-
నేనే శివుడిని.. నాకు ఏ టెస్టు వద్దు: పద్మజ
సాక్షి, చిత్తూరు: తమ ఇద్దరు కుమార్తెలు అలేఖ్య(27), సాయిదివ్య(22)ను ఇంట్లో కిరాతకంగా హత్యచేసిన తల్లిదండ్రులు పురుషోత్తం నాయుడు, పద్మజలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్కు తరలించారు. జంట హత్యల కేసులో A 1గా పురుషోత్తం నాయుడు, A 2 గా పద్మజను చేర్చారు. మంగళవారం సాయంత్రం కోర్టు ముందు హాజరుపరచనున్నారు. కాగా తమ ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులతో పద్మజ మరోసారి గొడవకు దిగారు. దేవుడి గదిలోకి బూట్లు వేసుకుని రావొద్దని, ఫొటోలు తీయొద్దని విజ్ఞప్తి చేశారు.(చదవండి: మూఢనమ్మకంతోనే.. బలిచేశారు) అదే విధంగా.. ‘‘నా బిడ్డల్ని వాళ్లకు ఎందుకు చూపిస్తున్నారు. నువ్వు చేసిన పని వల్లే కదా అయ్యా ఇదంతా జరిగింది’’ అని భర్త పురుషోత్తం నాయుడును నిందించారు. ఇక తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని పోలీసులను వేడుకున్న పద్మజ.. ‘‘ఈ ఒక్కరోజు వినండి ప్లీజ్ సర్. రేపటి లోగా నా బిడ్డలు బతికి వస్తారు. ఈ ఒక్కరోజు వదిలేయండి. మీ కాళ్లకు మొక్కుతా సర్’’ అంటూ విలపించారు. పోలీసులు తీసుకువెళ్తున్న సమయంలోనూ చేతులతో సైగలు చేస్తూ ఆమె విచిత్రంగా ప్రవర్తించారు. నేనే శివుడిని నాకు కరోనా టెస్టు ఏంటి?: పద్మజ కూతుళ్లను హత్య చేసిన పద్మజ మూఢనమ్మకాలతో పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు. కరోనా టెస్టుకు తీసుకెళ్లిన పోలీసులకు ఆమె చుక్కలు చూపించారు. కరోనా చైనా నుంచి రాలేదని, చెత్తను కడిగేయడానికి తన శరీరం నుంచి తానే వైరస్ను పంపించానంటూ బిగ్గరగా కేకలు వేశారు. తానే శివుడినని, తనకు ఏ టెస్టు అవసరం లేదంటూ గందరగోళం సృష్టించారు. -
ఓతండ్రి కిరాతకం
-
నాన్న కాదు కిరాతకుడు..
గోపవరం/వైఎస్సార్ కడప: నాన్న అంటే నమ్మకానికి ప్రతీక అంటారు..కానీ ఆ కసాయి తండ్రి ఇందుకు అర్హుడు కాడు.. చిన్నప్పుడే తల్లిని కోల్పోయినా నాన్నే సర్వస్వమని నమ్మారు ఆ ఇద్దరు చిన్నారులు. నాన్నలోనే అమ్మను చూసుకున్నారు. కానీ ఉన్నట్టుండి నాన్న రాక్షస అవతారం ఎత్తుతాడని ఆ చిన్నారులకేం తెలుసు..అంగడికి రండి అంటే ఆనందంగా బైక్ ఎక్కేశారు. ఏం కొంటాడో అని ఆశ పడ్డారు. కానీ ఆ తండ్రి కన్న బిడ్డలని కూడా చూడకుండా నిర్దయగా..అమానవీయంగా బావిలోకి తోసి పరారయ్యాడు. గోపవరం మండలం శ్రీనివాసాపురంలో జరిగిన ఈ ఘోరానికి సంబంధించి శుక్రవారం పెద్దకుమార్తె శవం బయటపడింది. రెండో బిడ్డ ప్రాణాలతో ఉందేమో అని భావించిన కుటుంబ సభ్యుల ఆశలపై నీళ్లు చల్లుతూ శనివారం శవమై కనిపించింది. ఈ ఘటన గోపవరం మండలం శ్రీనివాసపురంలో శుక్రవారం వెలుగు చూసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు తాళ్ల బాలకొండయ్య, బుజ్జమ్మలకు భావన (11), శోభన (9) ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. భర్త వేధింపులు తట్టుకోలేక బుజ్జమ్మ 5 సంవత్సరాల క్రితమే ఉరి వేసుకుని చనిపోయింది. భార్య చనిపోవడంతో ఇద్దరు పిల్లల ఆలనాపాలన చూసుకునేందుకు బాలకొండయ్య తన తల్లిదండ్రులను ఇంటిలో ఉంచుకున్నాడు. అప్పుడప్పుడు మేనత్త కూడా పిల్లల బాగోగులు చూసేది. స్థానిక పాఠశాలలో పెద్ద కుమార్తె భావన 5వ తరగతి, రెండవ కుమార్తె శోభన 3వ తరగతి చదువుతున్నారు. పిల్లలిద్దరిని తండ్రి బాగానే చూసుకుంటుండేవాడని స్థానికులు తెలిపారు. తనకున్న రెండు ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నాడు. మరో మినీ ట్రాన్స్పోర్ట్ వాహనాన్ని కూడా బాడుగల కోసం తిప్పుకుంటున్నాడు. అంగడికి వెళ్దామని చెప్పి.. గురువారం పిల్లలిద్దరూ బడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం 6–45 గంటల సమయంలో అంగడికి వెళ్దామంటూ బైకుపై ఎక్కించుకుని బయటికి తీసుకెళ్లాడు. తర్వాత వారెవరూ ఇంటికి తిరిగి రాలేదు. రాత్రంతా కుటుంబ సభ్యులతో పాటు బంధువులు గాలించారు. శుక్రవారం ఉదయం పొలం వద్దకు వెళుతుండగా రోడ్డు పక్కనే ఉన్న బావిలో పెద్ద కుమార్తె భావన శవమై ఉండటాన్ని గుర్తించారు. వారు హుటాహుటిన గ్రామంలోకి వెళ్లి సమాచారం చేరవేశారు. పోలీసులకు సమాచారమిచ్చారు. ఫైర్ సిబ్బంది, పోలీసులతో పాటు స్థానికులు బావి వద్దకు చేరుకుని భావన శవాన్ని బయటకు తీశారు. ఇద్దరు పిల్లలతో పాటు తండ్రి కూడా బావిలో దూకి చనిపోయి ఉంటారని అందరూ అనుమానించారు. ఫైర్ సిబ్బంది, పోలీసులు వారి కోసం మరింత గాలించగా... గోనె సంచిలో కుక్కి ఉన్న చిన్న కుమార్తె శోభన మృతదేహం శనివారం ఉదయం బావిలో బయటపడింది. తండ్రి బాలకొండయ్య ఆచూకీ దొరకలేదు. కాగా, బాలకొండయ్య నెల్లూరు జిల్లా సీతారామపురంలో ఉన్నట్లు అక్కడి బంధువొకరు సమాచారమిచ్చారు. పోరుమామిళ్ల నుంచి టేకూరుపేట మీదుగా బాలకొండయ్య బైకులో వెళుతున్నట్లు సీసీపుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. అతని కోసం గాలిస్తున్నారు. అభం శుభం తెలియని చిన్నారులు చనిపోవడంతో.. గ్రామంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. ఇద్దరికీ ఒకేసారి అంత్యక్రియలు ఇరువురు అక్కా చెల్లెళ్ల మృతదేహాలను శనివారం ఉదయం ఒకేసారి స్మశానానికి తీసుకెళుతున్నప్పుడు నానమ్మ, జేజబ్బ, కుటుంబ సభ్యులు బోరుబోరున విలపించారు. వృద్ధుల రోదనను చూసి స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. శోభన తలకు బలమైన గాయం ఉంది. గొంతును బలంగా నులిమినట్లు పోస్టుమార్టం ద్వారా వైద్యులు గుర్తించారు. ముందుగా భావనను బావిలో వేసిన తర్వాత శోభన కేకలు వేయడం వల్లే తలపై గాయపరిచి గొంతు నులిమి బావిలో వేసినట్లు భావిస్తున్నారు. శోభన బావిలో వేసేముందే మృతిచెందింది. అందువల్లే బావిలోని పూడికలో ఇరుక్కుపోయి ఉంటుందని చర్చించుకుంటున్నారు. నిందితుడి కోసం బద్వేలు రూరల్ సీఐ చలపతి ఆధ్వర్యంలో రెండు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల అదుపులో నిందితుడు ఇద్దరు కుమార్తెలను అతి కిరాతకంగా హత్య చేసిన నిందితుడు బాలకొండయ్యను పోలీసులు శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. కాశినాయన మండలం జ్యోతి క్షేత్రంలో నిందితుడు ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లారు. అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు ఆదివారం వెల్లడించే అవకాశం ఉంది. -
పెళ్లిళ్లు చేయలేనని.. ముగ్గురు కూతుళ్ల హత్య!
ఇంటివద్ద చక్కగా చదువుకుంటున్న తన కూతుళ్లకు కొత్త బట్టలు కొనిస్తానని చెప్పి.. వాళ్ల ప్రాణాలు నిలువునా తీసేశాడో కసాయి తండ్రి. పిల్లలను షాపింగ్కు తీసుకెళ్తున్నాను తిరిగి వచ్చేసరికి మంచి భోజనం వండాలని భార్యకు చెప్పాడు. ఈ మాటలు విన్న పిల్లలు ఎగిరి గంతేసి నాన్న చంకన ఎక్కేశారు. తర్వాత కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయారు. అత్యంత విషాదమైన ఈ ఘటన గుజరాత్లో పాండిసిరా అనే గ్రామంలో చోటుచేసుకుంది. తనకు ముగ్గురూ కూతుళ్లే ఉండటం, వాళ్లు పెద్దయితే పెళ్లిళ్లు చేయలేననే ఆలోచనతో అజయ్ దూబే (33) అనే వ్యక్తి తన ముగ్గురు కుమార్తెలు ప్రియ (7), అంకిత(9), భావన(2)లను గొంతు నులిమి చంపేశాడు. ముగ్గురి మృతదేహాలు కాలువలో పడేశాడు. కూతుళ్లు, భర్త రాత్రి 10 గంటలకు కూడా ఇంటికి రాకపోవడంతో కంగారు పడిన అజయ్ భార్య మీరాదేవి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. కాలువలో మృతదేహాలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు విచారించగా, అక్కడే ఉన్న అజయ్ తన పిల్లలను తానే చంపేసినట్లు చెప్పాడు. ఇటీవల వ్యాపారంలో మూడు లక్షల నష్టం వచ్చిందని, వారిని పెంచి పెళ్లి చేయలేనేమోననే భయంతో హతమార్చినట్లు పోలీసులకు తెలిపాడు. ఒకవైపు గుజరాత్ నుంచే వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ బేటీ బచావో.. బేటీ పఢావో అనే నినాదం ఇచ్చినా, అదే రాష్ట్రంలో ఇలాంటి ఘోరం జరగడం దారుణం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement