-
బెయిల్ నిరాకరణ
ఓటుకు నోటు కేసులో నిందితుల పిటిషన్లను కొట్టేసిన కోర్టు ♦ రేవంత్కు మాత్రం 12 గంటల తాత్కాలిక బెయిల్ ♦ కూతురు నిశ్చితార్థంలో పాల్గొనేందుకు అనుమతి ♦ ఎన్నికల ప్రక్రియను రేవంత్ కలుషితం చేశారు ♦ తన పలుకుబడితో కేసును ప్రభావితం చేస్తారు ♦ మిగతా రూ.4.5 కోట్ల ఆచూకీని కనిపెట్టాల్సి ఉంది ♦ బెయిల్ ఇవ్వొద్దని ప్రత్యేక కోర్టుకు ఏసీబీ విజ్ఞప్తి ♦ స్టీఫెన్సన్ కక్షగట్టి ఇరికించారని నిందితుల వాదన ♦ ఏసీబీ వాదనతో ఏకీభవించిన కోర్టు, పిటిషన్ల తిరస్కరణ సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డికి ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ను కోర్టు బుధవారం తోసిపుచ్చింది. అయి తే కుమార్తె నిశ్చితార్థంలో పాల్గొనేందుకు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. గురువారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిశ్చితార్థంలో రేవంత్ పాల్గొనవచ్చునని జడ్జి లక్ష్మీపతి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రూ.50 వేల పూచీకత్తుతోపాటు అంతే మొత్తానికి రెండు పూచీకత్తు బాండ్లను సమర్పించాలని షరతు విధించారు. బెయిల్ మీద బయట ఉన్న సమయంలో మీడియాతోనూ, రాజకీయ నాయకులతోనూ రేవంత్ కలవకూడదని, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేయరాదని, దర్యాప్తుకు ఆటంకం కలిగించరాదని ఆదేశిం చారు. విచారణకు సంబంధించిన విషయాల ను బహిర్గతం చేయరాదని స్పష్టం చేశారు. రేవంత్ కదలికలపై నిఘాకు అనుమతించాలన్న ఏసీబీ విజ్ఞప్తిని కోర్టు ఆమోదించింది. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రేవంత్రెడ్డి ఎన్నికల ప్రక్రియను అవినీతితో కలుషితం చేశారని, ఇది ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయడమేనని ఏసీబీ ప్రత్యేక లాయర్ వి.సురేందర్రావు కోర్టుకు విన్నవించారు. రాష్ట్ర రాజకీయాలను శాసిస్తానని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో రేవంత్ అన్నారని, తన పలుకుబడితో ఆయన ఎవరినైనా ప్రభావితం చేయగలరని పేర్కొన్నారు. ఓటు కోసం చేసుకున్న రూ.ఐదు కోట్ల డీల్లో అడ్వాన్స్గా ఇవ్వజూపిన రూ.50 లక్షలు పోను మిగతా రూ.4.5 కోట్ల ఆచూకీ కనిపెట్టాల్సి ఉందన్నారు. ఈ కేసులో కేవలం ఆడియో, వీడియో రికార్డులపైనే తాము ఆధారపడడం లేదని, కీలక ఆధారాలను సేకరించామని చెప్పారు. రేవంత్ ఇప్పటికే పలు పరువునష్టం దావాలను ఎదుర్కొంటున్నారని, ఆయనకు బెయిల్ మంజూరు చేయరాదని నివేదించారు. స్టీఫెన్సన్ను ముందుగా ఇద్దరు వ్యక్తులు కలిసి రూ.2 కోట్లు ఇస్తామన్నారని, తర్వాత సెబాస్టియన్ రూ.5 కోట్లు ఇస్తామని చెప్పారని వెల్లడించారు. ఏసీబీలో సిబ్బంది కొరత కారణంగా నిందితుల వాంగ్మూలాలను నమోదు చేయలేకపోయామని, ఆడియో, వీడియో సీడీలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపలేకపోయామని అన్నారు. ఈ కేసులో నిందితునిగా ఉన్న ఉదయ్సింహ నివాసంలో సోదాలు చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సమాచార హక్కు చట్టం కింద రేవంత్ తరఫున పలు సంస్థల నుంచి సమాచారం తీసుకున్నట్లు వాటి ద్వారా తేలిందన్నారు. స్టీఫెన్సన్ దగ్గరకు వెళ్లిన సమయంలో రేవంత్రెడ్డి తన గన్మెన్లను తీసుకెళ్లలేదని, ఈ కేసుతో సంబంధమున్న మత్తయ్య ఇప్పటికీ పరారీలో ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో నిందితుల బెయిల్ పిటిషన్ను కొట్టివేయాలని కోరారు. స్టీఫెన్ ఎంపికను వ్యతిరేకించారు నామినేటెడ్ ఎమ్మెల్యేగా స్టీఫెన్సన్ను ఎంపిక చేయడాన్ని వ్యతిరేకిస్తూ రేవంత్ గతంలో మాట్లాడారని, అందుకే ఆయనపై స్టీఫెన్ కోపం పెంచుకున్నారని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లుత్రా వాదనలు వినిపించారు. నామినేటెడ్ ఎమ్మెల్యేకు ఓటు హక్కుండదని, అలాంటప్పుడు అవినీతి నిరోధక చట్టంలోని 7, 11(పబ్లిక్సర్వెంట్ ముడుపులు తీసుకోవడం) సెక్షన్లు ఎలా వర్తిస్తాయని, ఆ సెక్షన్లే వర్తించనప్పుడు శిక్షకు సంబంధించిన సెక్షన్ 12 ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. ఆడియో, వీడియో రికార్డుల ఆధారంగా కస్టడీ కోరడమే సరికాదని, 4 రోజులపాటు కస్టడీలోకి తీసుకుని పూర్తిగా విచారించాక కూడా బెయిల్ను వ్యతిరేకించడం సరికాదన్నారు. సీజ్ చేసిన సొమ్ము ఏసీబీ దగ్గరే ఉందని, మిగతా డబ్బును కనిపెట్టేందుకు బెయిల్ను వ్యతిరేకిస్తున్నామనడం సమంజసం కాదన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్రెడ్డి ఎక్కడికి పారిపోరని, దర్యాప్తునకు అందుబాటులోనే ఉంటారని, బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అందుకు అవకాశం లేకపోతే, కుమార్తె నిశ్చితార్థం కోసం తాత్కాలిక బెయిలైనా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. సెబాస్టియన్, ఉదయ్సింహ ప్రైవేటు వ్యక్తులని, వారినిప్పటికే కస్టడీలో పూర్తిస్థాయిలో విచారించిన నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని వారి తరఫు న్యాయవాదులు నివేదించారు. ఏసీబీ వాదనలతో కోర్టు ఏకీభవిస్తూ ముగ్గురు నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. రేవంత్ను కలసిన ఎమ్మెల్యేలు చర్లపల్లి జైలులో రిమాండ్లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డిని ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్రెడ్డి బుధవారం ములాఖత్లో కలుసుకున్నారు. దాదాపు అరగంట పాటు ఆయనతో మాట్లాడారు. రేవంత్ను కలుసుకోవడంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని, ఆయన తమకు మిత్రుడని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
రేవంత్ రెడ్డి ఎవరినీ బెదిరించకూడదు..
హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో 12 గంటల పాటు బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి షరతులు విధించింది. 12 గంటల సమయంలో రేవంత్ రెడ్డి వెంట ఎస్కార్ట్ ఉండాల్సిందేనని, ఎవరితోనూ సమావేశాలు పెట్టకూడదని, అలాగే రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడకూడదని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా రేవంత్ రెడ్డి ఎవరినీ బెదిరించకూడదని, విచారణకు ఆటంకం కలిగించకూడదని సూచించింది. కాగా రేవంత్ రెడ్డి దాఖలు చేసుకున్న ప్రధాన బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. కేసు విచారణ సమయంలో ఉన్నందున ...ఈ దశలో రేవంత్కు బెయిల్ ఇవ్వలేమని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. -
రేవంత్ రెడ్డికి 12 గంటల పాటు బెయిల్
ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి బుధవారం షరతులతో కూడిన 12 గంటల పాటు బెయిల్ మంజూరైంది. ఏసీబీ కోర్టు ఆయనకు గురువారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బెయిల్ మంజూరు చేసింది. కుమార్తె నిశ్చితార్థం కోసం బెయిల్ మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి బెయిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నిశ్చితార్థం కోసమే అయితే బెయిల్ ఇచ్చేందుకు తమకు కూడా అభ్యంతరం లేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. ముందురోజు సాయంత్రం వెళ్లి, తర్వాతి రోజు సాయంత్రం వస్తే పర్వాలేదని అన్నారు. రేవంత్ రెడ్డి తరఫున సుప్రీంకోర్టు నుంచి వచ్చిన న్యాయవాదులు తమ వాదన వినిపించారు. వాదనలన్నీ విన్న తర్వాత ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్
ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన తల్లి!
హైదరాబాద్ లో బీర్లు కరువు
ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)
బాబు, లోకేష్ కు నోటీసులు..?
స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ
అప్పుడు భాషాలా.. ఇప్పుడు దావూద్ ఇబ్రహీంలా..
ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement