breaking news
Digital Insurance
-
ఏఐతో బీమా రంగంలో పెను మార్పులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కృత్రిమ మేథ (ఏఐ)తో బీమా రంగంలో పెను మార్పులు వస్తున్నాయని డిజిట్ ఇన్సూరెన్స్ హెడ్ (అనలిటిక్స్, డేటా సైన్స్ విభాగం) విశాల్ షా తెలిపారు. విస్తృతమైన డేటాబేస్లను విశ్లేషించి వివిధ రిస్కులను మదింపు చేసేందుకు, సముచితమైన ప్రీమియంలను నిర్ణయించేందుకు బీమా సంస్థలు ప్రస్తుతం ఏఐ ఆధారిత అల్గోరిథమ్స్ను ఉపయోగిస్తున్నాయని వివరించారు. అలాగే మోసపూరిత క్లెయిమ్లను కూడా వీటితో గుర్తించగలుగుతున్నట్లు చెప్పారు. మరోవైపు, కస్టమర్లకు సరీ్వసులను మరింత మెరుగుపర్చేందుకు ఏఐ ఆధారిత చాట్బాట్లు, వర్చువల్ అసిస్టెంట్లు వినియోగంలోకి వచి్చనట్లు షా తెలిపారు. తక్షణం సమాధానాలిచ్చేలా, పాలసీల ఎంపికలు, కోట్ జనరేషన్ మొదలైన అంశాల్లో కస్టమర్లకు సహాయపడేలా వీటి శిక్షణ ఉంటోందన్నారు. అలాగే కీలకమైన క్లెయిమ్లకు సంబంధించి మదింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు బీమా సంస్థలు ప్రత్యేక అల్గోరిథమ్లను ఉపయోగిస్తున్నాయని చెప్పారు. మోటర్ బీమా విషయానికొస్తే వాహనాలను వ్యక్తిగతంగా పరీక్షించాల్సిన అవసరాన్ని తగ్గిస్తూ ఇమేజ్ రికగి్నషన్ టెక్నాలజీ ద్వారా నష్టాన్ని అంచనా వేయడంలోనూ ఏఐ సహాయపడుతోందని షా చెప్పారు. బీమా రంగంలో భారీ స్థాయిలో ఉండే డేటాను విశ్లేషించడంలో తోడ్పడటం ద్వారా వినూత్న ఉత్పత్తులను రూపొందించేందుకు కూడా అడ్వాన్స్డ్ అనలిటిక్స్, మెషిన్ లెరి్నంగ్ అల్గోరిథమ్లు సహాయపడుతున్నాయని పేర్కొన్నారు. -
రూ.130 కోట్లు సమీకరించిన రిన్యూబై
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ ఇన్సూ్యరెన్స్ ప్లాట్ఫామ్ రిన్యూబై.కామ్ రూ.130 కోట్ల నిధులను సమీకరించింది. సిరీస్–బీ రౌండ్లో భాగంగా లోక్ క్యాపిటల్, ఐఐఎఫ్ఎల్ ఏఎంసీ, అమికుస్ క్యాపిటల్స్ ఈ పెట్టుబడులు పెట్టాయి. ప్రస్తుతం రిన్యూబైలో 25 వేల పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) పార్టనర్స్ నమోదయ్యారు. ఏటా రూ.500 కోట్ల ప్రీమియం వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ప్రస్తుతం 450 నగరాల్లో సేవలందిస్తున్నామని, 2020 నాటికి వెయ్యి నగరాలకు.. 2 లక్షల పీఓఎస్లను లకి‡్ష్యంచామని కంపెనీ సీఈఓ బాలచందర్ శేఖర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
డిజిటల్ బీమా.. వైపరీత్యాల్లో ధీమా
వర్షాలు.. వరదలు ఇతరత్రా రూపాల్లో ఇటీవలి కాలంలో ప్రకృతి వైపరీత్యాల ఉదంతాలు అనేకం కనిపిస్తున్నాయి. వీటి వల్ల కొన్ని సందర్భాల్లో ప్రాణనష్టం, ఆస్తినష్టం గణనీయంగానే జరుగుతోంది. వాస్తవానికి ప్రకృతి వైపరీత్యాల మీద మనకెలాంటి నియంత్రణ లేకపోయినప్పటికీ.. వాటి బారి నుంచి మనకి కొంతైనా ఉపశమనం కల్పించే బీమా పాలసీల విషయంలో కాస్త ముందుచూపుతో ఉంటే తగు ప్రయోజనాలు పొందే వీలుంటుంది. సులభంగా క్లెయిమ్ చేసుకునేందుకు సాధ్యపడుతుంది. పాలసీ క్లెయిమ్లకు సంబంధించి సమస్యలేమీ ఎదురవకుండా ఉండాలంటే.. ముందుగా ఆయా బీమా పాలసీల్లో వివిధ నిబంధనల గురించి తగినంత అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే పాలసీకి సంబంధించి మన హక్కులను పరిరక్షించుకునే వీలవుతుంది. ఈ దిశగా ఉపయోగకరమైన కొన్ని అంశాలివీ... * ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో భద్రపరచటం మేలు * వీలైతే బీమా కంపెనీల సైట్లలోనే రిజిస్ట్రేషన్ ఆరోగ్య బీమా జీవిత బీమా తరహాలోనే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ పత్రాలను కూడా ప్రత్యేకంగా బీరువాల్లో దాచిపెట్టకుండా.. డిజిటల్ ఫార్మాట్లోనూ భ ద్రపర్చుకోవచ్చు. వర్తించే ప్రయోజనాలన్నీ పొందవచ్చు. అయితే, ఎంత ప్రకృతి వైపరీత్యాల్లాంటి సమయంలోనైనా హెల్త్ పాలసీ ప్రయోజనాలు పొందాలంటే కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే క్లెయిములను బీమా కంపెనీ తోసిపుచ్చే అవకాశం ఉంది. ఏదైనా చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన పక్షంలో దాన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయాలి. ఒకోసారి క్యాష్లెస్ హాస్పిటలైజేషన్ కుదరకపోయినప్పటికీ.. నిర్దేశిత నిబంధనలు పాటిస్తే, తర్వాత దశలో రీయింబర్స్మెంట్ అయినా పొందడానికి వీలవుతుంది. జీవిత బీమా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించిన మొత్తం డాక్యుమెంట్ని సాధ్యమైతే ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో భద్రపర్చడం మంచిది. అలా కుదరకపోతే కనీసం పాలసీ నంబరునైనా ఎలక్ట్రానిక్ విధానంలో ఎక్కడో ఒక దగ్గర భద్రంగా ఉంచుకోవాలి. నిజానికిది చాలా సులువైన ప్రక్రియే. డాక్యుమెంట్ ను స్కాన్ చేసిన త ర్వాత మీ ఈమెయిల్ అకౌంట్లోనో లేదా ఆన్లైన్ డ్రైవ్లోనో స్టోర్ చేసుకోవచ్చు. సెర్చి ఇంజిన్ గూగుల్ ఇందుకోసం డాక్యుమెంట్స్, డ్రైవ్ వంటి సర్వీసులు అందిస్తోంది. జీమెయిల్ ఉంటే వీటిని ఉచితంగా కూడా వినియోగించుకోవచ్చు. దీంతో పాటు పలు బీమా కంపెనీలు కస్టమర్లకు ఆన్లైన్ సౌకర్యాలు అందిస్తున్నాయి. అంటే పాలసీల్ని వీటిలో రిజిస్టరు చేసుకోవచ్చన్న మాట. ఒకసారి రిజిస్టరు చేసుకుంటే... ప్రీమియం చెల్లింపులు కూడా దీనిద్వారానే చేయొచ్చు. పాలసీ వివరాలతో పాటు చెల్లించిన రసీదులు కూడా దీన్లో భద్రంగా ఉంటాయి. దీంతో పాటు జీవిత బీమా పాలసీ తీసుకున్న సంగతిని పాలసీదారు తనపై ఆధారపడి ఉన్న కుటుంబసభ్యులకు/ నామినీలకు కచ్చితంగా తెలియజేయాలి. చాలా మంది ఈ విషయాన్ని గురించి వెల్లడించకుండా... పెద్ద తప్పు చేస్తుంటారు. ఒకవేళ పాలసీదారుకు ఏదైనా అనుకోనిది జరిగితే.. లైఫ్ ఇన్సూరెన్స్ ఉందన్న సంగతి నామినీకి తెలియకపోతే కట్టిన ప్రీమియంలు, ప్రయాస అంతా వృధానే అవుతుంది. కాబట్టి, జీవిత బీమా కంపెనీ పేరు, పత్రం లేదా నంబరు, సమ్ ఇన్సూర్డ్, ప్రీమియం, వేలిడిటీ మొదలైన వివరాలన్నీ నామినికీ తెలియపర్చి ఉంచాలి. ప్రస్తుతం అన్ని జీవిత బీమా కంపెనీలు.. పాలసీలను డిజిటల్ ఫార్మాట్లో ఇవ్వడంపై దృష్టి పెడుతున్నాయి. దీని వల్ల పేపర్లను పోగొట్టుకునే రిస్కులు తగ్గుతాయి. సాధారణ బీమా ఇతర పాలసీల మాదిరిగానే, జనరల్ ఇన్సూరెన్స్ విషయంలోనూ నిర్దిష్ట జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాల వల్ల మీ మోటార్సైకిలు, కారు, ఇల్లు లేదా వ్యాపారాలకు నష్టం వాటిల్లి క్లెయిమ్ పొందాలనుకుంటే.. సదరు ఘటన జరిగిన రెండు, మూడు రోజుల్లోగానే బీమా కంపెనీకి తెలియజేయాలి. ప్రకృతి వైపరీత్య పరిస్థితుల్లో పాలసీ కింద ఎంత మేరకు, ఏయే సమస్యలకు కవరేజి ఉంటుందో ముందుగానే నిబంధనలు తెలుసుకుని ఉండాలి. చివరిగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు మరికొన్ని ఉన్నాయి. రిస్కు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించే వారు అధిక ప్రీమియంలు కట్టాల్సి రావొచ్చు. ఇక ప్రైవేట్దైనా, ప్రభుత్వ రంగంలోనిదైనా.. బీమా కంపెనీని ఎంచుకునే ముందు క్లెయిమ్ సెటిల్మెంట్లో సదరు సంస్థ ట్రాక్ రికార్డును కూడా పరిశీలించుకుని నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం. -
డిజిటల్ ఇన్సూరెన్స్పై కోటక్లైఫ్ దృష్టి
ప్రీమియర్ లైఫ్ పేరుతో కొత్త పథకం... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ ఇన్సూరెన్స్పై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీ కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రకటించింది. పాలసీలు విక్రయం దగ్గర నుంచి అన్ని లావాదేవీలు డిజిటల్ ఫ్లాట్ఫామ్ మీద అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కోటక్ లైఫ్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ సురేష్ అగర్వాల్ తెలిపారు. ఏడాదిలో వ్యాపారంలో 70 నుంచి 80% డిజిటల్ చానల్స్ ద్వారా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలి పారు. అంతకుముందు 99 ఏళ్లు బీమా రక్షణ కల్పించే హోల్లైఫ్ ప్లాన్ ‘ప్రీమియర్ లైఫ్’ను మార్కెట్లోకి లాంఛనంగా విడుదల చేశారు.