-
ఉప్పల్ కష్టాల్: అడుగడుగునా ట్రాఫికర్.. నలుదిక్కులా దిగ్బంధనం
మీరెప్పుడైనా ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి వాహనంపై వెళ్లారా? అయితే.. అక్కడి ట్రాఫిక్తో నరకం అనుభవించే ఉంటారు! వాహనాల ప్రవాహంతో ఆ కూడలి దిగ్బంధనంలో చిక్కుకున్న దృశ్యం మీకు కనిపించే ఉంటుంది. మరోసారి ఈ దారి నుంచి రావొద్దురా బాబు అని అనుకునే ఉంటారు. ఇసుక పోస్తే రాలనంత వాహనాల సమూహం. అక్కడి పరిసరాలన్నీ నిత్యం ట్రాఫిక్ పద్మవ్యూహం. ఓ వైపు సికింద్రాబాద్, హబ్సిగూడల నుంచి.. మరోవైపు ఎల్బీనగర్ నుంచి.. ఇంకోవైపు కోఠి, ఎంజీబీఎస్, అఫ్జల్గంజ్, రామంతాపూర్ ప్రాంతాల నుంచి వచ్చీ వెళ్లే వాహనాలతో ఉప్పల్ కూడలితో పాటు దాని సమీప ప్రాంతాలు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో అటు పాదచారులు, ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ లోపం, స్కైవే నిర్మాణంలో జాప్యం తదితర కారణాలతో వాహన దిగ్బంధనం కొనసాగుతోంది. భారీ ప్రాజెక్టులు, ఆకాశాన్నంటే వంతెనలు, ఆకాశ మార్గాల్లో నడకదారులు.. ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నా ఇక్కడి ట్రాఫిక్ వ్యవస్థ తీరు మాత్రం మారడం లేదు. – ఉప్పల్ పెరిగిన వ్యక్తిగత వాహనాలు.. కోవిడ్ తర్వాత వ్యక్తిగత వాహనాలు పెరగడంతోనూ ట్రాఫిక్ సమస్యకు ఆజ్యం పోసినట్లవుతోంది. ఈస్ట్ సిటి అభివృద్థిలో బాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఉప్పల్ వైపు ఐటీ కారిడార్లను తీసుకు రావడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఉప్పల్ వద్ద జెన్ప్యాక్, అరీనా టవర్స్ వంటి సాఫ్ట్వేర్ సంస్థలు, డీఎస్ఎల్ మాల్ లాంటి అనేక కంపెనీలో అడుగుపెట్టాయి. మరిన్ని సంస్థలు వచ్చి చేరడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. వీటికి మార్గం సుగమం కావాలంటే మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థ అవసరం. పదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన యూటర్న్ సిస్టంపై నెట్టుకుంటూ వస్తున్నారు. ఉప్పల్ చౌరస్తా మీదుగా నిమిషానికి సుమారు 600 నుంచి 700 వాహనాలు వెళ్తున్నట్లు అంచనా. బస్టాప్తో పరేషాన్.. హబ్సిగూడ, రామంతాపూర్ల నుంచి ఉప్పల్కు వచ్చే దారిలో బస్స్టాప్ ఉంది. సిటీ బస్సులతో పాటు వివిధ డిపోలకు చెందిన బస్సులు ఇక్కడ నుంచి వెళ్తుంటాయి. యాదాద్రి, వరంగల్కు వెళ్లడానికి ఈ బస్సుస్టాపే ప్రధానమైంది. దీంతో పాటు నాలుగు అడుగుల దూరంలోనే ఉప్పల్ చౌరస్తా వద్ద సిగ్నల్ ఉండటంతో ట్రాఫిక్ సమస్య నిత్యకృత్యమవుతోంది. స్కైవే ఎఫెక్ట్తో.. ఉప్పల్ చౌరస్తా నుంచి సికింద్రాబాద్ వెళ్లే మార్గం కూడా నిత్యం రద్దీగా ఉంటుంది. రామంతాపూర్ వైపు స్కైవే నిర్మాణం జరుగుతుండగా భారీ వాహనాలను దారి మళ్లించడంతో రద్దీ రెట్టింపైంది. ఉప్పల్ చౌరస్తా నుంచి కేవీ– 2 స్కూల్ నుంచి వెళ్లాల్సిన భారీ వాహనాలను ఏక్ మినార్ మజీద్, ఉప్పల్ క్రికెట్ స్టేడియం మీదుగా రామంతాపూర్కు మళ్లించారు. బస్సు పక్కన బస్సుతో.. హబ్సిగూడ నుంచి ఉప్పల్ వైపు వచ్చే దారిలో వరంగల్ వైపు వెళ్లే బస్సులతో పాటు మిగతావాటికీ ఇక్కడే బస్టాప్. వరంగల్, యాదాద్రి వెళ్లడానికి ఇదే ప్రధాన బస్టాప్గా మారడంతో ఇమ్లిబన్, జూబ్లీ నుంచి వచ్చే వాహనాలు రోడ్డుపైనే నిలబెట్టి ప్రయాణికులను ఎక్కించుకుంటారు. దీంతో బస్సు వెనక బస్సు కాకుండా బసు పక్కన బస్సులను నిలపడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. దీనికి తోడు యాదాద్రికి వెళ్లడానికి ఉప్పల్ చౌరస్తా ప్రధాన రహదారి కావడం, ఎల్బీనగర్ వైపు పెద్ద పెద్ద ఫంక్షన్ హాళ్లకు వెళ్లడానికి ఇదే ప్రధాన మార్గం. వీఐపీల ప్రయాణాలు అధికంగా ఉండటంతోనూ ట్రాఫిక్ నిత్యం నరకంగా మారుతోంది. అదనంగా లోకల్ బస్సు డిపోలకు సంబందించిన బస్సులు చేంజ్ ఓవర్ కూడా ఇక్కడే ఉండటంతో మరింత జటిలమవుతోంది. బోడుప్పల్ నుంచి ఉప్పల్ చౌరస్తా వరకు అడ్డదిడ్డం ఉప్పల్ బస్డిపో నుంచి ఉప్పల్ చౌరస్తా, ఎల్బీనగర్ బస్టాప్ వరకు దాదాపు 2 కి.మీ రోడ్లు అడ్డదిడ్డంగా ఉండటంతో ట్రాఫిక్ సమస్య జటిలమవుతోంది. స్కైవే నిర్మాణం జరుగుతోందని ఈ రోడ్డును ఏమీ చేయలేమని జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. నత్తనడకన ఫ్లై ఓవర్ పనులు.. ఉప్పల్ ఎల్బీనగర్ బస్స్టాప్ నుంచి నాగోల్ చౌరస్తా వరకు దాదాపు 2 కి.మీ దూరం. ఉప్పల్ చౌరస్తాలోనే నాలుగు జిల్లాల ఆర్టీసీ బస్సులకు ఇక్కడే స్టాప్. దీంతో పాటు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లడానికి బస్స్టాప్ కూడా ఇక్కడే ఉండటం, రోడ్డుకు ఇరువైపులా మెట్రో స్టేషన్లు.. ఇలా దారి పొడవునా ట్రాఫిక్ ఇబ్బందులే. వీటికి తోడు నాగోల్ బ్రిడ్జి దాటిన తర్వాత నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు అనుకున్నంత వేగంగా జరగటంలేదు. ఉప్పల్ ప్రయాణమంటేనే హడల్ రోడ్లు సరిగా లేవు. స్కైవే నిర్మాణం ప్రారంభమై నాలుగేళ్లు గడిచినా ఇంకా కొలిక్కి రారేదు. మరోపక్క స్కైవాక్ వంతెన కూడా పూర్తి కాలేదు. రోడ్డు దాటాలన్నా హడలెత్తిస్తోంది. ఎప్పుడే ప్రమాదం వచ్చి పడుతుందోననే భయం వెంటాడుతోంది. – సతీష్, ప్రైవేటు ఉద్యోగి, ఉప్పల్ ఆదర్శ్నగర్ ట్రాఫిక్తో పాటు కాలుష్యం.. ఉప్పల్ జంక్షన్కు వస్తున్నామంటనే ట్రాఫిక్ భయం పట్టుకుంటుంది. ముఖ్యంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ లేనందువల్లే అభద్రతా భావం ఏర్పడుతోంది. పెరుగుతున్న ట్రాఫిక్కు అనుగుణంగా చర్యలు చేపట్టాలి. కానీ అలా జరగడం లేదు. ట్రాఫిక్ పోలీసుల దృష్టి కేవలం చలానాలపైనే ఉంటోంది. – ప్రదీప్ కుమార్, ఉప్పల్ -
నూతన బైపాస్లో డేంజర్ బెల్స్
ఒంగోలు క్రైం: ఒంగోలు నగరానికి తూర్పు వైపున నిర్మించిన నూతన బైపాస్కు ఇరువైపులా ఉన్న మలుపు కూడళ్లు ప్రాణసంకటంగా మారాయి. నూతన బైపాస్ దక్షిణం వైపు, ఉత్తరం వైపు అప్రోచ్ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నందున వాహనదారులు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిగా, అసౌకర్యంగా మారింది. దీంతో అటు ఉత్తరం వైపు, ఇటు దక్షిణం వైపు తరచూ ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఇంత జరుగుతున్నా జాతీయ రహదారి అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పనులు చేస్తుండటంతో వాహనదారులు ఇక్కట్ల పాలవుతున్నారు. నూతన బైపాస్ కూడళ్లలో, మలుపుల వద్ద ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకపోవటంతో కార్లు, ద్విచక్ర వాహనాలు రోడ్డుపై ఉంచిన సిమెంట్ దిమ్మెలను ఢీకొంటున్నాయి. ఇటీవలి కాలంలో దక్షిణ బైపాస్లో ఐదు ప్రమాదాలు సంభవించాయి. ఇక ఉత్తర బైపాస్లో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇప్పటికైనా రోడ్డు మార్జిన్లలో ప్రమాద సూచికలు, రేడియం స్లిక్కర్లు ఏర్పాటు చేస్తారో లేదో వేచి చూడాల్సిందే. -
డెత్ క్రాస్..!
అద్దంకి: చిన్నకొత్తపల్లి క్రాస్ రోడ్.. ఈ పేరు వింటేనే వాహనదారులు హడలెత్తిపోతున్నారు. అక్కడేదో శక్తి వచ్చేపోయే వాహనాలను ప్రమాదాలకు గురి చేస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఇది ఎంత వరకు నిజమో ఎవరూ చెప్పలేరు కానీ ఇదే ప్రదేశంలో లెక్కకు మించి ప్రమాదాలు సంభవించడం తీవ్ర భయాందోళనలకు గురి చేస్తుంది. అట్లాంటిక్ సముద్ర జలాల్లో ఉన్న బర్ముడా ట్రయాంగిల్ అనే ప్రదేశానికి వెళ్లిన నౌకలు.. విమానాలు మాయం అవుతున్నట్లు.. ఈ ప్రదేశానికి ఇది బర్ముడా ట్రాయంగిల్ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అద్దంకి –నార్కెట్పల్లి రాష్ట్రీయ రహదారి పరిధిలో ఉన్న చిన్నకొత్తల్లి గ్రామానికి వెళ్లే మార్గం వద్ద క్రాస్ రోడ్ ఉంది. ఇది అత్యంత ప్రమాదకర ప్రదేశంగా మారింది. గత ఐదారు సంవత్సరాలుగా 50 మందికి పైగా ఇక్కడ జరిగిన వాహన ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. 150 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ప్రమాదాల నివారణ కోసం పోలీసులు తీసుకున్న స్టాప్ బోర్డులు, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఎలాంటి ఫలితం ఇవ్వకపోవడంతో స్పీడ్ బ్రేకర్లు వేయాలని పోలీసులు నిర్ణయించారు. తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో అటు పోలీసులకు, ఇటు వాహనదారులకు కంటిమీద కునుకు ఉండటంలేదు. ఏడాదికి పది ప్రాణాలు 2017 జనవరి నుంచి 2018 జనవరి వరకు ఇక్కడ జరిగిన ఐదు ప్రమాదాల్లో 10 మంది మృత్యువాత పడ్డారు. 20 మంది వికలాంగులుగా మారారు. ♦ 2017 ఫిబ్రవరి 7న బైక్ను బస్సు ఢీకొనడంతో ఏల్చూరుకు చెందిన వ్యక్తి మృతిచెందాడు. ఒకరికి గాయాలయ్యాయి. ♦ ఏప్రిల్ 4న మారెళ్ల గ్రామానికి చెందిన అల్లాబక్షు, అతని భార్య కరిమూన్, ప్రియాంక అనే చిన్నారి మోటారు బైకుపై మలుపు తిరుగుతుండగా వేగంగా వస్తున్న, కారు ఢీ కొట్డడంతో, ప్రియాంక మృతిచెందింది. కరిమూన్కు తీవ్ర గాయాలయ్యాయి. ఇదే నెలలో 29న మోటారు బైకును కారు ఢీ కొట్టినప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ♦ మే 12న మహారాష్ట్రకు చెందిన తుఫాన్ వాహనంలో ఉన్న 12 మందికి గాయాలయ్యాయి. డిసెంబరు 16వ తేదీన మోటారు బైకుపై వెళ్తున్న బల్లికురవ మండలం కూకట్లపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు ఇంజినీర్లను, మరో వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టడంతో ఒక యువ ఇంజినీరు అక్కడికక్కడే మృతచెందాడు. మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. గతంలో ఇదే క్రాస్ రోడ్ వద్ద బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులపై లారీ వెళ్లడంతో నలుగురు మరణించారు. ఈ క్రమంలో పోలీసులు ఈ క్రాస్ రోడ్ను డేంజర్ జోన్గా ప్రకటించారు. శాశ్వత పష్కారం? ఈ క్రాస్ రోడ్ వద్ద స్పీడు బ్రేకర్లు వేసినా, స్టాప్ బోర్డులు పెట్టినా ప్రయోజనం ఉండదని, ఆవి ప్రమాదాలను మరింత పెంచుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ ఏదో ఒక దైవ సంబంధిత విగ్రహం ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. దీనివల్ల భక్తుల రద్దీ పెరిగి వాహనాల వేగం తగ్గుతుందంటున్నారు. ఆ దిశగా అధికారులు, గ్రామానికి చెందిన పెద్దలు ఆలోచించాలని కోరుతున్నారు. గతంలో ఆధ్యాత్మిక ప్రాంతాల ఏర్పాటు.. గతంలో అత్యంత ప్రమాదకర ప్రాంతాలుగా ఉన్న వల్లూరమ్మ దేవస్థానం ప్రాంతం, జాతీయ రహదారిపైన బొప్పూడి వద్ద గుడుల ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలను పూర్తిగా నివారించగలిగారని చెబుతున్నారు. చిన్నకొత్తపల్లి క్రాస్ రోడ్డు వద్ద కూడా దేవాలయం నిర్మిస్తే నిత్యం జన సంచారంతోపాటు, ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించవచ్చు. లౌడ్ స్పీకర్ల వలన దాదపు రెండు వైపులా ఆర కిలోమీటరు మేర భక్తిపాటలు వినిపిస్తుంటాయి కాబట్టి నిద్రమత్తులో ఉన్న డ్రైవర్లు కూడా మేల్కొనే అవకాశం ఉంటుంది. దుకాణాలు ఏర్పడటం వల్ల ఆక్కడ కాసేపు ఆగి విశ్రాంతి తీసుకొనే అవకాశం కలుగుతుంది. దైవ కృప సంగతి అటుంచితే దీనిని రద్దీగా ఉండే ప్రాదేశంగా మార్చవచ్చనేది నిపుణుల అభిప్రాయం. -
గాలిలో దీపంలా చిన్నారుల ప్రాణాలు
భీమవరం(పెళ్లకూరు): ఒకటి కాదు...రెండు కాదు...వరుసగా రోడ్డు ప్రమాదాలే...నిత్యం ఏదోకచోట విద్యార్థులు ప్రయాణించే బస్సులే ప్రమాదాలకు గురవుతున్నాయి. ముక్కుపచ్చలారరని చిన్నారులతో పాటు కళాశాలకెళ్లే విద్యార్థులు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడంతో పాటు తీవ్రంగా గాయపడుతున్నారు. అన్నింటికంటే ప్రధానంగా ప్రమాదం జరిగిన సమయంలో చిన్నారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. చిన్నారులు ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి. తల్లిదండ్రులు ప్రాణపదంగా భావించే తమ పిల్లలను ఎంతో ఆనందంగా స్కూల్కు పంపిస్తుంటే ప్రమాదాలు పెను విషాదాన్ని మిగుల్చుతున్నాయి. తాజాగా 71వ జాతీయ రహదారిపై భీమవరం క్రాస్రోడ్డు వద్ద శనివారం సాయంత్రం స్కూల్ వ్యాన్ను లారీ ఢీకొనడంతో 19 మంది విద్యార్థులకు గాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని చిల్లకూరు వడ్డిపాళెం గ్రామంలోని ప్రైవేటు పాఠశాల బస్సు విద్యార్థులను భీమవరం, నెలబల్లి గ్రామాలకు తీసుకెళుతుంది. క్రాస్ రోడ్డుకు వ్యాన్ తిరిగే సమయంలో నాయుడుపేట నుంచి శ్రీకాళహస్తి వైపు వెళ్లే లారీ స్కూల్ వ్యాన్ను వెనుక భాగంలో ఢీకొట్టింది. దీంతో వ్యాన్ రోడ్డు పక్కనే ఉన్న పంటకాలువలోకి బోల్తా పడింది. ఈ సంఘటనలో వ్యానులో ఉన్న 19మంది విద్యార్థులు, ఉపాధ్యాయురాలు ఆషాకు గాయాలయ్యాయి. వ్యాన్లో వున్న రాంధీప్, కౌశిక్లకు తలపైన, సంధీప్, రేష్మ, భరత్కుమార్లకు కాలు, చెయ్యి విరిగాయి. వాసు, వెంకటేష్, రూప, పురంధరీశ్వరి, గణేష్, ఉదయ్కుమార్, పవన్, ప్రవళిక తదితరులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై శివశంకరావు తన సిబ్బందితో కలిసి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. గాయపడిన విద్యార్థులను 108 వాహనంలో శ్రీకాళహస్తి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. తలపై గాయాలైన ఇద్దరు విద్యార్థులకు మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. నాయుడుపేట సీఐ రత్తయ్య, ఎస్సై ఆంజనేయరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. స్కూల్వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని, డ్రైవర్కి గతంలో పలుమార్లు హెచ్చరించామని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్వ్యాన్ ప్రమాదానికి గురైన సమాచారం తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన విద్యార్థులకు వెంటనే వైద్య సేవలు చేయించేలా చర్యలు చేపట్టారు. తమ బిడ్డలకు ఏమైందో నంటూ ఆసుపత్రి ప్రాంగణం తల్లిదండ్రుల రోదనలతో మిన్నంటాయి. ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆయిల్ ట్యాంకర్ ఢీకొని సీపీఎం నాయకుడి మృతి
నెల్లూరు, సిటీ: ఆరుుల్ ట్యాంకర్ ఢీకొని సీపీఎం సీనియర్ నాయకుడు అరిగెల నారాయణ(75) మృతిచెందిన సంఘటన గొలగమూడి క్రాస్ రోడ్డు వద్ద గురువారం చోటుచేసుకుంది. బంధువుల ఇంట్లో ఓ కార్యక్రమానికి హాజరయ్యేం దుకు నారాయణతో పాటు ఆయన సోదరుడు రాధాకృష్ణతో కలిసి స్కూటర్పై నెల్లూరు నుంచి కనుపర్తిపాడు బయలుదేరారు. హైవే ఎక్కేందుకు గొలగమూడి క్రాస్ వద్ద రోడ్డు దాటుతుండగా తిరుపతి నుంచి విజయవాడ వైపు వేగంగా వెళుతున్న ఆరుుల్ ట్యాంకర్ ఢీకొట్టింది. నారాయణ తలకు బలమైన గాయంకావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఆయన సోదరుడు రాధాకృష్ణకు తీవ్ర గాయూలుకావడంతో చికిత్స నిమిత్తం సమీపంలోని సింహపురి ఆస్పత్రికి తరలించారు. రాధాకృష్ణ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. రాధాకృష్ణ బండి నడుపుతుండగా నారాయణ వెనుక కూర్చున్నారు. ప్రమాదానికి కారణమైన ట్యాంకర్ డ్రైవర్ పరారయ్యూడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ట్యాంకర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదో నగర సీఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
T20 WC: సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లకు ఛాన్స్
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
- టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ డెసిషన్.. ఎగ్ ఫ్రీజింగ్ వీడియో వైరల్
- ‘కాపు ఉద్యమాన్ని అణిచివేసింది మీరు కాదా?’
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
Advertisement