breaking news
circulating
-
కొత్త నోట్లను ప్రింట్ కొడుతూ.. వీడియో వైరల్
సాక్షి, హైదరాబాద్ : దొంగ నోట్ల ప్రింటింగ్ పరిసరాలు ఎలా ఉంటాయో ఎప్పుడైనా చూశారా ? అప్పుడే ప్రింటింగ్ పూర్తి చేసుకొని కట్టలు కట్టలుగా పేర్చిన కొత్త నోట్లను గుట్టలు గుట్టలుగా ఓ వ్యక్తి పేరుస్తున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దొంగ నోట్లు చలామణివంటి చట్టవ్యతిరేక ఆర్థిక కార్యకలాపాలు మన దేశానికి అతిపెద్ద ముప్పుగా మారాయి. భారత దేశ ఆర్థిక వ్యవస్థనే ప్రభావితం చేసే స్థాయిలో దొంగనోట్లను పాకిస్తాన్, బంగ్లాదేశ్లు భారత్ లోకి డంప్ చేస్తున్నాయనేది ఓ వాదన. అయితే ఎన్నో ప్రమాణాలతో తయారైన కొత్త నోట్లకు కూడా ఫేక్ నోట్లను బంగ్లాదేశ్ లో తయారు చేస్తున్నారంటూ ఓ వీడియో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. Wow! Is this true or fake? Just wow!https://t.co/UKkkx4syxg — Vishnu Manchu (@iVishnuManchu) 10 January 2018 పాత రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు తర్వాత కొత్తగా రూ. 50, 200, 500, 2000 నోట్లను ప్రభుత్వం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే రూ.50, రూ.200 ల నోట్లను ప్రింట్ చేసిన అనంతరం ఓ వ్యక్తి కట్టలు కడుతూ పేరుస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన హీరో మంచు విష్ణు వామ్మో, ఇది నిజమా అబద్దమా అంటూ ఓ ట్వీట్ చేశారు. అయితే వీడియోలోని నోట్లు అచ్చు ఒరిజినల్ నోట్లలా ఉన్నా.. కొద్దిగా తీక్షణంగా పరిశీలిస్తే అందులో ఓ చిన్న మార్పు గమనించవచ్చు. సాధారణంగా నోట్ల పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని రాసి ఉంటుంది. అయితే వీడియోలో చూపించిన నోట్లలో మాత్రం భారతీయ చిల్డ్రన్ బ్యాంక్ అని రాసి ఉంది. అంటే వీడియోలో చూపించింది చిన్న పిల్లలు ఆడుకోవడానికి తయారు చేసే నోట్ల ఫ్యాక్టరీ అని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతుంటే, మరికొందరు చిన్న పిల్లలు ఆడుకోవడానికైతే మరీ అంత పెద్ద ఫ్యాక్టరీలో ప్రింట్ చేస్తారా, కాదు కాదు.. అవి దొంగనోట్లు తయారు చేసే ఫ్యాక్టరీనే అంటూ వాదిస్తున్నారు. అయితే అది నిజంగానే బంగ్లాదేశ్ లో దొంగ నోట్ల తయారీ కేంద్రమా లేక చిన్న పిల్లలు ఆడుకోవడానికి తయారు చేసే ఓ మామూలు ఫ్యాక్టరీనా అనేది తెలియాల్సి ఉంది. -
కొత్త నోట్లను ప్రింట్ కొడుతూ.. వీడియో వైరల్
-
ప్రధాని ఫోటో సర్క్యూలేట్ చేస్తూ పట్టుబడ్డాడు!
మోరెనా : సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రధాని నరేంద్రమోదీ అభ్యంతరకర ఫోటోను సర్క్యూలేట్ చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మొబైల్ షాపు నడుపుతున్న అస్లాం ఖాన్ అనే వ్యక్తి, ప్రధాని నరేంద్రమోదీ అభ్యంతరకర ఫోటోను సర్క్యూలేట్ చేస్తున్నాడని బన్మోర్ సబ్ డివిజనల్ పోలీసు ఆఫీసర్ ఆత్మారాం శర్మ తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోపై బన్మోర్ డివిజన్ ప్రెసిడెంట్ రాంబారన్ మావై ఆధ్వర్యంలో కొంతమంది బీజేపీ కార్యకర్తలు కూడా బన్మోర్ సబ్ డివిజనల్ పోలీసు స్టేషన్ ముందు నిరసనకు దిగినట్టు చెప్పారు. అదుపులోకి తీసుకున్న అస్లాం ఖాన్పై ఎఫ్ఐఆర్ నమోదుచేశామని, తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్టు శర్మ చెప్పారు.