-
పెరిగిన వంట గ్యాస్ ధర
సాక్షి, న్యూఢిల్లీ: వంట గ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. ఈ ఏడాదిలో రెండవసారి వినియోగదారులపై మళ్లీ వంటగ్యాస్ భారం పడింది. 14.2 కిలోల ఎల్పీజీ సబ్సిడీ సిలిండర్ ధరపై నామమాత్రంగా రూ. 25పైసలు, సబ్సిడీ లేని సిలిండర్ ధర రూ.5 చొప్పున పెరిగింది. సవరించిన ధరలు ఏప్రిల్ 1వ తేదీనుంచి అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసిఎల్) ఒక ప్రకటన జారీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరగడంతోపాటు, కరెన్సీ మారకపు రేటు ఒడిదుడుకుల కారణంగా వంట గ్యాస్ సిలిండర్ ధరలు ప్రభావితమవుతున్నాయి. హైదరాబాద్లో నాన్ సబ్సిడీ సిలిండర్ ధర రూ.762.35గా ఉంది. డిల్లీలో రూ.706. 50గా ఉంది. గత మూడు నెలలు (నవంబరునుంచి ఫిబ్రవరి దాకా) తగ్గుముఖం పట్టిన సిలిండర్ ధరలు మార్చి 1 తేదీన పెరుగుదలను నమోదు చేయగా, మళ్లీ ఏప్రిల్ నెలలో పెరిగాయి. మార్చి నెలలో సబ్సిడీ సిలిండర్ ధరను రూ.2.08, నాన్ సబ్సిడీ సిలిండర్పై రూ.42.50 పెంచిన సంగతి తెలిసిందే. అలాగే ఏవియేషన్ టర్బైన్ గ్యాస్(ఏటీఎఫ్ ఫ్యూయెల్) భారీగా పెంచింది. -
పేలిన సిలిండర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని కుషాయిగూడ ప్రాంతంలో ఓ ఇంట్లో శుక్రవారం ఉదయం జరిగిన పేలుడు కలకలం రేపింది. మొదట ఈ పేలుడికి కారణం తెలియక ఆందోళన చెందినా.. తర్వాత సిలిండర్ గ్యాస్ వల్లే పేలుడు జరిగిందని ప్రాథమిక ఆధారాల ద్వారా తెలిసింది. ఈ ఘటనలో ఆ ఇంటి యజమానితోపాటు మరొకరు చనిపోగా.. యజమాని భార్యకు తీవ్రగాయాలయ్యాయి. సిలిండర్ గ్యాస్ కారణంగా మంటలు ఎగిసిపడటంతో ఆమె తీవ్రమైన గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. అప్పుడప్పుడే నగరం నిద్రలేస్తున్న సమయంలో కాప్రాలో జరిగిన ఈ పేలుడు స్థానికంగా భయాందోళనలు సృష్టించింది. పేలుడు ధాటికి ఆ ఇంటి మొదటి అంతస్తు పూర్తిగా ధ్వంసమైంది. ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడిపోయాయి. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. ఇంటి శకలాలు తాకి రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి చనిపోయాడు. రోడ్డుపై వెళ్తున్న పలువురికి గాయాలయ్యాయి. ఎదురుగా, పక్కన ఇళ్లు కూడా పాక్షికంగా ధ్వంసమయ్యాయి. పక్కనున్న లైఫ్ స్ప్రింగ్ ఆసుపత్రితోపాటు సమీపంలోని ఇళ్లలో వస్తువులు చిందరవందరగా పడిపోయాయి. అసలేం జరిగింది! పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రాజస్తాన్ నుంచి వచ్చిన మోహన్ చందూలాల్ చౌదరి నగరంలో పాన్బ్రోకర్ వ్యాపారం చేస్తూ కాప్రాలో సొంతిల్లు కట్టుకున్నారు. ఆయనతోపాటు భార్య లీల, కుమారుడు గోవింద్ బాబు, కుమార్తె నిఖితలు మొదటి అంతస్తులో ఉంటుండగా.. పైన, కింద అంతస్తులను అద్దెకిచ్చారు. గురువారం రాత్రి తలుపులు మూసుకుని అంతా పడకగదిలో నిద్రకు ఉపక్రమించారు. సిలిండర్కు ఉండే రెగ్యులేటర్ ఆఫ్ చేయకపోవడంతో గ్యాస్ పైప్కు ఉన్న రంధ్రాల నుంచి గ్యాస్ లీకైంది. నిద్రలో ఉన్న కుటుంబసభ్యులు ఈ విషయం గమనించలేదు. శుక్రవారం ఉదయం నిద్ర లేచిన చందూలాల్ 7.10 గంటల సమయంలో వంటింట్లోకి వెళ్లారు. గ్యాస్ వాసన రావడంతో.. ఏం జరిగిందో చూద్దామని లైట్ స్విచ్ వేయడమే ఆయన చేసిన పాపమైంది. అప్పటికే గ్యాస్ ఇల్లంతా వ్యాపించి ఉండటంతో స్విచ్ ఆన్ చెయ్యగానే వచ్చిన స్పార్క్తో భారీ పేలు డు సంభవించింది. ఈ ధాటికి ఆ ఇంటి గోడలు, కిటికీలు, తలుపులూ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇంట్లోంచి రోడ్డుపైకి ఎగిరిపడి.. మంటల ప్రభావంతో కాలినగాయాలైన చందూలాల్ పేలుడు ధాటికి మొదటి అంతస్తు నుంచి ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఈ గ్యాస్ మంట తాకిడి భూమి నుంచి కొంత ఎత్తులోనే పని చేసింది. గదికి పక్కనే ఉన్న బెడ్రూంలోకీ గ్యాస్ వ్యాపించడంతో మంటలంటుకున్నాయి. దీంతో బెడ్పై పడుకున్న లీలకు కాలినగాయాలయ్యాయి. మంటల నుంచి తప్పించుకోలేక.. ఆమె అరుచుకుంటూ పక్కింటిలోకి వెళ్లి కుప్పకూలింది. ఇంటి హాల్లో పడుకున్న చందూలాల్ పిల్లలు గోవింద్బాబు, నిఖితలకు స్వల్ప గాయాలయ్యాయి. 