breaking news
city traffic police
-
‘స్పీడ్’ రూల్స్ ఇక పక్కా!
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో వాహనాల వేగానికి కళ్లెం వేసేలా పక్కాగా ప్రణాళిక అమలు చేయడానికి సిటీ ట్రాఫిక్ వింగ్ సన్నాహాలు చేస్తోంది. ఈ–చలాన్లు విధించడం మొదలెట్టడానికి ముందు కొన్ని రోజుల పాటు వాహనచోదకులకు అవగాహన పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రవాణా శాఖ బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం డివైడర్లు ఉన్న మార్గాల్లో కార్లు గరిష్టంగా గంటకు 60 కి.మీ., మిగిలిన వాహనాలు 50 కి.మీ., అవి లేని రూట్లలో వీటి వేగాన్ని గంటకు 50 కి.మీ., 40 కి.మీ.గా నిర్దేశించారు. కాలనీల్లో ఏ వాహనమైనా గంటకు 30 కి.మీ. వేగమే. ప్రస్తుతం రహదారులపై ఉన్న సూచికల బోర్డుల్లో పాత వేగ పరిమితులే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ పోలీసులు జీహెచ్ఎంసీ అధికారుల సాయంతో ఆయా ప్రాంతాల్లో కొత్తగా బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ఇక పరిమితికి మించిన వేగంతో ప్రయాణించే వాహనాలను గుర్తించడానికి ప్రస్తుతం ఆరు స్పీడ్ లేజర్ గన్స్, 44 సీసీ కెమెరాలను అనుసంధానించిన సాఫ్ట్వేర్ ఉపకరిస్తున్నాయి. వీటిని మరింతగా పెంచాలని భావిస్తున్నారు. ప్రత్యేక సాఫ్ట్వేర్తో అనుసంధానించి ఉండే సీసీ కెమెరాలు తమ ముందు ప్రయాణిస్తున్న వాహనం వేగాన్ని క్షణాల్లో గుర్తించగలుగుతాయి. పగలు, రాత్రి కూడా వేగాన్ని గుర్తించడానికి ఉపకరించే విధంగా సాఫ్ట్వేర్, కెమెరాలను అభివృద్ధి చేయనున్నారు. పరిమితికి మించిన వేగంతో ప్రయాణించే వాహనాలకు చలాన్లు జారీ చేసే ముందు పెద్ద ఎత్తున అవగాహన కల్పించనున్నారు. దీనికోసం సైనేజ్ బోర్డులు, సోషల్ మీడియా తదితరాలను వాడాలని నిర్ణయించారు. సుదీర్ఘ అధ్యయనం చేశాం నగరంలో వేగ పరిమితుల విధింపుపై సుదీర్ఘ అధ్యయనం చేశాం. చండీఘర్, ఢిల్లీ, చెన్నై, ముంబై, బెంగళూరు సిటీల్లో అమలులో ఉన్న విధానాలను అధ్యయనం చేశాం. చండీఘర్ మోడల్ను హైదరాబాద్కు అనువుగా మార్పుచేర్పులు చేసి సిఫార్సు చేశాం. ఉత్తర్వుల్లో ఉన్న వేగ పరిమితులు అన్ని రహదారులకు వర్తిస్తాయి. తాజా ఉత్తర్వులు అమలులో వచ్చినా ఓఆర్ఆర్, పీవీ నర్సింహ్మారావు ఎక్స్ప్రెస్వే మార్గాల్లో గతంలో సూచించిన వేగమే వర్తిస్తుంది. రింగ్ రోడ్ మీద లారీలు గంటకు 80 కి.మీ., కార్లు వంటివి గంటకు 100 కి.మీ., ఎక్స్ప్రెస్ వే మీద గంటకు 80 కి.మీ. వేగంతో ప్రయాణించవచ్చు. – ఏవీ రంగనాథ్, సిటీ ట్రాఫిక్ చీఫ్ (చదవండి: ప్రజాప్రయోజనాల కోసమే భూసేకరణ: హైకోర్టు ) -
రహదారి మధ్యలో రాడార్ స్పీడ్ గన్స్
హైదరాబాద్: వాహనాల ఓవర్ స్పీడింగ్పై సిటీ ట్రాఫిక్ విభాగం ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనికి చెక్ చెప్పడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్పీడ్ లేజర్ కెమెరాలకు తోడు రాడార్ స్పీడ్ డిటెక్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటి పనితీరుకు సంబంధించి జర్మనీకి చెందిన ఓ సంస్థ సోమవారం నగర కొత్వాల్ ఎం.మహేందర్రెడ్డితోపాటు ట్రాఫిక్ చీఫ్ డాక్టర్ వి.రవీందర్కు ప్రజెంటేషన్ ఇచ్చింది. ప్రసుత్తం అందుబాటులో ఉన్న స్పీడ్ లేజర్ గన్స్ పగటిపూట మాత్రమే వినియోగించడానికి అనుకూలం. పైగా వీటితో తనిఖీలు చేయడానికి ప్రత్యేకంగా సిబ్బంది అవసరం. ఈ నేపథ్యంలో ఓవర్ స్పీడింగ్పై పగలు రాత్రి తేడా లేకుండా నిర్విరామంగా చర్యలు తీసుకోవడానికి రహదారుల్లో రాడార్ ఉపకరణాలను అమర్చాలని ట్రాఫిక్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. మొత్తం 70 ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనుకున్న అధికారులు తొలి దశలో రేసింగ్స్, ఓవర్స్పీడింగ్ ఎక్కువగా జరిగే కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల వీటిని నెలకొల్పనున్నారు. రాడార్ పరిజ్ఞానంతో పనిచేసే ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్తో (టీ–సీసీసీ) అనుసంధానించి ఉండే ఈ ఉపకరణాలు పరిమితికి మించిన వేగంతో వెళ్లే వాహనాలకు సంబంధించి సెకనుకు మూడు ఫొటోలు తీస్తాయి. వీటి ఆధారంగా టీ–సీసీసీ అధికారులు ఈ–చలాన్లు జారీ చేస్తారు. -
83 మంది వాహనదారులకు జరిమానాలు
హైదరాబాద్: నగరంలోని కాచిగూడ్ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో 83 మంది వాహనదారులకు జరిమానా విధించారు. ట్రాఫిక్ ఏసీపీ డాక్టర్ ప్రేమ్ కాజల్ ఆధ్వర్యంలో బుధవారం బర్కత్పుర చమన్, టూరిస్ట్ హోటల్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్, సిగ్నల్ జంప్, ఇలా నిబంధనలను ఉల్లంఘించిన 83 మంది మంది వాహదారులపై కేసులు నమోదు చేసినట్లు కాచిగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పీజీ రెడ్డి తెలిపారు.