-
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం-2023లో పాల్గొన్న సీఎం జగన్ (ఫోటోలు)
-
పోలీసులపైనా దాడులు చేశారు: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: సమాజం కోసం తన ప్రాణాన్ని బలిపెట్టడానికి సిద్ధపడిన యోధుడు పోలీస్. ఖాకీ డ్రెస్ అంటే త్యాగనీరతి అని. పోలీస్ ఉద్యోగం అనేది ఓ సవాల్.. బాధ్యత. అలాంటి పోలీస్ కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. శనివారం ఉదయం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఆయన పాల్గొని.. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బందికి నివాళులర్పించారు. ‘‘అక్టోబర్ 21 పోలీస్ అమరుల సంస్మరణ దినం. గడిచిన 64 ఏళ్లుగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ త్యాగాలను స్మరించుకునే రోజు ఈరోజు. దేశప్రజలంతా మన పోలీసులను మనసులో సెల్యూట్ చేసే రోజు. ఈ రోజున అమరులైన పోలీసులందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నా అని సీఎం జగన్ ప్రసంగించారు. విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన పోలీస్ సోదరులకు ప్రభుత్వం అన్నివిధాలుగా తోడుగా ఉంటుందని ఆయన ఉద్ఘాటించారు. విధి నిర్వహణలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. శాంతి భద్రతలను పరిరక్షించాలి. సాంకేతికతకు తగ్గట్లు అప్డేట్ కావాలి. అసాంఘీక శక్తులు చట్టాల్ని చేతుల్లోకి తీసుకోవాలనుకుంటాయి. అలాంటి వాటిని ఎప్పటికప్పుడు అణచి వేయాలి. అలాంటి దుర్మార్గుల విషయంలో ఎలాంటి మొహమాటం లేకుండా చట్టాన్ని అమలు చేయాలి. దుష్టశక్తులకు గుణపాఠం చెప్పకుంటే సమాజంలో రక్షణ ఉండదు. అంగళ్లులో ప్రతిపక్ష పార్టీ పోలీసులపై దాడులు చేయించింది. పుంగనూరులో ఘటనలో 40 మంది పోలీస్ సిబ్బందికి గాయలు అయ్యాయి. ఓ పోలీస్ కన్ను కోల్పోయారు. న్యాయమూర్తలుపైనా ట్రోలింగ్ చేస్తున్నారు. అలాంటి దుష్టశక్తుల విషయంలో కఠినంగా ఉండాలి అని పోలీసులకు సూచించారాయన. ఏపీలో పోలీస్ సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది.వైద్య, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ.. ఆరోగ్య భద్రత కల్పిస్తోంది. ఏపీతో పాటు హైదరాబాద్లో గుర్తించిన 283 ఆస్పత్రుల ద్వారా చికిత్స అందిస్తోంది. -
సమరం ముగిసి శతాబ్దం
పారిస్: మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి ఆదివారానికి ఒక శతాబ్దం పూర్తయిన సందర్భంగా ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ప్రపంచ దేశాల అధినేతలు కలిసి యుద్ధంలో చనిపోయిన సైనికులకు వర్షంలోనే ఘనంగా నివాళులు అర్పించారు. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, టర్కీల అధ్యక్షులు వరుసగా డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్, ఇమ్మాన్యుయేల్ మేక్రాన్లు, రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్, జర్మన్ చాన్స్లర్ ఏంజెలా మెర్కెల్, కెనడా, ఇజ్రాయెల్ల ప్రధానులు జస్టిన్ ట్రూడో, బెంజమిన్ నెతన్యాహు, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్, భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా మొత్తం 70 మంది నేతలు ఈ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిస్లోని చాంప్స్–ఎలైసెస్లో ఉన్న యుద్ధ స్మారకం ‘ఆర్క్ డి ట్రియంఫె’ వద్ద ఈ సంస్మరణ కార్యక్రమం సరిగ్గా ఉదయం 11 గంటలకు జరిగింది. మొదటి ప్రపంచ సమరం 1914 జూలై 28న ప్రారంభమై 1918 నవంబర్ 11న ఉదయం 11 గంటలకు ముగియడం తెలిసిందే. ఈ యుద్ధంలో పౌరులు, సైనికులు కలిసి 1.8 కోట్ల మంది మరణించగా రెండున్నర కోట్ల మందికి పైగానే గాయపడ్డారు. ఆదివారం మేక్రాన్ సారథ్యంలో దేశాధినేతలు ఆర్క్ డి ట్రియంఫె కింద ఉన్న ‘అన్నోన్ సోల్జర్ (గుర్తు తెలియని సైనికుడు)’ సమాధి వద్దకు కాలి నడకన వెళ్లారు. ఫ్రాన్స్ జాతీయగీతంతో ప్రారంభం నివాళి కార్యక్రమాన్ని ఫ్రాన్స్ జాతీయగీతం మార్సెల్లైసెను పాడి ప్రారంభించారు. ఫ్రాన్స్, దాని మిత్ర దేశాల నుంచి 3,400 మంది ప్రస్తుత, మాజీ సైనికులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ దేశాల సైనిక పాఠశాలల నుంచి పిల్లలు వచ్చి, మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణ త్యాగాలు చేసిన సైనికుల గాథలను చదివి వినిపించారు. అంతకుముందు ట్రంప్ చాంప్స్–ఎలైసెస్కు చేరుకుంటుండగా ఇద్దరు స్త్రీలు అర్ధనగ్నంగా వచ్చి ట్రంప్ వాహన శ్రేణికి అడ్డు తగిలి నిరసన తెలపగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరూ స్త్రీల హక్కుల సాధన కోసం పోరాడుతున్న ఫెమెన్ అనే బృందానికి చెందిన వారు. అనంతరం సంస్మరణ స్థలం వద్ద ట్రంప్, పుతిన్లు ఇద్దరూ కరచాలనం చేసుకుని పలకరించుకున్నారు. మెర్కెల్తోపాటు పలు ఇతర నేతలతో కూడా చేయి కలిపిన ట్రంప్.. ట్రూడోను మాత్రం పట్టించుకోలేదు. కొన్ని నెలల క్రితం ట్రూడోను ‘నిజాయితీ లేని, బలహీన వ్యక్తి’గా ట్రంప్ విమర్శించడం తెలిసిందే. జాతీయవాదం వెన్నుపోటు వంటిది ఈ సందర్భంగా ఫ్రాన్సు అధ్యక్షుడు మేక్రాన్ మాట్లాడుతూ..‘జాతీయవాదం వెన్నుపోటు వంటిది. మా ప్రయోజనాలే ముఖ్యం.. మాకు ఇతర దేశాల గురించి బాధ లేదు.. అనడం ద్వారా మన దేశాల గొప్పతనాన్ని, నైతిక విలువలను పోగొడుతున్నాం’ అంటూ పరోక్షంగా ట్రంప్ నుద్దేశించి వ్యాఖ్యానించారు. మోదీ నివాళి భారత్తోపాటు బ్రిటన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, మయన్మార్ తదితర దేశాల్లోనూ తొలి ప్రపంచ యుద్ధ సంస్మరణ కార్యక్రమాలు జరిగాయి. కామన్వెల్త్ దేశాల అధినేతలు శాంతి సందేశాలు ఇచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఓ ట్వీట్ చేస్తూ ‘భారత్ ప్రత్యక్షంగా పాల్గొనని యుద్ధమిది. అయినా మన సైనికులు కేవలం శాంతి కోసమే ప్రపంచంలో చాలా చోట్ల పోరాడారు’ అని అన్నారు. ‘తొలి ప్రపంచ యుద్ధం ముగిసి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రపంచ దేశాలన్నీ సామరస్యం, సౌభ్రాతృత్వంతో మెలిగేలా కృషి చేసేందుకు, యుద్ధం వల్ల కలిగిన విధ్వంసం పునరావృతం కాకుండా చూసేందుకు కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేస్తున్నాం’ అని మోదీ తెలిపారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ కాన్బెర్రాలో మాట్లాడుతూ ‘మన రేపటి కోసం నాడు ఆ సైనికులు వారి ‘ఈ రోజు’ను త్యాగం చేశారు’ అన్నారు. లండన్లో రాణి ఎలిజబెత్, ప్రధాని థెరెసా మే తదితరులు వేలాది మందితో కలిసి యద్ధంలో చనిపోయిన పౌరులకు నివాళులర్పించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య కరచాలనం -
పోలీసు అమరులకు వందనం..
వరంగల్ క్రైం: విధి నిర్వహణలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు 64 మంది పోలీసులు అమరులయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రాణత్యాగాలు చేసిన వారి కోసం ఏటా పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 15 నుంచి 21 వరకు నిర్వహించేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసుల పని తీరును ప్రజలు, యువత, విద్యార్థులకు తెలియజేసేందుకు ప్రతి పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ నిర్వహించనున్నారు. ట్రైసిటీగా పేరుగాంచిన వరంగల్, హన్మకొండ, కాజీపేటలో విద్యార్థుల కోసం పోలీసు కమిషనరేట్లోని రాణిరుద్రమ దేవి ప్రాంగణంలో ఓపెన్ హౌస్కు ఏర్పాట్లు చేశారు. పోలీసులువిధి నిర్వహణలో ఉపయోగించే ఆయుధాలతోపాటు బాంబు డిస్పోజల్, క్లూస్, ఫింగర్ ప్రింట్స్, డాగ్స్క్వాడ్, కమ్యూనికేషన్ విభాగాలకు సంబంధించిన స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులకు ప్రతిభా పోటీలు.. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా సోమవారం నుంచి 21వ తేదీ వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపెన్ హౌస్ ప్రదర్శన కొనసాగేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా విద్యార్థులు, సిబ్బందికి వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నారుు. పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు ఈనెల 21న నిర్వహించే స్మృతి పరేడ్లో బహుమతులు అందజేయనున్నారు. రక్తదాన శిబిరాలు పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసు కమిషనరేట్ పరిధిలోని డివిజన్ కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఈ నెల 20న సాయంత్రం ఏడు గంటలకు హన్మకొండలోని అశోక జంక్షన్ నుంచి కమిషనరేట్ కార్యాలయం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించనున్నారు. 21న అమరవీరుల స్థూపం వద్ద స్మృతి పరేడ్ నిర్వహించి పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించడంతో వారోత్సవాలు ముగియనున్నాయి. విజయవంతం చేయాలి.. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన పోలీసు అమరవీరులను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఓపెన్హౌస్, రక్తదాన శిబిరాలు, ప్రతిభా పోటీల్లో పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు, అధికారులు, ప్రజలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి. – డాక్టర్ విశ్వనాథ రవీందర్, వరంగల్ పోలీసు కమిషనర్ -
పోలీసుల త్యాగాలకు విలువ కట్టలేం
ఏలూరు అర్బన్ : నేటి సమాజ శాంతి సౌభాగ్యాలు నాటి పోలీసు అమరవీరుల త్యాగ ఫలమేనని, సమాజంలో శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసులు చేస్తున్న త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర మంత్రి పీతల సుజాత అన్నారు. స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో శుక్రవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. మంత్రి ముఖ్య అతిథిగా హాజరై పోలీసు అమరవీరులకు ఘన నివాళులర్పించారు. పోలీసు అంటేనే ఒక ధైర్యమని, కంటిమీద కునుకు లేకుండా శాంతిభద్రతల రక్షణకు పాటు పడే మహావీరులు వారు అని కొనియాడారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రావాల్సిన రాయితీలు ఎప్పటికపుడు అందించడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ పోలీసులకు ఎవరిమీదా పగ ఉండదని, సంఘ విద్రోహశక్తులపైనే పీచమణచడంపైనే వారి దృష్టి ఉంటుందని అన్నారు. పోలీసు క్వార్టర్లలో పోలీసు కుటుంబాలకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని పోలీసు అధికారులకు ఆయన సూచించారు. మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ పోలీసులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలన్నారు. ఎస్పీ భాస్కర్ భూషణ్ మాట్లాడుతూ జన్మభూమిని రక్షించుకోవడంలో అనేక మంది జవానులు వీరమరణం పొందారని, వారు చేసిన ప్రాణత్యాగం ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. ఈ సంవత్సరం 473 మంది పోలీసులు దేశంకోసం ప్రాణాలు అర్పించారని, వారందరికీ శతకోటి వందనాలు అంటూ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, కార్టూన్, పెయింటింగ్ వంటి పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లోని అమరవీరుల స్థూపం నుంచి ఆర్ఆర్పేట మీదుగా ఫైర్స్టేçÙన్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఇన్చార్జి కలెక్టర్ పి.కోటేశ్వరరావు, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, పితాని సత్యనారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
ఎక్కడో కూర్చోని మాట్లాడతారు.. వారిని నేను పట్టించుకోను: కోహ్లి
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement