breaking news
China Jiyar Swamy
-
దీపం వెలిగిద్దాం: చినజీయర్ స్వామి
-
చినజీయర్ ఆశీస్సుల కోసం వచ్చా....
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ముచ్చింతల్లోని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ ఉదయం ఆశ్రమంలో సీతారామ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీయాగంలో యడియూరప్ప పాల్గొంటారు. ఈ సందర్భంగా యడియూరప్ప మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా చినజీయర్ ఆశీస్సులు తీసుకునేందుకు వచ్చినట్లు చెప్పారు. కాగా నిన్నశంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో చినజీయర్ స్వామి ఆశ్రమానికి వచ్చిన యడియూరప్పకు వేద పండితులు ఆశీర్వచనాలతో ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన చినజీయర్ స్వామిని కలుసుకుని ఆశీస్సులు తీసుకున్నారు. కర్ణాటక అసెంబ్లీలో జరిగిన విశ్వాసపరీక్షలో ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప విజయం సాధించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి హైదరాబాద్ వచ్చిన ఆయన రాత్రి ఆశ్రమంలోనే బస చేశారు. -
ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగిస్తాం
-
చిన జీయర్ షష్ఠిస్ఫూర్తి
-
జై శ్రీమన్నారాయణ..
ఇది వ్యక్తి పేరు కాదు.. జీవన మార్గ మంత్రం: జీయర్ స్వామి - కుల మతాలున్నా పరస్పర సోదరభావం రావాలి - రామానుజులు చెప్పింది ఇదే - దాన్నే అంబేడ్కర్ గుర్తించారు.. మనకూ అదే స్ఫూర్తి కావాలి - ఎల్బీ స్టేడియంలో ఘనంగా షష్టిపూర్తి మహోత్సవాలు సాక్షి, హైదరాబాద్: ‘‘కులమతాలు అంతరించటం సాధ్యం కాదు. అసాధ్యమైన వాటి కోసం ప్రయత్నం వృథా. కానీ.. స్వీయ ఆరాధనతోపాటు సర్వ ఆదరణతత్వం రావాలి. ఒకరికొకరి మధ్య ప్రేమానురాగాలు, సోదర భావన పెంపొందాలి. మానవ సేవయే మాధవ సేవ అనే నినాదం బదులు.. సర్వప్రాణి సేవే మాధవసేవ అని రావాలి. దీనికి ఏకైక నినాదమే ‘జై శ్రీమన్నారాయణ’.. అది ఓ వ్యక్తి పేరు కాదు. మనిషి ఎలా ఉండాలో చాటిచెప్పే గొప్ప తత్వం. ఆ వాక్యంలో ఒక్కో పదం ఒక్కో అర్థాన్నిస్తూ మనిషిని పరిపూర్ణుడిగా చేస్తుంది. వెయ్యేళ్ల క్రితం రామానుజులు ఆచరించి చూపిన మార్గమది. అశాంతి లేని సమాజం కోసం మనం ఆ బాటపట్టాలి’’ అని త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి అభిలషించారు. ఆదివారం సాయంత్రం తన షష్టిపూర్తి సందర్భంగా ‘షష్టిస్ఫూర్తి జనోత్సవ్’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా గంటసేపు మనిషి నడవడిక, సామాజిక సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రవచించారు. రామానుజుల మార్గదర్శనాన్ని ప్రస్తావించారు. కుల మతాల అసమానతలు సమాజానికి చేటు చేస్తాయని, అయితే వాటిని రూపుమాపటం సాధ్యం కాదని పరస్పర ప్రేమానురాగాలతో మనిషి మనిషిగా ఉండే మార్గాన్ని అనుసరించాలని పేర్కొన్నారు. సమానత్వం కోసం పాటుపడ్డ మహనీయుడిగా అంబేడ్కర్ త రచూ రామానుజుల వారి బోధనలను ఉటంకించేవారన్నారు. అంబేడ్కర్ బాటలో మనమూ నడవాలని పిలుపునిచ్చారు. శంషాబాద్లో రామానుజుల వెయ్యేళ్ల జయంతి వేడుకలను పురస్కరించుకుని ‘సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం’ నిర్మాణం, ఆయన భారీ విగ్రహ ప్రతిష్ట ఆలోచన ఇందులో భాగమేనని చెప్పారు. ‘స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ పేరుతో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఉగ్రవాదంతోపాటు ఇతర సామాజిక రుగ్మతల నుంచి మనం బయటపడాలంటే ఆ మహనీయుడి బోధనలను అనుసరించాలని, ప్రస్తుతం ఆ ప్రయత్నంలోనే తాము ముందుకు సాగుతున్నట్టు వెల్లడించారు. ‘కాలుకు ముల్లు గుచ్చుకుంటే కంటనీరొస్తుంది. అలా శరీరంలో అంగాలు వేరైనా అన్నీ కలిసి పనిచేస్తేనే ఆరోగ్యకర శరీరమవుతుంది. సమాజంలో మన తీరు కూడా అలాగే ఉండాలి. ఎవరి ఆచారాలు వారికున్నా అంతా కలిసి అన్యోన్యంగా సాగినప్పుడే ఆరోగ్యకర సమాజం ఉద్భవిస్తుంది. 36 సంవత్సరాల క్రితం సన్యాసాశ్రమం స్వీకరించినప్పటి నుంచి నేను రామానజుల బాటలో ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాను. నా కార్యక్రమాలకు ప్రజలు సహకరించి విజయవంతం చేస్తున్నారు’’ అని పేర్కొన్నారు. మంచి స్వార్థం అవసరమని, చెడు స్వార్థం నశించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్పై ప్రశంసల వర్షం ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావుపై జీయర్ స్వామి ప్రశంసల వర్షం కురిపించారు. దేశ చరిత్రలో ఎక్కడా ఇప్పటి వరకు జరగని విధంగా దేవాలయాల అభివృద్ధికి బడ్జెట్ నిధులు కేటాయించిన ఘనత ఆయనదేనన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తే ఎవరో ఏదో అనుకుంటారని, ఓట్లు దూరమవుతాయని వెరవకుండా ముందుకొచ్చి యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయించటం ఆయన గొప్పతనానికి నిదర్శనమన్నారు. 1995లోనే సిద్దిపేటలోని ఇంటింటికి మంచినీటి ప్రాజెక్టు వివరాలను అప్పట్లోనే తనకు పరిచయం చేశారని, ఆయన కార్యదీక్షకు ఆయన పనితీరే నిదర్శనమన్నారు. ‘సమతామూర్తి స్ఫూర్తి’ కేంద్రం ఏర్పాటులో కూడా ఆయన సహకారం ఉందని అభినందించారు. కార్యక్రమంలో ఆయన అతిథులందరినీ పవిత్ర మాలలు, శాలువాలతో సత్కరించారు. ఇలాంటి కార్యక్రమం నిర్వహించటం పట్ల తాను కొంత సిగ్గుపడ్డానని, అయితే రామానజుల బాటలో ముందుకు సాగేందుకు భక్తజనం పక్షాన తనకు ఇది స్ఫూర్తి పొందే సందర్భంగా భావిస్తున్నట్టు వెల్లడించారు. తరలి వచ్చిన భక్తజనం షష్టిపూర్తి కార్యక్రమాన్ని వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ‘ఆరుపదుల నిండైన పండగ’ అక్షర నీరాజనం పుస్తకాన్ని ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రి దత్తాత్రేయ, మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు జీయర్ స్వామికి పాదాభివందనం చేశారు. మై హోం అధినేత రామేశ్వరరావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి దగ్గరుండి కార్యక్రమాన్ని ఆసాంతం పర్యవేక్షించారు. -
ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగిస్తాం
చిన జీయర్ స్వామి షష్టిపూర్తి వేడుకల్లో సీఎం కేసీఆర్ - స్వామి సంస్కారం అందరికీ ఆదర్శం - ఆయన ప్రసంగాలు ప్రజల్ని సన్మార్గం వైపు మళ్లిస్తున్నాయి - 22 ఏళ్ల కిందట స్వామితో కొద్దిరోజులు ఉండే భాగ్యం దక్కింది - నా కారులో నేను డ్రైవర్గా ఆయన్ను తిప్పడం గొప్ప అనుభూతి - రామానుజుల విగ్రహ ప్రతిష్టాపన సంకల్పం తెలంగాణకే గర్వకారణం - పాల్గొన్న గవర్నర్లు నరసింహన్, విద్యాసాగర్రావు, - కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ తదితరులు సాక్షి, హైదరాబాద్: ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులోనూ వాటిని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఉద్ఘాటించారు. ప్రజలను సన్మార్గం వైపు మళ్లించేలా చినజీయర్ స్వామి ఆధ్యాత్మిక ప్రసంగాలు దోహదం చేస్తున్నాయని, చాలా సరళమైన భాషలో ఆయన చేసే అనుగ్రహ భాషణాలు భక్తిప్రపత్తులతో కూడుకున్న విన్యాసాలని కొనియాడారు. త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి షష్టిపూర్తి సందర్భంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ‘షష్టిస్ఫూర్తి జనోత్సవ్’ కార్యక్రమం ఘనంగా జరిగింది. దీనికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావు, కేంద్రమంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... నగర శివారులోని శంషాబాద్లో రామానుజాచార్యుల భారీ విగ్రహాన్ని ప్రతిష్టించాలన్న జీయర్ స్వామి సంకల్పం తెలంగాణకు గర్వకారణంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆ నిర్ణయానికిగాను తన పక్షాన, రాష్ట్ర ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు వెల్లడించారు. జీయర్ స్వామి సాన్నిహిత్యంలో ఉండటం తనకు కొత్త కాదని, 22 సంవత్సరాల క్రితం తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉండగా ఆయనతో కొద్దిరోజుల పాటు కలిసి ఉండే భాగ్యం దక్కిందని గుర్తు చేసుకున్నారు. ‘‘వికాసతరింగిణి ఆధ్వర్యంలో రెండు దశాబ్దాల క్రితం సిద్దిపేటలో బ్రహ్మయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సందర్భంగా పట్టణానికి వచ్చిన జీయర్స్వామికి స్వాగతం పలికి అక్కడ ఉండే వారం రోజులు మా ఇంటి ఆతిథ్యం స్వీకరించాలని కోరాను. దానికి ఆయన మన్నించి మా ఇంటనే ఉన్నారు. ఆ సందర్భంలో నా కారులో నేను డ్రైవర్గా ఆయనను తిప్పటం గొప్ప అనుభూతి. అల్లకల్లోలంగా ఉన్న పంజాబ్, కశ్మీర్లో ఆయన పర్యటించి ప్రశాంతతకు కృషి చేశారు. ఈ విషయం గుర్తొచ్చి కొంత అశాంతి నెలకొన్న సిద్దిపేటలో పర్యటించాలని కోరినప్పుడు శాంతి శోభాయాత్ర నిర్వహించటం గొప్ప అనుభూతినిచ్చింది. భక్తిగా యజ్ఞం చేస్తే చివరిరోజు వాన కురుస్తుందని జీయర్ స్వామి చెప్తే ఏమో అనుకున్నా. కానీ అది ఏప్రిల్ నెల అయినప్పటికీ చివరి రోజు యజ్ఞవాటిక అస్తవ్యస్తమయ్యేలా వాన కురిసి ఆశ్చర్యపరిచింది. ఆ సమయంలో నాకున్న పరిమిత పరిజ్ఞానంతో ఎన్నో ప్రశ్నలు వేసి సమాధానాలు తెలుసుకున్నా. నిత్యం కార్యక్రమం ప్రారంభ సమయంలో తన గురువైన గోపాలాచార్యులకు పాదాభివందనం చేసే జీయర్స్వామి సంస్కారం మనకందరికీ ఆదర్శమని అప్పుడే అనుకున్నా. ఈరోజు ఆయన షష్టిపూర్తి ఉత్సవంలో పాల్గొనటం ఎంతో సంతోషంగా ఉంది’’ అంటూ సీఎం తన పాత అనుభవనాలను గుర్తు చేసుకున్నారు. రామానుజుల మార్గం అనుసరణీయం: విద్యాసాగర్రావు వెయ్యేళ్ల క్రితం రామానుజ స్వామి చేసిన బోధనలు ఇప్పటికీ అనుసరణీయమని మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్రావు అన్నారు. ఇప్పుడు తెలంగాణలో మిషన్ భగీరథ, సాగునీరిచ్చేం దుకు చేస్తున్న ప్రయత్నాలు గొప్పవేనని, కానీ ఈ ఆలోచనలను రామానుజస్వామి అప్పుడే చేసి చూపారన్నారు. ఇప్పుడు జీయర్స్వామి కూడా అదే దారిలో సాగుతూ సమాజానికి మార్గదర్శనం చేస్తున్నారన్నారు. మంచి మార్గం వైపు సాగేందుకు చేయాల్సిన ప్రయత్నాలకు ఈ వేడుక ఓ వేదిక అని పేర్కొన్నారు. ఇక్కడ ఎంత పెద్ద కేక్ కట్ చేస్తారని తనను రాజ్భవన్ సిబ్బంది ప్రశ్నించార న్నారు. అయితే స్వామిని ఆశీర్వదించే శక్తి ఎవరికీ లేదని, ఆయన ఆశీర్వాదం కోసం కలిగిన అరుదైన అవకాశంగా తాను ఈ కార్యక్రమాన్ని భావిస్తున్నట్టు చెప్పానన్నారు. మానవత్వాన్ని మించిన మతం లేదు: దత్తాత్రేయ ప్రపంచంలో మానవత్వాన్ని మించిన మతం లేదని, సేవాభావం కన్నా గొప్ప గుణం లేదని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. మానవత్వం, సేవాగుణంతో మూర్తీభవించిన రూపం చిన జీయర్స్వామి అని కొనియాడారు. కుల వ్యవస్థ సిగ్గుచేటు: వెంకయ్య ‘‘ప్రపంచానికి గొప్ప సంస్కృతిని అందించిన మన భారతీయ సంప్రదాయానికి కుల వ్యవస్థ ఓ మచ్చలా మారింది. అది మనకు సిగ్గుచేటు. దాన్ని రూపుమాపాలి. వెయ్యేళ్ల క్రితమే రామానుజ స్వామి కులవ్యవస్థ వద్దని గట్టిగా చెప్పారు. ఆ స్ఫూర్తి మనకు అవసరం. ఇప్పుడు అసమానతలను రూపుమాపేందుకు జీయర్ స్వామి కృషి చేస్తున్నారు’’ అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. కులానికి సాంఘిక పునాది లేదని, అది వృత్తులతో పుట్టి సామాజిక సమస్యగా మారిందన్నారు. ఇక కుల వ్యవస్థకు కాలం చెల్లిందని, సంఘ సంస్కర్తగా ఆధ్యాత్మిక, సామాజిక ప్రగతి దిశగా బాటలు వేస్తున్న చిన జీయర్ స్వామి మాటలు అందరికీ అనుసరణీయమని శ్లాఘించారు. ‘మతం వ్యక్తిగతం, మన గతం ఒక్కటే’ అన్న మాటను నిజం చేస్తూ ధర్మపరిరక్షణ వైపు నడవాలన్నారు. శంషాబాద్లో శ్రీరామానుజస్వామి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న జీయర్ స్వామి నిర్ణయాన్ని ప్రధాని మోదీ కూడా స్వాగతించారన్నారు. మానవ రూపంలో వెలసిన అవతారం: గవర్నర్ కురుక్షేత్రంలో అర్జునుడికి అయోమయం నెలకొన్నప్పుడు సారథిగా శ్రీకృష్ణుడు దారిచూపినట్టు ఈ ప్రపంచమనే కురుక్షేత్రంలో మనం సరైన బాటలో పయనించేలా చిన జీయర్స్వామిలాంటి వారు కృషి చేస్తున్నారని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. మనుషులకే కాకుండా చెట్లు, పశుపక్ష్యాదుల కోసం జీయర్ స్వామి చేస్తున్న సేవలు గొప్పవన్నారు. రాముడు, కృష్ణుడు మానవ రూపంలో అవతరించినట్టుగానే జీయర్ కూడా ఓ అవతారమని తాను భావిస్తానన్నారు.