ఎంసెట్ లీకేజీ.. సీఐడీ డీఎస్పీ సస్పెన్షన్
వరంగల్: ఎంసెట్ లీకేజీ వ్యవహారంలో లొసుగులు నెమ్మదిగా ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి. ఈ లీకేజీ వ్యవహారంలో సీఐడీ డీఎస్పీపై వేటు పడింది. విజయవాడలో ఓ బ్రోకర్ వద్ద రూ. లక్షా 50 వేలు తీసుకున్నట్టు ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు సీఐడీ డీఎస్పీని సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది.