-
త్వరలో పంటల పరిశీలనకు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని పరిశీలించేందుకు బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు త్వరలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. సాగునీరు అందక భూగర్భ జలవనరులు కూడా అడుగంటిన పరిస్థితిలో రైతులతో ప్రత్యక్షంగా భేటీ కావాలని కేసీఆర్ భావిస్తున్నారు. క్షేత్రస్థాయి పర్య టనలో భాగంగా భువనగిరి, ఆలేరు నియోజక వర్గాల్లో పంట పొలాలను పరిశీలించి రైతులతో భేటీ అవుతారు. ఏప్రిల్ మొదటి వారంలో కేసీఆర్ పర్యటన ఉంటుందని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి మంగళవారం మీడియా ప్రతినిధులకు సూచనప్రా యంగా చెప్పారు. అత్యధికంగా బోర్లు వేసి నష్టపో యిన ముషంపల్లి నుంచి ఈ పర్యటన ప్రారంభమయ్యేలా కేసీఆర్ పర్యటన షెడ్యూలు ఉండే అవకాశముంది. కేసీఆర్ పర్యటన షెడ్యూ ల్తోపాటు రూట్మ్యాప్ ఖరారు చేసే బాధ్యతను జగదీశ్రెడ్డికి అప్పగించారు. మొదలైన లోక్సభ నియోజకవర్గ భేటీలు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఖరారైన నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా మంగళవారం భేటీలు ప్రారంభమయ్యాయి. వరంగల్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని నేతలతో సోమవారం రాత్రి మాజీ మంత్రి హరీశ్రావు నివాసంలో కీలక భేటీ జరగ్గా, మంగళవారం ఉదయం సికింద్రాబాద్ నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. నల్లగొండ నియోజకవర్గ నేతల సమన్వయ భేటీ కూడా జగదీశ్రెడ్డి నివాసంలో మంగళవారం రాత్రి జరిగింది. మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో బుధవారం తెలంగాణ భవన్లో భేటీ జరగనుంది. ఈ భేటీకి కేటీఆర్ హాజరవుతారు. ఇదిలాఉంటే మెదక్, చేవెళ్ల, పెద్దపల్లి తదితర లోక్సభ నియోజకవర్గాల పరిధిలోనూ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు ప్రారంభమయ్యాయి. -
అకాల వర్షాలు..రైతుల ఆవేదన
-
నకిలీ విత్తన మాఫియా స్వైరవిహారం
• నియంత్రించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది • వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి విమర్శ • పలు చోట్ల పంటల పరిశీలన.. రైతులకు ఓదార్పు దుగ్గొండి : రాష్ట్రంలో నకిలీ విత్తన మాఫియా స్వైర విహారం చేస్తుందని, దానిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి విమర్శించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట తుపాను కారణంగా నేలపాలైందని, చేతికి వస్తుందనుకున్న మిరప పంట నకిలీ విత్తనాలతో నట్టేట ముంచిందన్నారు. దుగ్గొండి మండలం గిర్నిబావిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పత్తి, మొక్కజొన్న పంటలను గురువారం ఆయన పరిశీలించారు. నష్టపోయిన రైతులను పరామర్శించారు. స్థానిక రైతులు ఎరుకల రాజమ్మ, గోలి నాగరాజు, అనుముల రాజిరెడ్డి, పెండ్లి శ్రీను పంటలను పరిశీలించి శ్రీకాంత్రెడ్డి చలించిపోయారు. ఎంత పెట్టుబడి పెట్టారు.. వ్యవసాయ అధికారులు ఎవరైనా వచ్చారా.. ప్రభుత్వం నుంచి పరిహారం ఏమైనా అందిందా.. అని అడిగి తెలుసుకున్నారు. ఎకరాకు రూ.20 వేలు పెట్టుబడి పెట్టామని, వ్యవసాయాధికారులు ఎవరూ కూడా పంట చూడటానికి రాలేదని వారు వివరించారు. చేతికి వచ్చే దశలో ఉన్న పంట పాడై పోయిన విధానాన్ని వివరిస్తూ వారు కన్నీటి పర్యంతమయ్యారు. ఎవరూ అధైర్య పడవద్దని, రైతాంగానికి అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అన్నదాతలు ఏ పంట చేను వద్ద చూసినా నాటి మహానేత వైఎస్సార్నే గుర్తుచేస్తున్నారని చెప్పారు. పంట పోయిన వెంటనే పంట నష్టపరిహారం చెల్లించడం, విత్తనాలను తక్కువ ధరకు అందించిన విధానాన్ని తెలియజేస్తున్నారన్నారు. నాటి వైఎస్ పాలనలో వ్యవసాయం పండుగగా మారితే ఆతర్వాత వచ్చిన పాలకులు నిర్లక్ష్యం చేశారని అన్నారు. పంట బాగుంటేనే రైతు పండుగ చేసుకుంటాడని రైతు ఏడుస్తున్న సమయంలో బతుకమ్మ పండుగ వచ్చినా రైతుల్లో ఆ వాతావరణం లేదన్నారు. ప్రభుత్వం మాత్రం జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల ప్రారంభం అదరాలని చెప్పడం బాధాకరమన్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందించి ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీకాంత్రెడ్డి వెంట పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు నాడెం శాంతికుమార్, రాష్ట్ర , జిల్లా నాయకులు శివకుమార్, భూపాల్రెడ్డి, జెన్నారెడ్డి మహేందర్రెడ్డి, చల్ల అమరేందర్రెడ్డి, దొంతి కమలాకర్రెడ్డి, బోయిని రాజిరెడ్డి, మండల నాయకులు నునావత్ రమేష్, పుట్టపాక రాజేందర్, ఇజ్జిగిరి కోటిలింగం, కట్టయ్య ఉన్నారు. -
హెలెన్ తుపాను బాధితులకు జగన్ పరామర్శ
-
గోదావరి జిల్లాల్లో హెలెన్ తుపాను బాధితులకు జగన్ పరామర్శ
తూర్పుగోదావరి జిల్లాలో హెలెన్ తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయిన అరటి తోటలు, పంట పొలాలను పరిశీలించి, బాధిత రైతులను జగన్ రామర్శిస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement