breaking news
Connecticut state
-
కరోనా: ఆరు వారాల శిశువు మృతి
వాషింగ్టన్ : అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యం చిగురుటాకులా వణుకుతోంది. పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కరోనా లక్షణాలతో కనెక్టికట్ రాష్ట్రంలో ఆరు వారాల శిశువు మరణించినట్లు ఆ రాష్ట్ర గవర్నర్ బుధవారం వెల్లడించారు. శిశువు మరణంతో ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా మరణాల్లో ఈ చిన్నారే అతి చిన్న వయస్కురాలుగా నమోదైనట్లు ఆయన తెలిపారు. శిశువు మరణంపై గవర్నర్నెడ్ లామోంట్ విచారం వ్యక్తం చేశారు. ట్విటర్ ద్వారా స్పందించిన ఆయన.. గతవారం స్పందన కోల్పోయిన నవజాత శిశువును ఆసుపత్రికి తీసుకువచ్చారని, మంగళవారం శిశువుకు కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు. (యూరప్లో 30 వేల మంది మృతి) మరోవైపు న్యూయార్క్, కనెక్టికట్, న్యూ జెర్సీ రాష్ట్రాలలోని ప్రజలు అత్యవసరం అనిపిస్తే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కేవలం ఈ మూడు రాష్ట్రాలలోనే లక్ష కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభిస్తోందని, ఇంట్లోనే ఉండటం వల్ల వైరస్ను వ్యాప్తి చెందకుండా అడ్డుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. దీని వల్ల తమ జీవితాలతోపాటు ఇతరుల జీవితాలు సురక్షితంగా ఉంటాయని పేర్కొన్నారు. (ఏపీలో 111 కరోనా పాజిటివ్ కేసులు ) ఇక ఇప్పటి వరకు అమెరికాలో 4476 మంది కరోనాకు బలవ్వగా.. 2,13,372 కేసులు నమోదయ్యాయి. కేవలం న్యూయార్క్లోనే మరణాలు అధికంగా నమోదవ్వడం పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ నగరంలో దాదాపు 2 వేల మంది మృత్యువాతపడ్డారు. (ఇంట్లోనే ఉందాం.... కరోనాను దేశం దాటిద్దాం) కోవిడ్-19 : మరణాల రేటు ఎంతంటే.. -
'హోదా' భిక్షకాదు 5 కోట్ల ఆంధ్రుల హక్కు..
-
'హోదా' భిక్షకాదు 5 కోట్ల ఆంధ్రుల హక్కు..
హార్ట్ఫోర్డ్ : ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మాయమాటలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఓట్లు దండుకున్నారని అమెరికాలోని కనెక్టికట్ స్టేట్ ఎన్ఆర్ఐలు మండిపడ్డారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామంటూ హామీలు గుప్పించారన్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా కాదు, ప్యాకేజీ చాలు అంటూ మాట మారుస్తున్నారని..ఇది సిగ్గుమాలిన చర్య అని ఎన్ఆర్ఐలు ధ్వజమెత్తారు. ఇచ్చిన మాట ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రత్యేక హోదా పోరాటానికి ఎన్ఆర్ఐల సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఏపీ ప్రత్యేక హోదా అంశంపై మోదీ, చంద్రబాబునాయుడు మాట మార్చినందుకుగానూ హార్ట్పోర్డ్లోని ఎన్ఆర్ఐలు ఫ్లకార్డులతో తమ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో రత్నాకర్, జితేందర్, హరిపెరుగు, శ్రినిను వాసిరెడ్డిలతోపాటూ మరికొందరు ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. 'ప్రత్యేక హోదా భిక్షకాదు 5 కోట్ల ఆంధ్రుల హక్కు'.. 'ప్రత్యేక హోదా రాకపోతే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి?..' అంటూ ప్రత్యేక హోదాకు మద్దతుగా ఎన్ఆర్ఐలు నినదించారు.