-
మన్ప్రీత్ సింగ్కూ ‘ఖేల్ రత్న’
ఈ ఏడాది జాతీయ క్రీడా పురస్కారాల్లో ‘ధ్యాన్చంద్ ఖేల్ రత్న’ అందుకోనున్న ఆటగాళ్ల సంఖ్య 12కు చేరింది. ఇటీవల 11 మందికి ‘ఖేల్ రత్న’ ప్రకటించగా... తాజాగా ఈ జాబితాలో భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ పేరును కూడా చేర్చారు. ఈ ఏడాది 35 మందికి ‘అర్జున’... పది మందికి ‘ద్రోణాచార్య’ అవార్డు... ఐదుగురికి ‘ధ్యాన్చంద్ లైఫ్టైమ్ అచీవ్మెంట్’ అవార్డు ఇవ్వనున్నారు. ఈనెల 13న రాష్ట్రపతి భవన్లో 2021 జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుంది. -
కోహ్లికి ఖేల్ రత్న.. ద్రవిడ్కు ద్రోణాచార్య
కోల్కత్తా: రాజీవ్గాంధీ ఖేల్ రత్న అవార్డుకు భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి పేరును, భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ పేరు ప్రతిష్టాత్మక ద్రోణాచార్య అవార్డుకు, ధ్యాన్చంద్ లైఫ్టైం అచీవ్మెంట్ అవార్డుకు లెజెండరీ ఓపెనర్ సునీల్ గావస్కర్ పేరును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సిఫార్సు చేసింది. భారత క్రికెట్ టీంలో విరాట్ కొంతకాలం నుంచి ముఖ్యభూమిక పోషిస్తున్నాడు. క్రికెట్లో బ్యాట్తో రాణిస్తూ దిగ్గజ ఆటగాడు సచిన్ను మరిపిస్తున్నాడు. దీన్ని పరిగణలోనికి తీసుకుని ఈ అవార్డుకు కోహ్లి అర్హుడని భావించి ఆయన పేరును ప్రతిపాదించారు. రాహుల్ ద్రావిడ్ కోచ్గా వ్యవహరిస్తున్న అండర్-19 టీం ఇటీవల ప్రపంచ కప్ నెగ్గిన సంగతి తెల్సిందే. భారత క్రికెట్కు గావస్కర్ చేసిన సేవలకు గానూ, 70,80వ దశలకాల్లో బ్యాట్తో రాణించి భారత్కు పేరు ప్రఖ్యాతులు తెచ్చింనందకు గానూ ఆయన పేరును ధ్యాన్చంద్ లైఫ్టైం అచీవ్మెంట్ అవార్డుకు ప్రతిపాదించారు. -
మనగడ్డ బిడ్డకు ప్రతిష్టాత్మక పురస్కారం
పెనుమంట్ర : మన జిల్లా ముద్దుబిడ్డ.. పరుగుల రాణి సత్తి గీత ధ్యాన్చంద్ పురస్కారానికి ఎంపికైంది. దేశంలోని ప్రఖ్యాత క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం సోమవారం పురస్కారాలు ప్రకటించింది. వాటిలో ప్రతిష్టాత్మకమైన ధ్యాన్చంద్ పురస్కారం గీతను వరించింది. ప్రస్థానం ఇదీ1983లో జూలై 5వ తేదీన మార్టేరులో జన్మించిన సత్తి గీత పరుగులో అనిర్వచనీయమైన విజయాలను సొంతం చేసుకుంది. 1996 నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న గీత ఇప్పటివరకు 180 బంగారు, 63 రజత, 40 ఇతర పతకాలు సాధించింది. ఏషియన్ ఛాంపియన్ షిప్ (2005)లో రజతం సంపాదించింది. ఆ తరువాత ఒలింపిక్స్ స్థాయి అథ్లెట్గా గుర్తింపు తెచ్చుకుంది. మార్టేరులో సంబరాలు : పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామం క్రీడాకారులకు పుట్టిల్లు. ఇదే గ్రామానికి చెందిన గీత గతంలో అనేక అవార్డులు, రివార్డులు సాధించి జిల్లా పేరు ప్రతిష్టతలను ఇనుమడింపచేసింది. ఆమె ధ్యాన్చంద్ పురస్కారానికి ఎంపికైందని తెలిసి మార్టేరులో సోమవారం సంబరాలు జరుపుకున్నారు. తోటి క్రీడాకారులు, ఆమె అభిమానులు స్వీట్లు పంచుకుని ఆనందాన్ని వ్యక్తపరిచారు. గీత తల్లిదండ్రులు సత్తిరెడ్డి, కమల మాట్లాడుతూ తమ కుమార్తెకు ధ్యాన్చంద్ పురస్కారం లభించడం తమకెంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. -
మనగడ్డ బిడ్డకు ప్రతిష్టాత్మక పురస్కారం
పెనుమంట్ర : మన జిల్లా ముద్దుబిడ్డ.. పరుగుల రాణి సత్తి గీత ధ్యాన్చంద్ పురస్కారానికి ఎంపికైంది. దేశంలోని ప్రఖ్యాత క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం సోమవారం పురస్కారాలు ప్రకటించింది. వాటిలో ప్రతిష్టాత్మకమైన ధ్యాన్చంద్ పురస్కారం గీతను వరించింది. ప్రస్థానం ఇదీ1983లో జూలై 5వ తేదీన మార్టేరులో జన్మించిన సత్తి గీత పరుగులో అనిర్వచనీయమైన విజయాలను సొంతం చేసుకుంది. 1996 నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న గీత ఇప్పటివరకు 180 బంగారు, 63 రజత, 40 ఇతర పతకాలు సాధించింది. ఏషియన్ ఛాంపియన్ షిప్ (2005)లో రజతం సంపాదించింది. ఆ తరువాత ఒలింపిక్స్ స్థాయి అథ్లెట్గా గుర్తింపు తెచ్చుకుంది. మార్టేరులో సంబరాలు : పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామం క్రీడాకారులకు పుట్టిల్లు. ఇదే గ్రామానికి చెందిన గీత గతంలో అనేక అవార్డులు, రివార్డులు సాధించి జిల్లా పేరు ప్రతిష్టతలను ఇనుమడింపచేసింది. ఆమె ధ్యాన్చంద్ పురస్కారానికి ఎంపికైందని తెలిసి మార్టేరులో సోమవారం సంబరాలు జరుపుకున్నారు. తోటి క్రీడాకారులు, ఆమె అభిమానులు స్వీట్లు పంచుకుని ఆనందాన్ని వ్యక్తపరిచారు. గీత తల్లిదండ్రులు సత్తిరెడ్డి, కమల మాట్లాడుతూ తమ కుమార్తెకు ధ్యాన్చంద్ పురస్కారం లభించడం తమకెంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. -
మిశ్రాకు ధ్యాన్చంద్ పురస్కారం
న్యూఢిల్లీ : డేవిస్ కప్ మాజీ కెప్టెన్, హైదరాబాదీ ఎస్పీ మిశ్రాకు ఈ ఏడాది ధ్యాన్చంద్ పురస్కారం లభించింది. ఆయనతో పాటు వాలీబాల్ మాజీ కెప్టెన్ నాయర్, హాకీ జట్టు మాజీ గోల్కీపర్ రోమియో జేమ్స్లను కూడా ఈ పురస్కారం వరించనుంది. 60 మంది జాబితాలో నుంచి ఈ ముగ్గురిని షార్ట్లిస్ట్ చేసిన కమిటీ క్రీడాశాఖకు పేర్లను పంపింది. తమ క్రీడా విభాగాల్లో అత్యున్నత సేవలందించినందుకు జీవిత సాఫల్య పురస్కారం కింద ధ్యాన్చంద్ పేరిట ఈ అవార్డును అందిస్తారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement