-
అంబేడ్కర్ విగ్రహ నిర్మాణంపై ప్రత్యేక కమిటీ
డిసెంబర్ 3 నుంచి చైనాలో పర్యటించనున్న బృంద సభ్యులు సాక్షి, హైదరాబాద్: 125 అడుగుల ఎత్తున్న అంబేడ్కర్ విగ్రహ నిర్మాణానికిగాను ప్రత్యేకంగా అధ్యయన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి, పార్లమెంటు సభ్యులు పసునూరి దయాకర్, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, ఆరూరి రమేశ్లతో పాటు ఆర్అండ్బీ సీఈ గణపతిరెడ్డి, జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ప్రతినిధి శ్రీనివాస్రెడ్డి, యాదగిరి గుట్ట ఆర్డ్ డెరైక్టర్లు ఆనందసాయి, లక్ష్మి నారాయణలను ఈ కమిటీలో సభ్యులుగా చేర్చింది. ఈ కమిటీ చైనాలో పర్యటించేందుకు సిద్ధమవుతోంది. అతిపెద్ద బుద్ధుని విగ్రహంతోపాటు పలు విగ్రహాలను చైనాలో విజయవంతంగా నిర్మించిన సంగతి తెలిసిందే. ఆయా విగ్రహాల నిర్మాణంలో తీసుకున్న జాగ్రత్తలు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై కమిటీ సభ్యులు అవగాహన పెంచుకోనున్నారు. ఖర్చును సైతం అంచనా వేయడంతో పాటు నిర్మాణానికి కావాల్సిన ముడిసరుకు.. సర్దుబాట్లపై సంబంధిత అధికారులతో చర్చించనున్నారు. డిసెంబర్ 3 నుంచి 11 వరకు పర్యటన సాగనుంది. అంబేడ్కర్ విగ్రహాన్ని రూ.100 కోట్లతో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. త్వరలో యాదగిరిగుట్టలో 108 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహాన్ని నిర్మించనున్నారు. ఈ క్రమంలో ఇద్దరు యాదగిరిగుట్ట ఆర్ట్ డెరైక్టర్లను కమిటీలో సభ్యులుగా చేర్చింది. పర్యటన అనంతరం వారిచ్చే నివేదికను బట్టి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. -
చైనా సంస్థల అధినేతలతో నేడు కేసీఆర్ బృందం భేటీ
బీజింగ్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చైనా పర్యటన ఆరో రోజు కొనసాగుతోంది. నేడు రాజధాని బీజింగ్ నగరంలో పలు కంపెనీల అధినేతలతో కేసీఆర్ బృందం భేటీ అవుతుంది. చైనా రైల్వే కార్పొరేషన్, ఇన్సుపర్ గ్రూప్, చైనా ఫార్చూన్ ల్యాండ్, గ్రీన్ సిటీ లిమిటెడ్, శాని గ్రూపులతో సీఎం బృందం భేటీ అయి వ్యాపార లావాదేవీలు, పెట్టుబడుల విషయంపై చర్చించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వీలున్న పరిస్థితులను చైనా సంస్థల అధినేతలకు సీఎం వివరించి, రాష్ట్రానికి వారిని ఆహ్వానించనున్నట్లు సమాచారం. -
'చైనాకు వెళ్లి ఆయన సాధించేం లేదు'
హైదరాబాద్ : చైనాకు వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సాధించేది ఏమీ లేదని కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్థన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఏదేశంలో కూడా చైనా కార్యక్రమాలు చేపట్టలేదని ఆయన చెప్పారు. కేసీఆర్ది తుగ్లక్ పాలన అని, రాష్ట్రంలో తీవ్ర కరువు నెలకొన్నప్పటికీ కేంద్రం సాయం కోసం ఆయన ఎందుకు పట్టుబట్టడం లేదని ప్రశ్నించారు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు రుణాల కోసం రైతులపై ఒత్తిడి తేకుండా ప్రభుత్వం చట్టం చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు. దిగ్విజయ్ సింగ్ పనితీరుపై రాష్ట్ర కాంగ్రెస్ కేడర్లో అసంతృప్తి నెలకొందని, రాష్ట్రానికి పూర్తిస్తాయి ఇంఛార్జ్ కావాలన్నారు. పీసీసీ, సీఎల్పీ కూడా కేడర్తో మమేకమై ప్రభుత్వ వైఫల్యాలపై దూకుడుగా పోరాడాలని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పిలుపిచ్చారు. -
'ప్రకటనల కోసమేనా తెలంగాణ ఏర్పాటు?'
హైదరాబాద్ : హామీలు, ప్రకటనలకు పరిమితం అయ్యేందుకేనా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదని కాంగ్రెస్ నేత, సీనియర్ ఎమ్మెల్యే టి.జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన 15 నెలలు రైతు సంక్షేమం గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆలోచించనేలేదని ఆయన విమర్శించారు. చైనాకు వెళ్లి పరిశ్రమలు తెస్తే మంచిదే, కానీ అందులో పది శాతమైనా రైతుల గురించి ఆలోచిస్తే బాగుండేదని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించే తీరిక కేసీఆర్కు లేదా? అని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యల విషయంలో గత టీడీపీ ప్రభుత్వం లాగే టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ ఆయన మండిపడ్డారు. -
ప్రపంచ ఆర్థిక సదస్సుకు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 8 నుంచి 15వ తేదీ వరకు చైనాలో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సదస్సు మేనేజింగ్ డైరెక్టర్ నుంచి సీఎం కేసీఆర్కు ఆహ్వానం అందింది. ఈ పర్యటనలో సీఎం, ఆరుగురు ఐఏఎస్ అధికారుల బృందం వెళ్లనుంది. సీఎం ముఖ్య కార్యదర్వి ఎస్.నర్సింగ్ రావు, అదనపు ముఖ్య కార్యదర్శి ఎ.శాంతికుమారి, ఇంటెలిజెన్స్ ఐజీ బి.శివధర్ రెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎం అదనపు కార్యదర్శి స్మితా సభర్వాల్, ప్రత్యేక కార్యదర్శి ఎస్.రాజశేఖర్ రెడ్డి ఈ బృందంలో వుండనున్నారు. ఈ మేరకు అనుమతులు జారీ చేస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
Advertisement