breaking news
Digital Trend
-
చైనా మూర్ఖపు నిర్ణయంతో..
China Crackdown Crypto Trading: అంతర్జాతీయ మార్కెట్లో రారాజుగా మారాలన్న చైనా ప్రయత్నాలు ఒక్కొక్కటిగా బెడిసి కొడుతున్నాయి. స్వీయ అపరాధాలతో పతనం వైపుగా అడుగులు వేస్తోంది. మరోవైపు చైనా కుబేరులు సైతం నష్టాల్ని చవిచూస్తున్నారు. మొత్తంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు అవుతుండడం చైనాకు మింగుడు పడడం లేదు. ఈ తరుణంలో డ్రాగన్ కంట్రీ చేసిన తాజా ప్రకటన ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తోంది. ప్రస్తుతం డిజిటల్ ట్రేడింగ్లో క్రిప్టో కరెన్సీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో ఈ కరెన్సీని నిషేధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తోంది చైనా. క్రిప్టో అనేది ఫ్లాట్ కరెన్సీ కాదని వాదిస్తున్న చైనా.. వీలైనంత త్వరలో తమ దేశంలో నిషేధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొంది. మరోవైపు క్రిప్టో కరెన్సీ సంబంధిత లావాదేవీలన్నీ చట్టవ్యతిరేకమైనవని చైనా కేంద్రీయ బ్యాంకు స్పష్టం చేసింది. పడిపోయిన టోకెన్ ధరలు డిజిటల్ కరెన్సీని నిషేధించాలని డ్రాగన్ కంట్రీ ప్రకటన.. డిజిటల్ ట్రేడ్పై ప్రతికూల ప్రభావం చూపెట్టింది. వర్చువల్ కరెన్సీ విలువల్లో విపరీత మార్పులు తెచ్చింది. క్రిప్టోకరెన్సీల విలువ(బిట్ కాయిన్, ఎథెరియమ్)లు ఒక్కసారిగా పడిపోయింది. బిట్కాయిన్ విలువ ఐదు శాతం పడిపోయి 42,232 డాలర్లకు చేరింది. ఇక రెండో అతిపెద్ద టోకెన్గా పేరున్న ఎథెరియమ్ విలువ 6.3 శాతం డ్రాప్ అయ్యి 2,888కు చేరింది. సోలానా 6.9శాతం తగ్గిపోయి 134 డాలర్లకు చేరింది. ఇక లైట్కాయిన్ విలువ 5.9 శాతం తగ్గి 149 డాలర్లకు చేరుకుంది. కార్డానో విలువ 2.4 శాతం పడిపోయి.. 2.15 డాలర్ల వద్ద కొనసాగుతోంది. చైనా అభ్యంతరాలు క్రిప్టో కరెన్సీ లావాదేవీల మనుగడ దేశీయ మార్కెట్కు నష్టమని చైనా అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలోనే క్రిప్టో సంబంధిత లావాదేవీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అనుకుంటోంది. విదేశీ సంస్థలు అందించే క్రిప్టో సేవలు అక్రమమైనవేనని పేర్కొంది. అదే సమయంలో దేశంలో బిట్కాయిన్ సహా క్రిప్టో కరెన్సీ మొత్తాన్ని నిషేధించాలని ప్రభుత్వానికి చైనా సెంట్రల్ బ్యాంక్ సలహా ఇచ్చింది. ► డిజిటల్ ట్రేడింగ్లో క్రిప్టోకరెన్సీ ఇప్పుడు ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంది. ► ఎలన్ మస్క్ లాంటి బిలియనీర్ల ప్రోత్సాహంతో.. జనాలు సైతం ఈ-కరెన్సీపై నమ్మకం పెంచుకుంటున్నారు. ► ప్రపంచంలో చాలా దేశాలు క్రిప్టోకరెన్సీ లావాదేవీల్ని అనుమతిస్తున్నాయి. ► చైనా అతిపెద్ద క్రిప్టోకరెన్సీకి మార్కెట్ కూడా. ► అయినప్పటికీ చైనా మాత్రం క్రిప్టో కరెన్సీని అంగీకరించడం లేదు ► ఆర్థిక వ్యవస్థకు ఒరిగేదీ ఏమి లేదని, పైగా వర్చువల్ కరెన్సీ వల్ల కార్బన్ ఉద్గారాలు ఉధృతంగా ఉత్పత్తి అవుతాయని సొల్లు కారణాలు చెబుతోంది. ► మే నెలలో చైనా స్టేట్ కౌన్సిల్ ఏకంగా బిట్కాయిన్ మైనింగ్ను మూసేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ► నిషేధ నిర్ణయం గనుక అమలు అయితే.. భారీగా నష్టపోయేది ముందుగా చైనానే! చదవండి: క్రిప్టోకరెన్సీకి పోటీ! సరికొత్త వ్యూహంతో ఆఫ్రికన్ దేశాలు ఇదీ చదవండి: Bitcoin: బిట్కాయిన్ సృష్టికర్త ఎవరో తెలుసా...! -
పల్లెగడపకు..e-సాక్షరత
సూర్యాపేట రూరల్ : ఇప్పుడంతా డిజిటల్ ట్రెండ్. ఇంటర్నెట్తో ప్రపంచమే ఒక కుగ్రామంగా మారింది. ఈ నేపథ్యంలో అత్యాధునిక పరిజ్ఞాన ఫలాలను మరింతగా విస్తరించడంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటికొకరు చొప్పున సాంకేతిక విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పం దం కుదుర్చుకుంది. పల్లెల్లో ప్రతి ఇంటా ఈ-సాక్షరత పథకాన్ని అమలు చేయనుంది. ఈ పథకం మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జిల్లాలను ఎంపిక చేసింది. అందులో నల్లగొండ జిల్లా ఎంపిక కాగా దానిలో సూర్యాపేట మండలం ఉండడం విశేషం. కేంద్ర సమాచార సాంకేతిక శాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. ప్రతి ఇంటిలోనూ ఒకరిని సాంకేతిక విద్యావంతుడిగా తీర్చిదిద్దా లన్న లక్ష్యంతో జాతీయ ఐటీ పాలసీని రూపొం దించింది. సూర్యాపేట మండలంలో 18 గ్రామాలతో పాటు 33 అనుబంధ గ్రామాలు ఉన్నాయి. జనాభా 48,617 ఉంది. జనాభాలో అక్షరాస్యత 63 శాతం ఉంది. శిక్షణ ఇలా.. నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ ఆధ్వర్యంలో చేపట్టే ఈ పథకంలో భాగంగా 14-60 సంవత్సరాల వయసున్న సాంకేతిక నిరక్షరాస్యులను గుర్తించి శిక్షణ ఇస్తారు. ఇందుకు సూర్యాపేట మండలానికి చెందిన ఏడుగురు మీ సేవ ఆపరేటర్లను ఎంపిక చేసి వారి ద్వారా సర్వే నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. సూర్యాపేట మండలంలో 15 వేల మందిని సర్వే చేసి 7,500 మంది లబ్ధిదారులను గుర్తిస్తారు. ఎన్డీఎల్ రూపొందించిన సాఫ్ట్వేర్ ఉన్న టాబ్లెట్ల ద్వారా ఈ సర్వేను పకడ్బందీగా నిర్వహించనున్నారు. ఇప్పటికే మీసేవ ఆపరేటర్లకు టాబ్లెట్లు అందజేశారు. మొదటి దశలో సూర్యాపేట మండలంలో 7,500 మందిని డిజిటల్ విద్యావంతులుగా తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అందులో భాగంగా ఎల్-1 పథకంలో 20గంటల శిక్షణ, ఎల్-2 కింద 40 గంటల శిక్షణ అందజేయనున్నారు. కుటుం బంలో ఒకరిని సాంకేతిక విద్యావంతులు చేసి వారికి కంప్యూటర్ వినియోగం, ఈ మెయిల్స్ పంపించడం, స్వీకరించడం వంటి జ్ఞానాన్ని అందించే దిశగా ఈ శిక్షణ సాగనుంది. శిక్షణ సమయంలో లబ్ధిదారులకు భృతిని ఇస్తారు. ఎల్-1 శిక్షణకు రూ.300 చొప్పున, ఎల్-2 శిక్షణకు రూ.600 చొప్పున అందించనున్నారు. వచ్చే నెల 10వ తేదీలోగా సర్వే పూర్తి చేసి మార్చి 31 వరకు శిక్షణ ముగించేందుకు సంబంధిత అధికారులు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఇంటికొకరు విద్యావంతులుగా మారే అవకాశం గ్రామీణ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పక్కాగా ఈ పథకం అమలైతే ఇంటికి ఒకరు విద్యావంతులుగా మారే అవకాశం ఉంటుంది. మొదటి దశలో సూర్యాపేట మండలం ఎంపిక కావడం మండల ప్రజల అదృష్టంగా భావించవచ్చు. అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. - బొమ్మగాని నాగలక్ష్మి, విద్యార్థిని, పిల్లలమర్రి గ్రామం త్వరలో సర్వే ప్రారంభం త్వరలో సర్వే ప్రారంభించి వచ్చే నెల 10వ తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంది. ఇటీవల శిక్షణ ఇచ్చారు. గ్రామా ల్లో సర్వే చేసి వివరాలను ఎప్పటికప్పుడూ ప్రభుత్వానికి అందించేందుకు టాబ్లెట్లు అందజేశారు. టాబ్లెట్లోనే కుటుంబానికి సంబంధించిన వివరాలు ఎలా సేకరించాలో ఉంటుంది. - సంతోష్కుమార్, మీసేవ ఆపరేటర్, రాయినిగూడెం