-
నో కాంప్రమైజ్
స్క్రిప్ట్ నచ్చినా పారితోషికం దగ్గర కాంప్రమైజ్ కానంటున్నారు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్. అవసరమైతే ఆ సినిమా చాన్స్ను వదులుకోవడానికి కూడా సిద్ధం అంటున్నారామె. ఈ విషయం గురించి తను ఎదుర్కొన్న ఓ సంఘటనను షేర్ చేశారు దీపికా. ‘‘ఇటీవల ఓ దర్శకుడు నాకు ఓ కథ చెప్పారు. క్రియేటివ్ యాంగిల్లో ఆ సినిమా నాకు నచ్చింది. ఆ తర్వాత రెమ్యూనరేషన్ డిస్కషన్స్ స్టార్ట్ చేశాం. నా మాట చెప్పాను. ఆ డైరెక్టర్ వెళ్లిపోయి మరలా రెండు రోజుల తర్వాత వచ్చారు. మెయిన్ లీడ్ యాక్టర్ కన్నా నాకు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇప్పించలేనని తన అభిప్రాయం చెప్పారు. సినిమా చేయనని నేను చెప్పేశాను. ఎందుకంటే నా విలువ నాకు తెలుసు. నా ట్రాక్ రికార్డ్పై నాకు అవగాహన ఉంది. ఆ సినిమాను వద్దనుకున్నందుకు కూడా బాధపడటం లేదు. నేటి రోజుల్లో సినిమాల్లో మహిళల అవకాశాలకు కొదవ లేదు. మహిళల పాత్రలకు కూడా ప్రాముఖ్యత పెరిగింది. ఓ మార్పు వస్తోంది’’ అని చెప్పుకొచ్చారు దీపికా. ‘పద్మావత్’ సినిమా సక్సెస్తో బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఎంటో నిరూపించుకున్న దీపికా ప్రస్తుతం ‘చెప్పాక్’ అనే సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నారు. ‘రాజీ’ ఫేమ్ మేఘనా గుల్జార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. అదేవిధంగా ఓ సూపర్ ఉమెన్ సినిమాలో కూడా నటించబోతున్నట్లు ఓ సందర్భంలో దీపిక చెప్పిన విషయం తెలిసిందే. -
నకిలీ డొంక కదిలేనా?
జేడీతో సమావేశమైన విత్తన కంపెనీల డీలర్లు రాజీ కోసం యత్నాలు! విత్తనాల ధరలు చెల్లించి చేతులు దులుపుకొనే యత్నం సమస్యను కోల్డ్ స్టోరేజీలోకి నెట్టేందుకు తంటాలు నకిలీ విత్తన కంపెనీల గుట్టు బట్టబయలవడంతో వాటి డీలర్లు, యాజమాన్యాలు రాజీ యత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. నకిలీ దందా ఓ మంత్రి, వ్యవసాయ శాఖ అధికారుల కనుసన్నల్లోనే సాగిన నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని నెమ్మదిగా కోల్డ్స్టోరేజీలోకి నెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. సాక్షి, అమరావతి బ్యూరో: నకిలీ మిర్చి విత్తనాల గండం నుంచి గట్టెక్కేందుకు వ్యవసాయ శాఖ అధికారులు తంటాలు పడుతున్నారు. ఈ విత్తనాల వ్యాపారంలో వ్యవసాయ సంయుక్త సంచాలకుల కార్యాలయంలోని కొంతమంది ఉద్యోగులు కీలకపాత్ర పోషించారు. నకిలీ దందా.. జిల్లాకు చెందిన ఓ మంత్రి, వ్యవసాయ శాఖ అధికారుల కనుసన్నల్లో సాగింది. ఈ నేపథ్యంలో నకిలీల వ్యవహారాన్ని కోల్డ్ స్టోరేజీలోకి నెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నష్టనరిహారాన్ని కంపెనీల నుంచి రాబడతామని, విత్తన యజమానులపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తున్నామని హడావుడి చేయడం తప్ప, క్షేత్ర స్థాయిలో ఈ వ్యవహారంపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. కేవలం ఆరుగురు డీలర్ల లైసన్సులు పూర్తిగా రద్దు చేయడంతో పాటు జీవా కంపెనీకి చెందిన 19 మంది డీలర్లకు, బ్రహ్మపుత్ర కంపెనీకి చెందిన 28 మంది డీలర్లకు కేవలం షోకాజ్ నోటీసులు ఇచ్చి సరిపెట్టారు. చర్యలపై వ్యవసాయ శాఖ కమిషనర్ చర్చ... వ్యవసాయ శాఖ కమిషనర్ ధనుంజయరెడ్డి వ్యవసాయ శాఖ కమిషనరేట్లోని కార్యాలయంలో గుంటూరు, ప్రకాశం జిల్లాల జేడీలు, నకిలీ విత్తనాల దర్యాప్తు కోసం నియమించిన ఆరు ప్రత్యేక బృందాలు, కమిషనరేట్లోని సీడ్ షెల్ అధికారులతో సమావేశమై ప్రత్యేకంగా చర్చించారు. కమిషనరేట్ నియమించిన ప్రత్యేక బృందాల తనిఖీల్లో వెల్లడైన అంశాలు, తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చ సాగినట్లు తెలిసింది. టీంలు ఇచ్చిన నివేదికల ఆధారంగా చర్యలు తీసుకొనే బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్కే ఉంది. ఈ నేపథ్యంలో జేడీలు ఎటువంటి చర్యలు తీసుకొంటున్నారో శుక్రవారం సాయంత్రంలోపు సమాచారాన్ని తెలియజేయాలని కమిషనర్ ఆర్.ధనుంజయరెడ్డి ఆదేశించినట్లు వ్యవసాయ శాఖ వర్గాల్లో చర్చ సాగుతోంది. నకిలీ విత్తనాలని బయటికి పొక్కగానే కొంతమంది డీలర్లు రైతులకు విత్తనాల ధర చెల్లించి, విషయం బయటకు పొక్కకుండా సరిచేసుకున్నట్లు తనిఖీ బృందాల పరిశీలనలో వెల్లడైనట్లు సమాచారం. అలాంటి విత్తనాలు సైతం ఎక్కడనుంచి వచ్చాయో ఆరా తీయాలని కమిషనర్ ఆదేశించినట్లు తెలిసింది. ఎక్కువ శాతం విత్తనాలను అనుమతి లేకుండానే విక్రయించినట్లు తనిఖీ బృందాల పరిశీలనలో తేలినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నకిలీల గుట్టు బయటపడేనా అనేది తెలుసుకోవాలంటే ఇంకా వేచిచూడాల్సి ఉంది. రాజీ ఫార్ములా సిద్ధం! జిల్లాలోని విత్తన డీలర్లు, వ్యవసాయ సంయుక్త సంచాలకులతో గురువారం సమావేశమై నకిలీ విత్తన వ్యవహారంపై చర్చించినట్లు సమాచారం. వ్యవసాయ అధికారులకు ఇబ్బంది కలుగకుండా, డీలర్లు నష్టపోకుండా మధ్యేమార్గంగా రాజీ ఫార్ములా సిద్ధం చేసినట్లు సమాచారం. రైతులకు నష్ట పరిహారంతో సంబంధం లేకుండా, విత్తనాల ధర చెల్లించి వారిని కన్విన్స్ చేయాలని అధికారులు ప్రతిపాదన తెచ్చినట్లు సమాచారం. వీరంతా నకిలీల గండం నుంచి గట్టెక్కే మార్గాలపైనే చర్చ సాగినట్లు తెలిసింది. -
కేసుల రాజీతో సమయం సద్వినియోగం
ఒంగోలు సెంట్రల్: లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడం ద్వారా సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ కె.వి.విజయకుమార్ చెప్పారు. ఒంగోలు జిల్లా కోర్టు ప్రాంగణంలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో బుధవారం ఆగస్టు 13న జరిగే జాతీయ లోక్ అదాలత్ సందర్బంగా బ్యాంకు అధికారులు, చిట్ఫండ్ సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ బ్యాంకు అధికారులు, చిట్ఫండ్ సంస్థల ప్రతినిధులు సమంజసంగా వ్యవహరిస్తే ఎక్కువ కేసులు పరిష్కారమవుతాయన్నారు. ఈ సందర్బంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యధర్శి టి.రాజా వెంకటాద్రి మాట్లాడుతూ లోక్ అదాలత్లో కేసులను రాజీ చేసుకోవడం ద్వారా కోర్టుకు కట్టిన ఫీజును తిరిగి పొందవచ్చన్నారు. జాతీయ లోక్ అదాలత్ అన్ని రకాల రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, అన్ని సివిల్ కేసులు, ప్రి లిటిగేషన్ కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమానికి న్యాయవాదులు, పోలీసుశాఖ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ బి.బి.నాగేంద్రరావు, ఫ్యామిలీ కోర్టు జడ్జి వి.మొహన్కుమార్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి వై.హేమలత, 3వ జూనియర్ సివిల్ జడ్జి జె.శ్రావణ్ కుమార్, బ్యాంకు అధికారులు, చిట్ఫండ్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.c
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement