ఆస్తులు కాపాడుకునేందుకే బీజేపీలోకి..
కోట : నేదురుమల్లి రాంకుమార్రెడ్డి తన ఆస్తులను కాపాడుకునేందుకే బీజేపీలోకి వెళ్లారని మధుసూదన్రెడ్డి, చిన్నబేబమ్మ ఆరోపించారు. శనివారం వారు విద్యానగర్లో విలేకరులతో మాట్లాడారు. రాంకుమార్ హెచ్వీయూస్ఎస్ అధ్యక్షుడు కాదని తెలిపారు. బాలకృష్ణారెడ్డి ఆస్తులపై సర్వహక్కులు తమకే ఉన్నాయన్నారు. సూరజ్రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి రాంకుమార్ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వాకాడు, విద్యానగర్లోని ఎన్బీకేఆర్ అభిమానులు తమ వెంటే ఉన్నారన్నారు.
నెల్లూరు టైగర్గా పేరు తెచ్చుకున్న నేదురుమల్లి జనార్దన్రెడ్డి ప్రథమ వర్థంతిని రాంకుమార్ కంటి తుడుపుగా జరిపారన్నారు. చివరి శ్వాసవరకు జనార్దన్రెడ్డి కాంగ్రెస్ వాదిగానే బతికార న్నారు. అలాంటి వ్యక్తి మరణించి సంవత్సరం కాకముందే బీజేపీలో చేరి ఆయన పేరుప్రతిష్టలను రాంకుమార్ మంటగలిపారన్నారు. తన తండ్రి విగ్రహానికి పూలమాల వేయనీకుండా చేసి రాంకుమార్రెడ్డి అవమానించారని చిన్నబేబమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో మోహన్నాయుడు పాల్గొన్నారు.
వాకాడు: విద్యానగర్ కళాశాల పార్కులోని నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి విగ్రహానికి సూరజ్రెడ్డి పూలమాల వేయడానికి వెళ్తే గేట్కు తాళంవేసి అవమానించడాన్ని నిరశిస్తూ శనివారం వాకాడు అశోక్పిల్లర్ సెంటర్లో వారి అనుచరులు, గ్రా మస్తులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గండవరం మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ బాలకృష్ణారెడ్డి ఎప్పుడు రాజకీయాలు చేయలేదని, జీవించినంత కాలం పేదలకు సేవచేశారన్నారు. తన కుమారుడు సూరజ్రెడ్డి కోట, వాకాడు, మండలాల్లో బాలకృష్ణారెడ్డి ఆశయాలను కొనసాగించాలని సేవా కార్యక్రమాలు చేస్తుంటే ఎక్కడ మంచి పేరు వస్తుందనే దురిద్దేశంతో అడ్డుకున్నారన్నారు.
సూరజ్రెడ్డి సేవా ముసుగులో ఉన్నాడని రాంకుమార్ విమర్శించడం అతని అవివేకానికి నిదర్శనమన్నారు. ధర్నాలో బాలకృష్ణారెడ్డి కుమార్తె యూధికా ప్రియ, తుమ్మల మోహన్నాయుడు, కుంబాల మస్తాన య్య, కుంబాల కోటయ్య, మామిడిపూడి వెంకటేశ్వర్లు, కోడూరు మధురెడ్డి, బట్టా భరత్, సునీల్, ఇస్మాయిల్ పాల్గొన్నారు.