breaking news
clashes among fans
-
ఫుట్బాల్ మ్యాచ్లో గొడవ.. 100 మంది మృతి
సౌత్ ఆఫ్రికాలోని గినియా దేశంలో పెను విషాదం చోటుచేసుకుంది. గినియాలోని రెండవ అతిపెద్ద నగరమైన ఎన్జెరెకోర్లో ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా అభిమానుల మధ్య భారీ ఘర్షణ జరిగింది. రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకోవడంతో దాదాపు 100 మందికి పైగా మరణించారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.కాగా గినియా మిలిటరీ జుంటా నేత మమాడి దౌంబోయ గౌరవార్థం జెరెకొరె నగరంలో ఆదివారం ఫుట్బాల్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఫుట్బాల్ మ్యాచ్ మధ్యలో రిఫరీ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదమైంది. దాన్ని వ్యతిరేకించిన ఓ జట్టు అభిమానులు మైదానంలోకి దూసుకెళ్లారు. దీంతో అవతలి జట్టు అభిమానులు వీరిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.అనంతరం వందలాది మంది వీధుల్లోకి వచ్చి పరస్పరం దాడులు చేసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ను కూడా ధ్వంసం చేసి, నిప్పంటించారు. ఈ క్రమంలో వంద మందికిపైగా మరణించగా.. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వీధులంతా రక్తసిక్తంగా మారాయి. ఎక్కడ చూసినా మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.⚠️🔞 WARNING: GRAPHIC 18+ 🔞⚠️❗️🇬🇳 - At least 100 people lost their lives in violent clashes between rival fans during a football match in N'zerekore, Guinea. This tragic event, which occurred at the end of a game, resulted in hundreds of fatalities. Medical sources confirmed… pic.twitter.com/xV3COoViUE— 🔥🗞The Informant (@theinformant_x) December 2, 2024 -
ఫుట్బాల్ మ్యాచ్లో కాల్పులు; ఇద్దరి మృతి
అభిమానం హద్దులు మీరి దురాభిమానంగా మారడంతో రెండు ప్రాణాలను బలికొంది. సరదా కోసం ఆడిన ఫుట్బాల్ మ్యాచ్ విషాదాన్ని మిగిల్చింది. రెండు ఫుట్బాల్ జట్ల అభిమానుల మధ్య ఘర్షణ చెలరేగడంతో ఇద్దరు మరణించగా, మరో ఐదు మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శనివారం బ్రెజిల్లో జరిగింది. నటాల్ నగరంలో రెండు స్థానిక జట్లు ఎబీసీ, ఏఎస్ఏ మధ్య జరిగిన మ్యాచ్కు అభిమానులు భారీగా హాజరయ్యారు. మ్యాచ్ ముగిసే దశలో ఇరు జట్ల అభిమానులు పరస్పరం గొడవకు దిగారు. ఇది తీవ్ర రూపం దాల్చడంతో అభిమానులు కాల్పులు జరుపుకొన్నారు. ఫ్లావియో (17), ఇస్మాయిల్ (18) మరణించారు. వచ్చే ఏడాది బ్రెజిల్లో ఫుట్బాల్ ప్రపంచ కప్ జరగాల్సివుంది. తాజా సంఘటన నేపథ్యంలో శాంతి భద్రతలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.