-
ఎంఎంటీఎస్ రైలు ఢీకొని సాక్షి విలేకరి మృతి
హైదరాబాద్: ఎంఎంటీఎస్ రైలు ఢీకొన్న ఘటనలో ‘సాక్షి’విలేకరి దుర్మరణం చెందారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, రేగొండ ప్రాంతానికి చెందిన బాల మైసయ్య(40) శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో బోరబండ–హైటెక్సిటీ రైల్వే స్టేషన్ల మధ్యలో రైలు పట్టాలు దాటుతుండగా లింగంపల్లి నుంచి ఫలక్నుమా వైపు వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. దీంతో బాల మైసయ్య దుర్మరణం చెందారు. సంఘటనాస్థలానికి చేరుకున్న జీఆర్పీ పోలీసులు మైసయ్య మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడు బాల మైసయ్య జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రం ‘సాక్షి’విలేకరిగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య స్వరూప, కుమారులు వసంత్(10), రిషిత్(7) ఉన్నారు. శనివారం మంచిర్యాలలో జరిగే తన అక్క కుమార్తె వివాహానికి హైదరాబాద్లో ఉండే బంధువులను తీసుకెళ్లేందుకు వచ్చి మృత్యువాతపడ్డారు. దీంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
రేగొండ కంట్రిబ్యూటర్ దుర్మరణం
సాక్షి, భూపాలపల్లి : హైదరాబాద్లోని నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి రైలు ప్రమాదంలో మరణించాడు. మృతుని జేబులో ఉన్న అక్రిడిటేషన్ కార్డు ఆధారంగా అతన్ని భూపాలపల్లి జిల్లా రేగొండ మండల న్యూస్ కంట్రిబ్యూటర్ మైస బాలయ్యగా గుర్తించారు. బాలయ్య సాక్షి దినపత్రికలో పనిచేస్తున్నారు. రైల్వే పోలీసులు భూపాలపల్లి రిపోర్టర్కు సమాచారం అందించారు. -
ఖషోగ్గీ ఎమయ్యాడో తెలీదు: సౌదీ రాజు
దుబాయ్: వాషింగ్టన్ పోస్ట్ కంట్రిబ్యూటర్ జమాల్ ఖషోగ్గీ కనిపించకుండా పోవడంపై సౌదీ అరేబియాపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో రాజు సల్మాన్ రంగంలోకి దిగారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. ఖషోగ్గీ ఏమమయ్యాడో తమకు తెలియదని చెప్పారు. సౌదీ పౌరుడైన ఖషోగ్గీ అమెరికాలోఉంటూ సౌదీపై వాషింగ్టన్ పోస్ట్లో విమర్శనాత్మక కథానాలు రాసేవారు. ఈ నెల 2న టర్కీలోని ఇస్తాంబుల్లో ఉన్న సౌదీ ఎంబసీలోపలికెళ్లిన తర్వాత ఆయన కనిపించకుండా పోవడం, ఆయనను సౌదీనే హత్య చేసిందని ఆరోపణలు రావడం తెల్సిందే. సౌదీలో రాజకుటుంబానికి మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే వ్యతిరేక పోస్ట్లు కూడా వస్తున్నప్పటికీ వాటిని సౌదీ ప్రభుత్వం వెంటనే తొలగిస్తోందని తెలుస్తోంది. ఇస్తాంబుల్లోని సౌదీ ఎంబసీలో ఖషోగ్గీ అదృశ్యంపై టర్కీ పోలీసులు అక్కడ సోదాలు చేశారు. -
బీజేపీ విజయంలో కాంగ్రెస్ పాత్ర కీలకం
న్యూఢిల్లీ: తమ పార్టీ విజయంలో కాంగ్రెస్ పాత్ర కీలకమని బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ వ్యాఖ్యానించారు. యూపీఏ హాయంలో కుంభకోణాలు జరగకుంటే లోక్సభ ఎన్నికల ఫలితాలు భిన్నంగా ఉండేవని అన్నారు. 'లోక్సభ ఎన్నికల్లో మా పార్టీ కార్యకర్తలు బాగా కష్టపడ్డారు. నరేంద్ర మోడీ ప్రచార సారథ్యం బీజేపీకి బాగా కలసివచ్చింది. అయితే మా విజయానికి ప్రతిపక్షాలు కూడా ఎక్కువగా దోహదపడ్డాయి. ఈ విషయాన్ని విస్మరించలేం' అని తన నివాసంలో జెండావిష్కరణ అనంతరం అద్వానీ అన్నారు. నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ 282 లోక్సభ సీట్లు నెగ్గగా, కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నడు లేనంతగా చిత్తుగా ఓడిపోయి 42 సీట్లకు పరిమితమైన సంగతి తెలిసిందే. ప్రజలు మార్పు కోరుతూ బీజేపీకి ఓటు వేశారని, ఇందులో వ్యక్తుల ప్రమేయం లేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
- ధాన్యం తడవకుండా.. కాపాడే మంచె!
- గాజాలో ఆగని దాడులు.. భారతీయుడి మృతి
- శ్రీనగర్: రెండు దశాబ్ధాల ఓటింగ్ రికార్డు బద్దలు!
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
- ఆగని టీడీపీ అరాచకాలు
- Lok Sabha Election 2024: నేడు వారణాసిలో మోదీ నామినేషన్
- పోలింగ్ సిబ్బంది ‘పచ్చ’పాతం
- TS: 64.93% పోలింగ్! ప్రశాంతంగా ముగిసిన లోక్సభ ఎన్నికలు
- ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ ఛాన్స్ . అలా జరిగితేనే?
Advertisement