-
ఆ భోజనం అధ్వానం
విజయనగరం టౌన్: నగరంలోని బాబామెట్ట ప్రభుత్వ బాలి కోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉందని చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు సత్తి అచ్చిరెడ్డి ఆరోపించారు. శనివారం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఆయన మాట్లాడుతూ మనుషులు తినడానికి పనికిరాని భోజనం ఇక్కడ విద్యార్థులకు పెట్టడం చాలా దారుణమన్నారు. పాచిపోయిన అన్నం, సాంబారు కూరల్లో పురుగులు ఉండటంతో చాలామంది విద్యార్థినులు ఇంటి నుంచే క్యారేజ్ తీసుకుని రావడం కనిపిస్తోందని పేర్కొన్నారు. కస్పా హైస్కూల్లోనూ, వి.టి.అగ్రహారం స్కూల్, జొన్నవలస స్కూల్, నెల్లిమర్ల స్కూళ్లలోనూ ఇదే పరిస్థితి కనబడినట్టు చెప్పారు. నవప్రయాస్ సంస్థ ఇంత ఘోరంగా భోజనం పెడుతున్నా... డీఈఓకు స్కూల్ హెచ్ఎం ఫిర్యాదుచేసినా పట్టించుకోకపోవడం సరికా దన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి నవప్రయాస్ సంస్ధపై చర్యలు తీసుకోవాలని, పిల్లలకు శుభ్రమైన ఆహారం అందించాలని కోరారు. స్పందించకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిటీకి ఫిర్యాదు చేసి, విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ సీఆర్పీఎఫ్ పోరాడుతామని తెలిపారు. కార్యక్రమంలో ఫోరం ప్రధాన కార్యదర్శి సింహాద్రిస్వామి, ప్రవీణ్ కుమార్, రాము, కూర్మారావు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. -
బాలల హక్కులపై క్యాండిల్ ర్యాలీ
విజయవాడ : బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు శనివారం రాత్రి నగరంలో ఏర్పాటుచేసిన క్యాండిల్ ర్యాలీని సబ్–కలెక్టర్ డాక్టర్ సలోని సిదాన ప్రారంభించారు. సబ్–కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ మహాత్మాగాంధీ రోడ్డు మీదుగా పోలీసు కమిషనరేట్ వరకు సాగింది. బాలల హక్కుల వారోత్సవాలలో భాగంగా చైల్డ్లైన్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కె. కృష్ణకుమారి, కార్మిక శాఖ సహాయ కమిషనర్ ఆంజనేయరెడ్డి, చైల్డ్లైన్ ప్రతినిధి అరవ రమేష్ పాల్గొన్నారు. -
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యం
బాలల హక్కుల పరిరక్షణకు కృషి అందరి మన్నలు అందుకుంటున్న చైల్డ్రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం నగర కన్వీనర్ సీతారాం నేడు బాల కార్మిక దినం విశాఖపట్నం : స్మార్ట సిటీగా రూపుదిద్దుకునేందుకు వేగంగా పరుగులు తీస్తున్న విశాఖ నగరంలో బాల కార్మిక వ్యవస్థ వేళ్లూనుకొని ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో చైల్డ్రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం నగర కన్వీనర్ గొండు సీతారాం బాలకార్మిక వ్యవస్థను రూపుమాపి, ప్రతి విద్యార్థిని బడికి పరిచయం చేసి, తద్వారా విశాఖ నగర అభివృద్ధికి పెద్ద పీట వేసేందుకు నిరంతరం తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిర్వహణలో కలెక్టర్ చైర్మన్గా పని చేస్తున్న జాతీయ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్లో జిల్లా టాస్క్ఫోర్స్ సభ్యుడిగా కీలకంగా వ్యవహరిస్తూ ఎక్కడ బాలకార్మికులు ఉన్నా వారిని ఆ పని నుంచి విముక్తుల్ని చేస్తూ వారికి ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు కృషి చేస్తున్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా జిల్లా స్థాయిలో మూడు, రాష్ట్ర స్థాయిలో మూడు అవార్డులు లభించాయి. చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం జాతీయ అధ్యక్షురాలు శాంతా సిన్హా విశాఖ నగర కన్వీనర్గా సీతారామ్ను నియమించారు. అప్పటి నుంచి ఆయన కార్మిక, విద్యాశాఖల అధికారులు, జాతీయన చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సభ్యులతో కలసి దుకాణాలు, పరిశ్రమలు, హోటళ్లు, కార్కానాలపై తరచూ దాడులు నిర్వహిస్తూ బాల కార్మికులకు విముక్తి కలిగిస్తున్నారు. నగరంలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. రాత్రి బస, బాలల భోజన వసతులపై ఆరాాతీస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి, మానసిక, శారీరక వికలాంగ విద్యార్థులకు వైద్య ధ్రువీకరణ పత్రాల జారీకి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పాఠశాలల్లో కనీస వసతుల కల్పనకు అధికారులతో సంప్రదించి తగిన ఏర్పాట్లు చేయిస్తున్నారు. సేవలకు గుర్తింపు : సీతారాం సేవలను గుర్తించిన కలెక్టర్ యువరాజ్, పోలీస్ కమిషనర్ అమిత్గార్గ్ ఈ ఏడాది జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఉత్తమ బాలల హక్కుల రక్షణ సంస్థ అవార్డును సీతారాంనకు అందజేశారు. వుడా వీసీ బాబూరావు నాయుడు, ఆంధ్రాయూనివర్సిటీ వీసీ జి.ఎస్.ఎన్.రాజు ఉగాది పురస్కారాన్ని అందజేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అమలు సాధ్యమేనా..?
అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
కలెక్టర్ ఆదేశాలు కూడా పనిచేయలేదు
మాజీ సైనికులు ఓటు హక్కు వినియోగించుకోవాలి
ఓటర్ స్లిప్పు లేదా.. టెన్షన్ వద్దు
ప్రభుత్వరంగ బ్యాంకులను కాపాడుకుందాం
ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై దుష్ప్రచారం
టీడీపీలో చేరిన నేతను నిలదీసిన గ్రామస్తులు
No Headline
మేమంతా జగనన్న బాటలోనే..
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement