-
ఫైబర్ నెట్ కుంభకోణం సూత్రధారి బాబే
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ టెండర్ల కేటాయింపులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారని సీఐడీ.. న్యాయస్థానానికి నివేదించింది. పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించి మరీ అస్మదీయుల కంపెనీ టెరాసాఫ్ట్కు టెండర్లు కట్టబెట్టారని ఆధారాలతో సహా వెల్లడించింది. ఇప్పటికే స్కిల్ స్కామ్ కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబును ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో అరెస్ట్ చేసేందుకు పీటీ వారెంట్ను ఆమోదించాలని న్యాయస్థానాన్ని కోరింది. ఫైబర్ నెట్ కుంభకోణంలో చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు పీటీ వారెంట్ జారీచేయాలన్న సీఐడీ పిటిషన్ను విజయవాడ ఏసీబీ న్యాయస్థానం బుధవారం విచారించింది. ఈ కేసులో తమ వాదనలు వినాలని చంద్రబాబు న్యాయవాదులు దాఖలు చేసిన ‘రైట్ టు ఆడియెన్స్’ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. అనంతరం సీఐడీ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కట్టబెట్టారని చెప్పారు. ఏపీ ఈ–గవర్నెన్స్ కౌన్సిల్లో డైరెక్టర్గా ఉన్న వేమూరి హరికృష్ణను ఈ ప్రాజెక్ట్ టెండర్ల టెక్నికల్ ఎవాల్యూయేషన్ కమిటీలో సభ్యుడిగా చేర్చారన్నారు. ఆయన కంపెనీ టెరాసాఫ్ట్ టెండర్లలో పాల్గొంటుండగా ఆయన్నే కమిటీలో చేర్చడం పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టానికి విరుద్ధమని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. బ్లాక్ లిస్టు్టలో ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీకి టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పిం చడం ద్వారా అవినీతికి దారులు తెరిచారని తెలిపారు. అంతేగాక నిబంధనలకు విరుద్ధంగా టెండర్ల గడువును వారం రోజులు పొడిగించారని చెప్పారు. మనీ ల్యాండరింగ్కు పాల్పడుతూ 10 బ్యాంకు ఖాతాల్లోకి రూ.114 కోట్ల అక్రమ నిధులు మళ్లించినట్టు సీఐడీ దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. ఫాస్ట్లేన్ కంపెనీ, టెరాసాఫ్ట్, ఫ్యూచర్ స్పేస్, అభిజ్ఞ, నీలిమ, నెట్ ఇండియా, కోఫెల్, నెట్టాప్స్ అనే కంపెనీలకు చెందిన మొత్తం 10 ఖాతాలకు అక్రమంగా రూ.114 కోట్లు మళ్లించిన వివరాలను కోర్టుకు సమర్పించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిని దుర్వినియోగం చేస్తూ కుంభకోణంలో కీలకపాత్ర పోషించడం ద్వారా ప్రజాధనం దోపిడీకి పాల్పడ్డారని చెప్పారు. ఈ కేసులో మరింత సమగ్ర దర్యాప్తునకు ఆయన్ని అరెస్ట్చేయాల్సిన అవసరం ఉన్నందున పీటీ వారెంట్ను ఆమోదించాలని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద కోరారు. ఈ కేసులో వాదనలు పూర్తికావడంతో న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. గురువారం తీర్పు వెలువరించనుంది. -
Sep 29, 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
LIVE : Chandrababu And Nara Lokesh Bail Petition Hearings and Ground updates 7:07 PM, సెప్టెంబర్ 29, 2023 కోర్టులపై వక్రభాష్యాలకు సమాధానాలు ఇవిగో ► కోర్టులకు ఎదురవుతున్న సవాళ్లకు ఇటీవల ఇండియా టుడే కాంక్లేవ్లో సూటిగా, స్పష్టంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ DY చంద్రచూడ్ సమాధానాలు ప్రశ్న : కోర్టుల స్వతంత్రత గురించి మీరేమంటారు? తీర్పు ఇచ్చే సమయంలో మీపై ఒత్తిడులుంటాయా? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ DY చంద్రచూడ్ : ► ఒక జడ్జిగా నాకు 23ఏళ్లుగా అనుభవం ఉంది. ► ఒక కేసులో ఇలా ఉండండి, ఇలా తీర్పు చెప్పండి అని ఏ ఒక్కరు మాపై ఒత్తిడి తీసుకురారు, తీసుకురాలేదు. ► ప్రతీ రోజూ సుప్రీంకోర్టులో ఉదయాన్నే బెంచ్ మీదకు వెళ్లకముందు జడ్జిలందరూ కలిసి కాఫీ తాగుతాం. ► కానీ ఏ ఒక్కరు ఇంకొకరి కేసు గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చించబోరు ► ఇక హైకోర్టులోనయితే ఈ సున్నితమైన పరిస్థితి మరింత ఎక్కువ. ► కొన్ని సార్లు సింగిల్ బెంచ్లో జడ్జి ఇచ్చిన తీర్పును అదే హైకోర్టులోని మరో ఇద్దరు జడ్జిలు సమీక్షించాల్సి ఉంటుంది. ► ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరి విషయంలో మరొకరు జోక్యం చేసుకోరు. ► ఎవరి కేసునయితే నేను సమీక్షించబోతున్నానో.. అదే జడ్జితో కలిసి భోజనం చేయవలిసిన పరిస్థితి ఉంటుంది. ► భోజనం షేర్ చేసుకుంటాం. అయితే కేసులను మాత్రం షేర్ చేసుకోం. ► అది మేం తీసుకున్న శిక్షణలో భాగం. ► అంతెందుకు మాపై ప్రభుత్వంలో ఉన్న ఏ వ్యవస్థ నుంచి ఒత్తిడి రాదు. ► ఇది నా ఒక్కరి గురించి చెప్పడం లేదు. మొత్తం దేశంలోని న్యాయవ్యవస్థ గురించి చెబుతున్నాను. 7:02 PM, సెప్టెంబర్ 29, 2023 లోకేష్ ఎక్కడ.? ► ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో A14 లోకేష్ ► 41ఏ కింద నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీకి వెళ్లిన CID బృందం ► ఇప్పటివరకు బస చేసిన ITC మౌర్య హోటల్లో రూమ్ ఖాళీ ► మీటింగ్లు పెట్టే గల్లా జయదేవ్ కంపెనీ గెస్ట్ హౌజ్లో లేడు ► రెగ్యులర్గా వాడే కారు మార్చేశాడు ► CID కంటికి కనిపించకుండా లోకేష్ దాగుడు మూతలు 6:32 PM, సెప్టెంబర్ 29, 2023 అభివృద్ధి తరలిపోతోందన్న బ్రాహ్మణి.. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పగలరా? ► బ్రాహ్మణి చేసిన వ్యాఖ్యలకు YSRCP సూటి ప్రశ్నలు 1) బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాసచౌదరి ఇంట్లో కేంద్ర సంస్థ ఆదాయంపన్ను అధికారులు ఫిబ్రవరి 13 ,2020న సోదాలు జరిపినపుడు రూ.2 వేల కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించి నల్లధన వివరాలు లభ్యమయ్యాయని ఫిబ్రవరి 17, 2020న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ప్రెస్ నోట్ విడుదల చేశారు. దీన్ని మీరు అంగీకరించారా? లేదా? 2) అమరావతి కాంట్రాక్టర్ల నుంచి రూ.600 కోట్ల సచివాలయం బిల్డింగ్ లో రూ.119 కోట్లు (20%) ముడుపులు బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి కి ఇచ్చానని షాపుర్జీ పల్లంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ చెప్పాడు. అవును, నిజమే ఆ డబ్బు బాబుకు ఇచ్చాను అని అని శ్రీనివాస్ చౌదరీ ఒప్పుకున్నాడు అని ఆగష్టు 4 న కేంద్ర సంస్థ ఇన్కంటాక్స్ సంస్థ చంద్రబాబుకు నోటీస్ ఇచ్చింది. దీనిమీద మీ మాటేంటీ? 3) రూ.371 కోట్ల స్కిల్ కుంభకోణంలో కేంద్ర సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నలుగురిని అరెస్ట్ చేసింది. మరి మీరు అంతా సవ్యంగా జరిగిందని ఎలా అంటారు? 4) CID నోటీసులు అందుకున్న వెంటనే పెండ్యాల శ్రీనివాసచౌదరి, మనోజ్ వాసుదేవ్ , యోగి విదేశాలకు ఎందుకు పారిపోయారు? 6:23 PM, సెప్టెంబర్ 29, 2023 పళ్లాలను గరిటలతో కొట్టండి : బ్రాహ్మణి ► చంద్రబాబు అరెస్ట్ అయినందుకు నిరసన తెలపాలంటూ పిలుపు ► బ్రాహ్మణి తీరును తప్పుబట్టిన మంత్రి అంబటి ► నాడు పళ్లాలను గరిటలతో కొట్టిన కాపులను దెబ్బతీశారు, ఇప్పుడు విధి ప్రకారం మీ వంతొచ్చిందంటూ చురకలు విధి విచిత్రమైనది ! కాపు ఉద్యమంలో పళ్ళాలు కొట్టినవారిని మక్కెలిరగొట్టి బొక్కలో వేసావ్ ! అవినీతి కేసులో బొక్కలో పడి పళ్ళాలు కొట్టమంటున్నావ్ ! వారే వాహ్ !@ncbn@naralokesh @iTDP_Official — Ambati Rambabu (@AmbatiRambabu) September 29, 2023 5:23 PM, సెప్టెంబర్ 29, 2023 భువనేశ్వరీకి నోటీసులు ఇవ్వాలి : కోర్టును కోరిన లూథ్రా ► రింగ్ రోడ్ అక్రమ అలైన్మెంట్ కేసులో చంద్రబాబు తరపున సిద్ధార్ధ్ లూద్రా వాదనలు ► భువనేశ్వరి అకౌంట్ నుంచే లింగమనేనికి అద్దె చెల్లింపులు జరిగాయి ► చంద్రబాబు, భువనేశ్వరికి 91 నోటీసు ఇవ్వొచ్చు కదా అని కోరిన లూథ్రా ► బాబు బెయిల్ నిరాకరణకు లింగమనేని వ్యవహారానికి లింకు పెట్టొద్దు లూథ్రా 5:20 PM, సెప్టెంబర్ 29, 2023 లోకేష్ ఢిల్లీలో ఎందుకు ఉంటున్నారంటే.? : అచ్చెన్నాయుడు ► ఎన్నికేసులు వేసినా లోకేష్ భయపడడు ► సుప్రీంకోర్టు లాయర్లకు బ్రీఫింగ్ ఇవ్వడానికే లోకేష్ ఢిల్లీలో ఉంటున్నాడు ► లాయర్లతో చర్చించాలి కాబట్టే లోకేష్ పాదయాత్ర వాయిదా 5:00 PM, సెప్టెంబర్ 29, 2023 తప్పులు చేసిన చంద్రబాబు జైలుకు వెళ్లారు : రఘువీరారెడ్డి ► శ్రీసత్యసాయి జిల్లా: చంద్రబాబు అరెస్ట్పై సీనియర్ నేత N.రఘువీరారెడ్డి వ్యాఖ్యలు ► స్వీయ తప్పిదాల వల్లే చంద్రబాబు జైలుకు వెళ్లారు ► తాను తవ్విన గోతిలో తనే పడ్డారు చంద్రబాబు ► ప్రత్యేక హోదా కోసం 2017లో గుంటూరులో సభ నిర్వహిస్తే చెప్పులు, రాళ్లు వేయించారు ► టీడీపీ దీక్షల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.. చంద్రబాబు విడుదల కాలేరు ► న్యాయస్థానంలో తప్పు చేయలేదని చంద్రబాబు నిరూపించుకోవాలి 4:25 PM, సెప్టెంబర్ 29, 2023 హైకోర్టు : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసు అక్టోబర్ 3కు వాయిదా ► చంద్రబాబు ముందస్తు బెయిల్పై హైకోర్టులో విచారణ వచ్చే నెల 3కు వాయిదా ► CID తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు ► రింగ్ రోడ్ మార్గంలో లింగమనేనికి భారీగా భూములు ► లింగమనేని భూముల పక్కనుంచి వెళ్లేలా అలైన్మెంట్ మార్పులు ► అలైన్మెంట్ మార్పు తర్వాత లింగమనేని భూముల విలువ భారీగా పెరిగింది ► లింగమనేని, హెరిటేజ్ సంస్థలు భూఅక్రమాలకు పాల్పడ్డాయి ► చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ లూథ్రా వాదనలు 3:25 PM, సెప్టెంబర్ 29, 2023 స్టేబిఎన్ ఇన్నాళ్లకు జైలుకెళ్లాడు : బొత్స ► విజయనగరంలో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ ► స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టిడిపి నేతలు కలిసి దోచుకుతిన్నారు ► ఇప్పడు సెక్షన్లు వర్తించవని అంటున్నారు తప్ప.. అవినీతి జరగలేదని చెప్పడం లేదు ► చంద్రబాబు ఇప్పటివరకు స్టే లు తెచ్చుకొని బ్రతికాడు ► స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో కూడా అలాగే తప్పించుకోవడానికి ప్రయత్నించాడు ► జైలుకు వెళ్లిన తర్వాత సానుభూతి పొందాలని చూస్తున్నాడు ► శాసనసభలో చర్చకు అవకాశం ఉన్నప్పటికీ టిడిపి ఎమ్మెల్యేలు చర్చించకుండా పారిపోయారు ► అవినీతి జరిగిందని అసెంబ్లీలో ఉన్న టిడిపి ఎమ్మెల్యేలకి కూడా తెలుసు 3:15 PM, సెప్టెంబర్ 29, 2023 తెలుగుసేనలో అయోమయం ► రాజమండ్రిలో జైలుకు పరిమితమైన చంద్రబాబు ► ఢిల్లీ నుంచి కదలనంటున్న లోకేష్ బాబు ► రాజమండ్రి నుంచి హైదరాబాద్కు భువనేశ్వరి ► రాజమండ్రి లోకేష్ క్యాంప్లో నారా బ్రాహ్మణి ► రెండు రోజుల హడావిడి తర్వాత కనిపించని బాలకృష్ణ ► జైలు ముందు పొత్తు ప్రకటన చేసి సైలంట్ అయిన పవన్ కళ్యాణ్ 3:10PM, సెప్టెంబర్ 29, 2023 హైకోర్టు : ఫైబర్ గ్రిడ్ కేసులో బాబు, లోకేష్ పిటిషన్లు వాయిదా ► చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ ► కేసు విచారణను అక్టోబర్ 4, 2023, బుధవారానికి వాయిదా వేసిన హైకోర్టు ► ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ను కూడా అక్టోబర్ 4కు వాయిదా వేసిన హైకోర్టు 3:00PM, సెప్టెంబర్ 29, 2023 హైకోర్టు : స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో 4వరకు ఆగండి ► స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో లోకేష్ వేసిన ముందస్తు బెయిల్పై విచారణ ► లోకేష్ను అరెస్ట్ చేసే విషయంలో అక్టోబర్ 4వరకు ఆగాలని హైకోర్టు సూచన ► ముందస్తు బెయిల్ పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులిచ్చిన హైకోర్టు 2:50PM, సెప్టెంబర్ 29, 2023 హైకోర్టు : అమరావతి రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్ కేసు ► చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ జరుపుతున్న హైకోర్టు ► CID తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు 2:40PM, సెప్టెంబర్ 29, 2023 లోకేష్ లోకేషన్ ఎక్కడ? ► ఢిల్లీ: మీడియాకు కంటపడకుండా తిరుగుతున్న లోకేష్ ► కార్లు మారుస్తూ రహస్యంగా మీటింగులు ► నిన్నటి నుంచి గల్లా జయదేవ్ ఇంటికి రాని లోకేష్ ► ఐటీసి మౌర్య నుంచి మరో చోటకు మకాం మార్పు ► జయదేవ్ కంపెనీ గెస్ట్ హౌస్లో ఉన్నారని సమాచారం ► ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హైకోర్ట్ ఎదురుదెబ్బ తగలడంతో న్యాయవాదులతో మంతనాలు ► CID బృందం వస్తుందని తెలిసి ఢిల్లీలో అలర్ట్ 2:30PM, సెప్టెంబర్ 29, 2023 ►లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టులో విచారణ ప్రారంభం ►స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ గ్రిడ్ స్కామ్ కేసుల్లో లోకేష్ బెయిల్ పిటిషన్ 2:15 PM, సెప్టెంబర్ 29, 2023 హైకోర్టు : ఫైబర్ గ్రిడ్ కేసులో బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ► ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు ► హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన బాబు లాయర్లు ► ఫైబర్ నెట్ స్కాంలో A25గా ఉన్న చంద్రబాబు ► A25గా చేరుస్తూ ఏసీబీ కోర్టులో ఇప్పటికే సిఐడి మెమో ► తాజా పరిణామాలతో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు ► అత్యవసరంగా విచారించాలని ఇప్పటికే హైకోర్టును కోరిన లోకేష్ లాయర్లు ► కాసేపట్లో హైకోర్టు బెంచ్ ముందుకు విచారణకు వచ్చే అవకాశం 2:00 PM, సెప్టెంబర్ 29, 2023 ఫైబర్ గ్రిడ్ కేసు గురించి పది పాయింట్లు.. తండ్రీ కొడుకులు ఏం చేశారంటే.? 1. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును 2016 డిసెంబర్ 29న తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు ప్రారంభించారు. రూ.149కే కేబుల్ ప్రసారాలు, 200 చానళ్లతో టీవీ, ఫోన్ సౌకర్యం ఇస్తామని ప్రకటించారు. 2. ఫైబర్నెట్ ప్రాజెక్టును బ్లాక్ లిస్టులో ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీకి కట్టబెట్టారు. రూ.333 కోట్ల బిడ్డింగ్ ముగియటానికి ఒక్క రోజు ముందు టెరాసాఫ్ట్ను బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించారు. దీనిపై అభ్యంతరం తెలిపిన APTS వీసీ సుందర్ను బదిలీ చేశారు. టెండర్ ప్రక్రియ ముగిశాక హరికృష్ణప్రసాద్ను టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్స్ నుంచి డైరెక్టర్గా తొలగించారు. 3. టెరాసాఫ్ట్ సంస్థకు 14 ఏళ్లు డైరెక్టర్ ఎవరంటే హెరిటేజ్ సంస్థల్లో డైరెక్టర్గా పనిచేసిన దేవినేని సీతారామయ్య 4. బహిరంగ మార్కెట్లో అత్యంత నాణ్యమైన సెట్టాప్ బాక్స్ రూ.2,200కే దొరుకుతుండగా చంద్రబాబు సర్కారు మాత్రం రూ.4,400 చొప్పున కొనుగోలు చేసింది. వీటిని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కంపెనీలో ఉత్పత్తి చేసినట్లు వేమూరి అంగీకరించారు. 5. APSFL నుంచి టెరా సాప్ట్కి రూ.284 కోట్లు విడుదల చేశారు. అందులో రూ.117 కోట్లు ఫాస్ట్ లైన్ అనే సంస్థకి ఇచ్చారు. ఆగస్టులో టెండర్లు జరిగితే సెప్టెంబర్లో ఆ కంపెనీ ఏర్పాటైంది. నెట్వర్క్, ఎక్స్వైజెడ్, కాపీ మీడియా లాంటి షెల్ కంపెనీల ద్వారా డబ్బును బదిలీ చేశారు. ఈ డబ్బంతా హరికృష్ణప్రసాద్ కుటుంబ సభ్యులు వేమూరి అభిజ్ఞ, వేమూరి నీలిమ తదితరులకు వెళ్లినట్లు తేలింది. ఈ కంపెనీలన్నింటి చిరునామా, టెరా సాఫ్ట్వేర్ అడ్రస్ ఒక్కటే. 6. ఈ డబ్బంతా పెండ్యాల శ్రీనివాస్ ద్వారా చంద్రబాబు రూటు అయినట్టు గుర్తించారు. దీనికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఇన్కమ్ టాక్స్ కూడా శ్రీనివాస్కు, చంద్రబాబుకు నోటీసులిచ్చింది. 7. హెరిటేజ్తో సంబంధాలున్న వేమూరి హరికృష్ణప్రసాద్కి టెరా సాఫ్ట్తో అనుబంధం ఉంది. ఈవీఎంల దొంగతనం కేసు నమోదైన వ్యక్తికి చెందిన సంస్థకు ఈ ప్రాజెక్టును ఇచ్చారు. టెండర్ల పర్యవేక్షణ కమిటీలో ఆయన్ను సభ్యుడిగా నియమించారు. ఆయనే టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్ సంస్థ డైరెక్టర్గానూ వ్యవహరిస్తున్నాడు. పర్యవేక్షణ కమిటీ సభ్యుడుగా ఉంటూ తన సొంత సంస్థ టెరా సాఫ్ట్కు పనులు ఇచ్చేసుకున్నారు. 8. ఐదేళ్లూ చంద్రబాబు వద్దే పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ ఉండింది. ఆ శాఖ పరిధిలోనిదే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్. నిబంధనల మేరకు సంబంధిత శాఖను నిర్వహిస్తున్న మంత్రి మాత్రమే ఆ శాఖలోని ఫైళ్లపై సంతకం చేయాలి. ఇతర మంత్రులు సంతకం చేయకూడదు. 9. లోకేశ్ మంత్రి కాగానే హరికృష్ణ ప్రసాద్ను 2017 సెప్టెంబర్ 14న APSFLకు సలహాదారుగా నియమించారు. అప్పటి నుంచి టెండర్లలో గోల్ మాల్ పెద్ద ఎత్తున జరిగినట్టు తేలింది. లోకేశ్ వద్ద ఉన్న శాఖలకు, APSFLకు సంబంధం లేదు. అయినా తన తండ్రి శాఖలోని ఫైల్ తెప్పించుకున్న లోకేశ్.. 2017 నవంబర్ 12న బీబీఎన్ఎల్తో ఎంవోయూ ఫైల్పై సంతకం చేశారు 10. కేంద్రం అనుమతి లేకుండా అంచనా వ్యయం రూ.500 కోట్లకుపైగా పెంచేసి వేమూరి సంస్థకు ఖరారు చేశారు. BBNL మార్గదర్శకాలను తుంగలో తొక్కి.. టెండర్ షరతులను సడలించి.. నిబంధనలు ఉల్లంఘించి.. అర్హత లేని టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్కు 11.26 శాతం అధిక ధరలకు పనులు అప్పగించారు. దీనివల్ల అంచనా వ్యయం రూ.907.94 కోట్ల నుంచి రూ.1410 కోట్లకు పెరిగింది. 1:40 PM, సెప్టెంబర్ 29, 2023 లోకేష్ ఇప్పటికైనా బయటకు రావాలి : మంత్రి రోజా ► ఈ 20 రోజుల్లో లోకేష్ ముఠా నానా యాగీ చేసింది ► తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించాలి ► తప్పు చేయక పోతే ముందస్తు బెయిల్కు ఎందుకు దరఖాస్తు చేస్తుకున్నారు? ► యువగళం పాదయాత్ర ఆపేసి ఢిల్లీలో ఎందుకు దాక్కున్నారు? ► ఎన్టీఆర్ కూతురు, మనవరాలిగా భువనేశ్వరి, బ్రాహ్మణిలను అభిమానిస్తాం, ► టిడిపి స్క్రిప్ట్ చదివితే మాత్రం తప్పులు ఎత్తి చూపిస్తాం ► ఎర్ర బుక్లో రాసుకున్నాము, తాట తీస్తాం అన్న లోకేష్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? 1:35PM, సెప్టెంబర్ 29, 2023 కుంభకోణం గురించి మాట్లాడరెందుకు? : సజ్జల రామకృష్ణారెడ్డి ► ఈ 20 రోజుల్లో లోకేష్ ముఠా నానా యాగీ చేసింది ► ప్రజలకు సంబంధించిన సొమ్ము దోపిడీకి గురైంది ► సాక్ష్యాధారాలతో దొరికితే చంద్రబాబును కోర్టు రిమాండ్కు పంపింది ► జరిగిన కుంభకోణంపై వీరంతా మాట్లాడడం లేదు ► దొంగతనం చేసి సానుభూతి కోరుకుంటున్నారు ► మేధావులు అనుకుంటున్న కొందరితో స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు ► చంద్రబాబు అరెస్టును దేశ సమస్యలా చిత్రీకరిస్తున్నారు ► రాష్ట్రపతికి వినతి పత్రం ఇచ్చారు, ఐక్యరాజ్యసమితికి ఇచ్చినా ఆశ్చర్యం లేదు ► మూడేళ్లు దర్యాప్తు చేశాక ఆధారాలతో అరెస్ట్ చేశారు ► స్కిల్ స్కామ్ లో పూర్తి ఆధారాలు ఉన్నాయి ► తమకు సంబంధం లేదని సీమెన్స్ కంపెనీ స్టేట్మెంట్ ఇచ్చింది ► గంటా సుబ్బారావుకు నాలుగు పదవులిచ్చారు ► మొత్తం నాలుగు కేసుల్లో అన్ని ఆధారాలున్నాయి ► డిజైన్ టెక్ ద్వారా కోట్లు కొట్టేశారు 1:25PM, సెప్టెంబర్ 29, 2023 ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చంద్రబాబు మరో బెయిల్ పిటిషన్ ► హైకోర్టులో మరో పిటిషన్ వేసిన చంద్రబాబు నాయుడు ► ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ ► ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టయి రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు 12:55PM, సెప్టెంబర్ 29, 2023 ఇండియా కూటమి వైపు సైకిల్ వెళ్తొందా.? బయటకొస్తున్న అసలు ఎజెండాలు ► చంద్రబాబు అరెస్ట్పై ఇప్పటివరకు తెగ ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్ ► హైదరాబాద్లో ధర్నాలను పోలీసులు నిలిపివేయడంపై టి కాంగ్రెస్ చీఫ్ రేవంత్ ఆగ్రహం ► చంద్రబాబును వెనకేసుకొస్తూ ప్రకటనలు చేస్తోన్న రేవంత్ ► గతంలో చంద్రబాబుతో కలిసి ఓటుకు కోట్లు పంపిణీ చేసి రెడ్ హండెడ్గా దొరికిన రేవంత్ ► తాజాగా చంద్రబాబు కోసం తెగ ఆరాట పడ్డ మోత్కుపల్లి ► బాబును తిట్టిన నోటితోనే ప్రశంసలు కురిపించి తెలుగుదేశం పార్టీనే ఆశ్చర్యపరిచిన మోత్కుపల్లి ► ఇవ్వాళ బెంగళూరుకు వెళ్లిన మోత్కుపల్లి నర్సింహులు ► డీకే శివకుమార్ తో భేటీ అయిన మోత్కుపల్లి నర్సింహులు ► పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అంటోన్న మోత్కుపల్లి ► డీకే శివకుమార్ డైరెక్షన్తోనే చంద్రబాబుకు మోత్కుపల్లి మద్ధతిచ్చారా? 12:45PM, సెప్టెంబర్ 29, 2023 ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో యార్లగడ్డ క్వాష్ పిటిషన్లు ► లోకేష్ యువగళం పాదయాత్రలో రెచ్చిపోయిన యార్లగడ్డ వెంకట్రావు ► తన మనుష్యులతో కలిసి వీరంగం సృష్టించినట్టు యార్లగడ్డపై అభియోగాలు ► గన్నవరం నియోజకవర్గంలోని రంగన్నగూడెం, వీరవల్లి పోలీస్ స్టేషన్లు ముట్టడి ► ఏపీ హైకోర్టును ఆశ్రయించిన యార్లగడ్డ వెంకట్రావు ► మూడు కేసుల్లో క్వాష్ పిటిషన్ వేసిన యార్లగడ్డ ► యార్లగడ్డ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నాగముత్తు 12:25PM, సెప్టెంబర్ 29, 2023 విజయవాడ వేదికగా కురుక్షేత్ర సంగ్రామ శంఖారావాన్ని పూరించిన CM వైఎస్ జగన్ ► ప్రస్తుత సంక్షేమ ప్రభుత్వానికి, గత ప్రభుత్వంలోని స్కాముల నేతలకు మధ్య యుద్ధం ► ఫైబర్ గ్రిడ్ స్కామ్, స్కిల్ స్కామ్, అసైన్డ్ భూముల స్కామ్... ► అమరావతి పేరుతో స్కాములు చేసిన గత నాయకులతో యుద్ధం ► గతంలోనూ ఇదే బడ్జెట్, మారిందల్లా సీఎం ఒక్కడే ► గతంలో ఎందుకు ఈ పథకాలు ఇవ్వలేకపోయారు? ► దోచుకోవడానికి వాళ్లకు అధికారం కావాలి ► దోచుకున్నది పంచుకునేందుకే వాళ్లకు అధికారం కావాలి ► వాళ్లకు మాదిరిగా నాకు గజదొంగల ముఠా తోడుగా లేదు ► వంత పాడేందుకు వాళ్లకున్నట్టు దత్త పుత్రుడు లేడు ► పేదవాడి ప్రభుత్వం నిలబడాలి, పెత్తందారుల ప్రభుత్వం రాకూడదు ► మీ ఇంట్లో మంచి జరిగిందనిపిస్తే నాకు తోడుగా నిలవండి ► ఈ కురుక్షేత్ర యుద్ధంలో నాకు అండగా నిలవండి ► ఓటు వేసే ముందు జరిగిన మంచి గురించి ఆలోచించండి 12:15PM, సెప్టెంబర్ 29, 2023 రాజమండ్రి జైలుకు నారాయణ, చంద్రబాబుతో ములాఖత్ ► 20 రోజులుగా జైల్లో ఉన్నా చంద్రబాబు మనో ధైర్యం కోల్పోలేదు ► ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్కు సంబంధించి లోకేష్పై కేసు పెట్టారు ► ఇన్నర్ రింగ్రోడ్లో నా సొంత భూమి పోయింది, దాని ఖరీదు ఏడు కోట్ల రూపాయలు ► జనసేనతో పొత్తుపై ఉమ్మడి కమిటీ వేస్తాం ► కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మేరకు ముందుకు వెళ్తాం ► అన్ని విషయాలు కోర్టులోనే తేలుతాయి, బాబు జైల్లో ధైర్యంగా ఉన్నారు 12:05PM, సెప్టెంబర్ 29, 2023 ఎక్కడ దాక్కున్నా తప్పుంటే అరెస్ట్ కావాల్సిందే : లోకేష్ ఛాలెంజ్కు పేర్ని నాని కౌంటర్ ► ఢిల్లీకి వచ్చి అరెస్ట్ చేసే దమ్ము CIDకి లేదా ? : లోకేష్ ఛాలెంజ్ ► ఢిల్లీ కాదు.. సప్త సముద్రాల అవతల చెట్టు తొర్రలో దాక్కున్నా తప్పు చేస్తే అరెస్ట్ కావాల్సిందే : పేర్ని నాని నారా లోకేష్ని అరెస్ట్ చేయాలంటే ఢిల్లీలోనే కాదు.. చెట్టు తొర్రలో దాక్కున్నా దర్యాప్తు అధికారులు నిమిషాల్లో అరెస్ట్ చేసి తీసుకురాగలరు. చంద్రబాబు కంటే నువ్వేమీ పోటుగాడివి కాదు కదా @naralokesh..? కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎప్పుడు ముద్దాయిని అరెస్ట్ చేయాలి? అనేది దర్యాప్తు… pic.twitter.com/dLLF8HcNj3 — YSR Congress Party (@YSRCParty) September 28, 2023 12:00PM, సెప్టెంబర్ 29, 2023 పచ్చమీడియాకు ఇంత పక్షపాతమా? : YSRCP ► ఏ కేసులోనయినా ఏ మీడియా అయినా రెండు వర్షన్లను కవర్ చేస్తారు ► కానీ స్కిల్ స్కాంలో పచ్చమీడియా నిజాలు దాచిపెడుతోంది ► మేం అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తే కవర్ చేయలేదు ► టిడిపి వాళ్లు అసత్యాల ప్రజంటేషన్కు మాత్రం ఎల్లో మీడియా పట్టం కట్టింది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం గురించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రజెంటేషన్ రూపంలో క్లియర్గా ప్రభుత్వం చూపించినా.. ఎల్లో మీడియా మాత్రం ప్రసారం చేయలేదు. కేవలం టీడీపీ వాళ్లు చెప్పింది మాత్రమే ప్రజలకి చూపించారు. బాబు అరెస్ట్ తర్వాత ఎల్లో మీడియా పిచ్చి పీక్స్కి చేరిపోయింది. దీన్ని… pic.twitter.com/mimAxmJcXA — YSR Congress Party (@YSRCParty) September 28, 2023 11:40AM, సెప్టెంబర్ 29, 2023 మరో రెండు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన లోకేష్ ►హైకోర్టులో మరో రెండు పిటిషన్లు వేసిన లోకేష్ లాయర్లు ►స్కిల్ డెవలప్మెంట్ స్కాం, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో నిందితుడు లోకేష్ ►ఈ రెండు కేసుల్లో అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి ►అరెస్ట్ చేస్తారు, అత్యవసరంగా విచారించండి : హైకోర్టుకు అభ్యర్థన ►మధ్యాహ్నం తర్వాత బెంచ్ ముందుకు పిటిషన్లు వచ్చే అవకాశం 11:20AM, సెప్టెంబర్ 29, 2023 లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు : హైకోర్టు : BIG BREAKING ►IRR కేసులో నారా లోకేష్కు 41ఏ కింద నోటీసులు ►దర్యాప్తుకు లోకేష్ సహకరించాల్సిందే : హైకోర్టు ►ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్కు నోటీసులు ►కేసు దర్యాప్తుకు లోకేష్ సహకరించాలన్న హైకోర్టు ►కుంభకోణంలో లోకేష్ పాత్రను స్పష్టం చేస్తూ 129 ఆధారాలు సేకరించిన సిట్ ►ముందస్తు బెయిల్ పిటిషన్కు అంగీకరించని న్యాయస్థానం ►దర్యాప్తు అధికారి FIRలో మార్పు చేశారని నివేదించిన అడ్వొకేట్ జనరల్ ►41ఏ నిబంధనలు పూర్తిగా పాటిస్తామని చెప్పిన అడ్వొకేట్ జనరల్ 11:15AM, సెప్టెంబర్ 29, 2023 ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా? ► ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్పై టిడిపికి YSRCP ఏడు ప్రశ్నలు 1. అలైన్మెంట్ ఖరారుకు ముందు లింగమనేని ఎకరాను రూ.8 లక్షలకు విక్రయించారు, అలైన్మెంట్ తర్వాత రూ.36 లక్షల రిజిస్టర్ విలువ చూపించారు. అంటే రిజిస్టర్ విలువే నాలుగున్నర రెట్లకు పైగా పెరిగింది వాస్తవం కాదా? 2. మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతంగా రూ.887.50 కోట్లకు పెరిగింది వాస్తవం కాదా? 3. అమరావతి నిర్మాణం పూర్తయితే సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో ఎకరా విలువ రూ.4 కోట్లకు చేరుతుందని నాడు సీఎం హోదాలో చంద్రబాబే ప్రకటించింది వాస్తవం కాదా? 4. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది వాస్తవం కాదా? 5. అమరావతి నిర్మాణం పూర్తయితే ఇన్నర్ రింగ్ రోడ్డు పక్కనున్న 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా వాస్తవం కాదా? 6. ఆ ప్రకారం మార్కెట్ ధరను బట్టి హెరిటేజ్ఫుడ్స్ 10.4 ఎకరాల మార్కెట్ విలువ రూ.5.20 కోట్ల నుంచి రూ.41.6 కోట్లకు కోట్లు పెరిగిందన్నది వాస్తవం కాదా? 7. ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు.. స్కాం జరగలేదంటారు.. మరి ఇన్నాళ్లు ప్రజలకు రాజధాని కట్టామని ఎందుకు చెప్పారు? చంద్రబాబు సృష్టించిన సంపద అంటే మాయా ప్రపంచమేనా? 11:02AM, సెప్టెంబర్ 29, 2023 41 ఏ కింద లోకేష్కు నోటీసులు: ఏజీ శ్రీరామ్ ►IRR కేసులో నారా లోకేష్కు 41ఏ కింద నోటీసులు ►కోర్టులో వెల్లడించిన అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ ►హైకోర్టులో ఏపీ సీఐడీ తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు ►నోటీసుల కాపీ హైకోర్టుకు అందజేత ► ఇన్నర్ రింగ్రోడ్ కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై కొనసాగుతున్న విచారణ ► లోకేష్ తరపున వాదనలు వినిపించిన దమ్మాలపాటి శ్రీనివాస్ 10:55AM, సెప్టెంబర్ 29, 2023 బటన్ నొక్కడంలో తేడాలు గమనించండి: YSRCP ► జగనన్న బటన్ నొక్కితే సంక్షేమ పథకాల రూపంలో పేద ప్రజల ఖాతాల్లో నగదు జమ ► అదే చంద్రబాబు బటన్ నొక్కితే.. ఫస్ట్ కార్పోరేట్ సంస్ధల ఖాతాల్లోకి నగదు జమ ► మళ్లీ ఆ డబ్బు షెల్ కంపెనీల ద్వారా తిరిగి బాబు జేబులోకే వెళ్తుంది. ► స్కిల్ డెవలప్మెంట్ స్కాం, ఫైబర్ గ్రిడ్ స్కాం, అమరావతి అసైన్డ్ భూమల స్కాం, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కాంలో అంతర్లీనంగా జరిగింది ఇదే..! జగనన్న బటన్ నొక్కితే సంక్షేమ పథకాల రూపంలో పేద ప్రజల ఖాతాల్లో నగదు జమ అవుతుంది. కానీ.. చంద్రబాబు బటన్ నొక్కితే తొలుత కార్పోరేట్ సంస్ధల ఖాతాల్లోకి నగదు జమ అవుతుంది. మళ్లీ ఆ డబ్బు డొల్ల కంపెనీల ద్వారా తిరిగి బాబు జేబులోకే వెళ్తుంది. స్కిల్ డెవలప్మెంట్ స్కాం, ఫైబర్ గ్రిడ్ స్కాం,… pic.twitter.com/mQ8rlC4JfQ — YSR Congress Party (@YSRCParty) September 29, 2023 10:50AM, సెప్టెంబర్ 29, 2023 IRR కేసులో లోకేష్ పిటిషన్పై విచారణ ప్రారంభం ►ఏపీ హైకోర్టులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ప్రారంభం ►లోక్ష్ తరపున వాదనలు వినిపిస్తున్న దమ్మాలపాటి శ్రీనివాస్ ► ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ14గా ఉన్న నారా లోకేష్ ► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణంతో లబ్ధి పొందినట్లు ఏపీ సీఐడీ అభియోగం 10:04AM, సెప్టెంబర్ 29, 2023 కుటుంబ సభ్యుల ములాఖత్ నేడు! ►నేడు చంద్రబాబుతో ములాఖత్ కానున్న కుటుంబసభ్యులు ►రాజమండ్రి జైలులో ఉ.11 గం.కు చంద్రబాబుతో కుటుంబసభ్యుల ములాఖత్ ► సతీమణ భువనేశ్వరి, కోడలు బ్రహ్మణితో పాటు మాజీ మంత్రి నారాయణ కూడా 08:58AM, సెప్టెంబర్ 29, 2023 విధుల్లో చేరిన జైలు సూపరిండెంట్ ►రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరిండెంట్ విధుల్లో చేరిన రాహుల్ ►కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో భార్య మృతి చెందడంతో విధులకు దూరంగా ఉన్న సూపరిండెంట్ రాహుల్ ►జైలు సూపరిండెండెంట్ భార్య అనారోగ్య కారణాలతో సెలవు పెడితే విపరీతార్థాలు తీసిన పచ్చ మీడియా ►పచ్చ మీడియా తీరుపై వెల్లు వెత్తిన విమర్శలు 08:45AM, సెప్టెంబర్ 29, 2023 సుప్రీంలో బాబుకు మరో దెబ్బ! ►సుప్రీం కోర్టులో చంద్రబాబు SLP లిస్టింగ్కే మరింత ఆలస్యం ►అక్టోబర్ 3 కాదు.. 6? ►ఇంతకు ముందు స్పెషల్ లీవ్ పిటిషన్ అక్టోబరు 3కి వాయిదా ►కానీ, అక్టోబర్ 6వ తేదీ.. అదీ లిస్టింగ్కు వచ్చే ఛాన్స్ ► అంటే ఆరోజు.. పిటిషన్ను విచారణకు స్వీకరిస్తారా? అని చెప్పే ఛాన్స్ ► ఒకవేళ విచారణ చేపడితే.. ఏ రోజు విచారణ చేపడతారో ప్రకటిస్తుంది బెంచ్ ►సుప్రీం కోర్టు వెబ్సైట్లో ఈ మేరకు కంప్యూటర్ జనరేటెడ్ ధృవీకరణ 08:33AM, సెప్టెంబర్ 29, 2023 శతవిధాల ప్రయత్నాలు ►చంద్రబాబు బెయిల్ కోసం విస్తృతమైన ప్రయత్నాలు చేస్తున్న టీడీపీ వర్గాలు ►లోకేష్ అరెస్టు అవుతాడని రాజమండ్రిలో వదంతులు ►అరెస్టు అవుతాడనే కారణం తోనే ఢిల్లీ నుంచి రాకుండా జాప్యం చేస్తున్నారంటూ వార్తలు ►ఇవాళ నుంచి ప్రారంభం కావలసిన యువగళం వాయిదా ►సుప్రీంకోర్టులో క్వాష్ ఫలితం తేలిన తర్వాతే రాజమండ్రి కి రానున్న లోకేష్ ►రాజమండ్రి టిడిపి శిబిరంలో నారా బ్రాహ్మణి భువనేశ్వరుని ముందు పెట్టుకుని కార్యక్రమాలు కొనసాగిస్తున్న టీడీపీ శ్రేణులు ►‘‘బాబుతో మేము’’, ‘‘పోస్ట్ కార్డు ఉద్యమం’’ తో పాటు రిలే నిరాహార దీక్షలు ,దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు ►ప్రజల నుంచే కాదు.. టీడీపీ కార్యకర్తల నుంచి కూడా కనిపించని స్పందన 07:10AM, సెప్టెంబర్ 29, 2023 లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ►ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ►నేడు హైకోర్టులో వాదనలు జరిగే అవకాశం ►అమరావతి ఇన్నర్ రింగ్రోడ్ కేసులో ఏ14గా లోకేష్ పేరు చేర్చిన ఏపీ సీఐడీ ► అరెస్ట్ భయంతో.. ఢిల్లీ నుంచే యాంటిసిపేటరీ బెయిల్కు దరఖాస్తు ► బెయిల్ వస్తేనే యువగళం పాదయాత్ర.. లేకుంటే మరిన్ని రోజులు ఢిల్లీలోనే 07:05AM, సెప్టెంబర్ 29, 2023 చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై నేడు విచారణ ►చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ► మధ్యాహ్నం 2.15కి ప్రారంభంకానున్న విచారణ ►ఇప్పటికే వాదనలు పూర్తి చేసిన చంద్రబాబు తరపు న్యాయవాది లూథ్రా ►మరోసారి వాదనలు వినిపించనున్న ఏజీ ►చంద్రబాబు కేసులు..బెయిల్ పిటిషన్లతో టీడీపీ(TDP) శ్రేణుల్లో టెన్షన్ పెరుగుతోంది. 07:00AM, సెప్టెంబర్ 29, 2023 రాజమండ్రి జైల్లో చంద్రబాబు @20 ►స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ►ఏసీబీ కోర్టు విధించిన జ్యూడీషియల్ రిమాండ్ 20వ రోజుకి చేరిక ► సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో అదుపులోకి తీసుకుంది ఏపీ సీఐడీ ► ఏసీబీ కోర్టు రిమాండ్తో ఖైదీ నెంబర్ 7691గా రాజమండ్రి సెంట్రల్ జైలు స్నేహా బ్లాక్లో చంద్రబాబు ► అక్టోబర్ 5వ తేదీ వరకు జైల్లోనే చంద్రబాబు -
ప్రతీ నిబంధననూ మార్గదర్శి ఉల్లంఘించింది
సాక్షి, విజయవాడ: సీఐడీ విచారణపై తప్పుడు కథనాలు రాస్తున్నారని ఏపీ సీఐడీ అడిషనల్ డీజీపీ ఎన్ సంజయ్ పేర్కొన్నారు. మార్గదర్శి పెద్ద స్కాం అని, చాలా నిబంధనలు అతిక్రమించిందని తెలిపారు. మార్గదర్శి మోసాలపై ప్రజలకు నిజాలు తెలియాలని అన్నారు. కోట్ల రూపాయలు కట్టిన బాధితులకు మార్గదర్శి నుంచి వేలల్లో మాత్రమే ముట్టిందన్నారు. మార్గదర్శి మోసాలపై కొన్ని పత్రికలు తప్పుడు కథనాలు రాస్తున్నాయని మండిపడ్డారు. చిట్స్ నిబంధనలను మార్గదర్శి పాటించడం లేదని విమర్శించారు. మార్గదర్శి మోసాలపై ఐటీ, ఈడీలకు సమాచారమిచ్చామని సంజయ్ తెలిపారు. కోటికి పైగా చిట్స్ వేసిన బాధితులు 800 మందికి పైగా ఉన్నారని అన్నారు. సీఐడీ అడిషనల్ డీజీపీ మాట్లాడుతూ.. ‘అన్ని రూల్స్ పాటిస్తున్నామని చెబుతూ మోసం చేస్తున్నారు. ఆక్షన్ జరపకుండా నెలలపాటు పొడిగిస్తున్నారు. 40 శాతం చిట్ గ్రూపుల్లో చందాదారులే లేరు. కంపెనీనే సొంతంగా చిట్స్ను తీసుకుంటుంది. ప్రతి చిట్ గ్రూపులో మోసాలు ‘చెక్ ప్రిపేర్ అయినా లెడ్జర్లో వివరాలు పొందుపరచడం లేదు. చందాదారులను బెదిరిస్తూ చిట్ అమౌంట్ ఇవ్వకుండా వేధిస్తున్నారు. ప్రతి చిట్ గ్రూపులో మోసాలు బయటపడ్డాయి. గోస్ట్ సబ్ స్క్రైబర్స్ పేరుతో కంపెనీనే డబ్బులు తీసుకుంటుంది. కొన్ని ప్రాంతాల్లో మార్గదర్శిపైపోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు నమోదయ్యాయి. కొందరు చిట్ వేయకున్నా వారి పేరుతో చిట్స్ నడుస్తున్నాయి. దీనిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది. అక్రమాలను కవర్ చేసుకుంటూ వార్తలు మార్గదర్శిలో అక్రమాలపై కవర్ చేసుకుంటూ ఈనాడులో రాసుకుంటున్నారు. మార్గదర్శికి అనుకూలంగా.. చిట్ ఫండ్ నిర్వహణలో తప్పులు లేనట్లు సొంత పేపర్లో రాశారు. మేము రాసిందే కరెక్ట్ అన్న ధోరణిలో రామోజీ, శైలజా కిరణ్లు ఉన్నారు. ఈనాడు రాస్తోంది కరెక్ట్ కాదు. అందుకే ప్రజలకు వివరాలు వెల్లడిస్తున్నాం. విచారణకి సహకరించరు.. పైగా రామోజీరావు, శైలజ కిరణ్లను మేము ప్రశ్నించకూడదు అంట, మార్గదర్సి చిట్స్ కార్యాలయాలలో తనిఖీలు చేయకూడదట. సీఐడీ బ్రాంచ్లలో తనిఖీ చేసినప్పుడు మార్గదర్సి రోజువారీ కార్యకలాపాలకి ఆటంకాలు సృష్టిస్తున్నారని తప్పువు వార్తలు రాస్తున్నారు. 3 వేల మందికి ఆ విషయమే తెలీదు మార్గదర్శిలో జరిగిన బిజినెస్లోనే అక్రమాలు జరుగుతున్నాయి. కోటికి పైగా చిట్లో పాల్గొన్న వాళ్లు 800 మందికి పైగా ఉన్నారు. మార్గదర్సిలో చిట్స్ కడుతున్నట్లు దాదాపు 3 వేల మందికి తెలియనే తెలియదు. వంద మంది ఘోస్ట్ సబ్ స్క్రైబర్స్ను గుర్తించి విచారించాం. ఘోస్ట్ సబ్ స్క్రైబర్స్కు తెలియకుండా వారి ఆధార్, ఇతర వివరాలని మార్గదర్సి వాడుకుంటోంది. ఒక్కో కంపెనీ 20,30, 50 చిట్లు ఎలా వెయ్యగలిగింది. శైలజా పీఎం నుంచి బెదిరింపు ఫోన్లు జగజ్జనని కేసులో 9 కోట్ల ఆస్తులు అటాచ్ చేశాం. అనుమతులు లేకుండా చిట్ గ్రూప్ను ప్రారంభించారు. వేలం జరగకుండా నాలుగైదు చిట్లు ఎలా కట్టించుకుంటారు. అన్నపూర్ణ దేవిని శైలజ కిరణ్ పీఏ శశికళ నుంచి బెదిరింపు ఫోన్లు వెళ్తున్నాయి. ఇది సీఐడీ విచారణను అడ్డుకోవడం కాదా?. 3 వేల మందికి చిట్ కడుతున్నట్టు వాళ్ళకే తెలియదు.800 మంది అత్యధిక డబ్బులతో నడుస్తున్న చిట్ల వివరాలను ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్కు పంపాం. విజయవాడలో ఒక బిల్డర్ 50 కోట్ల చిట్లు వేస్తున్నారు. అవి నగదా, చెక్ల రూపంలో చెల్లిస్తున్నారా..? అని విచారిస్తున్నాం’ అని తెలిపారు. అన్నపూర్ణ దేవి ఇచ్చిన ఫిర్యాదు పై విచారణ జరిపాం. ఫిర్యాదుదారు కుమార్తె ప్రియాంక సంతకాన్ని ఫోర్జరీ చేశారు. విదేశాల్లో ఉన్న ప్రియాంక సంతకాన్ని ఫోర్జరీ చేశారు. వాళ్ళు ఫోర్జరీ సంతకంతో నష్టానికి వేలం పాట పాడించారు. మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్లు ఏజెంట్లను మోసం చేస్తున్నారు. నరసరావుపేట బ్రాంచ్లో ఏజెంట్ సంతకాన్ని బ్రాంచ్ మేనేజర్ ఫోర్జరీ చేశారు. -ఫకీరప్ప, ఎస్పీ, సీఐడీ -
ఏపీలో పటిష్టంగా ఫోరెన్సిక్ వ్యవస్థ
సాక్షి, అమరావతి : దిశ వ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం నేర పరిశోధనను బలోపేతం చేస్తోంది. ఇందులో కీలకమైన ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాలనూ పటిష్టపరుస్తోంది. 2014లో రాష్ట్ర విభజనతో ఫోరెన్సిక్ మౌలిక వసతుల వ్యవస్థ అంతా హైదరాబాద్లోనే ఉండిపోయింది. 2019 వరకు రాష్ట్రంలో ఏ నేరం జరిగినా.. ఫోరెన్సిక్ నివేదికల కోసం హైదరాబాద్పై ఆధారపడాల్సి వచ్చేది. దీంతో నేర పరిశోధన ఆలస్యమై దోషులను గుర్తించడం, నేరాన్ని నిరూపించడంలో జాప్యం జరిగేది. దీనికి విరుగుడుగా రాష్ట్రంలోనే ఫోరెన్సిక్ సైన్స్ వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆధునిక ల్యాబొరేటరీలతో మౌలిక వసతులను కల్పిస్తూనే.. మరోవైపు పూర్తిస్థాయిలో నిపుణుల నియామకం ద్వారా ఈ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కార్యాచరణ చేపట్టింది. ఏడుచోట్ల సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లు రాష్ట్రంలో ఏడు సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లతోపాటు పెద్దఎత్తున నిపుణుల నియామక ప్రక్రియను సర్కారు చేపట్టింది. అనంతపురం, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, కర్నూలు, గుంటూరు, విజయవాడలలో దిశ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీల ఏర్పాటుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను ఆమోదించింది. డీఎన్ఏ పరిశోధన సామర్థ్యాన్ని మూడింతలు.. సైబర్ నేర పరిశోధన మౌలిక వసతుల సామర్థ్యాన్ని ఐదింతలు పెంచింది. దాంతోపాటు ఫోరెన్సిక్ నిపుణుల సంఖ్యను ఐదింతలు పెంచాలని నిర్ణయించింది. అందుకోసం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ నియామక ప్రక్రియ చేపట్టింది. 58 మంది సైంటిఫిక్ అసిస్టెంట్ల నియామకం రాష్ట్రంలో ఇటీవలే 58 మంది సైంటిఫిక్ అసిస్టెంట్లను ప్రభుత్వం నియమించింది. మొత్తం 58 మంది పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా 8,127 మంది రాత పరీక్షకు హాజరయ్యారు. వారిలో 3,481 మంది అర్హత సాధించగా 58 మందిని ఎంపికచేసింది. సైంటిఫిక్ అసిస్టెంట్ (ఫిజికల్) పోస్టులకు 18 మందిని, సైంటిఫిక్ అసిస్టెంట్ (కెమికల్) పోస్టులకు 18 మందిని, సైంటిఫిక్ అసిస్టెంట్ (బయాలజీ/సెరోలజీ) ఖాళీల్లో 22 మందిని నియమించి వారికి శిక్షణనిస్తోంది. కాంట్రాక్టు పద్ధతిలో 46 మంది ల్యాబ్ టెక్నీషియన్లు ఇక ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో మరో 46 మంది నిపుణులను కాంట్రాక్టు విధానంలో ప్రభుత్వం తాజాగా నియమించింది. ఎంప్లాయ్మెంట్ ఎక్సే్ఛంజ్ల నుంచి అర్హుల జాబితాను తెప్పించుకుని అర్హులైన వారికి రాత పరీక్ష నిర్వహించింది. తద్వారా సైంటిఫిక్ అసిస్టెంట్లు 16 మంది, ల్యాబ్ అసిస్టెంట్లు 15 మంది, ల్యాబ్ టెక్నీషియన్లు 15 మందిని నియమించింది. త్వరలో 15 మంది సైంటిఫిక్ ఆఫీసర్ల పోస్టులను కూడా భర్తీ చేయనుంది. -
అరచేతిలో నేరగాళ్ల చిట్టా
► నేరస్తుల వివరాలు కంప్యూటరీకరణ ► పోలీసు శాఖ ప్రత్యేక యాప్ ► 90 శాతం పనులు పూర్తి ఏలూరు అర్బన్ : నేర నియంత్రణపై దృష్టి సారించిన పోలీసులు ఆధునిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. నేరాల నిరోధానికి గతంలో అమలు చేసిన సాధారణ పరిశోధనలకు సాంకేతికను జోడిస్తున్నారు. దీనిలో భాగంగా పోలీసుశాఖ ప్రత్యేకతలు ఉన్న కొత్త యాప్ను రూపొందించుకుంది. దీంట్లో నేరస్తుల చరిత్రను నిక్షిప్తం చేయడంతో పాటు నేరగాళ్ల వేలిముద్రలు, ఆధార్ సంఖ్య పొందుపరుస్తున్నారు. ఇలా తయారైన యాప్ను రాష్ట్ర పోలీసు కార్యాలయంలోని కంప్యూటర్లోనే కాకుండా అన్ని పోలీసు కార్యాలయాల్లో, పోలీసుల వాడే స్మార్ట్ఫోన్లలో కూడా ఇన్స్టాల్ చేస్తారు. దీని వలన పోలీసులకు అనుమానితులు ఎదురైతే వెంటనే యాప్ను యాక్టివేట్ చేస్తే నేరగాళ్ల చరిత్ర సులభంగా తెలుస్తుంది. ఇలా అందుబాటులోకి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి పంచుకునేందుకు పోలీసు శాఖ ప్రణాళికను సిద్ధం చేస్తుంది. ఆధార్ నంబర్, వేలిముద్రల ఆధారంగా..: యాప్ అమలులోకి వస్తే నేరస్తుడి ఆధార్ నంబర్ లేదా వేలిముద్ర స్మార్ట్ఫోన్లో ఎంటర్ చేయగానే పూర్తి జాత కం స్క్రీన్పై కనిపిస్తుంది. దీంతో నేర విచారణ పద్ధతుల అవసరం ఉండబోదనేది పోలీసుల భావన. దీనిని దృష్టిలో ఉంచుకుని నేరస్తుల పూర్తి వివరాలను కంప్యూటరీకరించేందుకు సిద్ధం చేస్తున్నారు. దందాలో భాగంగా ఇతరులను బెదిరించడం, భూ కబ్జాలు, తగాదాలు, ఆర్థిక లావాదేవీల్లో తలదూర్చి సెటిల్మెంట్లు చేయడం, దొంగతనాలు, బ్లాక్మెయిలింగ్, కిడ్నాప్లకు పాల్పడటం వంటి పలు నేరాలకు సంబంధించిన కార్యకలాపాలన్నింటినీ కళ్ల ముందు సాక్షాత్కరించేలా అన్ని వివరాలు సమగ్రంగా కంప్యూటర్లో నిక్షిప్తం చేసి అనంతరం ఇంటర్నెట్తో అనుసంధానించే పనులు 90 శాతం వరకు పూర్తయ్యాయి. పూర్తిస్థాయిలో నేరాల నియంత్రణ లక్ష్యం: నేరాలను పూర్తిస్థాయిలో నివారించడం, అదుపుచేయడం పోలీసుల ఏకైక లక్ష్యం. దీనిలో భాగంగా పోలీసులు ఎప్పటికప్పుడు వ్యూహాలు రూపొందించుకుంటారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో అందిపుచ్చుకునేందుకు యాప్ రూపకల్పన చేసుకున్నాం. దీని ద్వారా నేరస్తులను గుర్తించడం, కేసులను ఛేదించడ సులభమని భావిస్తున్నాం. అసలు నేరాలే జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం యాప్ అంతమ లక్ష్యం. –భాస్కర్భూషణ్, ఎస్పీ -
క్లూస్కు 'సై'బరాబాద్
* శాస్త్రీయ ఆధారాల సేకరణతో పకడ్బందీగా నేరగాళ్లకు శిక్షలు * ఐదుజోన్లకు ఒక్కోటి చొప్పున క్లూస్టీమ్లు * వాహనాలను ప్రారంభించిన సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో నేర పరిశోధన మరింత సులువు కానుంది. ప్రస్తుతం ఉన్న ఒకే ఒక్క వేలిముద్రల విభాగ బృందం స్థానంలో ఐదు జోనల్ క్లూస్టీమ్లను ఏర్పాటు చేశారు. కమిషనర్ సీవీ ఆనంద్ ఈ జోనల్ క్లూస్టీమ్స్ వినియోగించేందుకు తెప్పించిన సుమోలను గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శాస్త్రీయ ఆధారాల సేకరణకు సంబంధించిన అన్ని పరికరాల కిట్లను సిబ్బందికి అందజేశారు. నేరం జరిగినట్లు ఆయా ఠాణాల పరిధిలోని ప్రాంతాల నుంచి వచ్చిన ఫోన్కాల్తో పాటు కమాండ్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందగానే... ఆ జోన్లోని క్లూస్ టీమ్ సభ్యులు వాహనంలో కొద్ది నిమిషాలోన్లే ఘటనాస్థలికి చేరుకుని, ఆధారాలు చెరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. శాస్త్రీయ ఆధారాలను సేకరించి భద్రపరుస్తారు. వీటిలో అవసరమైన వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపి నివేదికలు తెప్పిస్తారు. ఈ శాస్త్రీయాధారాలే కోర్టుల్లో కేసును రుజువు చేసేందుకు పనికొస్తాయి. నేరగాళ్లకు శిక్షపడే వీలుంటుంది. 24 గంటలు అందుబాటులో... ఒక్కోజోన్ క్లూస్టీమ్లో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులు, ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. 24 గంటల పాటు షిఫ్ట్ పద్ధతిలో ఈ సిబ్బంది అందుబాటులో ఉంటారు. వీరికి నాలుగు చక్రాల వాహనం అందుబాటులో ఉంటుంది. ఈ క్లూస్టీమ్లోని సభ్యులంతా ఘటనాస్థలిలో ఫొటోలు తీయడం, వీడియో చిత్రీకరించడం, వేలిముద్రలు, రక్త నమూనాల సేకరణ, పేలుడు పదార్థాలను గుర్తించడం... తదితర శాస్త్రీయ ఆధారాలు సేకరించి ల్యాబొరేటరీకి పంపే విధానంపై నాంపల్లి రెడ్హిల్స్లోని టీఎస్ఎఫ్ఎస్ఎల్లో వారంపాటు శిక్షణ పొందారు. సైబరాబాద్ పరిధిలోని శంషాబాద్, మాదాపూర్, ఎల్బీనగర్, మల్కాజిగిరి, బాలానగర్ జోన్లలో ఐదు క్లూస్టీమ్లను ఏర్పాటు చేయడం ద్వారా ఆయా ప్రాంతాల్లో నేరాలు జరిగితే వెంటనే క్లూస్టీమ్లు అక్కడికి చేరుకునేలా శిక్షణ ఇచ్చారు. క్రైం సీన్ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్ సాయంతో ఆధారాల్ని సేకరిస్తారు. ఒక్కోసారి ఘటనాస్థలిలో లభించే పైకి కనిపించే ఆధారాల్ని బట్టి అమాయకుల్ని అనుమానించాల్సి వస్తోంది. అసలైన నేరస్తుడిని గుర్తించడంలో ఈ ఆధారాలు కీలకంగా పని చేయనున్నాయి. నేర పరిశోధన బలోపేతం కోసమే... ఘటనాస్థలిలో శాస్త్రీయ ఆధారాలను పూర్తిస్థాయిలో సేకరిస్తే దోషులకు శిక్ష విధించే వీలుంటుంది. క్లూస్టీంల వల్ల నేరపరిశోధన సులువవుతుంది. క్లిష్టమైన కేసులను వెంటనే ఛేదించవచ్చు. అందుకే ఈ వ్యవస్థను పటిష్టం చేసేందుకు దృష్టి సారించాం. ఇప్పటికే కొన్ని కేసుల్లో ఘటనాస్థలిలో లభించిన శాస్త్రీయ ఆధారాలే అనేక మంది నేరగాళ్లకు శిక్షపడేలా చేశాయి. -సీవీ ఆనంద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ జోనల్ క్లూస్ టీమ్ ఫోన్ నంబర్లు... మాదాపూర్ జోన్ : 8333993505 బాలానగర్ జోన్ : 8333993506 మల్కాజిగిరి జోన్ : 8333993507 ఎల్బీ నగర్ జోన్ : 8333993508 శంషాబాద్ జోన్ : 8333993509
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- పంజాబ్ ‘సర్దార్’ ఎవరు? ఏ పార్టీకి ఎంత బలముంది?
- శ్రీహరికోట: అగ్నిబాణం.. ప్చ్ మళ్లీ వాయిదా
- ఛాయాచిత్రం
- రాచరికపు ఆనవాళ్లు లేకుండా రాష్ట్ర చిహ్నం
- ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ జాప్యం?
- బిర్యానీ తినేందుకు వెళ్తుండగా...
- 'పాలిటెక్నిక్' లో నవోదయం
- శ్రీటీఎంటీ స్టీల్ బ్రాండ్ అంబాసిడర్గా బుమ్రా
- రిఫరీ తొండి అయినా... సగటు ఓటరే విజేత!
- కొత్త రికార్డు స్థాయిని తాకి, వెనక్కి..
Advertisement