breaking news
danish ahmed
-
నాడు గ్రనేడ్తో అరిచి నేడు లొంగిపోయాడు
శ్రీనగర్: నెల రోజుల కిందట చేతిలో గ్రనేడ్ పట్టుకొని ప్రభుత్వ, సైనిక వ్యతిరేక నినాదాలు చేసిన దానిష్ అహ్మద్ అనే కశ్మీర్ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. గత కొద్ది రోజులుగా తప్పించుకొని తిరుగుతున్న అతడికి ఎలాంటి హానీ చేయబోమని తల్లిదండ్రులకు మాట ఇవ్వడంతో బుధవారం ఉదయం లొంగిపోగా అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ‘కొద్ది రోజుల కిందట ఓ వీడియో క్లిప్లో గుర్తు తెలియని ఓ ఉగ్రవాది చేతిలో గ్రనేడ్ పట్టుకొని నినాదాలు చేస్తూ కనిపించాడు. ఆ వీడియో క్లిప్ ట్రాల్ ప్రాంతంలో హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రిరిస్టు కమాండర్ జబ్జార్ భట్ అంతిమయాత్ర కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఓ స్థానిక మీడియా ప్రతినిధి రికార్డు చేశాడు. తర్వాత ఆ వీడియోను పరిశీలించగా అందులో ఉగ్రవాదిగా కనిపించిన ఆ వ్యక్తి ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ ప్రాంతంలోగల డూన్ పీజీ కాలేజీలో అగ్రికల్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుతున్న దానిష్ అహ్మద్ అని గుర్తించాం. అనంతరం అతడి తల్లిదండ్రులను సంప్రదించి వివరాలు తెలుసుకోగా వారు తమ నుంచి హామీ తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అతడు బుధవారం కశ్మీర్లోని హంద్వారాలో లొంగిపోయాడు’ అని ఓ పోలీసు అధికార ప్రతినిధి చెప్పారు. దక్షిణ కశ్మీర్లోని ఉగ్రవాదులతో తాను సోషల్ మీడియా ద్వారా టచ్లో ఉన్నానని దానిష్ చెప్పినట్లు వారు తెలిపారు. గతంలో కూడా అతడిపై రాళ్లు విసిరిన ఘటనలో అరెస్టు చేసినా అతడి కెరీర్కు ఎలాంటి ఇబ్బంది రాకూడదనే ఎలాంటి చర్యలు తీసుకోకుండానే వదిలిపెట్టారు. -
అలా అయితే అమ్మాయిలు హీరోల్లా చూస్తారని!
న్యూఢిల్లీ: హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది సబ్జార్ భట్ అంత్యక్రియల్లో హల్చల్ చేసిన అనుమానిత ఉగ్రవాది డానిష్ అహ్మద్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. త్రాల్లో జరిగిన సబ్జార్ అంత్యక్రియల ఫొటేజీతో డానిష్ అహ్మద్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా పోలీసుల వద్ద డానిష్ అహ్మద్ వెల్లడించిన విషయాలు విస్తుగొల్పుతున్నాయి. హంద్వారాలోని కులంగావ్ ప్రాంతానికి చెందిన డానిష్.. డూన్ పీజీ కాలేజీలో అగ్రికల్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. 2016లో హంద్వారా ప్రాంతంలో సైన్యంపై జరిగిన రాళ్లదాడుల్లో అతడు పాల్గొన్నట్లు వెల్లడైంది. ఉగ్రవాదం వైపు మళ్లిన చాలా మంది యువత అసంతృప్తితో ఉన్నారని, అయితే స్థానిక కమాండర్ల నుంచి ప్రాణహాని ఉండటం వల్ల వారు లొంగిపోవడానికి భయపడతారని డానిష్ తెలిపాడు. అలాగే.. ఉగ్రవాదులతో చేతులు కలిపినవారిని లోకల్ అమ్మాయిలు హీరోలుగా చూస్తారన్న భావనతో.. వారితో ఫ్రెండ్షిప్ చేసేందుకు కొంత మంది యువత ఉగ్రవాదం వైపు వెళ్తున్నారని డానిష్ వెల్లడించాడు. స్థానికంగా తగాదాలను పరిష్కరించడంతో పాటు.. ధనవంతుల నుంచి ఉగ్రవాదులు ’ప్రొటెక్షన్ మనీ’ వసూలు చేస్తారని విచారణలో డానిష్ అహ్మద్ తెలిపాడు.