-
నేటి నుంచి డీఎడ్ సెమిస్టర్ పరీక్షలు
యడ్లపాడు: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (2019–21) విద్యార్థులకు మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 5, 6, 7, 8వ తేదీలలో జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ జి.మాణిక్యాంబ తెలిపారు. రోజూ ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు జరిగే ఈ పరీక్షలకు విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఆన్లైన్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షా కేంద్రాల్లో వసతులు కల్పించింనట్టు వెల్లడించారు. విద్యార్థులు మాస్కు ధరించాలని, శానిటైజర్లను వెంట తెచ్చుకోవడంతోపాటు భౌతిక దూరం పాటించాలని కోరారు. 601 మంది పరీక్షలకు హాజరు నాలుగు పరీక్షా కేంద్రాల్లో మొత్తం 601 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. గుంటూరు పరీక్ష కేంద్రంలో 188 మంది, బాపట్లలో 115 మంది, నరసరావుపేటలో 172 మంది, యడ్లపాడు మండలం బోయపాలెంలోని జిల్లా ప్రభుత్వ డైట్ కళాశాలలో 126 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని అధికారులు వివరించారు. బోయపాలెంలో 144 సెక్షన్ బోయపాలెం ప్రభుత్వ డైట్ కళాశాలలో సోమవారం నుంచి ఫస్టియర్ రెండోసెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నందున పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తహసీల్దార్ జె.శ్రీనివాసరావు తెలిపారు. డైట్ కళాశాల సమీపంలో, బోయపాలెం గ్రామంలో ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులను పరీక్ష జరిగే సమయంలో మూసివేయాలని ఆదేశించారు. ఈనెల 8 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని చెప్పారు. -
డీఎడ్ పేపర్ వాల్యూయేషన్ బహిష్కరణ
సాక్షి, గుంటూరు : డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీ ఎడ్) ప్రథమ సంవత్సర పరీక్షలు రాసిన విద్యార్థులకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను శుక్రవారం గుంటూరు నగరంపాలెంలోని స్టాల్ బాలికోన్నత పాఠశాలలో ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా విధులకు హాజరైన 130 మందికి పైగా ప్రైవేటు డీఎడ్ కళాశాలల అధ్యాపకులు గతేడాది డీఎడ్ ద్వితీయ సంవత్సర మూల్యాంకనానికి సంబంధించిన రెమ్యూరేషన్ బకాయిలను చెల్లించకపోవడంతో ఆందోళనకు దిగారు. రెమ్యూనరేషన్ బకాయిలు చెల్లించిన తరువాతే మూల్యాంకన విధుల్లో పాల్గొంటామని అక్కడే ఉన్న ప్రభుత్వ పరీక్షల విభాగ సహాయ కమిషనర్ మాణిక్యాంబకు స్పష్టం చేసి, వాల్యూయేషన్ విధులను బహిష్కరించారు. అనంతరం క్యాంప్ ప్రాంగణంలో ఆందోళనకు దిగారు.ఈ సందర్భంగా చీఫ్ ఎగ్జామినర్, ఎగ్జామినర్ విధులకు హాజరైన అధ్యాపకులు బి.వెంకటేశ్వరరావు, మరియదాసు, టి.దాసు, రాజ్కుమార్ మాట్లాడుతూ గతేడాది వాల్యూయేషన్ చేసిన అధ్యాపకులకు చెల్లించాల్సిన రెమ్యూనరేషన్ చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై పలుమార్లు అధికారులను కలిసినప్పటికీ పట్టించుకోకపోవడంతో విసిగి వేసారిన ఫలితంగా తాజాగా డీఎడ్ ప్రథమ సంవత్సర వాల్యూయేషన్ విధులను బహిష్కరిస్తున్నామని చెప్పారు. గతేడాది వాల్యూయేషన్ విధుల్లో పాల్గొన్న 177 మంది అధ్యాపకులకు డీఏతో పాటు పేపర్ వాల్యూయేషన్కు కలిపి మొత్తం రూ.9 లక్షలు చొప్పున చెల్లించాల్సి ఉందని తెలిపారు. డీఈవో హామీతో ఆందోళన విరమణ స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో అధ్యాపకులు ఆందోళనకు దిగిన విషయాన్ని తెలుసుకున్న డీఈవో ఆర్.