breaking news
Class 12 Student
-
కథల వర్ణన్
ఒక టీనేజర్ బామ్మగా మారిపోయింది. మీరు విన్నది నిజమే, పెద్దవాళ్లు పిల్లలకు కథ చెప్పే అలవాటు పోయిందంటూ రేపటి తరానికి కథలు చెప్పడానికి సిద్ధమైపోయింది పద్దెనిమిదేళ్ల ప్రియాల్ జైన్. ‘పిల్లలు మన భారతీయ సంస్కృతికి, వారసత్వానికి దూరం అవుతున్నారని పెద్దలు బాధపడుతుంటారు. ఇది వారి తప్పు కాదు. పిల్లలకి మన చరిత్ర, సంస్కృతి, వారసత్వానికి దగ్గరయ్యేలా వారిలో స్ఫూర్తిని నింపాలి. అది మన బాధ్యత’ అంటోంది ప్రియాల్. రాజస్థాన్ వాసి అయిన ప్రియాల్ దేశవ్యాప్తంగా ఉన్న సంప్రదాయ, జానపద కథలకు రూపం కూడా ఇస్తోంది. ప్రియాల్ జైన్ 12వ తరగతి చదువుతోంది. లాక్డౌన్ టైమ్ని సద్వినియోగ పరుచుకోవాలని ‘వర్ణన్’ అనే పేరుతో వెబ్సైట్ ప్రారంభించి, తను చిన్ననాటి నుంచి విన్న కథలన్నీ అందులో పొందుపరుస్తోంది. ఇంకెన్నో కథలను సేకరిస్తూ, వాటిని రేపటితరానికి అందిస్తోంది. శతాబ్దాల జ్ఞానం ‘నా చిన్నప్పుడు మా బామ్మ నా హిస్టరీ బుక్లో ఉన్న పాఠాల కన్నా ఎన్నో కథలు చెప్పేది. అవన్నీ నేను మరచిపోలేనివి. ధైర్యవంతులైన స్త్రీ పురుషుల కథల గురించి, మార్మికమైన పౌరాణిక పాత్రల గురించి, విశ్వాసపాత్రమైన జంతువుల గురించి... ఇలా ఎన్నో కథలు. నేను పెద్దయ్యాక మా నాన్న ఉద్యోగరీత్యా నా చదువుకోసం బామ్మ నుంచి దూరంగా వెళ్లిపోయాం. నా చెల్లెలికి పదేళ్లు ఉంటాయి. తనకి కథలు చెప్పడానికి ఎవరూ లేరు. ఈ ఏడాదిన్నర కాలంగా ఆన్లైన్లో తరగతులు. నాకైతే ఒకే క్లాసులో ఉన్న భావన కలుగుతోంది. పిల్లలకు ఆటలు లేవు. అలాగే, మన భారతీయ చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదలో పొందుపరిచిన శతాబ్దాల మిశ్రమ జ్ఞానం కూడా పొందలేకపోతున్నారు. ఇది గ్రహించే నేను ‘వర్ణన్’ అనే వెబ్సైట్ ప్రారంభించాను. ఇందుకు మా నాన్న నాకు సపోర్ట్నిచ్చారు. శతాబ్దాల నాటి భారతీయ జ్ఞానాన్ని అంతా సజీవంగా ఉంచాలనుకుంటున్నాను. ఈ జ్ఞానాన్ని తరువాత తరానికి తీసుకెళ్లకపోతే ఎంతో కాలం ఉండదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ప్రతి ఒక్కరికీ కథ చెప్పే బామ్మగా వర్ణన్ ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను’ అని తన ఆలోచన రూపం దాల్చిన విషయం గురించి చెబుతుంది ప్రియాల్. 6 నుంచి 106 ఏళ్ల వయసున్న కథలు ‘మా కథల సేకరణ పిల్లల్లో ఊహాన్వేషణను ప్రోత్సహిస్తుంది. ఏ మాత్రం బోర్ కొట్టవు. బెడ్ టైమ్ కథలతోపాటు, పెద్దలను కూడా వినోదంతో ఆకట్టుకునేలాంటి కథలు మా ‘వర్ణన్’లో ఉంటాయి. అంటే ఐదారేళ్ల పిల్లలతో పాటు నూరేళ్ల వయసు దాటిన వారినీ మా కథలు ఆకట్టుకుంటాయి. ‘వర్ణన్’ మీకు ఇష్టమైన కథ చెప్పే తాత, బామ్మ లాంటిది. ప్రేరణ కలిగించేది, ఆలోచన పెంచే విధంగా ఉంటుంది’ అని తన వర్ణన్ గురించి వర్ణించి మరీ చెబుతుంది ప్రియాల్. కథకుల బృందం ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదలుపెట్టిన కథా పందిరి వర్ణన్కు కథలు అందించేలా 30 మంది దాకా బృందాన్ని ఏర్పాటు చేసింది ప్రియాల్. వారి ద్వారా కథా సేకరణ చేస్తోంది. వాటిన్నిటికీ ఒక రూపం ఇచ్చి, ఎడిట్ చేసి వెబ్సైట్లో ఉంచుతూ ఈ తరానికి కథల ప్రయోజనాన్ని తెలియజేస్తోంది. కథల మూటతో జ్ఞాన సంపదను భవిష్యత్ తరాలకు అందించాలని తపించే నవతరపు ప్రతినిధి ప్రియాల్ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. -
పంద్రాగస్టు వేడుకలకు వెళ్లొస్తుంటే దారుణం
చండీగఢ్: హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరై వస్తున్న పన్నెండో తరగతి విద్యార్ధినిపై సామూహిక లైంగిక దాడి జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం హర్యానాలోని కియోరా అనే గ్రామానికి చెందిన పన్నెండో తరగతి విద్యార్థిని తన పాఠశాలలో పంద్రాగస్టు వేడుకలకు హాజరై తిరిగొస్తుండగా బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అడ్డగించారు. బైక్ కు కొద్ది దూరంలో మరో ముగ్గురు వ్యక్తులు కారులో వచ్చారు. ఆ తర్వాత అందరూ కలిసి ఆ అమ్మాయిని కత్తితో బెదిరించి ఎత్తుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. కిడ్నాప్ చేసిన ప్రాంతం నుచి టిక్ అనే గ్రామంలోని ఓ ఇంట్లో వాళ్లు ఆకృత్యానికి దిగారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. -
అదృశ్యమైన విద్యార్థిని శవమై తేలింది
లక్నో: అదృశ్యమైన ఇంటర్ విద్యార్థిని శవమై తేలింది. ఈనెల 10వ తేదీ నుంచి కనిపించకుండా పోయిన ఉన్నతి విశ్వకర్మ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. దీంతో తమ కూతురి ఆచూకీ కోసం గత వారం రోజులుగా ఆశతో ఎదురుచూస్తున్న ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది. సెవార్ లోని రాణీ లక్ష్మీబాయి కాలేజీలో చదువుతున్న ఉన్నతి మొబైల్ను ఒక రిక్షా డ్రైవర్ దగ్గర గుర్తించారు. అయితే తనకు ఆ మొబైల్ దొరికిందని అతను చెబుతున్న చోటే అమ్మాయి చనిపోయి ఉండటం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. చెట్టుకు వేలాడుతూ ఉన్న ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీస్ ఉన్నతాధికారి రాజేష్ పాండే తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.