breaking news
controvesies
-
బాబోయ్ ట్రంపూ.. అప్పుడే ఏడాది పూర్తి
2024 జనవరి 20.. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా వైట్హౌజ్లో అడుగు పెట్టిన రోజు. అమెరికా ఫస్ట్ నినాదంతో నెగ్గిన ఆయన.. దేశాన్ని ఓ గాడిన పెడతాడని, అదే సమయంలో అంతర్జాతీయంగా పెద్దన్న రోల్ను సమర్థనీయంగా పోషిస్తారని ఆనాడు అంచనాలు ఉండేవి. కానీ, ఒక సంవత్సరం గడిచేలోపే సీన్ సితార అయ్యింది. ట్రంప్ సంతకం చేసిన అనేక నిర్ణయాలు అమెరికాలోనే కాదు.. అంతర్జాతీయంగా కూడా తీవ్ర చర్చలకు దారితీశాయి. వాటిలో చాలామట్టుకు ‘‘తల తిక్క’’ నిర్ణయాలుగా గుర్తింపు దక్కించుకున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం.. వలసవాదానికి చుక్కలు .. అధికారంలోకి రాగానే ట్రంప్ చేసిన మొదటి పని.. శరణార్థులపై కఠిన ఆంక్షల విధింపు. ఈ నిర్ణయంలో అక్రమ వలసవాదుల్ని వెతికి మరీ.. వాళ్ల వాళ్ల దేశాలకు డిపోర్ట్ చేశాడు. ఈ క్రమంలో బేడీలు వేసి.. కనీస వసతుల్లేని విమానాల్లో తరలించడం తీరు తీవ్రవిమర్శలు తావిచ్చింది. మానవ హక్కుల సంస్థలు వలసవాదులకు తలుపులు మూసేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. అయినప్పటికీ అమెరికా భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ సమర్థించుకున్నాడు.. ఇదేగాక.. వీసా టఫ్ రూల్స్.. అమెరికన్ల ఉద్యోగాల్ని రక్షించడం అనే పేరుతో.. హెచ్1బీ వీసా నియమాలను కఠినతరం చేశారు. ఫీజులు గణీయంగా పెంచారు. అధిక వేతన ప్రమాణాలు, కఠిన అర్హతలు, తక్కువ అనుమతులతో.. తీవ్ర చర్చనీయాంశంగా మారారాయన. ఈ నిర్ణయంతో.. భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా ప్రభావితమయ్యారు.ఆ దేశాలపై ట్రావెల్ బ్యాన్.. 2025 డిసెంబర్లో ట్రంప్ చేసిన ఒక ప్రకటన తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 39 దేశాల పౌరులపై అమెరికా ప్రవేశ నిషేధం విధించారాయన. అఫ్గన్ పౌరుడొకడు వాషింగ్టన్లో గన్ ఫైర్ ఎటాక్ జరపడమే ఇందుకు కారణం. ఈ లిస్టులో చాలా వరకు ముస్లిం దేశాలే ఉన్నాయి. ఇది 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది.టారిఫ్ కింగ్.. 2025లో ట్రంప్ను ప్రత్యేకంగా నిలిపింది ఏదైనా ఉందీ అంటే.. అది సుంకాల యుద్ధమే. తనకు నచ్చని.. తన మాట వినని దేశాలపై టారిఫ్ కొరడా ఝుళిపించారాయన. ఈ క్రమంలో.. చైనా, యూరప్, కెనడా, మెక్సికో వంటి దేశాలపై భారీ దిగుమతి సుంకాలు (tariffs) విధించారు. ట్రంప్ టారిఫ్ వార్లు అమెరికా పరిశ్రమలను రక్షించాలనే ఉద్దేశంతో ప్రారంభమైనా, అవి గ్లోబల్ ట్రేడ్లో ఉద్రిక్తతలు, భారత్ లాంటి మిత్రదేశాలతో సంబంధాల క్షీణత, వినియోగదారులపై అదనపు భారాలు వంటి అనేక సమస్యలకు దారితీశాయి.ఫెడరల్ టు స్టేట్స్.. 2024 నవంబర్లో ట్రంప్ తన ఎన్నికల హామీలో.. విద్యాశాఖను పూర్తిగా రద్దు చేస్తానని ప్రకటించారు. చెప్పినట్లుగా.. అధికారంలోకి రాగానే ఆ పని చేశారు. 2025 మార్చి 20న ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేసి, కేంద్ర(ఫెడరల్) విద్యాశాఖను మూసివేయడానికి అధికారిక ప్రక్రియను ప్రారంభించారు. ఫెడరల్ ప్రభుత్వంపై అనవసర భారం ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారాయన. 40 ఏళ్లలో 3 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేసినా ఫలితం లేదు. విద్యా నియంత్రణ రాష్ట్రాలకే ఉండాలి అనేది ఆయన వాదన. దీంతో ఆ దేశంలో కేంద్ర విద్యా శాఖ కనుమరుగు అయ్యే ప్రాసెస్ నడుస్తోంది. అయితే.. ఈ నిర్ణయం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు భారం కానుంది.అదే సమయంలో.. ఇటు అమెరికా ఆరోగ్య శాఖ (Department of Health and Human Services – HHS)ను కూడా రద్దు చేయాలని నిర్ణయించారు. రెండో టర్మ్లో ఈ మేరకు ప్రతిపాదన కూడా చేశారు. ఆయన వాదన ప్రకారం, ఆరోగ్య విధానాలు రాష్ట్రాలకే అప్పగించాలి.. ఫెడరల్ స్థాయిలో ప్రత్యేక శాఖ అవసరం లేదు. అయితే ఇది ఇంకా ప్రతిపాదన స్థాయిలోనే ఉంది. ప్రస్తుతానికి దాని అధికారాలు, నిధులు తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒబామాకేర్( Affordable Care Act) రద్దు ప్రయత్నాలతో కలిపి, ఆరోగ్య శాఖను పునర్వ్యవస్థీకరించాలనే ప్రణాళిక మాత్రం రేపో మాపో అమలయ్యే ఛాన్స్ ఉంది.వీటితో పాటు ఐక్యరాజ్య సమితిపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ విమర్శలు గప్పించడం.. నిధుల్ని తగ్గించడం.. ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా నిధుల్ని కోత వేసే ప్రయత్నాలు.. భారత్తో వాణిజ్య వివాదాలు.. పాక్తో మైత్రి, వెనెజువెలా అధ్యక్షుడ్ని బంధించి ఎత్తుకెళ్లి.. ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడోకు మద్దతు.. ఆమెకు దక్కిన నోబెల్ మెడల్ను స్వీకరించడం.. “ఇకపై కేవలం శాంతి గురించే ఆలోచించాల్సిన బాధ్యత లేదు” అని వ్యాఖ్యలు చేయడం, ఇరాన్ నిరసనకారుల్ని రెచ్చగొట్టడం.. డెన్మార్క్ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ గ్రీన్లాండ్ను చేజిక్కించుకునే ప్రయత్నాలు.. వీటికి తోడు ఫేక్ న్యూస్ అంటూ మీడియా సంస్థలపై దాడులు, దావాలు వేయడం.. ఈ ఏడాది కాలంలో కుటుంబ వ్యాపారాలు విపరీతమైన లాభాలు అర్జించి సంపద పెరగడం ట్రంప్ను తిట్టిపోసేలా చేశాయి. -
జీసస్ సమాధిపై ఆశ్చర్యకరమైన నిజాలు
మానవ చరిత్రలో అత్యంత ప్రాచుర్యం పొందిన దేవతామూర్తిగా యేసుక్రీస్తు పేరు గడించారనే విషయం మాత్రమే మనందరికీ తెలుసు. జెరుసలేం హోలీ సెపల్చేర్ లోని యేసుక్రీస్తు సమాధిని గత వారం తొలిసారి తెరిచారు. కానీ యేసు క్రీస్తు విశ్రాంతి తీసుకుంటున్న ప్రదేశం అదొక్కటే కాదు. 30 ఏడీలో మరణించిన మెసయ్య సమాధులు భారత్, జపాన్ లలో కూడా ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. క్రైస్తవ సంప్రదాయం ఏం చెబుతోందంటే యేసుక్రీస్తుకు శిలువ వేసిన అనంతరం ఆయన దేహాన్ని సమాధి చేసేందుకు ప్రత్యేకమైన బండరాళ్లతో చిన్న నిర్మాణాన్ని తయారు చేశారు. దీన్ని ఎడిక్యూల్ అని పిలుస్తారు. ఎడిక్యూల్ అనే పదం లాటిన్ నుంచి వచ్చింది. దీనికి చిన్ని ఇల్లు అని అర్ధం. ఆ నిర్మాణాన్ని దీపాలు, కొవ్వొత్తులతో అలంకరించి క్రీస్తు దేహానికి అభిషేకం చేసి గుడ్డతో చుట్టి సమాధి చేశారు. ఆ తర్వాత క్రీస్తు పునర్జర్మ ఎత్తినట్లు క్రైస్తవ సంప్రదాయం చెబుతోంది. కాగా, క్రీస్తును ఉంచిన సమాధి ఆయనకు శిలువ వేసిన ప్రదేశం నుంచి కొద్ది దూరంలోనే ఉంది. దీనిపై ప్రస్తుతం అథెన్స్ జాతీయ సాంకేతిక విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేస్తున్నారు. హోలీ సెపల్చేర్ చర్చ్ జెరుసలేంలోని హోలీ సెపల్చేర్ చర్చిలో అసలైన జీసస్ సమాధి ఉందనే ప్రచారం జరిగింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంద్రి క్రైస్తవుల దృష్టిని కూడా ఈ చర్చి ఆకర్షిస్తోంది. అయితే చరిత్రకారులు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. టాల్పాయిట్ జెరుసలేంలోని టాల్పాయిట్ పట్టణంలో 1922లో నిర్మితమైంది. 2007లో హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ నిర్మించిన 'ది లాస్ట్ టూంబ్ ఆఫ్ జీసస్'లో టాల్పాయిట్ లో జీసస్ సమాధి ఉందని పేర్కొన్నారు. 1980లో టాల్పాయిట్ లో జరిగిన తవ్వకాల్లో పూర్వికులకు సంబంధించిన ఎముకలు, దేహాలను భద్రపరిచే అత్యంత పురాతన పేటికలు లభ్యమవడమే ఇందుకు కారణం. వీటిపై పరిశోధనలు చేసిన ఆర్కియాలజిస్టులు, బిబ్లికల్ స్కాలర్లు ఒకరినొకరు ఏకీభవించుకోలేదు. గ్లాట్సన్ బ్యూరీ జెరుసలేంలోని బెత్లెహోమ్ యేసు జన్మస్ధలమని క్రీస్తు బోధనల్లో ఉంది. అయితే, యుక్త వయసులో జీసస్ బ్రిటన్ కు వెళ్లినట్లు మరో కథ కూడా ప్రచారంలో ఉంది. బ్రిటన్ కు వలస వచ్చిన జీసస్ ప్రిడ్డీ, సోమర్ సెట్ ప్రాంతాల్లో స్ధిరపడ్డారని దీని సారాంశం. క్రీస్తు దేహాన్ని గ్లాట్సన్ బ్యూరీలో భద్రపరిచినట్లు ఈ కథ చెబుతుంది. భారత్, నేపాల్, జపాన్ లలో.. జీసస్ కు శిలువ వేయలేదని, ఆయన భారత్ కు వలస వచ్చి జీవనం కొనసాగించినట్లు 1800వ సంవత్సరంలో స్ధాపించిన అహ్మదీ ముస్లిం ఫెయిత్ అనే సంస్ధ చెబుతోంది. ఉత్తర కశ్మీర్ లోని రోజాబాల్ అనే పుణ్య ప్రదేశంలో క్రీస్తు దేహాన్ని సమాధి చేసినట్లు పేర్కొంది. నేటికి కూడా పెద్ద సంఖ్యలో క్రైస్తవులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారని చెప్పింది. అయితే, దీనిపై వివాదాలు ఉన్నాయి. ముస్లిం మత బోధకులు యోజా ఆసిఫ్, సయ్యద్ నజీరుద్దీన్ లకు చెందిన సమాధులు ఆ ప్రాంతంలో ఉన్నట్లు స్ధానికులు చెబుతున్నారు. పదమూడేళ్ల ప్రాయంలో జీసస్ జెరుసలేంను విడిచి హిమాలయాలకు వచ్చినట్లు 1887లో రష్యా యుద్ధ ప్రతినిధి నికోలస్ నోటోవిట్చ్ పేర్కొన్నారు. తనకు లభ్యమైన ఓ డాక్యుమెంటులో ఇందుకు సంబంధించిన సమాచారం ఉందన్నారు. జీసస్ టిబెటన్ ఆచారాలను పాటిస్తూ బుద్ధిజాన్ని చదువుకున్నట్లు తెలిపారు. అయితే, చరిత్రకారులు ఈ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. 1930లో క్రీస్తుపై మరో కథ కూడా వెలుగు చూసింది. శిలువ నుంచి తప్పించుకుని తన సోదరుడు ఇసుకురిని తీసుకుని జీసస్ జపాన్ కు వచ్చినట్లు దీని కథనం. ఆ తర్వాత తన జీవితకాలన్ని మొత్తం షింజో అనే గ్రామంలో జీసస్ వెళ్లదీశారని పేర్కొంది. దీన్ని బలపరుస్తూ షింజో గ్రామంలోని సజిరో సవాగుచి కుటుంబం తాము జీసస్ వారసులమని ప్రకటించింది. 100 ఏళ్ల వయసు వరకూ జీసస్ జీవించారని చెప్పంది. ఆయన దేహాన్ని గ్రామానికి దగ్గరలో సమాధి చేసినట్లు పేర్కొంది. ఈ ప్రాంతాన్ని కూడా ఏళ్లుగా క్రైస్తవులు సందర్శిస్తూ వస్తున్నారు.


