-
నాపై ట్రోలింగ్కు ఆ నిర్మాతే కారణం: జాన్వీ కపూర్
మరాఠీ బ్లాక్బస్టర్ మూవీ సైరాట్ హిందీలో ధడక్గా రీమేక్ అయి సూపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రంతోనే వెండితెర అరంగ్రేటం చేసింది హీరోయిన్ జాన్వీ కపూర్. ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్పై కరణ్ జోహార్ నిర్మించాడు. ఆ తర్వాత కరణ్ నిర్మించిన పలు సినిమాల్లో తళుక్కున మెరిసింది జాన్వీ. ఇదే ఆమెకు విమర్శలు తెచ్చిపెట్టింది. తనను కరణ్ జోహార్ లాంచ్ చేయడం వల్లే తనపై ఇంత విద్వేషం చిమ్ముతారంటొంది జాన్వీ. తాజాగా బాలీవుడ్ లైఫ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'గొప్ప నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్ హౌస్ నన్ను ఇండస్ట్రీలో లాంచ్ చేసింది. ఇదే నాపై ట్రోలింగ్కు కారణమనుకుంటా. ఐకానిక్ ధర్మ ప్రొడక్షన్స్ నన్ను ద్వేషించేందుకు ఓ మార్గాన్ని కల్పించింది. దీనివల్ల ఒత్తిడికి లోనవుతాను, కానీ క్షణం కూడా పశ్చాత్తాపపడను. ఎందుకంటే.. కరణ్ జోహార్, అతడికి సంబంధించిన ధర్మ ప్రొడక్షన్ హౌస్ సృజనాత్మక నిర్ణయాల గురించి మీకు తెలియదు. వాళ్ల బ్యానర్లో పని చేసినందుకు నేను అదృష్టవంతురాలిగా ఫీలవుతున్నా. అన్నింటికీ మించి కరణ్ వంటి నిర్మాత నుంచి నాకు ప్రేమ, విశ్వాసం, మార్గదర్శకత్వం లభించింది' అని చెప్పుకొచ్చింది. ఇకపోతే ఇటీవలే మిలి చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది జాన్వీ. ప్రస్తుతం ఆమె బవాల్, మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాలు చేస్తోంది. చదవండి: ఎట్టకేలకు ఓటీటీలో కాంతార ఆ హీరోతో డేటింగ్, ఇదేం పాడుపని అన్నారు -
కాపీ కొట్టి ఆ సినిమా తీశారు.. స్క్రీన్షాట్స్ వైరల్
బీటౌన్ దర్శక నిర్మాతల్లో ప్రముఖంగా చెప్పుకునే వారిలో ఒకరు కరణ్ జోహార్. ఆయన ధర్మ ప్రొడక్షన్స్ పేరిట తాజాగా నిర్మించిన చిత్రం 'జుగ్జుగ్ జీయో'. రాజ్ మెహతా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ క్యాస్ట్ అనిల్ కపూర్, నీతూ కపూర్, వరుణ్ ధావన్, కియరా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ జూన్ 24న విడుదలకు సిద్ధంగా ఉంది. పుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్గా అలరించేందుకు రెడీ అయిన తరుణంలో తాజాగా నిర్మాత కరణ్ జోహార్కు షాక్ తగిలింది. ఈ సినిమా విడుదలకు ముందే తమకు చూపించాలని రాంచీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విషయం ఏంటంటే.. తను పంపించిన పాయింట్స్ను కాపీ కొట్టి 'జుగ్జుగ్ జీయో' సినిమాను నిర్మించారని రాంచీకి చెందిన రచయిత విశాల్ సింగ్ ఆరోపించారు. దానికి సంబంధించిన స్క్రీన్షాట్స్ కూడా తన వద్ద ఉన్నాయని చెప్పుకొచ్చాడు. 'బన్నీ రాణీ' అనే టైటిల్తో కొన్ని పాయింట్స్ను ధర్మ ప్రొడక్షన్స్కు పంపించినట్లు ఆయన తెలిపాడు. తర్వాత ఆ సంస్థ నుంచి రిప్లై కూడా వచ్చిందని, అయితే ఆ పాయింట్స్ను సినిమాగా రూపొందిస్తున్నట్లు ధర్మ ప్రొడక్షన్స్ తనతో చెప్పలేదని, తీరా చూస్తే ఆయన పాయింట్స్తో ఈ మూవీ వచ్చినట్లుగా పేర్కొన్నాడు. ఈ విషయంపై రాంచీ కోర్టులో దావా వేశారు విశాల్. పిటిషన్ స్వీకరించిన రాంచీ కమర్షియల్ కోర్టు సినిమా విడుదలకు ముందే తమకు చూపించాలని ఉత్తర్వులు జారీ చేసింది. స్క్రీనింగ్ తర్వాత ఇరువైపులా వాదనలు విని, కాపీ రైట్ ఉల్లంఘన జరిగిందో, లేదో చెబుతామని వెల్లడించింది. చదవండి: లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్లో కరణ్ జోహార్.. బుల్లితెర నటి ఆత్మహత్య.. అతడే కారణమని తండ్రి ఆరోపణ వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్ అయితే ఇప్పటివరకు ఈ విషయంపై కరణ్ జోహార్ అధికారికంగా స్పందించలేదు. కాగా 'జనవరి 2020లో బన్నీ రాణీ టైటిల్తో కథ రిజిస్టర్ చేసుకున్నా. 2020 ఫిబ్రవరిలో సహా నిర్మాతగా వ్యవహరించే అవకాశం కోసం ధర్మ ప్రొడక్షన్స్కు మెయిల్ చేశా. నాకు రిప్లై కూడా ఇచ్చారు. తర్వాత వాళ్లు నా స్టోరీ తీసుకున్నారు. జుగ్జుగ్ జీయో సినిమాను తెరకెక్కించారు. ఇది సరికాదు కరణ్ జోహార్.' అని విశాల్ సింగ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్తోపాటు విశాల్ పంపించిన పాయింట్స్కు సంబంధించిన స్క్రీన్షాట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
పార్టీలో హీరోయిన్తో విజయ్ ముచ్చట్లు.. వీడియో తీసిన చార్మీ
Liger Stars Vijay Deverakonda, Ananya Panday At Apoorva Mehta Birthday: బాలీవుడ్ అంతా ఇప్పుడు టాలీవుడ్ వైపే చూస్తుంది. ఇప్పటికే మన స్టార్స్ పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతున్నారు. ఇక టాలీవుడ్ అర్జున్రెడ్డి విజయ్ దేవరకొండకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ చేస్తున్న 'లైగర్' సినిమా కోసం ఇండస్ట్రీ అంతా ఎదురుచూస్తుంది. ఓవైపు షూటింగ్లో బిజీగా ఉంటూనే, మరోవైపు పార్టీ మూడ్ని ఎంజాయ్ చేస్తుంది లైగర్ టీం. గురువారం ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతా పుట్టినరోజు సందర్భంగా ముంబైలో గ్రాండ్ పార్టీ నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ పార్టీలో లైగర్ బ్యాచ్ టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచింది. బ్లాక్ అండ్ బ్లాక్లో అందరూ దుమ్మురేపారు. మోస్ట్ స్టైలిష్ లుక్తో మెస్మరైజ్ చేశారు. పార్టీ మొత్తంలో లైగర్ టీం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రసత్తుం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే..ధర్మ ప్రొడక్షన్స్- పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న లైగర్ సినిమా ఆగస్ట్25న ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) -
బంపర్ ఆఫర్? ధర్మ ప్రొడక్షన్స్లో రష్మికా సినిమా ఉంటుందా?
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా దూసుకెళుతున్న రష్మికా మందన్న బాలీవుడ్లోనూ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆమె నటించిన హిందీ చిత్రాలు ‘మిషన్ మజ్ను, గుడ్ బై’ విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈలోపు బాలీవుడ్ నుంచి మరిన్ని అవకాశాలు రష్మిక తలుపు తడుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శక–నిర్మాత కరణ్ జోహార్ సినిమాలో నటించే బంపర్ ఆఫర్ రష్మికని వరించిందని తాజా బాలీవుడ్ టాక్. సోమవారం (జనవరి 24) ముంబయ్లోని కరణ్ జోహార్కి చెందిన ధర్మ ప్రొడక్షన్ కార్యాలయానికి రష్మిక వెళ్లడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. కరణ్ నిర్మించనున్న ఓ చిత్రంలో రష్మికను కథానాయికగా అనుకున్నారని, ఆ చిత్రానికి సంబంధించిన చర్చలు సంస్థ కార్యాలయంలో జరిగాయని టాక్. కాగా సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ‘పుష్ప’ చిత్రాన్ని సోషల్ మీడియా ద్వారా కరణ్ అభినందించిన విషయం తెలిసిందే. బహుశా ‘పుష్ప’లో రష్మిక నటన నచ్చి, తన సినిమాకి తీసుకోవాలనుకున్నారేమో. అసలు ధర్మ ప్రొడక్షన్స్లో రష్మిక సినిమా ఉంటుందా? ఆ విషయం తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే. -
రాశీ ఖన్నాకు బంపర్ ఆఫర్.. కరణ్ జోహార్ సినిమాలో ఛాన్స్..!
సౌత్ క్రేజీ హీరోయిన్ రాశీ ఖన్నా కెరీర్ మెల్లిగా బాలీవుడ్లోనూ స్పీడందుకుంటోంది. ఇప్పటికే హిందీలో రెండు వెబ్ సిరీస్లను (షాహిద్ హీరోగా ‘సన్నీ’ (వర్కింగ్ టైటిల్), అజయ్ దేవగన్ ‘రుద్ర’) పూర్తి చేసిన రాశీ ఖన్నా ఇప్పుడు ఓ సినిమాలో లీడ్ క్యారెక్టర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బాలీవుడ్ సమాచారం. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణంలో యాక్షన్ ఫ్రాంచైజీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోనే ఓ లీడ్ క్యారెక్టర్కి రాశీ ఖన్నా అవకాశం దక్కించుకున్నారని టాక్. ఫ్రాంచైజీ అంటే కొన్ని భాగాలుగా సినిమాని తీస్తారని తెలిసిందే. ఒకవేళ ఈ సినిమాలో రాశీ కమిట్ అయిన వార్త నిజమే అయితే బంపర్ ఆఫర్ దక్కించుకున్నట్లే. సిద్ధార్థ్ మల్హోత్రా, దిశా పటానీ ఇతర ప్రధాన తారాగణంగా కనిపించే ఈ యాక్షన్ ఫ్రాంచైజీకి ‘యోధ’ అనే టైటిల్ను అనుకుంటున్నారని, పుష్కర్ ఓజా అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తారని బీ టౌన్ ఖబర్. ఇక సౌత్లో గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’, నాగచైతన్య ‘థ్యాంక్యూ’, కార్తీ ‘సర్దార్’ చిత్రాల్లో రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement