breaking news
Dalit welfare departments
-
కళ్లుండి కబోదిలా..
సాక్షి ప్రతినిధి, వరంగల్: దళిత సంక్షేమ శాఖలో అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. పరిపాలన వైఫల్యంతో ఆ శాఖ ఉద్యోగులు ఓ వైపు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఆ శాఖకు సంబంధించి కోట్లాది రూపాయల ఆస్తులను ఇతర శాఖలు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నా... ఉన్నతాధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.10 కోట్ల సబ్ప్లాన్ నిధులు 2013లో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ సబ్ప్లాన్ ద్వారా జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖకు రూ.10 కోట్లు కేటాయించింది. ఆ నిధులను విద్యార్థుల భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడే విధంగా నగరంలో హాస్టల్ భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. ఇవి నగర పరిధిలో కళాశాలలకు అందుబాటులో ఉంటే బాగుంటుందని అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. కాకతీయ యూనివర్సిటీ, హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ అధికారులతో సంప్రదింపులు జరిపి ఆర్ట్స్ కాలేజీ వెనుక స్థలం, కేయూ క్యాంపస్ , పలివేల్పుల, యాదవనగర్లో మొత్తం నాలుగు హాస్టళ్లు నిర్మించాలని నిర్ణయించారు. రెండేళ్ల వ్యవధిలో ఈ హస్టళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. నిర్మాణం పూర్తి చేసుకుని దాదాపు రెండేళ్లు గడుస్తున్నా.. వీటిలో ఏ ఒక్కటి కూడా దళిత సంక్షమ శాఖ ఆధీనంలో లేవు. ఎక్కడివక్కడ ఇతర ఇతర శాఖలు ఆక్రమించుకున్నాయి. భవనాలపై పేచీ.. పలివేల్పుల హాస్టల్ భవనం రెసిడెన్షియల్ స్కూల్ విభాగానికి అప్పగించారు. కేయూలో ఉన్న హాస్టల్ ప్రారంభానికి అక్కడి అధికారులు ఒప్పుకోలేదు. తమ క్యాంపస్లో మరో శాఖకు చెందిన హాస్టల్ ఉండడానికి ససేమిరా అంటున్నారు. నిర్మాణం పూర్తయిన భవనాన్ని తమకు అప్పగిస్తే యూనివర్సిటీ అవరాలకు ఉపయోగించుకుంటామని చెబుతున్నారు. హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో ఉన్న భవనం పరిస్థితి ఇంచుమించు ఇదే. యాదవనగర్లో నిర్మించిన హాస్టల్ భవనం అప్పగింత విషయంలో కాంట్రాక్టర్, దళిత సంక్షేమ శాఖకు మధ్య వివాదం నెలకొంది. ఏళ్లు గడిచినా ఈ వివాదం పరిష్కారం కాకపోవడంతో కాంట్రాక్టర్ కిరికిరితో అధికారులకు అప్పగించలేదు. నిర్లక్ష్యం.. దళిత సంక్షేమ శాఖ ఒక్కో హస్టల్ నిర్మాణానికి దాదాపు రెండు కోట్ల రూపాయలకు పైగానే ఖర్చు చేసింది. నాలుగు హాస్టళ్లకు కలిసి దాదాపు రూ.10 కోట్లు ఖర్చయింది. లెక్కాపత్రం లేకుండా నోటి మాటలతో భవన నిర్మాణ పనులు ప్రారంభించడంతో ప్రస్తుతం కేయూ క్యాంపస్, ఆర్ట్స్ కాలేజీ భవనాల స్వాధీనం చిక్కుముడుల్లో పడింది. పలివేల్పుల హాస్టల్ భవనం ఇప్పటికే చేజారిపోయింది. కాంట్రాక్టరుతో ఉన్న వివాదం సమసిపోతే యాదవనగర్ హస్టల్ భవనం ఒక్కటే దళిత సంక్షేమ శాఖ స్వాధీనం చేసుకునే స్థితిలో ఉంది. రెండేళ్లపాటు భవనాల నిర్మాణం పూర్తయినా వాటిని స్వాధీనం చేసుకోవడంలో దళిత సంక్షేమశాఖ ఉన్నతాధికారులు నిర్లక్ష్య వైఖరి అవలంబించినట్లు తెలుస్తోంది. కేయూ, ఆర్ట్స్ కాలేజీ యాజమాన్యాలతో తలెత్తిన సమస్యను పరిష్కరించేందుకు ఎటువంటి ప్రయత్నం చేయలేదు. కనీసం ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి సకాలంలో తీసుకెళ్లలేదు. దీంతో కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన భవనాలు నిరూపయోగంగా మారాయి. నూతన కలెక్టరేట్ నిర్మాణం దృష్ట్యా కలెక్టరేట్లో కొన్ని విభాగాలను సమీప ఆర్ట్స్ కాలేజీలో నిరుపయోగంగా ఉన్న దళిత సంక్షేమ శాఖ హాస్టల్ భవనంలోకి మార్చేందుకు పరిగణనలోకి తీసుకుంటున్నారు. సామగ్రికి బూజు జిల్లాలో సుమారు 15వరకు ఎస్సీ కాలేజీ హాస్టళ్లు ఉన్నాయి. వాటిలో మొత్తం మూడు వేల మంది వరకు విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ భోజనం వండి పెట్టేందుకు ప్రభుత్వం వంట సామగ్రి కొనుగోలు చేయించింది. లక్షల విలువైన సామగ్రిని నెలలు గడుస్తున్నా అధికారులు హాస్టళ్లకు పంపిణీ చేయలేదు. దీంతో హాస్టల్ వార్డెన్లు, వర్కర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఉద్దేశపూర్వకంగా సామగ్రి పంపిణీ చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో డీడీ అంకం శంకర్ మాట్లాడుతూ సామగ్రి నాణ్యతను పరిశీలించాల్సి ఉందని.. ఈ మేరకు ఐటీఐ అధికారులను పిలిపించాలని ప్రయత్నిస్తున్నామన్నారు. పరిశీలన పూర్తికాగానే పంపిణీ చేస్తామని చెప్పారు. -
నా జోలికొస్తే అంతే..
దళిత సంక్షేమ శాఖలో వివాదాస్పద వార్డెన్ విజిలెన్స్ విచారణలో రూ.3 లక్షల అవినీతి ఎస్ఎంఎస్, ఫోన్లలో బెదిరింపులు ఎనిమిదేళ్ల సర్వీసులో మూడు సస్పెన్షన్లు తోటి ఉద్యోగులు, ఉన్నతాధికారులకు వేధింపులు పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు హన్మకొండ : జనగామ డివిజన్లో 2005లో ఆ వార్డెన్ విధుల్లో చేరినప్పటి పని తీరు బాగా లేకపోవడం.. వివాదాస్పదంగా వ్యవహరించడంతో పరకాల ప్రాంతానికి బదిలీ అయ్యారు. తన హాస్టల్లో విద్యార్థులు పదుల సంఖ్యలో ఉంటే రిజిస్టర్లో వందల సంఖ్యలో చూపించి నిధులు డ్రా చేశారు. దీంతో విజిలెన్స్ అధికారులు విచారణ చేసి రూ.3 లక్షలు అవినీతి జరిగినట్లు తేల్చారు. ప్రాథమిక చర్యల్లో భాగం గా ఈ వార్డెన్ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ములుగు డివిజన్లో పోస్టింగ్ ఇవ్వగా.. ఇక్కడా విద్యార్థుల సంఖ్య అధికంగా చూపడంతో మరోసారి సస్పెండయ్యారు. ఆ తర్వాత జనగామ డివిజన్లో విధుల్లో చేరారు. ఈసారి తన వద్ద పని చేసే కింది స్థాయి ఉద్యోగులను వేతనాలు ఇవ్వకుండా వేధిం పులకు గురి చేయడంతో.. విసిగిపోయిన ఉద్యోగులు చివరకు అధికారులకు ఫిర్యాదు చేసి పంచాయతీ పెట్టారు. అడ్డుచెబితే అంతే సంగతులు జనగామ డివిజన్లో విధుల్లో చేరిన తరువాత అవినీతి వ్యవహారం ఎప్పటిలాగే మొదలైంది. అడ్డుకున్న పర్యవేక్షకుల కు ఈ వార్డెన్ తన ప్రతాపం చూపెట్టడంతో.. జనగామ పర్యవేక్షకుడు నెలరోజులకు పైగా సెలవులో వెళ్లారు. ఆయన స్థానంలో ఇన్చార్జీగా వచ్చిన అధికారికి ఇదేతీరుగా చేదు అనుభవం ఎదురైంది. మరో సందర్భంలో హాస్టల్ పర్యవేక్షణకు వచ్చిన ఓ అధికారి.. ఈ వార్డెన్ అక్రమాలు గుర్తించి సరుకులు సీజ్ చేసి తాళం వేశాడు. దీంతో శివాలెత్తిన వివాదాస్పద వార్డె న్ సదరు పర్యవేక్షకుడిని నానా మాటలు అనడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు తనకు వ్యతిరేకంగా నివేదికలు ఇస్తున్నావంటూ పర్యవేక్షకుని ఇంటికెళ్లి కుటుంబ సభ్యుల ఎదుట నానాయాగి చేసింది. సదరు వార్డెన్ అక్రమా లు తారాస్థాయికి చేరడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు డ్రాయింగ్ పవర్ వార్డెన్కు తొలగించి పర్యవేక్షకుడిని ఇచ్చారు. ఇక అప్పటి నుం చి జిల్లా అధికారికి, పర్యవేక్షకుడికి ఆ మహిళా వార్డెన్ నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. నిత్యం తీవ్ర పదజాలంతో దూషిస్తూ ఎస్ఎంఎస్లు పంపడం నిత్యకృత్యంగా మారింది. ఠాణాలో ఫిర్యాదు దళిత సంక్షేమశాఖలో ఈ లేడీ డాన్ బాధితులు పెరగడంతో ఉద్యోగులు అంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇటీవల సుబేదారి ఎస్సై స్వయంగా కలెక్టరేట్లోని శాఖ కార్యాలయానికి వచ్చి విచారణ చేశారు. సదరు వార్డెన్ వేధింపులు భరించలేక పోతున్నామంటూ ఉద్యోగులు, అధికారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. దళిత సంక్షేమ శాఖలో ఆ వార్డెన్ అంటే సాటి వార్డెన్లకు, ఉన్నతాధికారులకు హడల్. ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (వార్డెన్) హెచ్చరికలు వింటే బేజారు కావాల్సిందే. తన ఎనిమిదేళ్ల కెరీర్లో నాలుగు బదిలీలు.. మూడు సస్పెన్షన్లు ఉన్నా ఖాతరు లేదు. కిందిస్థారుు ఉద్యోగుల నుంచి జిల్లాస్థారుు అధికారుల వరకు అందరినీ టార్గెట్ చేసి వేధింపులు, బెదిరింపులకు గురి చేస్తోంది. ఈ వార్డెన్పై కలెక్టర్తోపాటు ఆ శాఖ రాష్ట్ర కమిషనర్కూ ఫిర్యాదులు అందాయి. - సాక్షి, హన్మకొండ