-
టిక్.. టిక్.. టిక్ అలుపన్నది లేదు!
చార్మినార్. హైదరాబాద్ మహానగరానికి మణిహారం. చార్మినార్ నిర్మాణంతోనే భాగ్యనగరానికి పునాదులు పడ్డాయి. తొలుత కుతుబ్షాహీ, అనంతరం అసఫ్జాహీ పాలకులు నగర ప్రజల కోసం అన్ని ఏర్పాట్లూ చేస్తూ వచ్చారు. ఆ కాలంలో భారతదేశంలో బ్రిటిష్ పాలకులు వారి అధీనంలో ఉన్న ప్రాంతాల్లో ప్రజల సౌకర్యార్థం ఎత్తైన టవర్లు నిర్మించి వాటిలో గడియారాలను అమర్చారు. గడియారం అంటే అంతగా ప్రాచుర్యం లేని రోజుల్లో ఈ క్లాక్ టవర్లు ప్రజలు సమయాన్ని తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగపడ్డాయి. గంట గంటకూ గడియారం చేసే శబ్దాల ఆధారంగా ప్రజలు తమ దినచర్య ప్రారంభించి ముగించేవారు. బ్రిటిష్ పాలకుల అధీనంలో ఉన్న ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్కతాతోపాటు పలు నగరాల్లో క్లాక్ టవర్లు నిర్మించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఉన్న బ్రిటిష్ రెసిడెన్సీ ప్రతినిధి 1865లో బ్రిటిష్ రెసిడెన్సీ ఆస్పత్రి ప్రాంగణం(ఇప్పుడు సుల్తాన్బజార్)లో నగరంలోనే తొలి క్లాక్టవర్ను నిర్మించారు. ఈ నేపథ్యంలోనే పాతబస్తీ ప్రజల సౌకర్యార్థం ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ 1889లో చార్మినార్కు నాలుగు వైపులా గడియారాలను ఏర్పాటు చేయించారు. ఒకప్పుడు హైదరాబాద్ దర్పానికి ప్రతీకలుగా నిలిచిన ఈ క్లాక్ టవర్లు నేడు నిరుపయోగంగా మారాయి. ప్రజల చూపునకు నోచుకోక.. సరైన నిర్వహణ లేక ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. చార్మినార్పై ఉన్న నాలుగు గడియారాలు మాత్రం 128 ఏళ్లుగా క్షణం కూడా ఆగకుండా పనిచేస్తున్నాయి. నగరంలోని క్లాక్ టవర్లపై ‘సాక్షి’ప్రత్యేక కథనం.. క్లాక్ టవర్లు.. బ్రిటిష్ అనుసరణ 1865లో సుల్తాన్బజార్ క్లాక్ టవర్ను బ్రిటిష్ రెసిడెన్సీ ప్రతినిధి నిర్మించారు. దానికి పోటీగా.. అప్పటి పాలకుల మన్ననలు పొందడానికి సంస్థాన ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలు నగరంలోని ఇతర ప్రదేశాల్లో క్లాక్ టవర్లు నిర్మించి నిజాం పాలకులకు బహూకరించారు. నగరంలో ఉన్న అన్ని గడియారాలు లం డన్లో తయారు చేసినవే. వాటిని ఓడల ద్వారా ముంబైకి.. అక్కడి నుంచి నగరానికి తీసుకొచ్చి ప్రతిష్టించారు. చార్మినార్ ఉత్తర దిశలో ఉన్న గడియారం విలువ అప్పట్లోనే రూ.60 వేలు. మిగతా మూడు గడియారాలు ఒక్కొక్కటీ రూ.30 వేలు. ఇక నగరంలోని మిగతా గడియారాల విలువ రూ.50–60 వేల వరకూ ఉంది. ఫతేమైదాన్ క్లాక్ టవర్.. ఆరో నిజాం సంస్థానంలో రక్షణ మంత్రిగా విధులు నిర్వహిం చిన నవాబ్ జఫర్ జంగ్ బహదూర్ ఫతేమైదాన్ క్లాక్ టవర్ను 1903లో నిర్మించి ఆరో నిజాంకు బహూకరించారు. ఇది బషీర్బాగ్ ఫ్లైఓవర్ చివరలో ఉంది. ప్రసుత్తం ఈ క్లాక్ టవర్ కనుమరుగయ్యే స్థితిలోకి జారుకుంటోంది. ఇక నగరంలోని మొజంజాహీ మార్కెట్ నిర్మాణం అనంతరం 1935లో గడియారం ఏర్పాటు చేశారు. దీన్ని నిజాం ప్రభుత్వం నిర్మించింది. మిగతా గడియారాలన్నీ ఇతరులు నిర్మించినవే. నగరంలో తొలి క్లాక్ టవర్... కోఠిలోని బ్రిటిష్ రెసిడెన్సీ పనులు పూర్తయ్యాక రెసిడెంట్ అధికారి 1865లో సుల్తాన్ బజార్ క్లాక్ టవర్ నిర్మించారు. ఈ టవర్ చతురస్రాకారంలో ఉంటుంది. ఈ క్లాక్ ప్రస్తుతం పనిచేయడం లేదు. వందల ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా ఉన్న ఈ నిర్మాణం కనుమరుగయ్యే పరిస్థితిలోకి జారుకుంటోంది. మహబూబ్ చౌక్ క్లాక్ టవర్.. ఈ టవర్ను నవాబ్ సర్ ఆస్మాన్జా బహదూర్ 1890లో నిర్మించారు. సాలార్జంగ్ చొరవ వల్ల ఈ క్లాక్ టవర్ 1892లో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఇండోనేíసియా శైలిలో దీనిని నిర్మించారు. చార్మినార్ పశ్చిమ దిశలో లాడ్ బజార్కు ముందు మహబూబ్ చికెన్ మార్కెట్(ముర్గీ చౌక్) పక్కన ఇది ఉంది. ఈ క్లాక్ టవర్కు 2008లో ఇంటాక్ హెరిటేజ్ అవార్డు లభించింది. చార్మినార్ గడియారం.. చార్మినార్ను 1591లో నిర్మించారు. అయితే 1889లో ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ పాలనా కాలంలో చార్మినార్ మొదటి అంతస్తు మధ్యలో నాలుగు వైపులా గడియారాలు అమర్చారు. ఆ రోజుల్లో పాతబస్తీ ప్రజలు ఈ గడియారం చూసి తమ దినచర్య ప్రారంభించే వారు ముగించే వారు. చార్మినార్లో ఉన్న మూడు గడియారాలు ఒకలా ఉంటే.. ఉత్తర దిశలో ఉన్న గడియారం భిన్నంగా ఉంటుంది. ప్రతి గంటకు ఉత్తర దిక్కులో ఉన్న గడియారం గంటలు కొడుతుంది. మిగతా గడియారాల కంటే ధర ఎక్కువ. చార్మినార్ గడియారం గొప్పతనం ఏమిటంటే ఏ రోజు దానిని ప్రతిష్టించారో ఆ రోజు నుంచి ఇప్పటి వరకూ ఆగకుండా పనిచేస్తోంది. ప్రస్తుతం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గడియారాలన్నీ నిలిచిపోయాయి. కానీ చార్మినార్పై ఉన్న గడియారం మాత్రం పనిచేస్తూనే ఉంది. పాతబస్తీకి వచ్చే పర్యాటకులు, స్థానిక ప్రజలు గడియారంలో సమయాన్ని చూసే భాగ్యం కల్పిస్తోంది. బోసిపోయిన సికింద్రాబాద్ క్లాక్ టవర్.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దగ్గర ఉన్న క్లాక్ టవర్ ప్రస్తుతం పనిచేయడం లేదు. బ్రిటిష్ కంటోన్మెంట్ ప్రగతికి చిహ్నంగా 1896లో దీనిని నిర్మించారు. సికింద్రాబాద్ క్లాక్ టవర్ దేశంలోని ఎల్తైన క్లాక్ టవర్లలో మూడోది. దీని ఎత్తు 37 మీటర్లు(120 అడుగులు). 1896లో పది ఎకరాల విశాల స్థలంలో క్లాక్ టవర్ నిర్మించారు. సర్ ట్రెవర్ జాన్ సిచెల్ ప్లోడన్ 1897 ఫిబ్రవరి 1న క్లాక్ టవర్ను ప్రారంభించారు. గడి యారాన్ని దివాన్ బహదూర్ సేట్ లక్ష్మి నారాయణ రాంగోపాల్ బహూకరించారు. దీనికి 2005లో హెరిటేజ్ అవార్డు కూడా దక్కింది. 128 ఏళ్లుగా ఎప్పుడూ ఆగలేదు.. నేను 1962 నుంచి చార్మినార్ గడియారం నిర్వహణ చేస్తున్నాను. రోజుకు ఒక్కసారి గడియారానికి ‘కీ’ఇస్తున్నాం. చార్మినార్ గడియారం ఏర్పాటు చేసినప్పటి నుంచీ మా తాత, బాబాయిలు, మా నాన్న రసూల్ ఖాన్కు నిజాం ప్రభుత్వం నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. చార్మినార్ గడియారం బరువు 25 కేజీలు ఉంటుంది. ఇంగ్లండ్లో తయారు చేసిన మెకానికల్ గడియారం ఇది. 128 ఏళ్లుగా గడియారం ఎప్పుడూ ఆగలేదు. – సికందర్ఖాన్ ఆగినా పట్టించుకోని అధికారులు సికింద్రాబాద్ జేమ్స్ స్ట్రీట్(రాంగోపాల్ పేట్) పోలీస్ స్టేషన్పై ఉన్న క్లాక్ టవర్ను ఆ రోజుల్లో ప్రముఖ సంఘ సేవకుడు సేట్ రాంగోపాల్ 1900వ సంవత్సరంలో నిర్మించారు. ఈ క్లాక్ టవర్ నిర్మాణం పూర్తిగా యూరోపియన్ శైలితో సాగింది. ఈ క్లాక్ టవర్ చూపరులను ఎంతో ఆకట్టుకుంటుంది. 6వ నిజాం నవాబ్ మీర్ మహబూబ్ అలీఖాన్ పాలనా హయాంలో ఈ క్లాక్ టవర్ నిర్మాణం జరిగింది. ప్రసుత్తం ఈ క్లాక్ టవర్ పనిచేయడం లేదు. -
నిజాం ‘కాలం’లో..
బన్సీలాల్పేట్: నిజాం పాలనలో వాచీ అంటే ఖరీదైన వస్తువు కింద లెక్క. సామాన్యులకు చేతి గడియారం పెట్టుకునే స్తోమత ఉండేది కాదు. అయితే, జంట నగరాల ప్రజలు టైం తెలుసుకోవడానికి వీలుగా పలు ప్రధాన రహదారుల్లో నాడు క్లాక్ టవర్లు ఏర్పాటు చేశారు. గడియారాలు అంతగా ప్రాచుర్యం లేని రోజుల్లో ఇవి ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయి. నాటి పాలకులు కళాపోషకులు కావడంతో ఈ క్లాక్ టవర్లను సైతం సుందరంగా నిర్మించారు. మహబూబ్ చౌక్.. ఇండో-యూరోపియన్ శైలిలో మహబూబ్ చౌక్ మసీదుకు ఎదురుగా 1850లో క్లాక్టవర్ నిర్మాణం చేపట్టారు. రెండేళ్ల తర్వాత అంటే 1852లో దీని నిర్మాణం పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. సాలార్జంగ్-1 చొరవతో ఈ క్లాక్టవర్ నిర్మాణం పూర్తి అయ్యిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ క్లాక్టవర్ చుట్టూ చక్కని పార్కును తీర్చిదిద్దారు. సికింద్రాబాద్ క్లాక్టవర్.. బ్రిటీష్ కంటోన్మెంట్ ప్రగతికి చిహ్నంగా 1860లో సికింద్రాబాద్ గార్డెన్ హోటల్ ముందు క్లాక్ టవర్ను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్యాట్ని వైపు వెళ్లే మార్గంలో ఈ క్లాక్టవర్ దర్శనమిస్తుంది. గతంలో తెలంగాణ అమరవీరుల స్థూపం.. క్లాక్టవర్ రెండు కలిసి ఎంసీహెచ్ పార్కులో ఉండేవి. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా ఆ పార్కును కుదించి మధ్య నుంచి రోడ్డు వేశారు. పచ్చని పచ్చిక మధ్య అహ్లాదకరవాతావరణంలో ఈ క్లాక్టవర్ సందర్శకులను ఆకర్షిస్తోంది. సుల్తాన్బజార్ క్లాక్టవర్ కోఠిలోని బ్రిటీష్ రెసిడెన్సీ నిర్మాణం పూర్తయ్యాక.. బ్రిటీష్ రెసిడెంట్ అధికారులు 1865లో సుల్తాన్ బజార్ క్లాక్ టవర్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రి సమీపంలో ఈ గడియారం స్తంభం ఉంది. ఎంజీ రోడ్డు జేమ్స్ స్ట్రీట్లో.. ఎంజీ రోడ్డులోని రాంగోపాల్పేట్ పోలీసు స్టేషన్ వద్ద 1900 సంవత్సరంలో ప్రముఖ సంఘసేవకుడు, వ్యాపారి అయిన సేఠ్ రాంగోపాల్ మలాని క్లాక్ టవర్ను ఏర్పాటు చేశారు. యూరోపియన్ శైలిలో నిర్మితమైన ఈ క్లాక్టవర్ ఆరో నిజాం నవాబ్ మీర్ మహబూబ్ అలీఖాన్ పాలన కాలంలో ఎంతో శోభాయమానంగా వెలుగొందింది. ఫతేమైదాన్ క్లాక్టవర్ 1903లో ఏడో నిజాం ఆస్థానంలోని రక్షణ మంత్రి నవాబ్ జఫర్జంగ్ బహదూర్ చేతుల మీదుగా ఫతేమైదాన్ క్లాక్టవర్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 1904లో నిజాం ప్రభువు ఈ క్లాక్ టవర్ను లాంఛనంగా ప్రారంభించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: నేను ఏమాత్రం సంతోషంగా లేను: ప్రీతి జింటా ట్వీట్ వైరల్
పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని
మళ్ళీ బీజేపీదే విజయం: యూపీ డిప్యూటీ సీఎం
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement