breaking news
Dark Chocolate movie
-
హీరో రానా నుంచి 'బూతుల' సినిమా.. టీజర్ రిలీజ్
రీసెంట్ టైంలో సినిమాల్లో వైల్డ్నెస్ పేరిట బూతుల్ని, బూతు సన్నివేశాల్ని అక్కడక్కడ ఉపయోగిస్తున్నారు. కొన్నింటికి సెన్సార్ కత్తెర వేస్తున్నప్పటికీ మరికొన్నిసార్లు మాత్రం మూవీకి 'ఏ' సర్టిఫికెట్ లాంటివి తెచ్చుకుని రిలీజ్ చేస్తున్నారు. వీటిని యూత్ చూస్తారు. ఫ్యామిలీ అడియెన్స్ కాస్త దూరంగానే ఉంటారు. సరే ఇదంతా పక్కనబెడితే రానా నిర్మాతగా 'డార్క్ చాక్లెట్' అనే మూవీ త్వరలో రాబోతుంది. దీని టీజర్ ఇప్పుడు రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చిన 37 సినిమాలు.. ఈ వీకెండ్ పండగే)టీజర్ చూస్తుంటే.. యజ్ఞ అనే హీరో, ఓ ముగ్గురు వ్యక్తుల(ఓ మహిళ, ఇద్దరు పురుషులు) మధ్య జరిగే కథే ఈ సినిమా స్టోరీలా అనిపిస్తుంది. టీజర్ లో బూతు సన్నివేశాలేం లేవు గానీ బూతు మాటలు మాత్రం కాస్త గట్టిగానే వినిపించాయి. వీటిని టీజర్ కోసమే పెట్టారా? నిజంగా మూవీలోనూ ఉంచుతారా అనేది చూడాలి? అయితే హీరో రానా నిర్మాతగా ఈ తరహా మూవీ వస్తుందని అస్సలు ఊహించలేదు.'35' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న విశ్వదేవ్ ఇందులో హీరో కాగా బిందుమాధవి హీరోయిన్. మరో ఇద్దరు కూడా తెలుగు నటులే. 'కిడ్స్ పక్కకెళ్లి ఆడుకోండి' ,'పాన్ మసాలా మూవీ', 'జానర్ అడగొద్దు' లాంటి క్యాప్షన్స్ చూస్తుంటే కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తుంది. అలానే రిలీజ్ ఎప్పుడనేది కూడా అక్టోబరు 31, నవంబరు 14, డిసెంబరు 5 అని మూడు తేదీలు ప్రకటించి, మనల్నే ఎంచుకోమన్నట్లు చూపించారు. శశాంక్ శ్రీ వాస్తవ్య దర్శకుడు కాగా వివేక్ సాగర్ సంగీతమందించాడు. చూస్తుంటే ఇది పెద్దల కోసం మాత్రమే తీసిన సినిమాలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: మొన్న విజయ్..నేడు రష్మిక.. అలా బయటపెట్టేశారుగా!) -
షీనాబోరా తల్లి పాత్రలో బాలీవుడ్ నటి
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనాబోరా హత్య ఉదంతాన్ని తెరకెక్కిస్తున్నారు. బెంగాలీ భాషలో తీస్తున్న 'డార్క్ చాకొలెట్' సినిమాలో షీనాబోరా తల్లి ఇంద్రాణి ముఖర్జీయా పాత్రలో బాలీవుడ్ నటి మహిమా చౌదరి నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా మహిమ ఈ విషయం చెప్పింది. ఇంద్రాణిని స్ఫూర్తిగా తీసుకుని ఈ పాత్ర పోషించినట్టు తెలిపింది. 'షీనాబోరా హత్యను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తీశారు. ఇందులో షీనాబోరా తల్లి పాత్రలో నటించాను. నాకిదే తొలి బెంగాలీ చిత్రం. ఈ సినిమాలో నటించినందుకు ఎంతో ఉత్సుకతగా ఉంది' అని మహిమ చెప్పింది. అగ్నిదేవ్ ఛటర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహిమా చౌదరితో పాటు రియా సేన్, ముంతాజ్ సార్కర్, రాజేశ్ శర్మ నటించారు. ఇంద్రాణి తన మాజీ భర్త (రెండో భర్త) సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్తో కలసి కూతురు (మొదటి భర్త ద్వారా) షీనాబోరాను హత్య చేయించడం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. ఇంద్రాణి మూడో భర్త పీటర్ ముఖర్జియా కొడుకు, షీనాబోరా ప్రేమించుకోవడం, ఇతర ఆర్థిక వ్యవహారాలు ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు.