ఎస్.గంగా భవానీ అక్కడకు చేరుకున్నారు. అధ్యాపకులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. గతేడాదికి సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ చెల్లింపులు జరగని మాట వాస్తవమేనని, బకాయిలను 20 రోజుల్లోపు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన అధ్యాపకులు తిరిగి వాల్యూయేషన్ విధులకు హాజరయ్యారు. ఈనెల 20వ తేదీ వరకూ వాల్యూయేషన్ జరగనుంది. -
ఉపాధ్యాయ విద్యలో బీసీలే అత్యధికం
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన వర్గాలు(బీసీ) ఉపాధ్యాయవిద్యలో ముందంజలో ఉన్నాయి. రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎడ్), బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఎడ్) కోర్సులను అభ్యసిస్తున్నవారిలో 67 శాతం బీసీలు, ఆ తరువాత స్థానంలో ఎస్సీలు ఉన్నారు. రాష్ట్రంలో వివిధ సామాజికవర్గాల వారీగా, వివిధ కోర్సులను అభ్యసిస్తున్నవారి వివరాలను బీసీ కమిషన్ విద్యాశాఖ నుంచి సేకరించింది. గత ఏడాది ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) రాసినవారిలోనూ బీసీలే అత్యధికంగా ఉన్నట్లు వెల్లడించింది. టెట్కు హాజరైన వారిలో 58.99 శాతం బీసీలుండగా, ఆ తరువాత 18.77 శాతంతో రెండో స్థానంలో ఎస్సీ అభ్యర్థులు ఉన్నట్లు తేల్చింది. పరీక్షకు మొత్తంగా 3,40,567 మంది హాజరైతే అందులో బీసీలు 2,00,922 మంది ఉండటం గమనార్హం. 85 శాతం గ్రామీణ ప్రాంతాల వారే.. ఉపాధ్యాయ విద్యను అభ్యసిస్తున్న వారిలో 85 శాతం మంది అభ్యర్థులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారేనని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ఉపాధ్యాయ విద్యపై ఆసక్తి చూపుతున్న వారిలో పట్టణ ప్రాంతాలకు చెందిన విద్యార్థుల తక్కువేనని పేర్కొంటున్నారు. అందులోనూ వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులే ఈ కోర్సులను అభ్యసించడం ద్వారా త్వరగా జీవితంలో స్థిరపడవచ్చన్న భావనే ప్రధాన కారణమని పేర్కొంటున్నారు. ఇంటర్మీడియట్ తరువాతే డీఎడ్ చేసే అవకాశం ఉన్నందునా ఎక్కువ కాలం చదివే అవకాశంలేని నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు డీఎడ్ పూర్తి చేసి ప్రభుత్వ రంగం లేదా ప్రైవేటు రంగంలో స్థిరపడవచ్చన్న భావనే ఇందుకు కారణమని చెబుతున్నారు. టెట్లో అర్హత సాధించిన ఓసీలు 10 శాతమే ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఓసీలే తక్కువగా అర్హత సాధిస్తుండగా, ఎస్సీల్లో ఎక్కువ అర్హత శాతం ఉంది. ఎస్సీల తరువాత ఎస్టీలు ఎక్కువ శాతం అర్హతను సాధిస్తున్నారు. బీసీలు తక్కువ అర్హత పొందుతున్నారు. అయితే ఇందుకు కారణం అర్హత మార్కుల విధానమే. అర్హత మార్కుల విధానం ఓసీలకు 60 శాత, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం ఉంది. గత ఏడాది నిర్వహించిన టెట్లో ఓసీలు 10 శాతం మందే అర్హత సాధించగా, బీసీలు 29.40 శాతం మంది, ఎస్సీలు 53.68 శాతం మంది, ఎస్టీలు 38.22 శాతం మంది అర్హత సాధించారు. -
డీఎడ్కు తగ్గిన డిమాండ్
వెబ్ ఆప్షన్లు ఇచ్చింది కేవలం 27 వేల మంది ఈ నెల 26న సీట్ల కేటాయింపు సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సుకు ఈసారి డిమాండ్ తగ్గింది. డీఈఈసెట్-2015 పరీక్షకు 1,05,382 మంది విద్యార్థులు హాజరు కాగా అందులో 68,884 మంది అర్హత సాధించారు. వెబ్ కౌన్సెలింగ్లో కేవలం 27 వేల మంది మాత్రమే ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ప్రభుత్వ పరిధిలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థలు (డైట్), ప్రైవేటు డీఎడ్ కాలేజీల్లో ప్రవేశాలకు చేపట్టిన డీఈఈసెట్-2015 వెబ్ఆప్షన్ల గడువు సోమవారంతో ముగిసింది. గతేడాది జూలైలో జరగాల్సిన ప్రవేశాల కౌన్సెలింగ్ ఆలస్యం కావడంతో ఈ పరిస్థితి నెలకొందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు ఈ నెల 26న సీట్లు కేటాయించనున ్నట్లు డీఈఈసెట్ కన్వీనర్ గోపాల్రెడ్డి పేర్కొన్నారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా 10 ప్రభుత్వ డైట్, 183 ప్రైవేటు డీఎడ్ కాలేజీల్లోని 8,700 కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. మరో 1,890 మేనేజ్మెంట్ కోటా సీట్లను యాజమాన్యాలే భర్తీ చేసుకోనున్నాయని వెల్లడించారు. -
డైట్సెట్కు తగ్గిన ఆదరణ
గతేడాది లక్షన్నర.. ఈసారి 87 వేల దరఖాస్తులే సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కాలేజీలు, జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో (డైట్) ప్రవేశాల కోసం ఈసారి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. గత ఏడాది తెలంగాణ జిల్లాల నుంచి లక్షన్నర మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా ఈసారి ఆ సంఖ్య 87 వేలకు పడిపోయింది. ప్రవేశాల నోటిఫికేషన్ జారీలో ఆలస్యం కావడమే ఇందుకు కారణంగా అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో డీఈఈసెట్ నిర్వహణ, నోటిఫికేషన్ జారీకి అవసరమైన చట్ట సవరణ చేయడంలో ప్రభుత్వం ఆలస్యం చేయడం వల్లే విద్యార్థులు ఇతర డిగ్రీ కోర్సుల్లో చేరిపోయినట్లు సమాచారం. డైట్, డీఎడ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష డీఈఈసెట్-2015 నోటిఫికేషన్ను ఈనెల 5వ తేదీన జారీ చేసిన విద్యాశాఖ 8వ తేదీ నుంచి విద్యార్థులు ఫీజులు చెల్లించేలా, 9వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు పంపేలా చర్యలు చేపట్టింది. సోమవారం వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు, మంగళవారం దరఖాస్తులు అందించేందుకు అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం వరకు 87 వేల దరఖాస్తులు వచ్చినట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే నెల 9న డీఈఈసెట్ నిర్వహించి, ఫలితాలు, ర్యాంకులను వచ్చే నెల 22న ప్రకటించనున్నట్లు తెలిపాయి. అందుబాటులోకి రానున్న 15 వేల సీట్లు రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్లు, ప్రైవేటు డీఎడ్ కాలేజీల్లో దాదాపు 15 వేల సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం జిల్లాల్లోని ప్రభుత్వ కాలేజీల్లో ఒక్కో కాలేజీలో 100 చొప్పున వేయి సీట్లు ఉండగా, 272 ప్రైవేటు కాలేజీల్లో 50 చొప్పున 13,600 సీట్లు ఉన్నాయి. అయితే కొన్ని ప్రైవేటు కాలేజీల్లోనూ 100 వరకు సీట్లకు అనుమతి తెచ్చుకున్నాయి. దీంతో ఈసారి డీఎడ్లో 15 వేల వరకు సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement