-
‘వేదం’ బ్యూటీ దిక్షాసేథ్ ఇప్పుడు ఎలా ఉంది, ఎం చేస్తుందో తెలుసా?
సెలబ్రెటీల లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఈ రంగుల ప్రపంచాన్ని ఏలి.. ఆ వెంటనే కనుమరగైపోతారు. అలాంటి వారిలో అల్లు అర్జున్ ‘వేదం’ బ్యూటీ దిక్షాసేథ్ ఒకరు. చేసింది సింగిల్ డిజిట్ చిత్రాలే అయినా తనదైన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. వేదంలో అల్లు అర్జున్ రిచ్ గర్ల్ఫ్రెండ్గా పరిచయమైన దిక్షాసేథ్ తొలి చిత్రంతోనే ఎనలేని క్రేజ్ సొంతం చేసుకుంది. ‘వేదం’ తర్వాత ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. అప్పట్లో దిక్షాసేత్దే హావా అనేంతగా వరుస పెట్టి సినిమాలు చేస్తూ పోయింది. ఈ క్రమంలో గోపిచంద్ వాంటెడ్, రవితేజ సరసన నిప్పు, మిరపకాయ, ప్రభాస్ రెబల్ ఇలా వెంట వెంటనే సినిమాలు చేసి వాంటెడ్ హీరోయిన్గా మారింది. ఆమె నటించిన చిత్రాలు పెద్దగా విజయం సాధించకపోయినా ధిక్షా గ్లామర్కు మాత్రం ఆడియన్స్ ఫిదా అయ్యారు. అంతేకాదు ఆమెను టాలీవుడ్ కత్రినా అని కూడా ముద్దుగా పిలుచుకునే వారు. తెలుగులో ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా సినిమాలో కనిపించిన ఆమెకు తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. దీంతో బాలీవుడ్కు వెళ్లిన ఆమెకు అక్కడ కూడా నిరాశే ఎదురైంది. లేకర్ హమ్ దివానా దిల్, ది హౌస్ ఆఫ్ ది డెడ్ 2, సాత్ కడమ్ వంటి హిందీ సినిమాలు చేసినా సక్సెస్ కాలేకపోయింది. కన్నడలో దర్శన్ సరసన జగ్గూబాయ్ సినిమాలో నటించినా ఫెయిల్యూర్గానే మిగిలింది. ఆమె సినీ కెరీర్లో మొత్తం ప్లాప్స్ చిత్రాలే ఉన్నాయి. దీంతో ఆమెకు ఆఫర్లు రాకపోవడం ధిక్షా ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం ఆమె లండన్లో నివసిస్తుంది. అక్కడ ఐటీ ఉదోగ్యం చేస్తున్నట్లు సమాచారం. అయితే తన స్నేహితులు, కొలిగ్స్తో కలిసి వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను తరచూ ఇన్స్టాగ్రామ్లో పంచుకుంటుంది. అలా ఇన్స్టా వేదికగా దిక్షా నెట్టింట ఫ్యాన్స్ని పలకరిస్తుంది. ఈ క్రమంలో దిక్షా రీసెంట్గ్ షేర్ చేసిన ఫొటోలు చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఇందులో ఆమె పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. సినిమాల్లో కాస్తా బుగ్గలతో ముద్దుగా ఉండే దిక్షా బక్కచిక్కి కనిపించడంతో ఆమెను గుర్తు పట్టలేకపోతున్నారు. దీంతో మరి ఇంతలా మారిపోయిందేంటని, సినిమాల్లో ఉన్నప్పుడే బాగుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Deeksha Seth (@deeksha721) View this post on Instagram A post shared by Deeksha Seth (@deeksha721) -
'నిప్పు' హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా?
దీక్షా సేత్.. ఈ పేరు చెప్తే గుర్తుపడతారో లేదో కానీ వేదం, నిప్పు, మిరపకాయ్, వాంటెడ్ సినిమాల హీరోయిన్ అంటే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. కాలేజీ రోజుల్లోనే మోడలింగ్లో అడుగుపెట్టిందీ బ్యూటీ. హైదరాబాద్లో ఓ మోడలింగ్ అసైన్మెంట్ కోసం పని చేస్తున్న సమయంలో డైరెక్టర్ క్రిష్ కంట పడింది దీక్ష. వెంటనే ఆమెను వేదం సినిమాలో కేబుల్ రాజు(అల్లు అర్జున్) గర్ల్ఫ్రెండ్ రోల్ కోసం తీసుకున్నారు. ఆ సినిమా క్లిక్ అవ్వడంతో వెంటనే ఆమె మరో రెండు సినిమాలకు సంతకం చేసింది. అందులో మిరపకాయ్ బాక్సాఫీస్ దగ్గర బాగానే ఆడింది, కానీ అందులో దీక్షా సేత్ సైడ్ హీరోయిన్. ఇక గోపీచంద్తో చేసిన వాంటెడ్లో తొలిసారి కథానాయికగా నటించింది. కానీ ఆమె అంచనాలు తలకిందులు చేస్తూ వాంటెడ్ పెద్ద ఫెయిల్యూర్గా నిలిచిపోయింది. అలా ఆమె హీరోయిన్గా చేసిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. దీంతో ఆమె నెమ్మదిగా టాలీవుడ్కు దూరమైపోయింది. ఆమె చివరగా తెలుగులో రెబల్(2012)లో, హిందీలో సాత్ కడమ్ (2016)లో నటించింది. ఆ తర్వాత సినిమాల్లో కనిపించకుండా పోయిన ఈ హీరోయిన్ సోషల్ మీడియాకు కూడా నెలల తరబడి దూరంగా ఉండేది. అప్పుడప్పుడు మాత్రమే తన ఫొటోలను పంచుకునేది. ఈ క్రమంలో దీక్ష తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇందులో బీచ్లో ఎంజాయ్ చేస్తోందీ హీరోయిన్. ఈ పోస్ట్ చూసిన సందీప్ కిషన్ 'సేత్ మళ్లీ వచ్చేసిందోచ్' అంటూ కామెంట్ చేశాడు. కొందరు మాత్రం దీక్ష ఇలా అయిపోయిదేంటని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఆమె సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తే బాగుండు అంటున్నారు ఫ్యాన్స్. View this post on Instagram A post shared by Deeksha Seth (@deeksha721) View this post on Instagram A post shared by Deeksha Seth (@deeksha721) చదవండి: ఏడాది తిరిగేసరికి ఇల్లు అమ్మేసిన హీరో! ఆ సినిమా కోసం నాలుగేళ్లుగా గెడ్డం తీయలేదు : శరత్ కుమార్ -
హీరోయిన్ దీక్షాసేత్ క్యూట్ ఫోటోలు
-
'అందుకే సినిమాకో కొత్త హీరోయిన్'
బెంగళూరు: హీరోల ఎత్తుకు తగ్గ హీరోయిన్లు దొరకడం కొంచెం కష్టమే. తాజాగా కన్నడ స్టార్ హీరో దర్శన్ కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాడు. తన హైటుకు సరిపడా హీరోయిన్లు దొరకడం లేదని, అయితే ఉన్నవారితోనే వరుసగా సినిమాలు చేస్తే అనవసర పుకార్లు సృష్టిస్తున్నారని వాపోయాడు. అందుకే సినిమా, సినిమాకు కొత్త హీరోయిన్లతో నటించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. కాగా దర్శన్ తాజా చిత్రం జగ్గుదాదా జూన్ 10న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా అతడు మైసూరులో సినిమా ప్రచారాన్ని నిర్వహించి మీడియాతో మాట్లాడాడు. కాగా ఈ చిత్రంలో దర్శన్ సరసన దీక్షాసేథ్ హీరోయిన్గా నటించింది. -
శింబూ సరసన!
తెలుగులో నాలుగైదు చిత్రాల్లో నటించిన దీక్షాసేథ్ ‘రాజపాట్టై’ చిత్రం ద్వారా తమిళ తెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రం విడుదలై, మూడేళ్లకు పైనే అవుతున్నా దీక్షాకి తమిళంలో అవకాశాలు రాలేదు. ఇప్పుడో అవకాశం దక్కించుకున్నారని సమాచారం. ‘7/జి బృందావన కాలనీ’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ తదితర చిత్రాల ద్వారా దర్శకునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సెల్వరాఘవన్ ఓ తమిళ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. శింబు హీరోగా రూపొందనున్న ఈ చిత్రంలో దీక్షాని కథానాయికగా తీసుకున్నారట.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సంజయ్లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ ఎలా ఉంది..?
నాడు మోదీకి వంట వండిన దీపక్.. ఇప్పుడేం చేస్తున్నారు?
కాన్వాయ్ స్లో చేసి అంబులెన్స్కు దారిచ్చిన సీఎం జగన్ (ఫొటోలు)
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
ఎల్లో శారీలో హీరామండి హీరోయిన్ సంజీదా షేక్ లుక్స్.. ఫోటోలు
ఇంటింటి ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి (ఫొటోలు)
జగన్ పాటకే భయపడ్డారు!
‘ప్రియాంక గాంధీ కాంగ్రెస్కు రెబల్గా మారనుంది’
భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement