breaking news
dhanamma
-
పోలీసులు చితకబాదడం వల్లే నా తమ్ముడు చనిపోయాడు
చంద్రబాబు కర్కశ పాలనలో ఖాకీలు కాలాంతకుల్లా మారుతున్నారు. ప్రాణాలు కాపాడాల్సిన పోలీసుస్టేషన్లు బడుగుజీవుల బలికోరే వధశాలలవుతున్నాయి. ఇటీవల విజయవాడ నగరంలో పోలీసుల అధికారమదానికి బలైన కాపు యువకుడు సాయికృష్ణ, దళిత యువకుడు క్రాంతికుమార్ మరణాలను మరిచిపోకముందే శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు ఎస్సై దాష్టీకానికి మరో దళిత యువకుడు ఏడుకొండలు, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సీఐ వేధింపులకు మైనార్టీ ఉద్యోగి దరియా హుసేన్ అసువులుబాశారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వ పెద్దల అండదండలతో ఖాకీలు మోగిస్తున్న ఈ మరణ మృదంగం రాష్ట్రంలో బాబు సర్కారు సాగిస్తున్న రెడ్బుక్ నరమేధానికి సజీవసాక్ష్యమై నిలుస్తోంది. రక్షణ చట్టాలకు ఉరితాడు బిగించి వికటాట్టహాసం చేస్తోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు పోలీస్స్టేషన్ ఎస్సై ఎస్కే హనీఫ్ ఖాకీ దుస్తులు ధరించిన క్రిమినల్ మాదిరిగా అరాచకంగా వ్యవహరిస్తున్నాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన వ్యవహార శైలి అత్యంత వివాదాస్పదంగా ఉందని చర్చించుకుంటున్నారు. తప్పు చేస్తే నిందితులను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పర్చాల్సిన ఎస్సై.. నిందితులను, అమాయకులను చచ్చే వరకు కొడుతున్నాడని పేర్కొంటున్నారు. ఆయన అరాచకాలకు ఎన్నో ఉదంతాలున్నాయని స్పష్టం చేస్తున్నారు. బదిలీపై వచ్చి.. ఈ ఏడాది మే 9వ తేదీన పొదలకూరు మండలం నావూరుపల్లికి చెందిన గాలం హరికృష్ణ అనే రైతును టీడీపీ నేతల ఆదేశాల మేరకు అకారణంగా స్టేషన్కు తీసుకొచ్చి లాఠీలతో చితకబాదాడు. ఈ సన్నివేశాలను వీడియో కాల్ ద్వారా టీడీపీ నేతలకు లైవ్లో చూపించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. దీన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. గూడూరు ఇన్చార్జి డీఎస్పీ దీనిపై విచారించి కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. ఎట్టకేలకు ఈ నెల మొదటి వారంలో ఆ ఎస్సైను మనుబోలు పోలీస్స్టేషన్కు బదిలీ చేయడంతో 6వ తేదీన బాధ్యతలు చేపట్టారు. చోరీ కేసులో పైశాచికత్వం బంగారం చోరీ కేసులో మనుబోలు మండలం చెరుకుమూడికి చెందిన బొల్లు ఏడుకొండలతోపాటు మరో ఇద్దరిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై హనీఫ్, కానిస్టేబుళ్లు రెండు రోజుల పాటు స్టేషన్లో వారిని లాఠీలతో కుళ్ల బొడిచారు. ఈ క్రమంలో వారిని ఆదివారం రాత్రి వదిలేసి.. మర్నాడు రావాలంటూ హెచ్చరించారు. సోమవారం ఇద్దరు మాత్రమే స్టేషన్కు రాగా ఏడుకొండలు రాలేదు. దీంతో మధ్యాహ్నం 3 గంటల సమయంలో మాధవరావు, మరో కానిస్టేబుల్ కారులో ఏడుకొండలు ఉన్న గ్రామానికి చేరుకుని విచక్షణారహితంగా కొట్టారు. సొమ్మసిల్లి పడిపోయిన ఏడుకొండలను కారు డిక్కీలో కుక్కి స్టేషన్కు తీసుకెళ్లారు. స్పృహలో లేకపోవడంతో నీళ్లు చల్లి మరీ చావబాదినట్లు సమాచారం. సాయంత్రం 6 గంటలకు ఏడుకొండలును గూడూరు ఏరియా వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చోరీ కేసులో కొట్టి చంపొచ్చా..? చోరీ కేసులో నిందితుడు ఏడుకొండలును అదుపులోకి తీసుకున్న మనుబోలు పోలీసులు విచారణ అనంతరం కోర్టులో హాజరు పరచాలి. కానీ ఏడుకొండలతోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని రెండు రోజుల పాటు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. నాలుగు సవర్ల బంగారం పోయిందని కేసు నమోదైతే.. నిందితులను కొట్టి, హింసించి 12 సవర్ల బంగారాన్ని తీసుకున్నారు. వారి నుంచి బంగారం కొనుగోలు చేసిన వారిని బెదిరించి కేసులు పెడతామని మరో 12 సవర్ల బంగారాన్ని తీసుకున్నారు. చివరకు 2 సవర్లు మాత్రమే రికవరీ చూపించారు. నిందితులను కోర్టుకు హాజరుపర్చకుండా స్టేషన్కు తరలించి చావబాదడం వల్లే ఏడుకొండలు చనిపోయాడని స్పష్టమవుతోంది. ఎస్పీ అజిత బుధవారం మీడియాతో మాట్లాడుతూ అది లాకప్ డెత్ కాదన్నారు. మరి ఎలా చనిపోయాడనే ప్రశ్నకు పోలీసుల దగ్గర సమాధానం లేదు. కొట్టి చంపే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? మనుబోలు పోలీస్స్టేషన్ వద్ద ఏడుకొండలు మృతదేహంతో ఆందోళనకు దిగిన కాకాణి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ గడ్డి మందు తాగి చనిపోయాడంటూ.. ఏడుకొండలు మృతి చెందాడని గుర్తించిన పోలీసులు అతడి సోదరుడికి ఫోన్ చేసి మీ అన్న గడ్డి మందు తాగి పొలాల్లో చనిపోయాడని, ఆస్పత్రికి వచ్చి సంతకాలు పెట్టాలని తొలుత చెప్పారు. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి గడ్డి మందు తాగి ఎలా చనిపోతాడని బాధితులు స్టేషన్ ఎదుట మంగళవారం రాత్రి ఆందోళనకు దిగారు. చంపేసి గడ్డి మందు తాగాడని చెబుతున్నారంటూ మండిపడ్డారు. గడ్డి మందు తాగి పొలాల్లో చనిపోతే నిబంధనల ప్రకారం స్థానిక వీఆర్వో ద్వారా ఫిర్యాదు తీసుకుని శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టంకు తరలించాలి. కానీ ఏడుకొండల విషయంలో అలాంటిదేమీ జరగలేదు. అసలు గడ్డి మందు తాగినట్లు ఆనవాళ్లు కూడా లేవు. పోలీసుల అదుపులో వ్యక్తి ఆస్పత్రిలో శవంగా తేలటాన్ని బట్టి దెబ్బలకు తాళలేకే చనిపోయాడన్న ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. పంచనామా రిపోర్టులో ఆ వివరాలేవి? ఏడుకొండలు మృతిపై పోలీసులు చెప్పేవన్నీ అబద్ధాలేనని శవ పంచనామా రిపోర్టే తేటతెల్లం చేస్తోంది. ఏడుకొండలును మంగళవారం సాయంత్రం 6.15 గంటలకు గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడని డ్యూటీ డాక్టర్ చెప్పినట్లు పంచనామా రిపోర్టులో పొందుపరిచారు. మృతుడి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని పేర్కొన్నారు. పోలీసులు చెప్పినట్లు నిజంగానే గడ్డి మందు తాగి ఉంటే.. పాయిజన్ వాసన వస్తుంది. శరీరం రంగు మారడం లాంటివి జరగాలి. కానీ ఇవేవి లేవు. కానిస్టేబుల్ మాధవరావు, మడమనూరుకు చెందిన నవీన్ కలిసి ఏడుకొండలను ఆస్పత్రికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. అపస్మారక స్థితిలో ఎక్కడ ఉండగా ఆస్పత్రికి తీసుకెళ్లారనే విషయం పంచనామా రిపోర్టులో రాయలేదు. పోలీసులు మొదట చిత్రీకరించిన ప్రకారం.. గడ్డి మందు తాగి చనిపోయి ఉంటే వీఆర్వో ఫిర్యాదు లేకుండా ఎలా తరలించారు? ఎవరి ద్వారా సమాచారం లేకుండా.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా.. ప్రాథమికంగా చేపట్టాల్సిన శవ పంచనామా చేయకుండా నేరుగా ఆస్పత్రికి ఎలా తరలించారు? అనే ప్రశ్నలకు పోలీసుల వద్ద సమాధానం లేదు. -
పోలీసులే తన తమ్ముడిని చంపేశారని చెబుతున్న మృతుడు ఏడుకొండలు అక్క ధనమ్మ
-
ట్రాక్టర్తో తొక్కించి చంపేస్తాం.. దిక్కున్నచోట చెప్పుకోండి..
దర్శి: తమ పొలాన్ని ఆక్రమించుకునేందుకు పత్తిపైరును దున్నేశారని, అడ్డం వస్తే ట్రాక్టర్తో తొక్కించి చంపేస్తామని, దిక్కున్నచోట చెప్పుకోండని బెదిరించారని ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని తానం చింతల గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు విలపించారు. కూటమి నేతల అండతో దౌర్జన్యం చేస్తున్నారని శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు యన్నాబత్తిన యలమంద భార్య ధనమ్మ, మేకల గురవారావు భార్య మేకల లక్ష్మీదేవి తెలిపారు. వారి కథనం మేరకు.. సర్వే నంబరు 132/2లో యన్నాబత్తిన ధనమ్మకు 79 సెంట్లు, సర్వే నంబరు 225/2 లో మేకల గురవారావుకు 1.32 ఎకరాల భూమి ఉంది. దశాబ్దాలుగా వారు ఈ భూమిని సాగుచేసుకుంటున్నారు. ప్రస్తుతం పత్తిపంట వేశారు. గ్రామానికి చెందిన మేకల రుక్మిణీదేవి, ఆమె కుమారుడు ప్రసన్నకుమార్ కోతదశకు చేరిన ఆ పైరును శుక్రవారం దున్నేశారు. గ్రామంలోని కూటమి నాయకుల ద్వారా టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మితో అధికారులకు ఫోన్ చేయించి, పొలాలను దున్నేసి ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారు. ఇదేమని అడిగితే ట్రాక్టర్తో తొక్కించి చంపేస్తామని బెదిరించారు. గ్రామంలో రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని తమ పంటలు చెడగొట్టి తమ నోటికాడ కూడు లాగేశారని, రూ.50 వేల విలువైన పంటను నాశనం చేశారని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై గతంలో తమను పిలిపించి మాట్లాడిన సీఐ, ఎస్ఐ, తహశీల్దార్.. తమవైపు న్యాయం ఉండటంతో మౌనంగా ఉన్నారని చెప్పారు. ఇప్పుడు మళ్లీ ఆక్రమణకు యతి్నంచి పైరును దున్నటంపై ఫిర్యాదు చేశామని, పోలీసులు న్యాయం చేస్తారని ఆశగా చూస్తున్నామని వారు తెలిపారు. -
షాకింగ్ వీడియో: ఘోర ప్రమాదం
-
షాకింగ్ వీడియో: ఘోర ప్రమాదం
శుభకార్యంలో పాల్గొని తిరిగి స్వగ్రామానికి బయలుదేరిన ఓ తల్లీకుమారుడిని మృత్యువు కబళించింది. మితిమీరిన వేగం.. ఆపై డ్రైవర్ నిర్లక్ష్యానికి కనుమూసి తెరిచేలోపే రెండు ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఈ విషాదకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కొత్తగూడెం చౌరస్తాలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంస్థాన్ నారాయణపురం (మునుగోడు) : రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపుర్ గ్రామానికి చెందిన గొర్రెంకల ధనమ్మ(50), అతడి కుమారుడు యాదగిరి(24) శుక్రవారం బైక్పై నల్లగొండ జిల్లా మునుగోడుకు వచ్చారు. అక్కడ బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యంలో పాల్గొన్నారు. శనివారం స్వగ్రామం చిత్తాపుర్కు బైక్పై బయలుదేరారు. మృతదేహాలు చెల్లాచెదురుగా.. హైదారాబాద్లోని చంపాపేట్కు చెందిన ఓ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్న తోర్పనూరి దానయ్య, భార్య పద్మతో కలిసి కారులో చండూరు మండలంలోని తన వ్యవసాయ భూమి వద్దకు వెళుతున్నాడు. అయితే మార్గమధ్యలో కొత్తగూడెం స్టేజి వద్ద ఎదురుగా వస్తున్న యా దగిరి, ధనమ్మల బైక్ను రాంగ్రూట్లో వచ్చి వేగంగా ఢీకొట్టాడు. దీంతో బైక్ సుమారు పది మీటర్ల ఎత్తుకు ఎగిరింది. బైక్పై ప్రయాణిస్తున్న తల్లీకుమారుడికి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కాగా, దానయ్య కారు కూడా అదుపుతప్పి సమీపంలో ఉన్న చెట్టును ఢీకొట్టడంతో వారిద్దరికి గాయాలయ్యాయి. పెద్దసంఖ్యలో తరలివచ్చిన గ్రామస్తులు ప్రమాద విషయం తెలుసుకున్న కొత్తగూడెం గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలికి చేరుకున్నారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన తల్లీకుమారుడు విగతజీవులుగా మారడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏఎస్ఐ యాదవరెడ్డి ఘట న స్థలాన్ని పరిశీలించి తొలుత ప్రమాదంలో గాయపడిన దానయ, అతడి భార్య పద్మను చౌటుప్పల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం సమాచారం మేరకు చౌటుప్పల్ సీఐ వెంకటేశ్వర్లు కొత్తగూడెం చేరుకుని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. ఘటన చోటు చేసుకున్న ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉండడంతో వాటి పుటేజీలను పరిశీలిస్తున్నారు. పోస్టుమార్టం నిమి త్తం మృతదేహాలను చౌటుప్పల్ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. ఆరు నెలల కిందటే వివాహం.. ప్రమాదంలో మృతిచెందిన ధనమ్మకు భర్త చంద్ర య్య, ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు సంతానం. పెద్దకుమారుడు యాదగిరికి ఆరుమాసాల క్రితమే వివాహం జరిగింది. ఇతను ఫిలింసిటీలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రమాద విషయం తెలుసుకున్న మృతుల బంధువులు చౌటుప్పల్ ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. శుభకార్యానికి వచ్చి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారా అంటూ కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. -
విరిగిన ధనమ్మ మర్రి చెట్టు
- ఈదురు గాలులకు వెయ్యి ఎకరాల అరటితోట నేలమట్టం - అంధకారంలో లంక గ్రామాలు కపిలేశ్వరపురం (మండపేట): గోదావరి చెంత ఆహ్లాదకరంగా ఉన్న లంక గ్రామాలు సోమవారం కకావికలమయ్యాయి. ఉన్నట్టుండి విరుచుకుపడ్డ ఈదురు గాలులకు ఉద్యాన పంటలు నేలనంటాయి, జిల్లాలోపర్యాటక కేంద్రంగా గుర్తింపుపొందిన ధనమ్మ మర్రి ఆవరణలోని మర్రి చెట్టు నేలకొరిగింది. కేదారిలంక, వీధివారిలంక, నారాయణలంక గ్రామాల్లో సుమారు వెయ్యి ఎకరాల అరటి తోట కుప్పకూలిపోయింది. కురిసిన వర్షానికి నేలలోని కంద కుళ్ళిపోయే ప్రమాదముందని రైతులు వాపోతున్నారు. ఆయా గ్రామాల్లో ఎనిమిది విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లంక గ్రామాల ప్రజలు చీకటిమాటున బిక్కుబిక్కుమని జీవిస్తున్నారు. వీఆర్వో స్వామినాయుడు, సర్పంచి రంకిరెడ్డి సత్యవతి, పంచాయతీ అధికారులు పరిస్థితిని పరిశీలించి ఉన్నతాధికారులకు తెలియజేశారు. -
ముగ్గురు జల సమాధి
దుస్తులు ఉతికేందుకు వెళ్లి మృత్యు ఒడికిదాసరహళ్లి వద్ద ఘటన కోలారు : చెరువులో మునిగి ముగ్గురు వ్యక్తులు జల సమాధి అయిన ఘటన గురువారం సాయంత్రం బంగారుపేట తాలూకా నేరెళే కెరె గ్రామం వద్ద చోటు చేసుకుంది. కేజీఎఫ్ సమీపంలోని దాసరహళ్లి గ్రామానికి చెందిన సురేష్ (38), ధనమ్మ (23)దంపతులు కొంత కాలంగా దాసరహొసహళ్లిలో నివాసం ఉంటున్నారు. గురువారం సాయంత్రం దుస్తులు ఉతకడానికి పక్కింటి బాలిక ఉమాభారతితో కలిసి చెరువుకువెళ్లారు. అక్కడ సురేష్ ఈత కొట్టడానికి ప్రయత్నించి పూడికలో కూరుకుపోతుండగా రక్షించేందుకు వెళ్లిన భార్య ధనమ్మ, పక్కింటి బాలిక ఉమాభారతి గల్లంతయ్యారు. చెరువు గట్టున దుస్తులు, చెప్పులు చూసిన స్థానికులు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. అగ్ని మాపక సిబ్బంది, బంగారుపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలించి సాయంత్రం 7గంటల సమయంలో సురేష్, ధనమ్మ, ఉమాభారతి మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టు మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. పండుగ ముందు రోజున దుర్ఘటన చోటు చేసుకోవడంతో ఈరెండు కుటుంబాలలో విషాదం అలుముకుంది. -
మహిళ ఆత్మహత్యాయత్నం
తుంగతుర్తి పోలీస్స్టేషన్ ఎదుట ధనమ్మ(30) అనే మహిళ బుధవారం విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఓ దొంగతనం కేసు విషయంలో రోజూ తనను పోలీసులు స్టేషన్కు పిలిపించి విచారణ పేరుతో వేధిస్తున్నారని మనస్తాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడింది. హుటాహుటిన ఆమెను తుంగతుర్తిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


