-
Srinu Vaitla Birth Day: నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు రావుగారూ..!
శ్రీను వైట్ల... ట్వంటీటూ ఇయర్స్ ఇండస్ట్రీ. డైరెక్టర్గా పదిహేడు సినిమాలు. జయాపజయాలు ఉన్నప్పటికీ కెరీర్ తృప్తిగా ఉందంటున్నారు. ఒక్క ప్రశ్నకు మాత్రం ‘నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు’ అనేశారు. మహేశ్బాబుతో శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘దూకుడు’కి నేటితో పదేళ్లు. శుక్రవారం శ్రీను వైట్ల పుట్టినరోజు. ఈ సందర్భంగా శ్రీను వైట్లతో ‘సాక్షి’ స్పెషల్ ఇంటర్వ్యూ.. ► ‘దూకుడు’ సినిమాకి పదేళ్లయిన సందర్భంగా కొన్ని విశేషాలు? మహేశ్బాబుతో సినిమా అనుకున్నాక ఒక స్టోరీ లైన్ అనుకోవడం.. దాన్ని మహేశ్ ఒప్పుకోవడం జరిగాయి. ఆ తర్వాత ఆ లైన్ని ఎనభై శాతం డెవలప్ చేశాక నాకు అసంతృప్తిగా అనిపించింది. డ్రాప్ చేసేశాను. ఏ కథతో సినిమా చేస్తే బాగుంటుందా అని ఆలోచించుకుంటున్న సమయంలో ‘మహేశ్ని ఎమ్మెల్యే గెటప్లో చూపిస్తే ఎలా ఉంటుంది?’ అనిపించింది. అలా పుట్టినదే ‘దూకుడు’. మహేశ్కి చెబితే ఎగ్జయిట్ అయ్యారు. పగ, ప్రతీకారాల నేపథ్యంలో వినోద ప్రధానంగా గోపీమోహన్తో కలసి, ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశా. బాగా వచ్చింది. సెన్సేషనల్ హిట్టయింది. ► 22 ఏళ్ల క్రితం సినిమా కష్టాల్లాంటి కష్టాలు ఫేస్ చేసే ఉంటారు. ఫైనల్లీ ఈ కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ మీరు కూల్గా ఉండేంత పొజిషన్లో ఉన్నారు... ఎగ్జాట్లీ.. ఒకప్పుడు ఎన్ని కష్టాలు పడాలో అన్నీ పడ్డాను. ఈ కరోనా టైమ్లో ఇంటికే పరిమితం కావాల్సి వచ్చినా.. షూటింగ్లకి దూరమవుతున్నామనే బాధ తప్ప వేరే కష్టాలు లేవు. అయితే ఇంట్లో ఎవర్నీ కాలు బయటపెట్టనివ్వకుండా కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నాను. ఆ విషయంలో నా పిల్లలు (ముగ్గురు కుమార్తెలు) కొంచెం కోపం ప్రదర్శించినా.. ఎందుకింత ప్రొటెక్టివ్గా ఉన్నానో తర్వాత అర్థం చేసుకున్నారు. ► స్త్రీల విషయంలో సమాజంలో పరిస్థితులు అంత బాగాలేవు. మరి.. ముగ్గురు ఆడపిల్లల తండ్రిగా చాలా జాగ్రత్తగా ఉంటారా? ఉంటున్నాను.. ఒక్కోసారి పిల్లల విషయంలో ‘ఓవర్ ప్రొటెక్టివ్’గా ఉంటాను. వాళ్లు ఇబ్బందిపడుతున్నారని అర్థం అవుతుంది. కానీ, జరుగుతున్న ఘోరాలు విన్నప్పుడు పిల్లల విషయంలో ఎక్స్ట్రా కేర్గా ఉండటం తప్పులేదనిపిస్తుంది. పెద్దమ్మాయి ప్లస్ టు, రెండో పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్, మూడో పాప సెవెన్త్ చదువుతోంది. మెచ్యూర్టీ వచ్చాక నేనెందుకు అంత ఓవర్ ప్రొటెక్టివ్గా ఉన్నానో వాళ్లకు అర్థమవుతుంది. ► ‘అమర్ అక్బర్ ఆంటోని’ 2018 చివర్లో రిలీజైంది. 2020లో లాక్డౌన్. ఆ ఏడాదిన్నర గ్యాప్లో ఏం చేశారు? 2019లో ఒక స్క్రి‹ప్ట్ రెడీ చేశాను. 2020లో అది స్టార్ట్ అవ్వాలి. ఈలోపు లాక్డౌన్ వచ్చింది. ఆ తర్వాత మరో కథ, ఆ తర్వాత ఇంకో ఆలోచన వస్తే.. నా రైటర్స్ టీమ్కి నచ్చడంతో అది కూడా తయారు చేశాం. మొత్తం మూడు కథలు రెడీగా ఉన్నాయి. అందులో ‘ఢీ అండ్ ఢీ’ ఒకటి. ► ‘ఢీ’లో కథ, దానితో పాటు సాగే కామెడీ అన్నీ చక్కగా కుదిరాయి. మరి.. ‘ఢీ అండ్ ఢీ’లోనూ ‘నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు’ వంటి డైలాగ్స్.. అంత కామెడీ ఉంటుందా? రెట్టింపు ఉంటుంది. అందుకే ‘ఢీ అండ్ ఢీ’కి ‘డబుల్ డోస్’ అని క్యాప్షన్ పెట్టాం. డబుల్ డోస్ ఆఫ్ కామెడీ అని అర్థం. ఇది ‘ఢీ’కి సీక్వెల్ కాదు. వేరే కథ. రావుగారూ.. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దులా పాపులర్ అయ్యే ౖడైలాగ్ ఇందులోనూ ఉంది. మిగతా అన్ని డైలాగ్స్ కూడా బాగుంటాయి. ► ‘ఢీ’లో విష్ణు కాస్త బొద్దుగా కనిపించారు. ఇప్పుడు మేకోవర్తో స్లిమ్ అయ్యారు. ఇది ప్లస్సవుతుందా? కచ్చితంగా ప్లస్.. మేకోవర్ విషయంలో విష్ణు వండర్ఫుల్. ఎంతో కష్టపడి, ఫిట్గా తయారయ్యారు. ‘ఢీ’లో విష్ణు బాగా యాక్ట్ చేశారు. ఇప్పుడు ఇంకా మెచ్యూర్టీ వచ్చింది కాబట్టి మ్యాగ్జిమమ్ పర్ఫార్మెన్స్ రాబట్టగలుగుతాననే నమ్మకం ఉంది. ‘ఢీ’ కంటే కూడా ఈ సినిమాలో విష్ణు క్యారెక్టర్లో ఇంకా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ► గౌతమ్ మీనన్ వంటి దర్శకులు ఇటు సినిమాల్లో అటు ఓటీటీ ప్లాట్ఫామ్లో నటులుగా కనిపిస్తున్నారు.. మీకా ఉద్దేశం లేదా? నాకు ఫొటోలు దిగడమంటేనే ఇబ్బంది. కెమెరా వెనకాల ఆర్టిస్టులకు ఎంతైనా చేసి చూపిస్తాను. కానీ, యాక్ట్ చేయాలనుకోలేదు. నాకా క్వాలిటీ లేదు. గౌతమ్ మీనన్ గురించి చెప్పాలంటే.. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఇష్టం. ► దర్శకుడిగా ఓటీటీ ప్రాజెక్ట్ ఏదైనా? ఇప్పుడు నా దగ్గరున్న మూడు కథలు థియేటర్ మీటర్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేసినవే. ఓటీటీ ప్రాజెక్ట్ గురించి ఇంకా ఏమీ ఆలోచించలేదు. ► మీతో ఎన్నో సినిమాలు చేసిన ప్రకాశ్రాజ్, రెండో సినిమా చేయనున్న విష్ణు ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు.. గెలుపు ఎవరిదని ఊహిస్తున్నారు? ‘ఢీ’లో డైలాగే చెబుతాను. ఇలాంటి విషయాల్లో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు రావుగారూ... (నవ్వేస్తూ). ఇప్పుడు నా దృష్టంతా త్వరలో మొదలుపెట్టబోయే ‘ఢీ అండ్ ఢీ’ మీదే ఉంది. ఎంత బాగా తీయాలా అనే ప్లానింగ్లో ఉన్నాను. అక్టోబరు చివర్లో లేదా నవంబరు మొదటి వారంలో షూటింగ్ ఆరంభించాలనుకుంటున్నాం. ► కొన్ని హిట్స్తో పాటు ఫ్లాప్స్ చూశారు కదా.. ఫ్లాప్స్కి కారణం తెలుసుకున్నారా? నా నుంచి ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ని కోరుకుంటున్నారని గ్రహించాను. దానికి దూరంగా వెళ్లినప్పుడు వేరేగా ఉంటుందని తెలుసుకున్నాను. అందుకే కథలో ఎంటర్టైన్మెంట్ ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నాను. -
ఏడువందల ఏళ్ల క్రితం ఏం జరిగింది?
‘గౌరవం’, ‘కొత్తజంట’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హైదరాబాద్లో ప్రారంభమైంది. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై ఎంవిఎన్ రెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ ఎస్.శైలేంద్ర బాబు, కేవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు శ్రీను వైట్ల కెమేరా స్విచ్చాన్ చేయగా, మరో దర్శకుడు బోయపాటి శ్రీను క్లాప్ ఇచ్చారు. యువ దర్శకుడు మారుతి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ- ‘‘సంవత్సరం నుంచి ఇటువంటి కథ కోసమే ఎదురు చూస్తున్నా. నేను, నాన్నగారు సింగిల్ సిట్టింగ్లో ఓకే చేసిన చిత్రమిది. దర్శకుడు ఎంవిఎన్ రెడ్డి తండ్రి మల్లిడి సత్యనారాయణరెడ్డిగారు, మా అన్నయ్యతో ‘బన్ని’ సినిమా నిర్మించారు. ఎంవిఎన్గారు చాలా చిత్రాలకు కో-డెరైక్టర్, అసోసియేట్ డెరైక్టర్గా పనిచేశారు. ఇప్పుడు నా చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవు తున్నారు’’ అని తెలిపారు. ‘‘లవ్ ఎంటర్టైనర్గా సాగే చిత్రమిది. ఏడువందల సంవత్సరాల క్రితం జరిగిన నేపథ్యం చూపించబోతున్నాం’’ అని దర్శకుడు చెప్పారు. ‘‘ ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ తర్వాత తీస్తున్న రెండో చిత్రమిది. మంచి కథ కుదిరింది’’ అని శైలేంద్రబాబు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, కెమేరా: సంజయ్ లోకనాథ్. -
నరేశ్కు పెళ్లి గిఫ్ట్లా..!
‘‘అల్లరి నరేశ్ కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటికే తను మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా కూడా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని దర్శకుడు శ్రీను వైట్ల అన్నారు. అల్లరి నరేశ్, సాక్షి చౌదరి జంటగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘జేమ్స్బాండ్’. సాయికిషోర్ మచ్చ దర్శకుడు. సాయికార్తీక్ స్వరాలందించిన ఈ సినిమా పాటల వేడుక హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ -‘‘మా సొంత సంస్థలో సినిమా చేయడం కంటే... ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో చేయడానికే ఎక్కువ ఇష్టపడతాను. ఈ సినిమాలో నా కన్నా సాక్షి చౌదరి ఎక్కువ కష్టపడ్డారు’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమా నరేశ్కు పెళ్లి గిఫ్ట్ కావాలి. చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్’’ అని హీరో శ్రీకాంత్ అన్నారు. ఈ వేడుకలో సంగీత దర్శకుడు సాయికార్తీక్, రచయిత రామజోగయ్య శాస్త్రి, హీరో సుధీర్బాబు తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement