-
దేవిశ్రీని పట్టుకోండి...
‘‘డిఫరెంట్ కాన్సెప్ట్తో తీసిన చిత్రమిది. మన దేశంలో ఇంతకు ముందెప్పుడూ ఇటువంటి కాన్సెప్ట్తో సిన్మా రాలేదు. ఒకవేళ.. ఎవరైనా వచ్చిందని నిరూపిస్తే, వారికి ఐదు లక్షల నగదు బహుమతి ఇస్తాం’’ అని సవాల్ విసిరారు నిర్మాత డి. వెంకటేశ్. పూజా రామచంద్రన్, భూపాల్ రాజు, ధనరాజ్, మనోజ్ నందం ముఖ్య తారలుగా శ్రీకిశోర్ దర్శకత్వంలో డి. వెంకటేశ్, ఆర్వీ రాజు, ఆక్రోశ్ నిర్మించిన సినిమా ‘దేవిశ్రీ ప్రసాద్’. ఈ నెల 24న సినిమా విడుదలవుతోంది. డి. వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘గతంలో భారతీయ తెరపై రాని కథను సినిమాగా మలచడం దర్శకుడి తెలివితేటలకు నిదర్శనం. వచ్చిందంటారా? దేవిశ్రీని పట్టుకోండి... ఐదు లక్షలు గెలుచుకోండి! కొత్తదనం కోరుకునే తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా మా సినిమా నచ్చుతుంది. సుమారు 200 థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. పోసాని కృష్ణమురళి, టిల్లు వేణు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: కమ్రాన్, లైన్ ప్రొడ్యూసర్: చంద్ర వట్టికూటి. -
శ్రమ ఆయుధమైతే విజయమే బానిస
-2 హైస్కూళ్లలో సత్యమూర్తి ఫౌండేషన్ డిజిటల్ తరగతులు -ప్రారంభించిన ఎమ్మెల్యే వేగుళ్ల రాయవరం (మండపేట) : ‘శ్రమ మీ ఆయుధమైతే విజయం మీ బానిస’ అవుతుందని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. మండలంలోని వెదురుపాక, రాయవరం జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో శ్రీసత్యమూర్తి ఫౌండేషన్ పేరిట ప్రముఖ రచయిత, దివంగత సత్యమూర్తి కుమారులు సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్, నేపథ్య గాయకుడు సాగర్ ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతులను మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్లు కొండిపూడి సత్యప్రభఏసురత్నం, పాలింగి చినబాబుల అధ్యక్షతన నిర్వహించిన సభల్లో ఎమ్మెల్యే వేగుళ్ల, దేవీశ్రీప్రసాద్, సాగర్, జెడ్పీటీసీ చిన్నం అపర్ణాపుల్లేష్ మాట్లాడారు. డిజిటల్ తరహాలో సాగే బోధనను సద్వినియోగం చేసుకుని విద్యాభివృద్ధిని సాధించాలని సూచించారు. అనంతరం ముగ్గురు మెరిట్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.5 వేల వంతున నగదు బహుమతితో పాటు మెమెంటోలను, ఉన్నత పాఠశాల విద్యార్థులకు డిక్షనరీలను అందజేశారు. ఆచంట రాంబాబు సౌజన్యంతో 40 మంది మెయిన్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్లు అందజేశారు. ఉప సర్పంచ్ తమలంపూడి గంగాధరరెడ్డి, వైస్ ఎంపీపీ సత్తి హిమరాణిసావిత్రిదేవి, సొసైటీ డైరెక్టర్ సత్తి శ్రీనివాసరెడ్డి, డోనర్స్ క్లబ్ సభ్యుడు ఆచంట రాంబాబు, పాఠశాల హెచ్ఎం శాంతిసునీత తదితరులు పాల్గొన్నారు. రక్తదాతలకు సత్కారం రక్తదానం చేస్తూ ప్రాణదాతలుగా నిలుస్తున్న వారిని రాయవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో సత్కరించారు. వలంటరీ బ్లడ్ డోనర్స్ క్లబ్ చైర్మన్ వెలగల ఫణికృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 50 మంది రక్తదాతలను మెమెంటోలతో ఎమ్మెల్యే జోగేశ్వరరావు, దేవీశ్రీప్రసాద్, సాగర్ సత్కరించారు. -
లింబో స్కేటింగ్లో బాలుడి రికార్డు
తిరుపతి స్పోర్ట్స్: తిరుపతికి చెందిన దేవిశ్రీప్రసాద్(8) లింబో స్కేటింగ్లో మరో రికార్డు నెలకొల్పాడు. దీన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో నమోదు చేసేందుకు ప్రతినిధులకు పంపారు. తిరుపతి సిల్వర్ బెల్స్ సెంట్రల్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న దేవిశ్రీప్రసాద్ బుధవారం ఫార్వార్డ్ లింబోస్కేటింగ్లో 53 సుమోల కింద 100 మీ. దూరాన్ని 17.84 సెకన్లలో చేరుకుని ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. బ్యాక్వార్డ్ (వెనక్కు) లింబోస్కేటింగ్లోనూ 53 సుమోల కింద 100 మీ. దూరాన్ని 22.03 సెకన్లలో చేరుకుని గత రికార్డులను తిరగరాశాడు. మరోవైపు అండర్ బార్స్ ఫార్వార్డ్ (ముందుకు) లోయస్ట్, లాంగెస్ట్ లింబో స్కేటింగ్లోనూ రికార్డు సృష్టించాడు. 113 కమ్మీల కింద 8.75 అంగుళాల ఎత్తులో 100.4 మీ. దూరాన్ని 15.4 సెకన్లలో చేరుకుని గిన్నిస్ రికార్డును తిరగరాశాడు. -
దటీజ్ దేవిశ్రీప్రసాద్
తిరుపతి: నగరానికి చెందిన దేవిశ్రీప్రసాద్ (8) లింబో స్కేటింగ్లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. స్థానిక ఓ ప్రైవేటు స్కూల్లో 4వ తరగతి చదువుతున్న అతను స్కేటింగ్ శిక్షణ పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం వేదిక్ యూనివర్సిటీ వద్ద 103.7 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన 50 సుమో వాహనాల కింద 8.5 ఇంచ్ల ఎత్తులో ముందుకు(ఫార్వర్డ్) స్కేటింగ్ చేస్తూ, కేవలం 19.27 సెకండ్లలో గత ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. గతంలో తమిళనాడుకు చెందిన ఐజెక్ హెండ్రీ అనే క్రీడాకారుడు 102 మీటర్ల దూరం లో ఏర్పాటు చేసిన 42 సుమోల కింద ముందుకు(ఫార్వర్డ్) 27.4 సెకండ్లలో ఈ రికార్డు సాధించగా దేవిశ్రీప్రసాద్ అధిగమించాడు. ఇదే స్కేటింగ్లోనే వెనక్కి(బ్యాక్వర్డ్) 53.8 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన 26 సుమోల కింద 27.98 సెకండ్లలో చేరుకుని సత్తా చూపాడు. ఈ వీడియో రికార్డులను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ల పరిశీలనకు పంపనున్నారు. ప్రపంచ రికార్డుతో ఒకే రోజూ ఏడు సంస్థల గుర్తింపు పొందిన దేవిశ్రీప్రసాద్కి ప్రతిష్టాత్మకమైన ‘మ్యాన్ ఆఫ్ ది రికార్డు-2015’ అవార్డును ప్రకటించారు. -
దేశానికే కేంద్ర బిందువులా తెలంగాణ
టీ జేఏసీ చైర్మన్ కోదండరాం హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం దేశ పటంలో కేంద్ర బిందువులా ఉందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో భారతదేశ మ్యాప్లో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని పొందుపర్చిన నమూనా మ్యాప్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. మన రాష్ర్టం మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రకు కూడలిగా ఉందన్నారు. ఒడిశా, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాలకు వ్యాపార కేంద్రంగా ఉంటుందని, దాన్ని దృష్టిలో ఉంచుకొని రవాణ వ్యవస్థను పెంపొందించుకుంటే వ్యాపారాన్ని విస్తరించవచ్చన్నారు. గోదావరి, ప్రాణహితకు వంతెనలు నిర్మిస్తే అశేష అవకాశాలు లభిస్తాయన్నారు. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమకు మంచి భవిష్యత్తు ఉంటుందని, రామగుండం నుంచి కాగజ్నగర్ వరకు పారిశ్రామికవాడలుగా మార్చుకునేందుకు అనువైన ప్రదేశంగా ఉందన్నారు. టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణను మిగతా రాష్ట్రాల కన్నా అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు శ్రమించాలని కోరారు. సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని 29వ రాష్ట్రంగా దేశ చిత్రపటంలో నమోదు చేయడం చారిత్రాత్మక ఘట్టమన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
డిజిటల్ ఫ్లాట్ఫామ్లో మరో ఓటీటీ సంస్థ!
లీడర్ VS చీటర్స్
టిష్యూ బ్రెడ్..అచ్చం రుమాలి రోటీ లా..!
అయోధ్యకు మోదీ.. ముస్తాబవుతున్న నగరం
ఓటీటీలోకి వచ్చేసిన మంజుమ్మల్ బాయ్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Nisha Madhulika: దేశంలోకెల్లా ఫిఫ్త్ రిచెస్ట్ యూట్యూబర్...
ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్
ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
స్టేషన్ మాస్టర్కు నిద్రొచ్చింది.. లోకో పైలెట్ హారన్ మోగించినా..
కెనడాలో భారతీయుల అరెస్ట్.. ప్రధాని ట్రూడో కీలక వ్యాఖ్యలు
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement