-
జాక్పాట్ దగా..!
పండ్లు, కూరగాయల రైతులకు మార్కెట్లో రుసుం రద్దుచేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 4న ఉత్తర్వులు జారీచేశారు. మార్కెట్ యార్డులు, చెక్పోస్టుల్లో కమీషన్ ఏజెంట్ల వ్యవస్థను రద్దుచేశారు. ఇందుకు సంబంధించి జీఓ ఎంఎస్ నంబర్ 58ను తీసుకువచ్చారు. మదనపల్లె మార్కెట్లో ఏమాత్రం మార్పు రాలేదు. సీఎం ఆదేశాలు బేఖాతర్ చేస్తూ ఇష్టారాజ్యంగా కమీషన్ల వసూళ్లకు పాల్పడుతూ జాక్పాట్ విధానాన్ని కొనసాగిస్తున్నారు. సాక్షి, మదనపల్లె టౌన్ : అన్నదాతకు ఆసరాగా నిలవాల్సిన మార్కెటింగ్ శాఖ అధికారులు దళారులకే అండగా నిలుస్తున్నారు. దీంతో రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. దళారీలతో అధికారుల కుమ్మక్కై ఈ–వేలానికి మంగళం పలికి జాక్పాట్ విధానాన్నే నేటికీ కొనసాగిస్తున్నారు. దీంతో రోజుకు రైతులు లక్షల్లో నష్టపోతుండగా ప్రభుత్వ ఆదాయానికి వేలల్లో గండిపడుతోంది. రాష్ట్రంలోనే అతి పెద్ద మార్కెట్గా పేరుపొందిన మదనపల్లె టమాట మార్కెట్ యార్డుకు సరాసరిన 400 టన్నుల టమాటాలు వస్తున్నాయి. ప్రస్తుతం పది కిలోల టమాటాలు రూ.380 నుంచి రూ.400 వరకు ధర పలుకుతున్నాయి. ఇలా రోజుకు 4 లక్షల కిలోల టమాటాలు మార్కెట్కు వస్తున్నాయి. వాటికి ప్రస్తుత ధరతో పోల్చుకుంటే రూ.1.52 కోట్ల వ్యాపారం జరుగుతోంది. ఈ వ్యాపారంలో జాక్పాట్, కమీషన్ విధానంతో సుమారు రైతులకు దాదాపు రూ.7.23 లక్షల మేర నష్టం కలుగుతోంది. ఈ లెక్కన మార్కెట్ అధికారులు నెలవారీ చూపించే వ్యాపార లావాదేవీల్లో నామమాత్రపు వ్యాపారం చేస్తున్నట్లు తప్పుడు నివేదికలు చూపుతున్నారనే సమాచారం ఉంది. మార్కెట్లో దాదాపు 100కు పైగా మండీల యజమానులు ఉన్నారు. ఒక కమీషన్ మండీ ఏజెంట్ నెలకు రూ.50 లక్షల వ్యాపారం నిర్వహిస్తే రూ.10 లక్షలు మాత్రమే చేస్తున్నట్లు అధికారులకు నివేదికలు పంపుతున్నారు. మార్కెట్ యార్డుకు సెస్, వ్యాపార కమీషన్ల ద్వారా సంవత్సరానికి రూ.1.90 కోట్లు వరకు ఆదాయం చేకూరుతోంది. మార్కెట్ యార్డులో రైతులకు, వ్యాపారికి నేరుగా ఎటువంటి సంబంధాలు ఉండవు. రైతు తీసుకొచ్చిన సరుకు కమీషన్ ఏజెంట్ ద్వారా విక్రయాలు జరుగుతాయి. కమీషన్ ఏజెంట్లు వ్యాపారుల మధ్య ముందుగానే వ్యాపారలావాదేవీల ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రైతు, వ్యాపారికి కమీషన్ ఏజెంటే మధ్యవర్తిగా వ్యవహరించి టమాటాలను జాక్పాట్, కమీషన్ పద్ధతిలో బహిరంగ వేలం నిర్వహిస్తాడు. వ్యాపారి నుంచి నగదును తీసుకుని తన కమీషన్ మినహా మిగిలిన మొత్తాన్ని రైతుకు అందజేస్తాడు. సీఎం ఉత్తర్వులు బేఖాతర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత వారం రైతులు పండించే పంటలకు కమీషన్ రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నిబంధనలను ఇక్కడి అధికారులు మాత్రం ఖాతరు చేయడంలేదు. వ్యాపారులు, మండీల నిర్వాహకులతో కుమ్మక్కై యథేచ్ఛగా రైతుల శ్రమను దోపిడీ చేస్తున్నారు. మోసం జరుగుతోంది ఇలా.. రైతులు తీసుకువచ్చిన టమాటాలను తనకు ఇష్టమొచ్చిన కమీషన్ మండీల్లో విక్రయించేందుకు సంబంధిత కమీషన్ ఏజెంట్తో వ్యాపారి ముందుగానే ఒప్పందం కుదర్చుకుంటారు. ఉదాహరణకు మండీకి ఓ రైతు 50 క్రేట్లు టమాటాలు తీసుకెళ్తే కమీషన్ ఏజెంటు 10 క్రేట్లకు ఒక క్రేట్ (35 కేజీలు) జాక్పాట్ కింద తీసుకుంటాడు. క్రేట్కు లెక్కప్రకారం 30 కేజీలు భర్తీ చేయాల్సివుండగా అదనంగా ఐదు కిలోలు మండీ వ్యాపారులు తీసుకుంటున్నారు. 50 క్రేట్లకు గాను ఐదు క్రేట్లు జాక్పాట్ కింద ఉచితంగా తీసుకుంటాడు. వంద క్రేట్లకు పది క్రేట్లు బలవంతంగా రైతుల నుంచి కమీషన్ మండీల నిర్వాహకులు తీసుకుంటారు. వీటిని వాస్తవిక లెక్కల్లో చూపరు. ఈ కాయలు అమ్మగా వచ్చిన మొత్తాన్ని వ్యాపారి, అధికారులతోపాటు మండీల నిర్వాహకులు పంచుకుంటారు. తరుగు పేరుతో మెలిక ఒక క్రేట్ టమాటాలను రూ.500 వేలం పాటలో పాడితే రైతుకు డబ్బులు ఇచ్చే బిల్లులో తరుగు పేరుతో మెలిక పెట్టి రూ.10 నుంచి 20 తగ్గించి రూ.480 మాత్రమే అందజేస్తున్నారు. బిల్లు ఇచ్చే సమయంలో ప్రభుత్వం నాలుగు శాతం కమీషన్ తీసుకోవాలని నిబంధనలు ఉన్నా ఏజెంట్లు దీన్ని 10 నుంచి 30 శాతానికి పైగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలా వసూలు అయిన దాంట్లో మండీ ఓనర్కు క్రేట్ల బాడుగ పేరుతో రూ.5 నుంచి 10 రూపాయలు, దింపే కూలీలకు లెస్ పేరుతో మరో రూ.5, నూటికి రూ.10 కమీషన్, వ్యాపారికి రిటర్న్ కమీషన్ తీసేస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఇలా చివరగా 100కి రూ.10 కమీషన్ పట్టుకుంటూ డబ్బులు ఇచ్చే సమయంలో కాయలు నాణ్యత లేవనో, తరుగు ఉందనో ధరల్లో కోత విధిస్తున్నారు. ఈ నింబ«ంధనలన్నీ పట్టించుకోకుండా అధికారులు గాలికి వదిలివేయడంతో కమీషన్ మండీల నిర్వాహకులకు, వ్యాపారులకు వరంగా మారింది. అంతా చట్టవిరుద్ధం మదనపల్లె టమాటా మార్కెట్లో ఈ–వేలం పద్ధతిలో టమాటాలను రైతుల నుంచి మండీల నిర్వాహకులు, వ్యాపారులు మార్కెట్ అధికారులు కలసి ముందుగానే రైతులతో సమావేశమై ఆన్లైన్ విధానంతో ధరలు నిర్ణయిస్తారు. నాణ్యతను బట్టి ధరలు పలుకుతాయి. ఇలా చేయడం వల్ల రైతులు ఎక్కువ శాతం కమీషన్ నష్టపోకుండా ఉంటారు. జాక్పాట్ లేకుంటే రైతులకు మంచి లాభాలు ఉంటాయి. నష్టాలు ఉండవు. అయితే ఇక్కడంతా చట్టవిరుద్ధం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులు మార్కెట్లోని మండీలకు తీసుకువచ్చిన టమాటాలను ఈనాం పద్ధతిలో వేలం వేస్తున్నామని మార్కెట్ అధికారులు రికార్డుల్లో నమోదుచేస్తూ బహిరంగ వేలం ద్వారా క్రయ, విక్రయాలు నిర్వహిస్తూ రైతులను బహిరంగంగానే మోసం చేస్తున్నారు. మార్కెట్ అధికారులే దగ్గరుండి మరీ రైతులను ఏమార్చి నష్టపరస్తున్నారు. రైతులతో సమావేశం ఏర్పాటు చేస్తా పదిహేను రోజులు గడువిచ్చాం.. ట్రేడర్ లైసెన్సులు పొందాలి. నోటీసులు ఇచ్చి రద్దుపరచినట్లు తెలియజేశాం. కమీషన్ తీసుకోకూడదని చెప్పాం. అన్ని మార్కెట్లలో వ్యాపారులు మాట్లాడుకుంటున్నారు. మార్కెట్ యార్డులో జాట్పాట్ పద్ధతి లేకుండా చేస్తా. ఇందుకోసం త్వరలో టమాటా రైతులతో సమావేశం ఏర్పాటుచేస్తాం. రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటాం. అధిక కమీషన్ వసూలుచేసే వారిపై కఠిన చర్యలకు ఉన్నతాధికారులకు నివేధిస్తాం. – జగదీష్, మార్కెట్ ఇన్చార్జి సెక్రటరీ, మదనపల్లె -
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె
సాక్షి, పెద్దపల్లిరూరల్ : గౌరవ వేతనం చెల్లించడంతోపాటు పాత బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని రేషన్డీలర్లు జిల్లా కేంద్రంలో శుక్రవారం భిక్షాటన చేసి నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బండారి వెం కటేశం మాట్లా డుతూ... కేంద్ర ప్రభుత్వం 2015 అక్టోబర్ నుంచి పెంచిన కమీషన్, పాత బకాయిలు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యంచేయడం తగదన్నారు. గత ఏడాది డిసెంబర్లో ఈ విషయమై ప్రభుత్వానికి విన్నవించుకున్నా... ఇప్పటికి ఫలితం లేదని వాపోయారు. బకాయి ఉన్న 400 కోట్ల రూపాయల కమీషన్ను వెంటనే చెల్లించి ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం అందిస్తున్న బియ్యం పంపిణీతో తమకు అందే కమీషన్ రేటు సరిపోవడంలేదన్నారు. నెలాఖరులోగా ప్రభుత్వం స్పందించకుంటే వచ్చేనెల ఒకటి నుంచి సమ్మె చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీలర్ల సంఘం నాయకులు మద్దెల నర్సయ్య, ఎలబోతారం శంకరయ్య, అడిచెర్ల రమేశ్, నంబయ్య, పెర్క లింగయ్య, కిషన్రెడ్డి, జయప్రద, పద్మ, సరస్వతీ, భారతీ, శ్రీనివాస్, ప్రభంజన్రెడ్డి, తోట శ్రీనివాస్, సత్యం, సాదిక్పాషా పాల్గొన్నారు. -
మరుగుదొడ్లనూ వదల్లేదు
సాక్షి, అమరావతి : పోలవరం కాంట్రాక్టుల్లో కొల్లగొట్టిన అధికార పార్టీ నేతలు మరుగుదొడ్లనూ విడిచిపెట్టటం లేదు. అక్కడ అంచనాలు పెంచి దండుకుంటుండగా... ఇక్కడ స్వచ్ఛంద సంస్థల ముసుగులో కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి కాజేస్తున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో అసలు కాంట్రాక్టరు వ్యవస్థకే చోటు లేదు. నిర్మించుకున్న లబ్ధిదారుడికే నేరుగా బిల్లులు చెల్లించాలి. అయితే అధికార పార్టీ నేతలు స్వచ్ఛంద సంస్థల పేరుతో వీటిని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఉన్నవారికి కొత్తవి మంజూరు చేసి బిల్లులు చేసుకోవడం, ఒకే ఇంట్లో ఇద్దరి పేర్లతో రెండు మంజూరు చేయించడం, ఒకటే కట్టి రెండింటికి బిల్లులు చేసుకోవటం, అసలు కట్టకుండానే డబ్బులు డ్రా చేయటం లాంటి అక్రమాలకు పాల్పడుతు న్నారు. చాలా మంది పేదలు నిర్మాణ పనులన్నీ స్వయంగా చేపడుతున్నారు. అయితే కాంట్రాక్టర్లుగా మారిన అధికార పార్టీ నేతలు సిమెంట్, ఇసుక లాంటివి ఇచ్చి బిల్లు మాత్రం మొత్తం వారే తీసుకుంటున్నారు. స్వచ్ఛ భారత్ పథకంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండాలన్న ఉద్దేశంతో కేంద్రం భారీగా నిధులు అందజేస్తోంది. గత మూడేళ్లలో రాష్ట్రంలో ఈ కార్యక్రమానికి విడుదల చేసిన నిధుల్లో రూ.600 కోట్లు కాంట్రాక్టర్ల అవతారమెత్తిన అధికార పార్టీ నేతలు వెనకేసుకున్నట్లు అంచనా. రూ.600 కోట్లు దొడ్డి దారిన స్వాహా! స్వచ్ఛ భారత్లో భాగంగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో గత మూడేళ్లలో 12.57 లక్షల మరుగుదొడ్లు కట్టినట్లు రికార్డుల్లో చూపించి రూ.1,813 కోట్లు బిల్లులు చేసుకున్నారు. నిర్మాణంలో ఉన్న మరో 2.92 లక్షల దొడ్లకు రూ.158 కోట్లు ఖర్చయిందని చెబుతున్నారు. పథకం కింద ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రభుత్వం రూ.12 వేల చొప్పున చెల్లిస్తోంది. ఇందులో కేంద్రం రూ.7200, రాష్ట్ర ప్రభుత్వం రూ.4800 ఇస్తున్నాయి. కేంద్రం సూచించినట్లుగా పెద్ద సైజులో మరుగుదొడ్డికి కట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.మూడు వేలు కలిపి మొత్తం రూ. 15 వేలు ఇస్తోంది. రాష్ట్రంలో మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్రం గత మూడేళ్లలో రూ.992 కోట్లు విడుదల చేసింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.838 కోట్లు కలిపి మొత్తం రూ.1,830 కోట్లను విడుదల చేసింది. ఇందులో మూడో వంతు అంటే రూ.600 కోట్లు కాంట్రాక్టర్ల అవతారమెత్తిన అధికారపార్టీ నేతల జేబుల్లోకే చేరినట్లు అంచనా. ఈ కమీషన్లు కింది స్థాయి నుంచి పెద్ద స్థాయి నేతల వరకూ పంచుకుంటున్నారు. పంచాయతీ తీర్మానం పేరుతో పంపకాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ టీడీపీ నేతలు మరుగుదొడ్ల నిర్మాణంలో అక్రమాలకు పాల్పడ్డారు. చాలా చోట్ల లబ్ధిదారులకు అసలు మరుగుదొడ్డి మంజూరు అయినట్టు కూడా తెలియకపోవటం గమనార్హం. వారి పేరుతో చెల్లింపులు మాత్రం జరిగిపోయాయి. గ్రామ సభ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉండగా అదేమీ లేకుండా అధికారులపై ఒత్తిడి తెచ్చి తాము చెప్పిన పేర్లతో మంజూరు చేయించారు. అవన్నీ తామే నిర్మిస్తామంటూ గ్రామ పంచాయతీ తీర్మానం చేసినట్లు పంపటంతో అధికారులు నేరుగా వారికే బిల్లులు చెల్లిస్తున్నారు. పదేళ్ల క్రితం కట్టిన వాటికీ బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా ప్రకటించిన పశ్చిమ గోదావరిలోని నల్లజర్ల మండలం చీపిరిగూడెంకు గత మూడేళ్లలో రూ. 55.95 లక్షలు మంజూరు కాగా అందులో రూ. 37.20 లక్షలు గ్రామానికి చెందిన ముగ్గురు టీడీపీ నేతల ఖాతాల్లోనే జమ అయ్యాయి. గ్రామ సర్పంచి చెల్లు ఎస్ఎస్ వరలక్ష్మి (బ్యాంకు ఖాతా నెంబరు 558938779, ఇండియన్ బ్యాంకు, నల్లజర్ల) రూ. 13.20 లక్షలు, తలంశెట్టి చినవెంకటేశ్వర్లు( బ్యాంకు ఖాతా నెంబరు 20269213265, ఎస్బీఐ, నల్లజర్ల) రూ. 12 లక్షలు, కూసంపూడి వెంకటేశ్వరరావు (బ్యాంకు ఖాతా నెంబరు 20162344981, ఎస్బీఐ నల్లజర్ల) రూ. 12 లక్షలు డ్రా చేసుకున్నారు. సర్పంచి వరలక్ష్మి ఇంట్లో ఎప్పుడో పదేళ్ల కిందట నిర్మించుకున్న పాత మరుగుదొడ్డికి కొత్తగా నిర్మించినట్టు బిల్లులు చెల్లించారు. ఒకే ఇంటికి చెందిన మామ కోడళ్లు చెల్లు వెంకటేశ్వర్లు, శిరీష పేరిట రెండింటిని మంజూరు చేయించి ఒక బిల్లు తాలూకు డబ్బులు నేతలే కాజేశారు. సూరమ్మ అనే వృద్ధురాలికి మంజూరైన మరుగు దొడ్డిని ఆమె ఇంట్లో కాకుండా మరోచోటకట్టారు. అదే ఊరిలో మరుగుదొడ్డి మంజూరు కాక నిర్మాణం మధ్యలో వదిలేసుకున్న వారూ ఉన్నారు. ఇద్దరు టీడీపీ నేతల ఖాతాల్లోకి రూ. 63.60 లక్షలు పశ్చిమ గోదావరి జిల్లాలోనే నల్లజర్ల మండలం తెలికిచెర్ల గ్రామానికి రూ. 102.30 లక్షలు విడుదల కాగా అందులో రూ. 63.60 లక్షలు ఇద్దరు టీడీపీ నేతల ఖాతాల్లోకే చేరాయి. గ్రామానికి చెందిన కామన విజయకుమార్ (బ్యాంకు ఖాతా నెంబరు 62206957261, ఎస్బీహెచ్, నల్లజర్ల) రూ. 49.95 లక్షలు, బండి సుబ్బారావు (బ్యాంకు ఖాతా నెంబరు 702101000059021, ఆంధ్రాబ్యాంకు, నల్లజర్ల) రూ. 13.65 లక్షలు డ్రా చేసుకున్నారు. పాత మరుగుదొడ్లకూ నిధులు మంజూరు చేయించుకున్నారు. కొందరు లబ్ధిదారులకు మాత్రం రూ. ఆరు వేల చొప్పున ఇచ్చారు. అబ్బూరులో దొడ్లపై సర్పంచి శిలా ఫలకాలు గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం అబ్బూరుకు గత మూడేళ్లలో 482 మరుగుదొడ్ల మంజూరు కాగా అవన్నీ తానే కట్టినట్లు సర్పంచి కట్టా రమేష్ రూ. 72.81 లక్షలు తన ఖాతాలో జమ చేసుకున్నారు. ప్రతి మరుగుదొడ్డిపైనా ఆయన పేరుతో శిలాఫలకాలు సైతం ఏర్పాటు చేసుకోవటం గమనార్హం. అబ్బూరులో గద్దె వెంకట్రావు అనే వ్యక్తి మరుగుదొడ్డి గుంట నిర్మాణం చేపట్టి సిమెంట్ రేకులు సొంతంగా కొనుగోలు చేసుకున్నారు. ఆయనకు రావాల్సిన బిల్లు రమేష్ ఖాతాకే జమ అయింది. అక్కడ ఎస్టీ కాలనీలో 55 దాకా ఇళ్లు ఉంటే 68 మరుగుదొడ్లు నిర్మించినట్టు బిల్లులు చూపుతున్నారు. ఆరు లక్షల దొడ్లకు కేంద్రం కోత మరుగుదొడ్ల నిర్మాణంలో అక్రమాలు చోటుచేసుకోవటంతో రాష్ట్రానికి ఆరు లక్షల మరుగుదొడ్లను కేంద్రం కోత విధించింది. 2012 బేస్ లైన్ సర్వే ప్రకారం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 71.20 లక్షల నివాసాలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే ఉన్నవి పోగా ఏపీలో ఇంకా 28.20 లక్షల ఇళ్లలో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక అందజేసి నిధులు కోరింది. అయితే ఇప్పటికే మంజూరు చేసినవి పోనూ వీటి సంఖ్య 22.60 లక్షలకు మించి ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో దాదాపు 6 లక్షల మరుగుదొడ్లకు కోత విధిస్తున్నట్లు రాష్ట్రానికి సమాచారమిచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం చీపిరిగూడెంలో భీమడోలు ఏసమ్మ (లబ్ధిదారురాలి నెంబరు 30958020) పేరుతో బిల్లులు మంజూరైనట్లు రికార్డుల్లో ఉన్నా డబ్బులు అమెకు చేరలేదు. డబ్బులేక ఆమె కుటుంబం మధ్యలోనే నిర్మాణాన్ని ఆపేసింది. ప్రభుత్వం మాత్రం ఆ గ్రామాన్ని బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా ప్రకటించింది. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం తెలికిచెర్లలో ముంగర సత్తెమ్మకు పథకం మంజూరైందని టీడీపీ నేత చెప్పటంతో ఆమె కుమారుడు వెంకటేశ్వర్లు అప్పు చేసి మరుగుదొడ్డి కట్టుకున్నాడు. పనులు పూర్తయ్యాక బిల్లు కోసం ఆ ఊరి నేత వద్దకు వెళ్లగా మంజూరు కాలేదని చెబుతున్నారు. కానీ సత్తెమ్మ (30941761 లబ్ధిదారుడి నెంబరు)కు ఏడాది కిందటే బిల్లులు చెల్లింపులు పూర్తయినట్టు అన్లైన్ డేటాలో ఉంది. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం పలుదేవర్లపాడులో పాత మరుగుదొడ్డికి బిల్లు మంజూరు చేయలేదని స్థానిక టీడీపీ నేత ఒకరు ఏడాది క్రితం ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుడిపై దాడి చేశారు. ‘గ్రామంలో 78 మరుగుదొడ్లు మంజూరయ్యాయి. వాటిల్లో 50 మరుగుదొడ్లను టీడీపీ నాయకులే నిర్మించారు. మిగిలిన వాటిల్లో కొన్ని గతంలో నిర్మించినవి కాగా మరికొన్ని అసలు కట్టకుండానే బిల్లులు చెల్లించాలని పంచాయతీ కార్యదర్శి పట్ల, నాపై బెదిరింపులకు దిగారు. వారి మాట వినకపోవటంతో టీడీపీ నాయకులు గ్రామసభలో దాడి చేసి గాయపరిచారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. అధికారులపై ఒత్తిడి తెచ్చి నన్ను ఉద్యోగం నుంచి కూడా తొలగించారు’’ అని ఫీల్డ్ అసిస్టెంట్ యనమాల ఎడ్వర్డ్ ‘సాక్షి’కి తెలిపారు. మరుగుదొడ్ల నిర్మాణానికి నాలుగేళ్లుగా విడుదలైన నిధులు(రూ. కోట్లలో) రాష్ట్ర నిధులు - 838.16 కేంద్ర నిధులు - 992.06 మొత్తం - 1830.22 స్వాహా చేసింది - 600 గుంటూరు జిల్లాలో గంపగుత్తగా మరుగుదొడ్ల నిర్మాణ కాంట్రాక్టు పనులు చేసిన సర్పంచి కట్టా రమేష్ ప్రతి దొడ్డిపైనా తన పేరుతో వేసుకున్న శిలాఫలకం బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా ప్రకటించిన గుంటూరు జిల్లా అబ్బూరులో ఇప్పటికీ మరుగుదొడ్డి లేని ఓ ఇల్లు పశ్చిమ గోదావరి జిల్లా చీపిరిగూడెం గ్రామంలో ప్రభుత్వ పథకంలో సమర్త మరియమ్మ ఇంట్లో గ్రామ సర్పంచే నిర్మించారు. మూడు నెలలకే రోడ్డుపైన అది ఉందని కూల్చిన వేసిన వైనం. ఛీపిరిగూడెం గ్రామంలో ఈమె పేరుతో మరుగుదొడ్డి మంజూరు అయింది. అయితే ఊళ్లో ఇంకొక చోట ఎక్కడో నిర్మించినట్టు నేతలు చెప్పడం డబ్బుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్న వృద్ద మహిళ. -
కొత్త జిల్లాలపై లీగల్ కమిషన్ నియమించాలి
తండ్రీ కొడుకుల కుట్రల్ని భగ్నం చేస్తాం శంషాబాద్ జిల్లాను రద్దు చేయండి సిరిసిల్ల జిల్లా ఇవ్వండి మంత్రి కేటీఆర్ క్యాట్వాక్ చేస్తున్నారు జిల్లా కోసం బహిరంగ సభ పెట్టండి టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి సిరిసిల్ల : తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు, విధివిధానాలపై సిట్టింగ్ జడ్జితో లీగల్ కమిషన్ నియమించాలని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో జరుగుతున్న జిల్లా సాధన ఉద్యమానికి ఆయన మంగళవారం సంఘీభావం తెలిపారు. సిరిసిల్ల ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే కేటీఆర్ రాష్ట్ర మంత్రి అయి సమంతతో క్యాట్వాక్ చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో తండ్రీ కొడుకుల కుట్రలను కళ్లు తెరిచి భగ్నం చేయాలని రేవంత్రెడ్డి కోరారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనుల్లో కోట్ల ముడుపులు దండుకున్నారని ఆరోపించారు. సిరిసిల్ల ప్రజలు జిల్లా కోసం ఉద్యమిస్తుంటే ప్రజల పక్షాన ఉండి జిల్లా ఏర్పాటు చేయాల్సిన మంత్రి పోరాడే బిడ్డలపై లాఠీఛార్జి చేయించడం ఏమిటని ప్రశ్నించారు. అధికార మదంతో కళ్లు మూసుకుపోయి మహిళలపై లాఠీచార్జి చేశారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ బంధువులకు శంషాబాద్లో వందల ఎకరాలున్నాయని జిల్లా చేస్తున్నారని ఆరోపించారు. శంషాబాద్ను రద్దు చేసి సిరిసిల్లను జిల్లా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కావాలని అక్కడ ఎవరూ అడుగడం లేదన్నారు. సిరిసిల్ల ప్రజలకు టీడీపీ పార్టీ అండగా ఉంటుందని, జిల్లా కోసం సిరిసిల్లలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలన్నారు. అన్ని పార్టీల వారితో సభ నిర్వహించాలని సూచించారు. సిరిసిల్ల జిల్లా కోసం శాసనసభలో గళం విప్పుతానని ఆయన స్పష్టం చేశారు. సిరిసిల్ల జిల్లా ఇవ్వకుంటే టీఆర్ఎస్ దిమ్మెలు కూల్చాలన్నారు. ఈ కార్యక్రమంలో ఓయూ జేఏసీ చైర్మన్ దరువు ఎల్లన్న, జిల్లా సాధన జేఏసీ నేతలు రమాకాంత్రావు, కత్తెర దేవదాస్, అన్నమనేని నర్సింగరావు, మహేశ్గౌడ్, జక్కుల యాదగిరి, ఆడెపు రవీందర్, బుస్సా వేణు పాల్గొన్నారు. -
బాధిత కుటుంబాలకు అన్ని విధాలా న్యాయం
ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ బిఉప్పులూరు(కొలిమిగుండ్ల): పాణ్యం మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్ సమీపంలో దారుణ హత్యకు గురైన ధారా ఓబులేసు, లక్ష్మయ్య కుటుంబాలకు అన్ని విధాలా న్యాయం జరిగేలా చూస్తానని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ హామీ ఇచ్చారు. కోర్టు వాయిదాకు వచ్చి వెళుతుండగా మంగళవారం అన్నదమ్ములిద్దరు హత్యకు గురైన విషయం తెలిసిందే. పోస్ట్మార్టం అనంతరం బుధవారం మృతదేహాలను స్వగ్రామం బి.ఉప్పులూరుకు తీసుకొచ్చారు. కలెక్టర్ సీహెచ్ విజయ్మోహన్,ఎస్పీ ఆకే రవికృష్ణతో కలిసి చైర్మన్ గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. దోషులను ఎప్పటిలోగా పట్టుకుంటురో చెప్పాలని ఎస్పీని చైర్మన్ కోరారు. పథకం ప్రకారం జరిగిన ఈ హత్యను పోలీసులు ముందుగానే పసిగట్టలేకపోయారా అని అసహనం వ్యక్తం చేశారు. ఎస్సీ కాలనీ వాసులకు గట్టి భద్రత కల్పించాలని పోలీస్ అధికారులకు సూచించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి తక్షణ సాయంగా రూ.6.50 లక్షలు అందించాలని కలెక్టర్ను కోరారు. ఓబులేసు, లక్ష్మయ్య భార్యలకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. జంట హత్యను జిల్లా యంత్రాంగం తీవ్రంగా పరిగణిస్తోందని కలెక్టర్ విజయ్మోహన్ చెప్పారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా గట్టిగా వ్యవహరిస్తామని తెలిపారు. హత్యకు పాల్పడిన నిందితులను నాలుగు రోజుల్లో అదుపులోకి తీసుకుంటామని ఎస్పీ అన్నారు. కార్యక్రమంలో నంద్యాల ఆర్డీఓ సుధాకరరెడ్డి, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ వినోద్కుమార్, ఆళ్లగడ్డ డీఎస్పీ ఈశ్వరరెడ్డి, కోవెలకుంట్ల, శిరివెళ్ల, ఆళ్లగడ్డ సీఐలు పీటీ కేశవరెడ్డి, ప్రభాకరరెడ్డి, ఓబులేసుతో పాటు సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు, ఎస్సీ, ఎస్టీ సెల్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement