breaking news
claims responsibility
-
బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్ తప్పనిసరి...మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు. .
Madras High Court: వాహనాలకు సంబంధించిన ఇన్సురెన్సులు చేసేప్పుడు ఇటు కొనుగోలుదారులు, అటు ఇన్సురెన్సు కంపెనీలు బాధ్యతగా వ్యవహరించాలంటూ మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. వాహనం నడిపే వారి సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకుని బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సును తప్పనిసరిగా చేసింది. మద్రాస్ హైకోర్టు తీర్పు ఏంటీ మద్రాసు హైకోర్టు తీర్పు ప్రకారం 2021 సెప్టెంబరు 1 నుంచి కొనుగోలు చేసే కొత్త వాహనాలకు బంపర్ టు బంపర్ ప్రాతిపదికన వాహన యజమాని, డ్రైవరు, ప్రయాణికులందరికీ వర్తించేలా బీమా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బీమా కాలపరిమితి ఐదేళ్లుగా ఉండాలని నిర్దేశించింది. లక్షల రూపాయలు పెట్టి వాహనం కొనేప్పుడు మైలేజీ, పవర్, డిజైన్లపై ఉన్న శ్రద్ధ తమపై కూడా పెట్టాలని వాహన కొనుగోలుదారులకు సూచించింది. కొద్దిపాటీ ప్రీమియం కట్టేందుకు నిర్లక్క్ష్యం చేస్తే, అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందంటూ కోర్టు అభిప్రాయపడింది. తీర్పుకు కారణం ఇది తమిళనాడులోని హొగినేకల్లో 2016లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సడయప్పన్ అనే వ్యక్తి మృతి చెందాడు. దీనిపై నష్టపరిహారం కోరుతూ కుటుంబ సభ్యులు ఈరోడ్ మోటారు వాహన ప్రమాద పరిహార ట్రైబ్యునల్ను ఆశ్రయించారు. విచారణ అనంతరం సడయప్పన్ కుటుంబానికి రూ.14,.65 లక్షలు పరిహారం చెల్లించాలని ఇన్సురెన్సు కంపెనీని ట్రిబ్యునల్ ఆదేశించింది. దీన్ని వ్యతిరేకిస్తూ న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. వాహన డ్రైవరు, యజమాని అనే ప్రాతిపదికన మాత్రమే వాహనానికి థర్డ్ ఫార్టీ బీమా చేశారని.. డ్రైవరు కాని వ్యక్తి మృతి చెందితే లక్ష రూపాయలు మాత్రమే పరిహారం చెల్లిస్తామని బీమా సంస్థ తెలిపింది. సడయప్పన్ ప్రమాద సమయంలో వాహనం నడపలేదని రుజువులు చూపింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి వైద్యనాథన్ ఈరోడ్ ట్రైబ్యునల్ ఆదేశాలను రద్దు చేశారు. అంతేకాకుండా ప్రీమియం, కవరేజీలు తక్కువగా ఉండే థర్డ్ పార్టీ ఇన్సురెన్సులను నిరసించారు. వాహన యజమాని, డ్రైవరుతో పాటు అందులో ప్రయాణించే అందరి సంక్షేమాన్ని కాంక్షిస్తూ బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సుని తప్పనిసరి గా చేస్తూ తీర్పు ఇచ్చారు. చదవండి: ఆటో విడిభాగాల పరిశ్రమ జోరు, పీవీ - ట్రాక్టర్లకు డిమాండ్ -
'మణిపూర్ దాడి మా పనే'
ఇంఫాల్: ఆర్మీ వాహన శ్రేణిపై మందుపాతరలు, గ్రెనేడ్లు, అత్యాధునిక ఆయుధాలతో మెరుపుదాడి చేసి 18 మంది సైనికులను హతమార్చింది తామేనని ఎన్ఎస్సీఎన్- కె (నాగాలాండ్ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ - ఖప్లాంగ్) సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఘటనకు బాధ్యవవహిస్టున్నట్లుగా శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. నాగాలాండ్ కు స్వయం ప్రతిపత్తి కల్పించాలనే డిమాండ్ తో గత కొన్నేళ్లుగా ఈ సంస్థ ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. మణిపూర్ రాజధాని ఇంఫాల్కు 80 కి.మీ.ల దూరంలో ఉన్న తెంగ్నౌపాల్- న్యూ సంతాల్ రోడ్పై గురువారం ఈ సంఘటన జరిగిన సంగతి తెలిసిందే. డోగ్రా రెజిమెంట్కు చెందిన సైనికులు నాలుగు వాహనాల్లో పెట్రోలింగ్కు బయల్దేరగా.. పారలాంగ్, చరాంగ్ గ్రామాల మధ్యకు రాగానే మిలిటెంట్లు ఆ వాహన శ్రేణిని శక్తిమంతమైన మందుపాతరతో పేల్చేశారు. ఆ వెంటనే రాకెట్తో ప్రయోగించే గ్రెనేడ్లు, అత్యాధునిక ఆటోమేటిక్ తుపాకులతో సైనికులపై విరుచుకుపడి, విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. గడిచిన ముప్పై ఏళ్లలో భారత సైన్యం పై జరిగిన భారీ దాడి ఇదే. దాడిలో 18 మంది సైనికులు చనిపోగా, 11 మంది గాయాల పాలయ్యారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల్లో రెడ్ అలెర్ట ను ప్రకటించింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కాల్పుల ఘటనను దర్యాప్తుచేస్తోంది.