breaking news
Coalition troops
-
అవినీతి నిర్మూలనే మా సిద్ధాంతం: మోదీ
న్యూఢిల్లీ: అవినీతి, దుష్పరిపాలన, జాతి వ్యతిరేక విధానాలే ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి అజెండా అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. అవినీతిని, బుజ్జగింపు రాజకీయాలను నిర్మూలించాలన్నదే తమ సిద్ధాంతమని అని తేలి్చచెప్పారు. ప్రజా సంక్షేమం ద్వారానే దేశ సంక్షేమం సాధ్యమని తాము విశ్వసిస్తున్నామని తెలిపారు. పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి పథకం లబి్ధదారులతో ప్రధాని మోదీ గురువారం సమావేశమయ్యారు. ఈ పథకంతో లక్షలాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నా యని వెల్లడించారు. వీధి వ్యాపారులకు బ్యాంకుల వడ్డీకే తక్కువ రుణ సదుపాయం లభిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటిదాకా 62 లక్షల మందికి రూ.11,000 కోట్లకుపైగా రుణాలు ఇచి్చనట్లు తెలియజేశారు. -
యెమెన్ పోరులో 114 మంది మృతి
మిలిటెంట్లు, సేనల మధ్య కొనసాగుతున్న ఘర్షణలు మరో 1,052 మంది భారతీయులను కాపాడిన ప్రభుత్వం ఆడెన్: యెమెన్లో రక్తపుటేర్లు పారుతూనే ఉన్నాయి. హుతీ మిలిటెంట్లు, భద్రతా బలగాల మధ్య సాగిన భీకర పోరులో సోమవారం ఆడెన్లో 114 మంది చనిపోయారు. ఈ తీరప్రాంత పట్టణాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు మిలిటెంట్లు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. వారిని సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు ప్రతిఘటిస్తున్నాయి. మృతుల్లో 19 మంది తీవ్రవాదులు, 15 మంది అధ్యక్షుడి మద్దతుదారులు ఉన్నట్లు తెలుస్తోంది. 53 మంది సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అబ్యాన్ రాష్ట్రంలో కూడా ఏడుగురు పౌరులు మరణించారు. లాహ్జ్కు సమీపంలో సంకీర్ణ సేనలు తాజాగా జరిపిన వైమానిక దాడిలో 10 మంది రెబెల్స్ చనిపోయారు. ఇరుపక్షాలు తక్షణమే ఒక ఒప్పందానికి వచ్చి కాల్పులకు విరమణ ప్రకటించాలని రెడ్క్రాస్ సొసైటీ విజ్ఞప్తి చేసింది. పౌరులకు తాగునీరు, ఆహారం, వైద్యసాయం అందించేందుకు సహకరించాలని కోరింది. కాగా, భారత్ సోమవారం యెమెన్ నుంచి మరో 1052 మందిని రక్షించింది. ఇప్పటివరకు ఆ దేశం నుంచి కాపాడిన భారతీయుల సంఖ్య 3,300 కు చేరింది. యెమెన్ నుంచి భారతీయుల తరలింపునకు కృషి చేస్తున్న ప్రభుత్వ విభాగాలను ప్రధాని మోదీ ప్రశంసించారు. ప్రజలకు సాయం అం దించాలన్న ప్రభుత్వ వైఖరికి ఇది అద్దం పడుతోందన్నారు. భారతీయులతోపాటు ఆపదలో ఉన్న విదేశీయులనూ యెమెన్ నుంచి కాపాడుతున్నారంటూ అధికారులను కొనియాడారు.