breaking news
Dharam Singh
-
బీజేపీ పెద్దలకు అఖిలేశ్ యాదవ్ గట్టి ఝలక్
-
కర్ణాటక మాజీ సీఎం ధరమ్ సింగ్ కన్నుమూత
బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ధరమ్ సింగ్ (80) గురువారం కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బెంగళూరులోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ధరమ్ సింగ్ హార్ట్ ఎటాక్తో ఈ రోజు ఉదయం 9 గంటలకు మరణించారు. ధరమ్ సింగ్ 2004 నుంచి 2006 వరకూ కర్ణాటక సీఎంగా పని చేశారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మరోవైపు ధరమ్ సింగ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. -
అయిదుగురు సీఎంల రణరంగం
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా అయిదుగురు మాజీ సీఎంలు కర్నాటక ఎన్నికల బరిలో ఉన్నారు. వీరందరూ చాలరన్నట్టు ఇంకో మాజీ సీఎం కూడా రంగంలో దిగేందుకు రెడీగా ఉన్నారు. మాజీ ప్రధాని, మాజీ సీఎం దేవెగౌడ మరోసారి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రులు ఎన్ ధరమ్ సింగ్, వీరప్పమొయిలీలు తమ తమ నియోజకవర్గాల్లో చెమటోడుస్తున్నారు. ఇక బిజెపి కూడా ఏమీ తక్కువ తినలేదు. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు - సదానంద గౌడ, ఎడియోరప్పలు రంగంలో ఉన్నారు. ఎడియోరప్ప షిమోగా నుంచి, సదానంద గౌడ బెంగుళూరు నార్త్ నుంచి పోటీలో ఉన్నారు. మరో మాజీ ముఖ్యమంత్రి, దేవెగౌడ సుపుత్రుడు హెచ్ డీ కుమార స్వామి కూడా తాను లోకసభకు పోటీ చేసే అవకాశం ఉందని చెప్పారు. అంటే ఆరో సీఎం కూడా రంగంలోకి దిగుతున్నారన్నమాట. ఏయే సీఎంలు గెలుస్తారో, ఏయే సీఎంలు ఓడిపోతారో చూడాలి!