breaking news
culture centre
-
ప్రభాస్ సాహో హీరోయిన్ ఎంత సింపుల్ గా ఉందొ చూడండి
-
NMACC: నీతా అంబానీ అద్భుతమైన డ్యాన్స్, మీరూ ఫిదా అవ్వాల్సిందే!
సాక్షి: ముంబై: రిలయన్స్ అధినేత ముఖేశ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ఎన్ఎంఏసీసీ’ (నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్) ఘనంగా లాంచ్ అయింది. ఈసందర్బంగా స్వయంగా డాన్సర్ అయిన నీతా అంబానీ నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. NMACC ప్రారంభోత్సవ వీడియోలు , ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆరేళ్ల వయస్సులో తన భరతనాట్య ప్రయాణాన్ని ప్రారంభించిన నీతా అంబానీ ఈ గ్రాండ్ లాంచ్ కోసం ప్రత్యేకంగా కొరియోగ్రఫీ చేసిన 'ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్: సివిలైజేషన్ టు నేషన్'లో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. బ్రైట్ లెహంగాలో ‘రఘుపతి రాఘవ రాజా రామ్’ అద్భుత నృత్యం ఆహూతులను ఆకట్టుకుంది. NMACC అధికారిక ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోను షేర్ చేశారు. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన ఈ కల్చరల్ సెంటర్ ఆరంభోత్సవానికి పలు వ్యాపార, క్రీడా ప్రముఖులు, బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. ముఖ్యంగా షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, దీపికా పదుకొణె, రణవీర్ సింగ్, ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ , జిగి హడిద్ వంటి స్టార్లతోపాటు బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్ర, గుర్నానీ, అలాగే ప్రముఖ క్రీడాకారులు సచిన్ టెండూల్కర్, యూవీ, బుమ్రా, టెన్సిస్ స్టార్ సానియా మీర్జా కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం విశేషం. View this post on Instagram A post shared by Nita Mukesh Ambani Cultural Centre (@nmacc.india) -
సంస్కారం నేర్పబడును
ఇక్కడ డ్రైవింగ్ నేర్పబడును.. క్రీడాకారులకు శిక్షణ ఇవ్వబడును.. కాంపిటీషన్ ఎగ్జామ్స్కు ఉచిత కోచింగ్.. ఇలాంటి ప్రకటనలు తరచూ చూస్తుంటాం.. కానీ సంస్కారం నేర్పబడును.. అని ఎక్కడా కనిపించడం కాదు కదా.. వినిపించి కూడా ఉండదు. ప్రతి ఒక్కరికీ చదువు - సంస్కారం ఎంతో అవసరమనేది తెలిసిందే. ప్రస్తుతం ర్యాంకులు, గ్రేడ్లంటూ విద్యా సంస్థలు బట్టీ చదువులకే ప్రాధాన్యత ఇస్తున్నాయే కాని.. సభ్యత, సంస్కారం నేర్పడం ఎప్పుడో మరిచిపోయాయనే విమర్శలు ఉన్నాయి. ఒక్క మొక్క కూడా నాటకుండానే చుట్టూ పచ్చదనం కోరుకోవడం ఎంత తప్పో.. పిల్లలకు సంస్కారం నేర్పకుండా వారి నుంచి గౌరవ, మర్యాదలు ఆశించడం కూడా అంతే తప్పు అంటారు మన వీర బలవంతప్ప. అందుకే ఆయన సంస్కారం నేర్పబడును అంటూ ముందుకొచ్చారు. నేడు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రత్యేక కథనం. సాక్షి, కర్నూల్ : పెద్ద పెద్ద చదువులు అభ్యసించి, ఉన్నత స్థానంలో విధులు నిర్వర్తిస్తున్నా.. సభ్యత, సంస్కారం లేకపోతే ప్రయోజనం లేదంటారు పెద్దలు. పెద్దలను గౌరవించడం, సంప్రదాయాలకు విలువ ఇస్తేనే సమాజం బాగుపడుతుందనేది అక్షర సత్యం. నేటి సమాజంలో కొంత మంది యువతలో సభ్యత, సంస్కారం, సంప్రదాయాలు లేవని పెద్దలు బాధపడుతున్నారు. రోజు రోజుకు సంస్కారం, సంప్రదాయాలు పాటించే వారు తగ్గిపోతున్నారని ఆవేదన చెందుతున్నారు కాని నేర్పిద్దామని ఆలోచించడం లేదు. ఇలాంటి తరుణంలో ఆస్పరి మండలంలో ముత్తుకూరు గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు అటు వైపు ఒక అడుగు వేశారు. విద్యార్థులకు సభ్యత – సంస్కారం నేర్పించేందుకు నడుం బిగించారు. ఈ మేరకు సొంతంగా రూ.6 లక్షలు ఖర్చు పెట్టి ఆస్పరి సమీపంలోని రామతీర్థం క్షేత్రంలో సంస్కార శిక్షణ కేంద్రం నిర్మించారు. ఇక్కడ 6వ తరగతి నుంచి నుంచి 10వ తరగతి విద్యార్థులకు పాఠశాల సెలవు రోజుల్లో సంస్కారంపై శిక్షణ ఇవ్వడంతో పాటు, భగవద్గీత, యోగాసనాలు, ఇతిహస పురాణాలు, నీతి, భక్తి శతకాల పద్యాలు నేర్పేందుకు ఏర్పాట్లు చేశారు. ఎవరు ఎటు పోతే నాకేందుకు అనుకునే వారెందరో ఉన్న ఈ రోజుల్లో భవిష్యత్ తరాలు వారికి మంచి నేర్పేందుకు వీర బలవంతంప్ప ముందుకు రావడం హర్షనీయమని స్థానికులు కొని యాడుతున్నారు. సంస్కార శిక్షణ కేంద్రం ఆదివారం ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా వీర బలవంతప్ప రచించిన శ్రీమానవ శతకం పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. భవిష్యత్ తరాలకు మంచిని నేర్పాలి సభ్యత, సంస్కారం, సంప్రదాయాల గురించి భవిష్యత్ తరాలు తెలుసుకోవాలని ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశా. నా వంతుగా కొంత మందికైనా మంచి విషయాలు తెలపాలనే ప్రయత్నం ఇది. చిన్నప్పటి నుంచి పిల్లలు మంచి మార్గంలో నడవాలంటే తల్లిదండ్రులు ఇలాంటివి నేర్పించాలి. అప్పుడే యువత చెడు మార్గం పట్టదు. సంస్కారంతో పాటు ఆరోగ్యం బాగుండాలంటే యోగాసనాలు వేయాలి. ఇతిహస పురాణాలు తెలుసుకోవాలి. అందరూ భక్తి మార్గంలో నడవాలన్నదే నా ధ్యేయం. – వీర బలవంతప్ప, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు