breaking news
clean railway
-
క్లీన్ రైల్వేస్టేషన్గా భువనేశ్వర్
భువనేశ్వర్ : భారతీయ రైల్వే జాతీయ స్థాయిలో పరిశుభ్ర రైల్వే స్టేషన్ల జాబితాను మంగళవారం విడుదల చేసింది. మొదటి 10 ఉత్తమ పరిశుభ్ర రైల్వేస్టేషన్ల జాబితాలో భువనేశ్వర్కు స్థానం లభించింది. రైల్వేశాఖ రెండేళ్ల నుంచి ఉత్తమ పరిశుభ్ర రైల్వేస్టేషన్లను ఎంపిక చేస్తున్న విషయం తెలిసిందే. భారత నాణ్యతా మండలి(క్యూసీఐ) ఏటా ఈ జాబితాను విడుదల చేస్తుండడం విశేషం. ఎ–1 విభాగంలో జోధ్పూర్, జైపూర్, తిరుపతి మొదటి 3 స్థానాల్లో ఉత్తమ పరిశుభ్ర రైల్వేస్టేషన్లగా నిలిచాయి. ఎ–విభాగంలో మార్వార్, ఫులేరా, వరంగల్ మొదటి 3 స్థానాల్లో నిలిచాయి. ఎ–1 విభాగంలో భువనేశ్వర్ రైల్వేస్టేషన్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఎ–1 విభాగంలో ఉత్తమ పరిశుభ్రత స్టేషన్ల జాబితాలో ఈస్టుకోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయం స్టేషన్ భువనేశ్వర్కు 9వ స్థానం ఎ–1 విభాగంలో పూరీ రైల్వేస్టేషన్ 37వ స్థానం నుంచి 22వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఎ– విభాగం జాబితాలో కటక్ రైల్వేస్టేషన్కు 30వ స్థానం లభించింది. గతేడాది కటక్ రైల్వేస్టేషన్కు 100వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.జాతీయ స్థాయిలో 10 జోన్లు పరిశుభ్రత విషయంలో 10 నుంచి 20 శాతం పుంజుకోవడం విశేషం. 4 రైల్వేజోన్ పరిశుభ్రతలో 20 శాతం పుంజుకుంది. వాయువ్య రైల్వే ఈ జాబితాలో అగ్ర స్థానంలో నిలవగా దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్కోస్ట్ రైల్వే తర్వాతి రెండు స్థానాల్లో నిలిచాయి. ఎ–1 విభాగంలోని తొలి పది.. ఎ–1 విభాగంలో మొదటి 10 ఉత్తమ పరిశుభ్ర రైల్వేస్టేషన్ల జాబితాలో జోద్పూర్, జైపూర్, తిరుపతి, విజయవాడ, ఆనంద విహార్ టెర్మినల్, సికింద్రాబాద్ జంక్షన్, బంద్రా, హైదరాబాద్, భువనేశ్వర్, విశాఖపట్టణం ఉన్నాయి. ఈస్ట్కోస్ట్ రైల్వేలో పలాస (20), బరంపురం (35), జాజ్పూర్–కెంజొహర్ రోడ్ (39), రాయగడ (64), ఖుర్దా (127), భద్రక్ (160), సంబల్పూర్ (239) ఉన్నాయి. -
ఉధృతంగా స్వచ్ఛ రైల్వే
– మొక్కలు నాటడమే కాదు..పరిరక్షణకూ చర్యలు – దక్షిణ మధ్య రైల్వే జోన్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ తిరుపతి అర్బన్: రైల్వే శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ రైల్వే కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ మెడికల్ డైరెక్టర్ కేహెచ్కే దొర వెల్లడించారు. అక్టోబర్ 2 నుంచి వారం రోజుల పాటు నిర్వహించనున్న స్వచ్ఛ రైల్వే ప్రచార వారోత్సవాల్లో భాగంగా శనివారం తిరుపతి రైల్వే స్టేషన్ ఆవరణలో సీనియర్ లైజన్ ఆఫీసర్ కుప్పాల సత్యనారాయణతో కలసి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం దొర విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ శాఖాధికారులు మొక్కలు నాటడం చేస్తుంటారని, వాటి సంరక్షణకు సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. కుప్పాల సత్యనారాయణ మాట్లాడుతూ రైల్వే పరిధిలోని వ్యాపార సంస్థల నిర్వాహకులు, కాంట్రాక్టర్లు కూడా స్వచ్ఛ రైల్వేలో భాగస్వాములై తిరుపతి స్టేషన్ను ఆదర్శంగా నిలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్(ఎస్ఎంఆర్) సుభోద్మిత్ర, రైల్వే హెల్త్ ఆఫీసర్ వేణుగోపాల్, ఐపీఎఫ్ నాగార్జున రావు, చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ సురేంద్రనాయక్, చీఫ్ టీటీఐలు టీవీ రావు, రాజాబాబు, మోహన్రెడ్డి, రైల్వే ఐఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి దోసపాటి చైతన్య శర్మ, ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ మధుసూదనరావు, ఎస్ఎంఆర్ కార్యాలయ అధికారి రాజు పాల్గొన్నారు.