బయటకు వచ్చి చర్చలకు రావాలని విజ్ఞప్తి చేశారు. సమావేశం మినిట్స్ను మాకు ఇస్తామని హామీ ఇచ్చారు. మాలో మేము చర్చింకున్నాం. సీఎం విజ్ఞప్తి మేరకు ప్రత్యక్షప్రసారం, వీడియో రికార్డింగు లేకుండా చర్చలకు అంగీకరించాం. ఇదే విషయాన్ని ఆరోగ్యమంత్రి చంద్రిమ భట్టాచార్యకు తెలుపగా.. ఇక చాలు మీరు వెళ్లిపోండని ఆమె చెప్పారు. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది, మీకోసం మూడు గంటలుగా వేచిచూస్తున్నామని తెలిపారు. అర్ధంతరంగా మమ్మల్ని పంపేశారు’ అని సీఎం నివాసం వద్ద జూనియర్ డాక్టర్లు మీడియాతో వాపోయారు. చర్చలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ‘ఈ ఉదంతం ప్రభుత్వం అసలు రంగును బయటపెట్టింది. చర్చలపై ఎవరికి చిత్తశుద్ధి లేదో తెలుపుతోంది’ అని ఒక జూనియర్ డాక్టర్ కన్నీరుపెట్టుకుంటూ అన్నారు. ‘ఈ రోజుకు ఇక ముగిసినట్లే. మూడు గంటలుగా మేం వేచిచూస్తున్నాం. మీరు సీఎం నివాసం లోపలికి రాలేదు. ఇప్పటికే బాగా ఆలస్యమైపోయింది (రాత్రి అయిందని)’ అని ఆరోగ్యమంత్రి చంద్రిమ అంటున్న వీడియోను జూడాలు మీడియాకు షేర్ చేశారు. ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న పీజీ ట్రైనీ డాక్టర్పై హత్యాచారాన్ని నిరసిస్తూ పశ్చిమబెంగాల్ జూనియర్ డాక్టర్లు నెలరోజులకు పైగా విధులను బహిష్కరిస్తున్న విషయం తెలిసిందే. సెపె్టంబరు 10న సాయంత్రానికల్లా విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ సమ్మె కొనసాగిస్తున్నారు. చర్చలపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. జూడాల డిమాండ్ మేరకు స్వయంగా చర్చల్లో పాల్గొనడానికి మమత అంగీకరించారు. ప్రత్యక్షప్రసారంపై పీటముడి పడినా.. చివరకు శనివారం జూడాలు దానిపై వెనక్కితగ్గారు. అయినా సర్కారు వైఖరితో చర్చలు సాధ్యపడలేదు. ఎన్నిసార్లు నన్నిలా అవమానిస్తారు: మమత అంతకుముందు సీఎం నివాసం వద్దకు చేరుకొని జూనియర్ డాక్టర్లు చర్చల ప్రత్యక్షప్రసారం డిమాండ్తో బయటే నిలబడిపోయా రు. వర్షంలో తడుస్తూ అలాగే నిలబడ్డారు. దాంతో సీఎం మమత బయటకు వచి్చ.. ‘మీరందరూ లోపలికి వచ్చి చర్చల్లో పాల్గొనాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. వైద్యురాలి హత్యాచారం కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ప్రత్యక్షప్రసారం సాధ్యం కాదు. చర్చలను వీడియో రికార్డు చేసి.. సుప్రీంకోర్టు అనుమతితో మీకొక కాపీ అందజేస్తాం. ఈ రోజు సమావేశమవుదామని మీరే కోరారు. మీకోసం వేచిచూస్తున్నా. మీరెందుకు నన్నిలా అవమానిస్తున్నారు. దయచేసి నన్నిలా అవమానించొద్దు. ఇదివరకు కూడా మూడుసార్లు మీకోసం ఎదురుచూస్తూ కూర్చున్నా. కానీ మీరు రాలేదు’ అని మమత జూడాలతో అన్నారు. జూడాల శిబిరం వద్ద ప్రత్యక్షం శనివారం ఉదయం అందరినీ ఆశ్చర్యపరుస్తూ సీఎం మమతా బెనర్జీ స్వయంగా జూనియర్ డాక్టర్ల వద్దకు వచ్చారు. ఐదురోజులుగా జూడాలు బైఠాయించిన స్వాస్థ్య భవన్ (ఆరోగ్యశాఖ కార్యాలయం) వద్దకు చేరుకున్నారు. జూడాల డిమాండ్లను పరిశీలిస్తానని, ఎవరైనా తప్పుచేశారని తేలితే వారిపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మెడికోలు వర్షాలకు తడుస్తూ రోడ్డుపై ఆందోళనలు కొనసాగిస్తుంటే తాను నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని చెప్పారు. తానిక్కడి రావడం సమస్య పరిష్కారం దిశగా చివరి ప్రయత్నమని తెలిపారు. సమ్మె చేస్తున్న జూడాలపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలుండవని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యయుత ఆందోళనను అణిచివేయడానికి ఇది ఉత్తరప్రదేశ్ కాదు, బెంగాల్ అని సీఎం వ్యాఖ్యానించారు. -
డామిట్.. కథ అడ్డం తిరిగింది..!
ఇన్చార్జి చైర్మన్ వర్గానికి హాండిచ్చిన పాలక పార్టీ కౌన్సిలర్లు సమావేశానికి ఏడుగురు ఎడమొహం టీడీపీలో కొత్త మలుపు తిరిగిన మున్సిపల్ రాజకీయం టీడీపీ మున్సిపల్ రాజకీయాల్లో మరోసారి ఆధిపత్యపోరు కొనసాగుతోంది. రెండేళ్ల నుంచి మున్సిపల్ మాజీ చైర్మన్ గోపవరపు శ్రీదేవి వర్గానికి వ్యతిరేకంగా పనిచేసిన ప్రస్తుత ఇన్చార్జి చైర్మన్ నెల్లూరి మంగమ్మ వర్గానికి చైర్మన్ వర్గీయులు మొదటి రోజే షాక్ ఇచ్చారు. మాచర్ల: మున్సిపల్ చైర్మన్ శ్రీదేవి గురువారం రాజీనామా చేసిన కొన్ని గంటలకే కమిషనర్ ఎం.శ్రీనివాసులు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆమె రాజీనామా అంశాన్ని ఆమోదించారు. ఈ విషయం ప్రభుత్వానికి నివేదించేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయంపై అన్ని పార్టీల కౌన్సిలర్లకు సమాచారం అందించారు. అయితే టీడీపీకి చెందిన ఏడుగురు కౌన్సిలర్లు ఈ సమావేశానికి దూరంగా ఉండడం కలకలం రేపింది. చైర్మన్ శ్రీదేవి పదవిలో ఉన్నంత కాలం ఇబ్బందులకు గురి చేసి తమ వర్గాన్ని నానాతిప్పలు పెట్టిన ప్రస్తుత ఇన్చార్జి చైర్మన్ అధ్యక్షతన జరిగే సమావేశానికి ఎందుకు హాజరు కావాలని వారంతా చర్చించుకొని పార్టీ నాయకులు ఫోన్లు చేసినా స్పందించలేదు. గురువారం రాత్రి వరకు సెల్ఫోన్లను ఆపి ఓ ప్రాంతంలో వారు సమావేశమై తమ భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకున్నట్టు తెలుస్తోంది. దీంతో రాజీ చేసిన నాయకులు డామిట్... మనం ఎంత చేసినా కథ అడ్డం తిరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ముఖ్య నాయకుడు ప్రయత్నించినా.. నామినేటెడ్ పదవిలో ఉండి నియోజకవర్గంలో హల్చల్ చేస్తున్న ఓ నాయకుడు శుక్రవారం ఉదయం అసమ్మతి కౌన్సిలర్లకు ఫోన్లు చేసి మీరు గురువారం మున్సిపాలిటీలో జరిగిన సమావేశానికి హాజరైనట్టు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి సంతకాలు పెట్టాలని ఫోన్లో ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. తాము సమావేశానికి వెళ్లలేదని అన్ని పత్రికలలో తాము గైర్హాజరైనట్లు ప్రచురణైతే ఏ విధంగా సంతకాలు పెట్టాలని ఆ నాయకుడిని అడిగినట్లు తెలిసింది. నేను చెబుతున్నా చేయండని ఆ నాయకుడు పదే పదే ఫోన్లు చేయగా మున్సిపల్ చైర్మన్కు నిన్నటి వరకు అనుకూలంగా ఉన్న ఐదుగురు కౌన్సిలర్లు, వారి భర్తలు రైల్వేస్టేషన్లలోని ఓ కార్యాలయంలో సమావేశమై తమను ఇప్పటివరకు ఇబ్బందులకు గురి చేసి నేడు పెత్తనం చేసే వర్గానికి తాము సహాయ నిరాకరణ చేయాలని నిర్ణయించుకున్నారు. సత్తా చాటేందుకు సన్నద్ధం..? మున్సిపల్ చైర్మన్కు సంబంధించి రాబోయే రోజులలో ఎంపిక నోటిఫికేషన్ వచ్చిన సమయంలో (కౌన్సిలర్లుగా) తమ సత్తా చూపించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. తాము రాజీ చేసిన తర్వాత మరో వర్గం వ్యతిరేక రాజకీయాలకు సిద్ధం కావడంతో నియోజకవర్గ నాయకులు మున్సిపాలిటీ రాజకీయాలను ఏ విధంగా చక్కదిద్దాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.