breaking news
dalit protests
-
కోదాడ: రాజేష్ అంత్యక్రియలకు ఒప్పుకున్న దళిత సంఘాలు
కోదాడలో దళిత యువకుడు రాజేష్ మృతదేహంతో కుటుంబ సభ్యులు, దళిత సంఘాల చేపట్టిన ధర్నా ముగిసింది. రాజేష్ది లాకప్ డెత్ అని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందేనని.. అతని కుటుంబానికి న్యాయం జరిగేవరకు అంత్యక్రియలు నిర్వహించబోమని తెగేసి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే పోలీస్ ఉన్నతాధికారుల హామీతో గురువారం ఉదయం వాళ్లు శాంతించి ఆందోళన విరమించారు.స్థానిక మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పనిచేసే చడపంగు నరేష్ కొంతమంది లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అదే పేరుతో ఉన్న ఇతరుల బ్యాంకు ఖాతాల్లో వేయించి సొమ్ము చేసుకున్నాడు. దీనిపై కొందరు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు నరేష్తో పాటు మరికొందరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. విచారణలో భాగంగా చిలుకూరుకు చెందిన కె. రాజేష్ పేరుతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కును కోదాడకు చెందిన కె.(కర్ల) రాజేష్కు ఇచ్చి అతని అకౌంట్ ద్వారా డబ్బులు విత్డ్రా చేసినట్లు నరేష్ చెప్పాడు. దీంతో.. చిలుకూరు పోలీసులు ఈనెల 9న రాజేష్ను అరెస్ట్ చేసి 10న రిమాండ్ విధించడంతో హుజూర్నగర్ సబ్ జైలుకు తరలించారు. 14వ తేదీ రాత్రి రాజేష్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో చికిత్స నిమిత్తం హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చిలుకూరు పోలీసులను ఎస్కార్ట్ ఇచ్చి హైదరాబాద్లోని ఉస్మానియాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 16న రాజేష్ మృతిచెందాడు. 17న పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. చిలుకూరు పోలీసులు కొట్టడం వల్లే రాజేష్ మృతిచెందాడని బంధువులు ఆరోపిస్తూ న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు చేసేది లేదని స్పష్టం చేశారు. రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు జరిపేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం కోదాడలోని కల్లుగడ్డ బజార్లో రాజేష్ ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచి ధర్నా నిర్వహించారు. రాజేష్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, ఆ కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, మృతికి కారణమైన చిలుకూరు పోలీసులపై చర్య తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు.హైకోర్టులో విచారణ వాయిదామరోపక్క రాజేష్ మృతికి కారణమైన చిలుకూరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని దున్న అంబేద్కర్ మంగళవారం హైకోర్టులో రిట్ పిటిషన్ వేయగా.. హైకోర్టు విచారణ బుధవారానికి వాయిదా వేసింది. బుధవారం సాయంత్రం మరోసారి విచారణ చేసి కేసును 15 రోజులపాటు వాయిదా వేసింది. ఈలోపు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించుకోవచ్చని చెప్పింది. -
మిస్టర్ దళిత్.. మీసం మెలేస్తోన్న యువత
గాంధీనగర్ : గుజరాత్లో తమపై వరుసగా జరుగుతోన్న దాడులను గర్హిస్తూ దళిత యువత వినూత్న నిరసనలు చేపట్టింది. ‘దళితులు మీసం మెలితిప్పరాద’న్న పాటిదార్(పటేల్), రాజ్పుత్(రాజపుత్ర) కులస్తుల హెచ్చరికలను సవాలు చేస్తూ సామూహికంగా మీసం మెలేస్తూ, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. గాంధీనగర్ జిల్లా లింబోదరాలో మొదలైన నిరసన క్రమంగా విస్తరించింది. అసలేం జరిగింది? : కలోల్ తాలూకా లింబోదర గ్రామంలో కృనాల్ మహేరియా(30) అనే న్యాయశాస్త్ర విద్యార్థి.. రాజ్పుత్ కులస్తుల ముందు మీసం మెలేశాడన్న కారణంగా దాడికి గురయ్యాడు. తీవ్రగాయాలపాలైన బాధితుడు కృణాల్.. గత ఆదివారం కలోల్ పోలీస్ స్టేషన్కు వెళ్లి రాజ్పుత్ యువకులపై ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు కూడా నమోదైంది. ఈ విషయంలో కక్ష పెంచుకున్న రాజ్పుత్ యువకులు.. కృనాల్ సోదరుడు దిగంత్ మహేరియా(17)పై మంగళవారం(అక్టోబర్ 3) సాయంత్రం దాడి చేశారు. ముసుగులు ధరించి బైక్ వచ్చి, దిగంత్ వీపుపై కత్తితో గాట్లుపెట్టారు. అంతకు ముందే ఆనంద్ జిల్లా భద్రనియా గ్రామంలో పాటిదార్(పటేల్) కులానికి చెందిన మహిళలు గర్భా నృత్యాలు ఆడుతుండగా.. అటుకేసి చూస్తూ మీసం మెలేశాడన్న కారణంగా జయేశ్ సోలంకి(21) అనే దళిత యువకుడిని పాటీదార్ యువకులు చితకబాదారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయేశ్ ప్రాణాలు కోల్పోయాడు. మీసం మెలివేసినంత మాత్రనికే తమపై అగ్రవర్ణాలు దాడిచేయడాన్ని దళితులు గర్హిస్తున్నారు. మిస్టర్ దళిత్ : ఏ మీసం మెలేసినందుకు తమపై అగ్రకులాలు దాడి చేశాయో.. అదే మీసం మెలేస్తూ దళితులు నిరసనకు దిగారు. ‘మిస్టర్ దళిత్’ ట్యాగ్తో మీసం మెలేస్తూ ఫొటోలను, ‘ఎన్ని దాడులు చేసినా.. మీసం మెలేస్తూనే ఉంటాం..’ అనే సందేశాలను పోస్టు చేస్తున్నారు. అకారణంగా తమవారిపై దాడిచేసినవారిని అరెస్టు చేయాలంటూ దళిత కుటుంబాలు పోలీసులను డిమాండ్ చేశాయి. దాడులకు సంబంధించి ఆయా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. -
'ఆదినారాయణ రెడ్డిని బర్తరఫ్ చేయాలి’


