chlorine gas
-
విష మేఘాలు: 250 మంది ఆసుపత్రి పాలు
-
విష మేఘాలు: 233 మంది ఆసుపత్రి పాలు
సాక్షి, ఈస్ట్ ససెక్స్: క్లోరిన్ వాయు మేఘాలు ఇంగ్లండ్లోని ఈస్ట్ ససెక్స్లో కలకలం రేపాయి. బీచ్లో సేద తీరుతున్న ప్రజలను విష వాయువు తాకడంతో కళ్ల మంటలు, గొంతు రాజుకుపోవడం, ఊపిరాడకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని 233 మందికి పైగా బాధితులను అంబులెన్స్ల సాయంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా వచ్చిన విష వాయు మేఘం నుంచి విపరీతమైన దుర్వాసన వచ్చిందని బీచ్లోని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ఆ తర్వాత ఆ వాయువు పీల్చుకున్న ప్రతి వ్యక్తికి ఏదో రకమైన ఇబ్బంది ఎదుర్కొన్నట్లు చెప్పారు. కాగా, ఆసుపత్రికి తరలించిన బాధితులకు డాక్టర్లు ప్రత్యేక సూట్లు వేసుకుని వైద్య సేవలు అందిస్తున్నారు. విష వాయువును పీల్చుకున్న వ్యక్తి నుంచి వెలువడే గాలి కూడా ప్రమాదమేనని చెబుతున్నారు. బీచ్ వైపు ఎవరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బీచ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. క్లోరిన్ వాయువు బీచ్ చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల నుంచి వెలువడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, అధికారులు ఈ కోణాన్ని కొట్టిపారేస్తున్నారు. అలాంటిది జరిగే కచ్చితంగా ఆధారాలు లభ్యమవుతాయన్నారు. గ్యాస్ ఎక్కడి నుంచి వెలువడిందనే దానికి అసలు ఆధారాలేవి ఇప్పటివరకూ లభ్యం కాలేదని చెప్పారు. -
క్లోరిన్ గ్యాస్ లీక్
నాచారం: నాచారం స్నేహపురి కాలనీ వద్ద గల వాటర్ ట్యాంకులో బుధవారం సాయంత్రం జలమండలి క్వాలిటీ అనాలిసిస్ సిబ్బంది క్లోరిన్ చేస్తుండగా గ్యాస్ లీకైంది. ఇది చుట్టు పక్కలకు వ్యాపించింది. సిబ్బంది పరుగులు తీశారు. అక్కడే విధుల్లో ఉన్న నాచారం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రాజేష్ విషయం తెలుసుకుని ఆపడానికి ప్రయత్నించి తీవ్ర అస్వస్థతకు గుర య్యాడు. తీవ్ర ఘాటువాసన రావడంతో స్థానికులు... సమీపంలోని మీ సేవ సిబ్బంది పరుగులు తీశారు. అస్వస్థతకు గురైన కానిస్టేబుల్ రాజేష్ను బాపూజీ నర్సింగ్ హోంకు తరలించారు. కుమార్ అనే వ్యక్తి వాంతులు చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న జలమండలి ఏఈ ఉమాపతి, నాచారం అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్తో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై ఏఈ ఉమాపతి మాట్లాడుతూ తమకు తెలియకుండా క్వాలిటీ అనాలిసిస్ సిబ్బంది వచ్చారని తెలిపారు. క్లోరిన్ గ్యాస్ను నీటిలో కలుపుతారని... అది ప్రమాదకరమైంది కాదని వివరించారు. విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైన కానిస్టేబుల్ను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సాయిజెన్ శేఖర్, పోతగాని గోపాల్ గౌడ్, వై. సత్యనారాయణ, అనుముల అశ్వత్థామరెడ్డి, మేడల మల్లిఖార్జున్ గౌడ్, గుండు రమేష్ గౌడ్, మహేష్ ఉన్నారు. ఆరు నెలలుగా మూత: గత ఆరు నెలలుగా నాచారం స్నేహపురికాలనీ వాటర్ ట్యాంక్లో నీరు లేక మూత పడి ఉంది. దీనిలో క్లోరినేషన్ చేస్తుండగా గ్యాస్లీకై ప్రమాదం సంభవించింది. -
మధ్యప్రదేశ్ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీకేజి
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రైసెన్ జిల్లాలో ఓ రసాయన ఫ్యాక్టరీ నుంచి క్లోరిన్ వాయువు లీకైంది. ఆ ఫ్యాక్టరీకి పరిసరాల్లో ఉన్న 39 మందిపై ఈ వాయువు ప్రభావం పడింది. వారిలో 29 మందిని రైసెన్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వాళ్లలో ముగ్గురి పరిస్థితి విషమంగా మారడంతో.. వారిని రాజధాని నగరమైన భోపాల్లో మరో ఆస్పత్రికి తరలించారు. గ్యాస్ లీక్ కావడానికి కారణాలు మాత్రం ఇంకా తెలియరావాల్సి ఉంది.