-
సాక్షిగా నేను నిలబడతా
విజయనగరం మున్సిపాలిటీ : సాక్షిగా నేను నిలబడతా, కౌన్సిల్కు దమ్ముంటే ఇప్పటి వరకు నేను ఇచ్చిన డిసెంట్ నోట్లపై విచారణ జరిపించండి. పాలకవర్గం, అధికార యంత్రాంగం చేస్తున్న అవినీతి నిజాలు నిగ్గు తేలుతాయని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీకి చెందిన సీనియర్ కౌన్సిలర్ ఎస్వీవీ రాజేష్ సవాల్ విసిరారు. గురువారం మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశం వాడీవేడీగా సాగింది. అజెండాలోని 23 అంశం చర్చకు వచ్చిన సమయంలో గ్రాడ్యుయేటెడ్ టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్స్ను 12 నెలల కాలపరిమితికి నియమించుకోవడంపై రాజేష్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ చైర్మన్కు ఆ అంశాన్ని వ్యతిరేకిస్తూ డీసెంట్ నోట్ ఇచ్చారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ మొత్తం 12 మంది ఇన్స్పెక్టర్ల నియామకాల్లో అవతవకలు చోటు చేసుకున్నాయని, డబ్బులు తీసుకుని నియామకాలు చెపట్టారని ఆరోపించారు. వారిని పంపిణీ చేసే విశాఖకు చెందిన సినెర్జీ ఎంటర్ప్రైజెస్ సంస్థ స్వయానా మున్సిపల్ ఇంజినీర్ రాజేంద్రకృష్ణ బినామీ సంస్థగా పేర్కొన్నారు. ఈ నియామకాల ద్వారా అవకతవకలు చోటు చేసుకోవడంతో పాటు భవిష్యత్లో భారీ అవినీతి చోటు చేసుకునే అవకాశం ఉందని సభ దృష్టికి తీసుకొచ్చారు. నకమహాలక్ష్మి ఇన్చార్జి కమిషనర్గా ఉన్న సమయంలో వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని పట్టణంలో అభివృద్ధి స్తంభించటానికి బినామీలే కారణమంటూ తూర్పరబట్టారు. ప్రతిపక్షం డిసెంట్ నోట్ ఇవ్వడంపై స్పందించిన అధికార పార్టీ కౌన్సిలర్లు కేవలం అధికారులను బెదిరించేందుకు ఇలాంటి నోట్ ఇస్తున్నారని మాటల దాడికి దిగడంతో స్పందించిన ప్రతిపక్ష కౌన్సిలర్ ధీటుగా సమాధానమిచ్చారు. తాను ఇప్పటి వరకు ఇచ్చిన డీసెంట్ నోట్లపై విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. ఇంజినీరింగ్ అధికారులపై విరుచుకుపడ్డ కౌన్సిల్.. మున్సిపాలిటీని ప్రగతి పథంలో నడిపించాల్సిన ఇంజినీరింగ్ అధికారుల తీరుపై గురువారం మున్సిపల్ కౌన్సిల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. నెలల తరబడి వీధి దీపాలు వెలగకున్నా కుంటి సాకులతో నెట్టుకురావడంపై 21వ వార్డు కౌన్సిలర్ గేదెల ఆదినారాయణ ఆగ్రహంతో ఊగిపోయారు. రూ.200లకే మంచి నీటి కుళాయిల మంజూరుపై మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ మండిపడ్డారు. ఈ సమయంలో మున్సిపల్ ఇంజినీర్ రాజేంద్రకృష్ణ వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించగా, చైర్మన్ అవసరం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్ అధికారుల తీరుతో కౌన్సిలర్లు తలదించుకోవాల్సి వస్తోంది. లొసుగులు లేకుంటే టెండర్లను కౌన్సిల్కు చూపడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఏసీ సంతకాలు చేసిన టెండర్లను కౌన్సిల్లో ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. అసలు మున్సిపాలిటీలో ఏపీఎండీపీ స్కీం, అమృత్ స్కీంల అమలుపై అవగాహన ఉందా అంటూ ప్రశ్నించారు. ఇంజినీరింగ్ అధికారుల నిర్వాకంతో అభివృద్ధి పనుల్లో జాప్యం చోటు చేసుకుంటుందని, నిధులు వినియోగంలో నిర్లక్ష్యం వహించడంతో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ కింద మంజూరైన కోట్లాది నిధులు వెనక్కి మళ్లిపోయే పరిస్థితి దాపురించిందని ఇలా అయితే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ఎప్పటికి జరుగుతుందని 1వ వార్డు కౌన్సిలర్ సోము స్రవంతి ప్రశ్నించారు. స్వయానా జిల్లా కలెక్టర్ వార్డుల్లో పర్యటించడం చూస్తుంటే కౌన్సిల్ పనితనం ఏంటో ప్రజలకు సందేశం వెళ్లిపోయిందని, మున్సిపాలిటీలో అధికారులు పని చేస్తున్నారా అంటూ 24వ వార్డు కౌన్సిలర్ రొంగలి రామారావు నిలదీశారు. సమావేశంలో లైటింగ్ సమస్యపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ టి.వేణుగోపాలరావు మాట్లాడుతూ రానున్న రెండు మూడు రోజుల్లో శతశాతం వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కనకల మురళీమోహన్, అసిస్టెంట్ కమిషనర్ కె.కనకమహాలక్ష్మి, ఇతర కౌన్సిల్ సభ్యులు, వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
టీడీపీ Vs టీడీపీ
కౌన్సిల్ సాక్షిగా బయటపడ్డ విభేదాలు టౌన్ ప్లానింగ్ అధికారిని ప్రభుత్వానికి సరెండర్ చేయాలని తీర్మానం కదిరి: టీడీపీ కౌన్సిలర్ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. కౌన్సిల్ సాక్షి గా బయటపడ్డాయి. మంగళవారం చైర్పర్సన్ సురయాభాను అధ్యక్షతన కౌన్సి ల్ సమావేశం వాడీవేడిగా సాగింది. కుటాగుళ్లలోని మున్సిపల్ పాఠశాల ప్రాంగణంలో అంగన్వాడీ భవన నిర్మాణానికి కౌన్సిల్ ఆమోదం లేదంటూ చైర్పర్సనే ఈ అంశాన్ని లేవనెత్తారు. వెంటనే పను లు ఆపేయాలని కమిషనర్ రామ్మోహన్ ను ఆదేశించారు. ఇందుకు టీడీపీకే చెంది న కుటాగుళ్ల వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ అభ్యంతరం తెలిపారు. అభివృద్ధి పనులు ఆపేయాలని చెప్పడం మూర్ఖత్వమే అవుతుందన్నారు. ఈ విషయాన్ని అజెండా లో చేర్చాలని తాను డీఈ వెంకటరమణకు 3 నెలలకు ముందే లేఖ ఇచ్చానని గుర్తు చేశారు. అయితే.. ఈ అంశం తన దృష్టికి రానందున పనులు ఆపాలని చైర్పర్సన్ పునరుద్ఘాటించారు. చైర్పర్సన్కు మద్దతుగా టీడీపీకి చెందిన కౌన్సిలర్ షబ్బీర్ నిలవగా.. కౌన్సిలర్ చంద్రకు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు మద్దతుగా నిలి చారు. ఆఖరుకు ఈ అంశంపై కమిటీని వేయాలని నిర్ణయించి.. తాత్కాలికంగా మూడు రోజుల పాటు పనులు ఆపాలని నిర్ణయించారు. మున్సిపల్ రిజర్వ్ స్థలా లు కబ్జాకు గురవుతున్నా అధికారులు మౌనం దాల్చారని, పాలకపక్షం ఎందుకు దీనిపై మెతకవైఖరిని అవలంబిస్తోందని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు కిన్నెర కళ్యాణ్, అజ్జుకుంటు రాజశేఖర్రెడ్డి, జగన్, శివశంకర్ నాయక్, జిలాన్ ప్రశ్నించారు. వీరికి టీడీపీ కౌన్సిలర్ శంకర్ మద్దతు తెలుపుతూ.. రాధికా థియేటర్ ముందు 10 అడుగులు ఆక్రమించి ఇల్లు నిర్మిస్తుంటే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిం చారు. చివరకు టౌన్ ప్లానింగ్ అధికారి వినయ్ప్రసాద్ను ప్రభుత్వానికి సరెం డర్ చేయాలని తీర్మానించారు. కాం ట్రాక్టు కార్మికుల 3 నెలల వేతనాలను ఇచ్చే బాధ్యతను బినామీ కాంట్రాక్టర్ బాబాకు కట్టబెడితే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వస్తుందని వైఎస్సార్సీపీ కౌన్సిలర్ కళ్యాణ్ హెచ్చరించడంతో కమిషనర్ ఆధ్వర్యంలో చెల్లించేలా నిర్ణయించారు. నిజాంవలీ కాలనీలో ఓ వీధి తన వార్డు పరిధిలోకి వస్తుందని, ఆ కాలనీ అభివృద్ధికి మంజూరైన రూ.కోటితో సదరు వీధిలో అభివృద్ధి పనులు చేపట్టాలని వైఎస్సార్సీపీ కౌన్సిలర్ మైనుద్దీన్ కోరారు. కాగా.. సమావేశం జరుగుతుండగానే సీపీఐ నాయకులు లోపలకు దూసుకొచ్చారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement