breaking news
Child House
-
సర్కారు బాధ్యతారాహిత్యం
మాజీమంత్రి శ్రీధర్బాబు మాజీమంత్రి దుద్ధిళ్ల శ్రీధర్బాబు బుధవారం సాయంత్రం శిశుగృహను సందర్శించారు. ఆయాల చేతిలో గాయాలపాలైన చిన్నారులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వ బాధ్యతారాహిత్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేవలం ఆయాలపై చర్యలతోనే సరిపెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉన్నతాధికారులనూ బాధ్యులుగా చేస్తూ చర్యలు తీసుకోవాలని సూచించారు. -
సిమెంట్ తొట్టిలో ‘బంగారుతల్లి’
మానవత్వం మాయమైందా..! - వికారాబాద్ పాతగంజ్లో పసికందు లభ్యం - తాండూరులోని శిశుగృహకు తరలింపు అనంతగిరి: మానవత్వం మాయమైపోయింది. ‘మాతృత్వం’ బరువైంది. లోకం పోకడ తెలియని పసికందును గుర్తుతెలియని వ్యక్తులు ఓ సిమెంట్ తొట్టిలో వదిలేసి పోయారు. ‘బంగారు తల్లి’ ఆ తల్లిదండ్రులకు బరువైందో.. లేక మరి ఇంకేదైన కారణమో..! నెలరోజుల వయసు కూడా లేని పసికందు గుక్కపట్టి ఏడ్వడంతో పలువురు ఆయ్యో ‘పాపం' అని కన్నీళ్లు పెట్టుకున్నారు. తల్లి ఒడిలో కంటినిండా నిద్రించాల్సిన చిన్నారి రోడ్డుపాలైంది. ఈ హృదయ విదారక సంఘటన వికారాబాద్లోని పాతగంజ్లో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాతగంజ్లో ఇళ్ల మధ్య ఓ సిమెంట్ తొట్టి ఉంది. అందులో కాలనీవాసులు చెత్తచెదారం పడేస్తుంటారు. ఇదిలా ఉండగా.. మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో తొట్టిలోంచి పసికందు రోదనలు వినిపించాయి. స్థానికురాలు చంద్రకళ అక్కడికి వెళ్లి చూడగా ఓ ఆడబిడ్డ గుక్కపట్టి ఏడుస్తోంది. దీంతో ఆమె చిన్నారిని తన ఇంటికి తీసుకెళ్లి దుస్తులు వేసింది. స్థానికులు పోలీసులకు, ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు. తాపీగా ఐసీడీఎస్ అధికారులు సాయంత్రం 4:30 గంటల సమయంలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు పసికందును సిమెంట్ తొట్టిలో వదిలేసి వెళ్లి ఉంటారని స్థానికులు అధికారులకు తెలిపారు. ఈ ‘పాప'ం ఎవరిదో అని స్థానికులు నిందించారు. ఐసీడీఎస్ సూపర్ వైజర్ సుష్మ పోలీసుల సాయంతో ‘బంగారు తల్లి’ని తాండూరులోని శిశుగృహకు తరలించారు.