breaking news
cooking skills
-
యూట్యూబ్ సెన్సేషన్ ఈ 74 ఏళ్ల బామ్మ..! నెలకు రూ.5 లక్షలు పైనే..
సోషల్ మీడియా ఎక్కడెక్కడో వంటింట్లోనే మగ్గిపోయే వనిత లెందరినో బయట ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఎందిరినో స్టార్లుగా మార్చింది. టెక్నాలజీ అంటే ఏంటో తెలియని బామ్మలను ఓవర్నైట్ స్టార్లుగా మార్చింది. అలానే ఇక్కడొక బామ్మ కూడా యూట్యూబ్ సెన్సేషన్గా మారింది. తన పాకకళతో ఎందరో ఫాలోవర్లును దక్కించుకుని డిజటల్ క్విన్గా మారింది ఈ 74 ఏళ్ల బామ్మ. ఆ బామ్మను అంతా ఆప్లీ ఆజీగా పిలిచే సుమన్ ధమానే. ఆమె యూట్యూబ్ ఛానెల్కి ఏకంగా 1.79 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అంచనాలకందని విధంగా డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టడం అతిపెద్ద విషయం అనుకుంటే..ఎవ్వరూ ఊహించని రీతిలో సంపాదన ఆర్థిచడం మరింత విశేషం. ఆమె మనవు యష్ సాయంతో ఈ డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టారామె. తన పాకకళతో యూట్యూబ్ ఛానెల్లో మహారాష్ట్ర వంటకాల రుచులను పరిచయం చేసింది ఈ బామ్మ. ఎప్పటికప్పుడూ కొత్తదనంతో..కాలానుగుణ రుచులతో ఆరోగ్యకరమైన వంటకాల వీడియోలతో అలరించింది. ఇంట్లో ఉండే సుగంధద్రవ్యాలతో ఆరోగ్యకరంగా వంటకాలు తయారు చేయడం ఎలా అనే వీడియోలతో..ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇచ్చే ఆహారప్రియులను బాగా ఆకర్షించింది. అదే ఆమెకు మంచి స్టార్డమ్ని తెచ్చిపెట్టింది. ఆకర్షణీయమైన పావ్ భాజీ, కరేలే కి సబ్జీ, మహారాష్ట్ర స్వీట్ల వరకు ప్రతిదీ నోరూరించేలా ఆరోగ్యకరంగా చేసుకోవడం ఎలాగో పరిచయం చేసింది. ఈ యూట్యూబ్ స్టార్డమ్ జర్నీలో ఆమె కెమెరా ముందు నిలబడి మాట్లాడటంలో మొదట్లో తడబాటు, సిగ్గుపడటం వంటి సమస్యలను ఎదుర్కొంది. అలాగే సాంకేతిక లోపాలు, ఛానెల్ హ్యాక్ వంటి ఇబ్బందులను కూడా ఎదుర్కొంది. అయినప్పటికీ..తన జర్నీని విరమించలేదు. తాజా కంటెంట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది. అలా యూట్యూబ్ సిల్వర్ బటన్ను కూడా దక్కించుకుంది. ఈ బామ్మ కథ విజయానికి వయసు అడ్డంకి కాదని చూపించడమే గాక కుటుంబ మద్దతుతో దేన్నేనా సాధించగలమని నిరూపించింది. ఈ బామ్మ తన యూట్యూబ్ ఛానెల్తో నెలకు రూ. 5 నుంచి రూ. 6 లక్షల పైనే సంపాదిస్తుందట. (చదవండి: మాతృత్వం మధురిమను కాపాడుకుందాం..! కాబోయే తల్లుల ఆరోగ్యం కోసం..) -
భర్త కోసం స్మృతి స్పెషల్ డిష్..
నటిగా, నిర్మాతగా, రాజకీయ నాయకురాలుగా.. తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. అయితే ఆమె ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారనే సంగతి తెలిసిందే. ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించడమే కాకుండా సరదా పోస్టులతో కూడా సందడి చేస్తారు.అలాగే తన కుటుంబానికి సంబంధించిన విశేషాలను కూడా ఆమె అప్పుడప్పుడు షేర్ చేస్తూంటారు. తాజాగా వంటల్లో తనకున్న ప్రావీణ్యాన్ని ఆమె అభిమానులతో పంచుకున్నారు. తాజాగా తన భర్త జూబిన్ ఇరానీ కోసం స్మృతి ప్రత్యేకంగా ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారుచేశారు. అందుకు సంబంధించిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో కూడా ఆమె వివరించారు. క్యాప్షన్స్తో కూడిన 7 ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ స్టోరిస్లో ఉంచారు. కాగా, కొద్దిరోజుల క్రితం స్మృతి తన కూతురు జోయిష్ ఇరానీ కోసం వెజ్ న్యూడిల్స్, చికెన్ మంచురియాను తయారు చేసిన సంగతి తెలిసిందే. -
అర్బాజ్ను మలైకా ఎలా పడేసింది?
ప్రముఖ నటి.. నిర్మాత మలైకా అరోరా ఖాన్ తన ప్రేమకు సంబంధించిన కొన్ని రహస్యాలను వెల్లడించబోతోంది. 'ఫరా కీ దావత్' కార్యక్రమంలో ఆమె ఈ విషయాలు చెబుతుందట. తన భర్త అర్బాజ్ఖాన్తో ప్రేమలో పడేందుకు తాను వండిన వంటకాలు కూడా ఓ కారణమని మలైకా చెబుతోంది. ఆమె అర్బాజ్ఖాన్తో డేటింగ్లో ఉన్న సమయంలో వాలెంటైన్స్ డే సందర్భంగా కొన్ని ప్రత్యేక వంటకాలు చేసి అతడికి రుచి చూపించిందట. అప్పటికి తనకు పెద్దగా వంట రాకపోయినా.. ఆ రుచి చూసే అర్బాజ్ ఖాన్ పడిపోయాడని, అదికూడా తమ ప్రేమ పండేందుకు ఓ కారణమని మలైకా చెబుతోంది. 1998లో అర్బాజ్, మలైకా పెళ్లి చేసుకున్నారు. వాళ్లకు అర్హాన్ అనే 12 ఏళ్ల కొడుకు ఉన్నాడు. కలర్స్ చానల్లో ప్రసారమయ్యే 'ఫరా కీ దావత్' కార్యక్రమంలో ఇలాంటివే మరికొన్ని రహస్యాలను మలైకా అరోరా ఖాన్ చెబుతుందట.