-
జేసీ సోదరుల అండతోనే దీపక్రెడ్డి భూకబ్జాలు
- జేసీ బ్రదర్స్ను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలి - వైఎస్సార్సీపీ తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి డిమాండ్ అనంతపురం సప్తగిరి సర్కిల్ : అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి- తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి అండతోనే అల్లుడు గుణపాటి దీపక్రెడ్డి భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని వైఎస్సార్సీపీ తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జేసీ సోదరులు అధికారులను బెదిరించి తమ పనులు చేయించుకుంటారని, మాట వినని వారిపై దౌర్జన్యాలకు సైతం పాల్పడుతున్నారని మండిపడ్డారు. జిల్లాలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ప్రజలకు ప్రశ్నించే హక్కు కూడా లేకుండా చేస్తున్నారన్నారు. అనంతపురంలోని టవర్క్లాక్ వద్ద ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తున్నావంటూ జేసీ దివాకర్రెడ్డి ఓ మార్వాడిని రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి కొడితే పోలీసులు చోద్యం చూశారే తప్ప ఏమీ చేయలేకపోయారన్నారు. సామాన్య ప్రజలు ఇలాంటి చర్యలకు పాల్పడితే తీవ్రంగా పరిగణించే పోలీసులు.. ఇలాంటి వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం పచ్చచొక్కా వేసుకుంటే ఇష్టమొచ్చినట్లు వ్యవహరించవచ్చనే ధోరణితో ప్రవర్తిస్తున్నారన్నారు. ‘అధికారం’ ముసుగులో ఎంతటి అరాచకాలకైనా పాల్పడవచ్చనే సంకేతాన్ని ప్రజలకు ఇస్తున్నారని దుయ్యబట్టారు. ‘చందాలు అడగరాదు’ అంటూ జేసీ సోదరులు తమ ఇంటి వద్ద పెద్ద పెద్ద బోర్డులు వేసుకున్నారన్నారు. అయితే అవి తమకు వర్తించవన్నట్టు గత ఏడాది అమ్మవారి గుడి కోసం, ఈ ఏడాది సాయిబాబా ఆలయం నిర్మాణం కోసం చందాలు వసూలు చేస్తున్నారన్నారు. వాటితో తమ కుటుంబం మాత్రమే సస్యశ్యామలంగా ఉండాలని వారు కోరుకుంటున్నారని విమర్శించారు. తాడిపత్రి నియోజకవర్గంలో ఫ్యాక్టరీలు ఉన్నప్పటికీ అందులో ఉద్యోగాల గురించి మాత్రం తమను అడగవద్దని చెప్పి నిరుద్యోగులను నిరుత్సాహానికి గురి చేస్తున్నారన్నారు. జేసీ సోదరులను ప్రజలు భయంతో గౌరవిస్తున్నారే తప్ప భక్తితో కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అధికారులపై దురుసుగా ప్రవర్తించడం, వారిపై దాడులకు పాల్పడడం వారికి అలవాటైపోయిందన్నారు. జేసీ సోదరులను టీడీపీ నుంచి సస్పెండ్ చేసి, శిక్షించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి కుమ్మరి ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్కంఠకు తెర
- పైలా నామినేషన్ ఉపసంహరణ - ‘స్థానిక’ ఎమ్మెల్సీగా దీపక్రెడ్డి ఏకగ్రీవం అనంతపురం అర్బన్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠకు తెరపడింది. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన పైలా నరసింహయ్య వెనక్కి తగ్గారు. ఆయన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో టీడీపీ నాయకులు ఊపిరిపీల్చుకున్నారు. పైలాతో పాటు టీడీపీ డమ్మీ అభ్యర్థి జేసీ అస్మిత్రెడ్డి కూడా శుక్రవారం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో టీడీపీ అభ్యర్థి గుణపాటి దీపక్రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఆయన వస్తే డిక్లరేషన్ పత్రాన్ని అందజేస్తామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు. ‘పైలా’ పై క్రమశిక్షణ చర్యలు పార్టీ అనుమతి లేకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ వేసి, తర్వాత ఉపసంహరించుకున్న పైలా నరసింహయ్యపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నామినేషన్ వేసిన క్రమంలోనూ, అటు తరువాత ఉపసంహరించుకోవడంలోనూ పార్టీ అనుమతిని పైలా తీసుకోలేదని తెలిపారు. నామినేషన్ వేయడంపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. కనీసం అందుబాటులోకి రాలేదని వివరించారు. పార్టీ జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేసి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పైలాపై క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటామని, ఈ విషయాన్ని రాష్ట్ర కమిటీ దృష్టికి కూడా తీసుకెళతామని తెలిపారు. -
బలిజలకు మొండిచేయి!
స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి సాక్షి ప్రతినిధి, అనంతపురం : అనుకున్నదే జరిగింది. ‘అనంత’ బలిజలకు చంద్రబాబు మరోసారి మొండిచేయి చూపించారు. ‘గ్రేటర్ రాయలసీమ’లో చిత్తూరు మినహా అన్ని జిల్లాలలోనూ ఎమ్మెల్సీ టిక్కెట్లు ఒకే సామాజికవర్గానికి కేటాయించిన చంద్రబాబు కనీసం ‘అనంత’లోనైనా బలిజలకు కేటాయిస్తారని ఆ సామాజిక వర్గం నేతలు ఆశించారు. అయితే జిల్లాలోని బలిజలకు ఎమ్మెల్సీ ‘స్థాయి’ లేదంటూ పార్టీ అధిష్టానం తేలిగ్గా తీసుకుంది. సమీకరణల్లో బలిజలను మినహాయిస్తే...మైనార్టీకోటాలో తమకైనా టిక్కెట్టు దక్కుతుందని ఆశించిన మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ఘని, మాజీ ఎంపీ సైఫుల్లాను కూడా పార్టీ విస్మరించింది. చివరకు ఆర్థికబలం, అంగబలం ఉన్న దీపక్రెడ్డివైపు మొగ్గుచూపింది. సోమవారం రాత్రి జరిగిన సమావేశంలో స్థానిక సంస్థల కోటాలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దీపక్రెడ్డి పేరును అధిష్టానం దాదాçపుగా ఖరారు చేసింది. ‘అనంత’ స్థానికసంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై టీడీపీ మల్లగుల్లాలు పడింది. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, వైఎస్సార్జిల్లాల టికెట్లు ఒకే సామాజిక వర్గానికి కేటాయించడంతో ‘అనంత’ స్థానానికి బలిజ అభ్యర్థిని ప్రకటిస్తారని ఆ సామాజికవర్గ నేతలు భావించారు. ‘అనంత’లో టీడీపీ విజయంలో బలిజ సామాజికవర్గ నేతల పాత్ర కీలకంగా ఉంది. గత ఎన్నికల్లో ఆ సామాజికవర్గానికి ఒక్క ఎమ్మెల్యే టిక్కెట్టు కూడా టీడీపీ కేటాయించలేదు. అయినప్పటికీ జిల్లాలో 12 అసెంబ్లీలతో పాటు 2 ఎంపీ స్థానాలు టీడీపీ గెలిపించింది. ఇందులోనూ బలిజ సామాజికవర్గ పాత్ర కీలకంగా ఉంది. ఈ క్రమంలో పట్టభద్రులకోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కర్నూలుకు చెందిన జనార్ధన్ రెడ్డిని టీడీపీ బరిలోకి దింపింది. దీంతో కర్నూలు, లేదా అనంతపురంలో తమ వర్గానికి టిక్కెట్ కేటాయిస్తారని బలిజలు ఆశపడ్డారు. చంద్రబాబు కూడా ‘సీమ’లో ఎమ్మెల్యే టిక్కెట్ల కేటాయింపులో బలిజలను విస్మరించామని, కాపు, బలిజ, ఒంటరి, తెలగ ఉద్యమం తీవ్రంగా ఉన్న ఈ సమయంలో మళ్లీ వీరిని విస్మరిస్తే ఈప్రాంతంలో పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందని భావించారు. దీంతోనే జిల్లా నేతలు దీపక్రెడ్డి, గడ్డం సుబ్రహ్మణ్యంపేర్లను తెరపైకి తెచ్చినపుడు ‘గ్రేటర్’లో అన్ని జిల్లాలలో రెడ్డి సామాజికవర్గానికి టిక్కెట్లు ఇస్తున్నామని, కనీసం ‘అనంత’లోనైనా బలిజలకు ఇవ్వాలని జిల్లా నేతలతో చెప్పారు. ఈ విషయం తెలిసి టీడీపీ నేత లక్ష్మీపతి చంద్రబాబును కలిసి తన అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఇది గ్రహించిన అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్చౌదరి లక్ష్మీపతికి అడ్డుకట్ట వేసేందుకు లీగల్సెల్ జిల్లా అధ్యక్షుడు ఆదెన్నకు మద్దతు తెలపడంతో, ఆదెన్న కూడా బాబు వద్ద తన వాణి వినిపించారు. కానీ బలిజ సామాజికవర్గంలో ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తులు ఎవ్వరూ లేరని జిల్లా పార్టీ నేతలు బాబుకు గట్టిగా చెప్పారు. దీంతో మైనార్టీ వర్గం వైపు కూడా బాబు ఆలోచించారు. బాలయ్య కోసం టిక్కెట్టు త్యాగం చేసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే ఘనీ పేరును పరిశీలించారు. దీనికి బాలయ్య అడ్డుపడ్డారు. దీంతో మాజీ ఎంపీ సైఫుల్లా కుటుంబాన్ని పరిగణలోకి తీసుకున్నారు. పార్టీకోసం సైఫుల్లా తన కుమారుడు రహంతుల్లాను కోల్పోయారని, దీంతో సైఫుల్లా లేదా ఆయన కుమారుడు జకీవుల్లాకు ఇద్దామని ఆలోచించారు. వీరు పార్టీలో క్రియాశీలకంగా పనిచేయడం లేదని ప్రభాకర్చౌదరితో పాటు పలువురు నేతలు బాబుకు చెప్పినట్లు తెలిసింది. దీంతో చంద్రబాబు అభ్యర్థి ఖరారుపై నిర్ణయానికి రాలేకపోయారు. ‘గ్రేటర్’లో అన్ని జిల్లాల అభ్యర్థులను ప్రకటించినప్పటికీ ‘అనంత’ అభ్యర్థి పేరు మాత్రం పెండింగ్లో ఉంచారు. దీపక్రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందేనని జేసీ బ్రదర్స్ చంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. జేసీ కుటుంబం నుంచి ఇప్పటికే ఎంపీ, ఎమ్మెల్యేలుగా జేసీ బ్రదర్స్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో వారి కుటుంబానికే చెందిన ప్రభాకర్రెడ్డి అల్లుడు దీపక్రెడ్డికి టిక్కెట్టు ఇవ్వడమేంటని పలువురు నేతలు జిల్లా నేతలతో వాదించారు. కానీ చివరకు దీపక్రెడ్డిపేరును ప్రకటిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. బలిజల మండిపాటు టీడీపీ తీసుకున్న నిర్ణయంపై టీడీపీలోని బలిజ సామాజికవర్గ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. జిల్లాలో ఎమ్మెల్యే, ఎంపీలలో ఒక్కరూ బలిజలు లేరని, కనీసం ఎమ్మెల్సీనైనా చేస్తారనుకుంటే ఆస్థాయి తమకు లేదంటూ తమను తీవ్రంగా అవమానించారని ఇద్దరు కీలక నేతలు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న బలిజలు ఈ అవమానాన్ని గుర్తుపెట్టుకుంటారని, పార్టీచేసిన ఈ తప్పుకు భవిష్యత్తులో తగిన మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నారు. కాలవ శ్రీనివాసులు, నిమ్మల కిష్టప్పలకు ఎంపీ టిక్కెట్టు కేటాయించినప్పుడు వారి స్థాయి ఏమిటో టీడీపీ గుర్తుంచుకోవాలన్నారు. బీకే పార్థసారథికి టిక్కెట్టు ఇచ్చినపుడు ఆయనస్థాయి ఏమిటో తెలీదా? అని టీడీపీలో చురుగ్గా ఉన్న బలిజ సామాజికవర్గ నేత ఒకరు ప్రశ్నించారు. బలిజలను గౌరవించి రాజకీయప్రాధాన్యం కల్పించాలని చంద్రబాబు భావిస్తే ఎవరెన్ని చెప్పినా టిక్కెట్టు కేటాయించేవారని, ఈ ఉద్దేశం లేకపోవడంతోనే తమను విస్మరించారని ఆరోపిస్తున్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
పరిపూర్ణం.. కోన సంబరం
ఉపాధికి మెండైన పాలి‘టెక్నిక్’
● ఢిల్లీ రోడ్డు ప్రమాదంలో చౌడేపల్లె యువకుడు మృతి ● ఒక్కగానొక్క కుమారుడి మృతితో కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు ● దుఃఖంలోనూ అవయవదానానికి అంగీకారం
షోకాజ్ నోటీసులను ఉపసంహరించండి
ట్రాన్స్కో వర్క్ ఆర్డర్లు పూర్తి చేయాలి
కౌంటింగ్పై అవగాహన తప్పనిసరి
● మగబిడ్డకు జన్మనిచ్చిన గంటలోపే బాలింత మృతి ● వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్న కుటుంబ సభ్యులు ● ఆస్పత్రి వద్ద ధర్నా.. పోలీసులకు ఫిర్యాదు
న్యాయమూర్తులకు ముగిసిన శిక్షణ
● మరో పదిరోజుల్లో ఓట్ల లెక్కింపు ● ఎన్నికల ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ ● జూన్ 4వ తేదీన తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
వైభవం.. వసంతోత్సవం
తప్పక చదవండి
- గిరికీలు కొట్టిన హెలికాప్టర్
- విస్తృతంగా పోలీసుల తనిఖీలు
- Lok Sabha Election 2024: గురుగ్రాంలో ముక్కోణం
- Lok Sabha Election 2024: బీజేడీకి సవాల్!
- హింస పన్నాగంతోనే అధికారుల బదిలీ
- Lok Sabha Election 2024: మహిళా ఎంపీలు 9 మందే!
- ఆ పచ్చ ‘సీఐ’ పై చర్యలేవి?
- Lok Sabha Election 2024: లోక్సభ బరిలో ప్యాడ్ ఉమన్
- జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్
- మేడిగడ్డ కింద అగాధం!
Advertisement