50%వరకు కాలిన గాయాలైన లీలను, రోడ్డుపై పడ్డ చందూలాల్ను, వీరి పిల్లలను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ చందూలాల్ చనిపోయారు. ఏ పాపం తెలియని వారు కూడా.. మొదటి అంతస్తు నుంచి ఎగిరిపడిన సిమెంట్ పెళ్లలు రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి ప్రాణం తీశాయి. స్థానికంగా సెలూన్ నిర్వహించే ఎలగందుల రవి (32) దుకాణం తెరిచేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ఈ సమయంలోనే గాల్లో ఎగురుతూ వచ్చిన సిమెంట్ పెళ్ల తగలడంతో తలకు తీవ్రగాయమై రవి అక్కడికక్కడే చనిపోయాడు. పాఠశాలకు తండ్రితో కలిసి రోడ్డుపై వెళ్తున్న యశస్వి అనే బాలుడికి శిథిలాలు తగిలి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న రాచకొండ సీపీ మహేశ్ భగవత్, జాయింట్ సీపీ సుధీర్బాబు, మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ, కుషాయిగూడ ఏసీపీ శివకుమార్లు హూటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. సిలిండర్ గ్యాస్ పేలుడు కారణంగానే దుర్ఘటన జరిగిందని నిర్ణయించారు. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మేయర్ రామ్మోహన్, డిప్యూటీ మేయర్ ఫసియొద్దీన్ తదితరులు ఘటనాస్థలాన్ని సందర్శించారు. ఈ ఘటనలో లీక్ అయిన సిలిండర్తోపాటు దాని పక్కనే ఉన్న సగం వరకు నిండి ఉన్న సిలిండర్లు అలాగే ఉన్నాయి. ఇవి పేలుంటే తీవ్రత మరింత ఎక్కువగా ఉండేదని భావిస్తున్నారు. కేవలం గ్యాస్ లీకైనందున దీన్ని కెమికల్ ఎక్స్ప్లోజర్గానే భావిస్తున్నారు. చెల్లాచెదురైన జీవితాలు రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబం మరోసారి పెద్దదిక్కును కోల్పోయింది. బొమ్మల రామారం మండలం నానినేనిపల్లికి చెందిన ఎలగందుల సత్తయ్య, పద్మ దంపతులకు రవి (33), ఇద్దరు కుమార్తెలు. బతుకు దెరువు కోసం 20ఏళ్ల క్రితం కాప్రాకు వలస వచ్చిందీ కుటుంబం. ఇటీవలే తండ్రి సత్తయ్య మరణించాడు. అప్పటి నుంచి ఏఎస్రావు నగర్లో మంగలి దుకాణం నిర్వహిస్తున్న రవి ఆ కుటుంబానికి పెద్దదిక్కయ్యాడు. తండ్రి సంపాదించిన ఇల్లు అమ్మి ఇద్దరు చెల్లెళ్ల పెళ్లిళ్లు చేశాడు. స్థానికంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకుని తల్లి, భార్యతో ఉంటున్నాడు. దుకాణంలో రోజంతా పని చేసినా రూ.500 కూడా రావడం లేదని తన మిత్రులతో వాపోయేవాడు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బైక్పై షాప్కు బయలుదేరిన రవికి చందూలాల్ ఇంట్లో పేలుడు యమపాశంగా మారింది. ఈ పేలుడు ధాటికి ఇంటి గోడల శిథిలాలు ఎగిరొచ్చి అటుగా వెళ్తున్న రవి తలకు బలంగా తగిలాయి. దీంతో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలిసి భార్య మాధవి, తల్లి పద్మ అక్కడికక్కడే కుప్ప కూలారు. తమకు అండగా ఉండాల్సినవాడు ఇక తిరిగిరాడని తెలిసి వారు విలపించిన తీరు అక్కడకు వచ్చిన వారిని కన్నీరు పెట్టించింది. -
గ్యాస్ పేలుడు ఘటన.. చికిత్స పొందుతూ మహిళ మృతి
హైదరాబాద్: గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ వృద్ధురాలు శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ నెల 7న ఎల్బీనగర్ భరత్నగర్, ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చిన్నారిసహా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వీరిలో తీవ్రంగా గాయపడిన సాలమ్మ అనే వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతిచెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement